Tag Archives: sarkaru vari paata

Parachuri Gopala Krishna: సర్కారు వారి పాట సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ కామెంట్స్.. అలా తీసి ఉంటే బాగుండేది అంటూ..

Parachuri Gopala Krishna : సినీ రచయిత, ప్రముఖ నటుడు పరుచూరి గోపాలకృష్ణ గురించి తెలియని వారంటూ ఉండరు. ఎన్నో సినిమాలకు కథా రచయితగా పనిచేసిన గోపాలకృష్ణ కొన్ని సినిమాలలో తన నటనతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అయితే ఇటీవల ఈయన మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమా మీద సంచలన కామెంట్స్ చేశాడు. ఇప్పుడు ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మహేష్ బాబు కీర్తి సురేష్ జంటగా నటించిన సర్కారు వారి పాట సినిమా ఇటీవల విడుదలై మంచి హిట్ అందుకున్న సంగతి తెలిసిందే.

Chiranjeevi gave a gift after listening that dialogue in Indra movie Paruchuri comments viral

ఈ సినిమా దాదాపు 200 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటి లో స్ట్రీమ్ అవుతోంది. అయితే ఈ సినిమా గురించి పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ.. ఈ రోజుల్లో మోడ్రన్ గా ఈ సినిమాకు సర్కారు వారి పాట అనే టైటిల్ పెట్టారు. కానీ ఆ రోజుల్లో అయితే దేశద్రోహులు అనే టైటిల్ పెట్టేవాళ్ళు. ఈ సినిమా మొదటి భాగంలో హీరో హీరోయిన్ మధ్య కామెడీ ప్రేక్షకులను బాగా అలరించింది. మొదటి 15 నిమిషాలు ఈ సినిమా చూస్తే సినిమా మొత్తం ఇలాగే సాగిపోతే బాగుంటుందని ప్రేక్షకులు అనుకున్నారు.

మహేష్ బాబు సడన్ గా అమెరికా నుండి ఇండియాకు పయనమవటంతో కథ మొత్తం అస్తవ్యస్తం అయ్యింది. హీరో హీరోయిన్ మధ్య ఉన్న కామెడీ సన్నివేశాలు చూస్తూ ఎంజాయ్ చేస్తున్న ప్రేక్షకులు ఇలా ఒక్కసారిగా యాక్షన్ టర్న్ తీసుకోవడంతో ప్రేక్షకులు బోరింగ్ గా ఫీల్ అయ్యారు. ఈ సినిమాలో రెండవ భాగం లో హీరో, విలన్ మద్య రివెంజ్ ఫైటింగ్ ఎక్కువ ఉండడం ప్రేక్షకులు విసిగిపోయారు.

రెండవ భాగం సినిమాకు కాస్త మైనస్ అయింది…

ఈ సినిమా ఇలా ఉండడం వల్ల కేవలం 200 కోట్లు మాత్రమే వసూలు చేసింది. అలా కాకుండా ఈ సినిమాలో చిన్న చిన్న మార్పులు చేసి ఉంటే మరొక 100 కోట్లు వసూలు అయ్యేది అంటూ పరుచూరి గోపాలకృష్ణ తనదైన రీతిలో ఈ సినిమా గురించి రివ్యూ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ సినిమా గురించి గోపాలకృష్ణ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Mythri Movie Makers: ఓటమి ఎరుగని మైత్రి మూవీ మేకర్స్ …ఫ్లాప్ సినిమాని కూడా బ్లాక్ బస్టర్ చేశారుగా?

Mythri Movie Makers: సాధారణంగా ప్రతి శుక్రవారం థియేటర్ వద్ద సినిమా తలరాతలే మారిపోతాయి. ప్రతి శుక్రవారం ఎన్నో సినిమాలు విడుదలయి సినిమా తలరాతనే మారుస్తూ ఉంటాయి. కొన్ని సినిమాలు విడుదలైన మొదటి రోజే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని అనంతరం సినిమా కలెక్షన్లపై ప్రభావం చూపుతూ డీలా పడిపోతుంటాయి.మరికొన్ని సినిమాలు మొదటి రెండు రోజులు ఫ్లాప్ టాక్ వచ్చినప్పటికీ ఆ తర్వాత బ్లాక్ బాస్టర్ సొంతం చేసుకునే సినిమాలు కూడా ఉన్నాయి.

ఇలాంటి సినిమాల విషయానికొస్తే గతంలో అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా మంచి ఉదాహరణ. ఈ సినిమా మొదటి రోజు యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది. అనంతరం ఈ సినిమా ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఆకర్షించి బ్లాక్ బస్టర్ విజయం అయింది. ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్ చిత్రం కోసం ప్రతి ఒక్క అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

ప్రస్తుతం మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట విషయంలో కూడా ఇదే జరిగింది. ఈ సినిమా మొదటి రోజు యావరేజ్ టాక్ సంపాదించుకున్నా ప్రస్తుతం కలెక్షన్ల పరంగా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమాలు ఫ్లాప్ టాక్ తెచ్చుకొని భారీ వసూళ్లను రాబట్టడం వెనక మైత్రి మూవీ మేకర్స్ కృషి ఎంతో ఉంది.

భారీ స్థాయిలో ప్రమోషన్స్…


మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కిన సినిమాలు ఫ్లాప్ టాక్ సొంతం చేసుకుంటే వెంటనే రంగంలోకి దిగి పెద్దఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటారు.ఈ క్రమంలోనే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడి అనంతరం ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తారు. ఈ విధంగా ప్లాప్ టాక్ సొంతం చేసుకున్న పుష్ప, సర్కారు వారి పాట వంటి చిత్రాలను కూడా బ్లాక్ బస్టర్ చేసిన ఘనత మైత్రి మూవీ మేకర్స్ ఉందని చెప్పాలి.

Sarkaru Vaari Paata: సంచలనంగా మారిన సర్కారు వారి పాట 100 కోట్ల పోస్టర్… ఇందులో నిజమెంత?

Sarkaru Vaari Paata: పరుశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా తెరకెక్కిన చిత్రం సర్కారు వారి పాట. ఈ సినిమా మే 12వ తేదీ విడుదల అయ్యింది. మొదటి షో తోనే మిశ్రమ స్పందన లభించిన కలెక్షన్ల పరంగా భారీ వసూళ్లను రాబడుతోంది అంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. మూడు రోజుల్లోనే ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లో చేరింది అంటూ మేకర్స్ కూడా వెల్లడించారు.

ఈ క్రమంలోనే తాజాగా మైత్రి మూవీ మేకర్స్ 100కోట్ల పోస్టర్ ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే ఎంతో మంది నెటిజన్లు ఈ పోస్టర్ పై స్పందిస్తూ మిశ్రమ స్పందన లభించిన ఈ సినిమా వంద కోట్లు రాబట్టడం ఎంత వరకు నిజం? ఈ పోస్టర్ లో నిజం ఎంత ఉంది అంటూ పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు.

ఈ సినిమా విడుదలైన మూడు రోజుల్లోనే ఓవర్సీస్ లో $2 మిలియన్ డాలర్లను కొల్లగొట్టింది. ఓవర్సీస్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇలా పలుచోట్ల కలెక్షన్లు మంచిగానే ఉన్నప్పటికీ ఏకంగా వంద కోట్ల పోస్టర్ విడుదల చేయడంతో నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.

ఫేక్ కలెక్షన్స్..


ఈ క్రమంలోనే కొందరు ఈ పోస్టర్ పై స్పందిస్తూ ఇలాంటి ఫేక్ కలెక్షన్స్ ఉన్న పోస్టర్లను విడుదల చేస్తూ మహేష్ బాబు ఇమేజ్ ని డ్యామేజ్ చేయకండి అంటూ కామెంట్లు చేస్తున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న మహేష్ బాబు సినిమా యావరేజ్ టాక్ వచ్చినా జనాలు థియేటర్లకు వచ్చి సినిమా చూస్తారు. సర్కారు వారి పాట విషయంలో కూడా అదే జరిగింది. కానీ ఒకే సారి ఇలా 100 కోట్ల పోస్టర్ విడుదల చేయడంతో ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.

Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట సినిమా ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. సినిమా ఎలా ఉందంటే?

Sarkaru Vaari Paata: సూపర్ స్టార్ మహేష్ బాబు కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం సర్కారీ వారి పాట.ఈ సినిమా ఈనెల 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడంతో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషనల్ కార్యక్రమాలను నిర్వహించి సినిమాపై భారీ అంచనాలు పెంచారు. ఈ క్రమంలోనే ఈ సినిమా మరొక రోజులో విడుదల కావడంతో ఈ సినిమాకి సెన్సార్ బోర్డ్ మెంబర్ ఉమైర్ సంధు రివ్యూ ఇచ్చారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సినిమా చూస్తూ తాను ఎంతో ఎంజాయ్ చేశానని చెప్పుకొచ్చారు. ఈ సినిమా యాక్షన్, కామెడీ, ఎమోషన్ కలబోత అంటూ ఉమైర్ సంధు రివ్యూ ఇచ్చారు. ఈ సినిమాలో ఎక్కువ మార్కులు మహేష్ బాబు నటనకు పడతాయని ఆయన తన రివ్యూ ద్వారా వెల్లడించారు.

ఈ ఏడాది విడుదలైన సినిమాలలో తన ఫేవరెట్ సినిమా గా మహేష్ బాబు సర్కారీ వారి పాట సినిమా నిలిచిపోతుందని ఈయన కామెంట్ చేశారు. ఈ సినిమాలో మహేష్ బాబు లుక్స్‌, డైలాగ్‌ స్లాంగ్‌, కాస్టూమ్స్‌ చూసిన తర్వాత ఈ సినిమాకి 5 కి 4.5 రేటింగ్ ఇవ్వడంలో ఏ మాత్రం తప్పు లేదని చెప్పుకొచ్చారు.

పాజిటివ్ రివ్యూ ఇచ్చిన ఉమైర్ సంధు..

ఈ విధంగా ఉమైర్ సంధు మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాకు పాజిటివ్ రివ్యూ ఇవ్వడంతో మహేష్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని అభిమానులు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. మహేష్ బాబు నటించిన ఈ చిత్రం బ్రేక్‌ ఈవెన్‌ సాధించాలంటే 121 కోట్లు కలెక్ట్ చేయాల్సి ఉంది.

ఆర్ఆర్ఆర్ రేసు నుంచి తప్పుకున్న పవన్, మహేష్.. పోటీకి సై అంటున్న ప్రభాస్..!

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా వస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 7న విడుదల కాబోతోంది. ఈసారి విడుదల తేదీలో ఎటువంటి మార్పులు కూడా ఉండదు. అయితే ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల కాకముందే సోషల్ మీడియాలో 45 నిమిషాల ఫస్ట్ గ్లింప్స్ సోషల్ మీడియాలో షేక్ చేస్తోంది. ఈ వీడియో ఫై టాలీవుడ్ బాలీవుడ్ సెలబ్రిటీలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఇది ఇలా ఉంటే సంక్రాంతికి విడుదల కానున్న రెండు భారీ చిత్రాలు పోస్ట్ పోన్ అవుతున్నట్లు సమాచారం. ఒకేసారి రెండు సినిమాలు విడుదల చేయడం వల్ల చాలా కష్టం చేకూరుతుందని భావించి మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ తమ చిత్రాలను విడుదల చేయడానికి వెనక్కి తగ్గారని తెలుస్తోంది. అందరికంటే ముందుగా మహేష్ బాబు సంక్రాంతి కానుకగా సర్కారు వారి పాట సినిమా విడుదల చేయాలని ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ప్రభాస్ ఏకంగా తేదీతో సహా రాధేశ్యామ్ పోస్టర్ విడుదల చేశారు.

ఇక పవన్ కళ్యాణ్ కూడా భీమ్లా నాయక్ సినిమాను జనవరి 12 న విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దీనితో జనవరి 12న బీమ్లా నాయక్, 13న సర్కారు వారి పాట, 14న రాధేశ్యామ్ సినిమా విడుదల కానున్నట్లు స్పష్టత వచ్చింది. ఇక ఆర్ఆర్ఆర్ సినిమా విషయానికి వస్తే. ఈ సినిమా అక్టోబర్ 13న విడుదల చేయాల్సి ఉండగా కరోనా మహమ్మారి వల్ల విడుదల తేదీ పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. ఇక ఎట్టకేలకు జనవరి 7న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు తెలిపారు చిత్రబృందం.

అయితే పవన్, మహేష్ సినిమాల విడుదలకి ఒక వారం ముందు ఆర్ఆర్ఆర్ విడుదల చేసేలా తెలివిగా ఆలోచించారు రాజమౌళి. ఇక ఏక కాలంలోనే ఇలా భారీ సినిమాలు విడుదల కావడంతో చాలా నష్టం చేకూరుస్తుంది. ఈ విషయం పట్ల చిత్ర నిర్మాతల మధ్య చర్చలు జరిగాయని, పవన్, మహేష్ బాబు సినిమాలను ఫిబ్రవరి లేదా మార్చి కి పోస్ట్ పోన్ అయినట్టు సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. మరి ప్రభాస్ మాత్రం ఈ విషయం పట్ల వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. అనుకున్న తేదీకే రాధేశ్యామ్ సినిమాను విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది.

వామ్మో కీర్తి సురేష్ ఒకే సారి ఇంత రెమ్యునరేషన్ పెంచేసిందా..?

కీర్తి సురేష్ ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు.మలయాళం లో సూపర్ హిట్ అయినా ‘ప్రేమమ్’ సినిమాతో సిని ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టింది ఆ తరువాత అ..ఆ తో తెలుగు సినిమాలలోకి తెరంగ్రేటం చేసింది. తన మొదటి సినిమా తోనే సూపర్ హిట్ ను అందుకుంది. ఇక మహానటి సినిమాతో ఒక్క తెలుగు ఆడియన్స్‌ మాత్రమే కాకుండా తమిళం, హిందీలో బాషలలోనూ గుర్తింపు తెచ్చుకుంది. నేను శైలజ, నేను లోకల్ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించింది కీర్తి సురేష్.

అలనాటి నటి సావిత్రి బయోపిక్‌గా తెరకెక్కిన ‘మహానటి’తో జాతీయ స్థాయి ఉత్తమ నటి పురస్కారం అందుకొని స్టార్ హీరోయిన్‌ స్టేటస్ ను సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం కీర్తి సురేష్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి సర్కారు వారి పాట సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాతో పాటుగా పలు సినిమాలలో నటిస్తూ బిజీగా గడుపుతోంది ఈ బ్యూటీ.

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న బోలా శంకర్ సినిమాలో చిరంజీవికి చెల్లెలిగా నటిస్తోంది.ఈ నేపథ్యంలోనే కీర్తి సురేష్ పారితోషికం వచ్చింది అంటూ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా అందిన సమాచారం ప్రకారం నేచురల్ స్టార్ తో కలిసి నటించిన దసరా సినిమాకి కీర్తి సురేష్ మూడు కోట్ల రూపాయల పారితోషికం అందుకున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాను శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేయగా, సుధాకర్ చెరుకూరి శ్రీలక్ష్మీవెంకటేశ్వర సినిమాస్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఇటీవల దసరా సినిమా మోషన్ పోస్టర్ ను షేర్ చేశారు. ఇందులో నాని కఠినమైన లుక్ లో కనిపించాడు. నవీన్ నూలి ఎడిటింగ్ విభాగాన్ని చేసుకుంటుండగా సత్యన్ సూర్యన్ isc సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

మహేశ్ ఇంటి నిర్మాణానికి రూ.5 కోట్లు ఖర్చుపెట్టారట..!

సూపర్ స్టార్ కృష్ణ తనయుడు మహేశ్ బాబు వరుస సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ప్రిన్స్ మహేశ్ బాబుగా పేరొందిన ఇతడు విభిన్నమైన క్యారెక్టర్లతో ఒక ట్రెండ్ ను క్రియేట్ చేశాడు. పోకిరీ సినిమాతో అప్పటి వరకు ఉన్న రికార్డులు అన్నీ బద్దలు కొట్టి తనకుంటూ మంచి ఫాలోయింగ్ ను పెంచుకున్నాడు మహేశ్. అయితే మహేశ్ బాబుకు లేడీస్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుంది.

ఇదిలా ఉండగా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలను లైన్‌లో పెట్టిన ప్రిన్స్ మహేశ్ బాబు ఆయా షూటింగ్‌లను పూర్తి చేసే పనిలో ఉన్నారు. మహేశ్ బాబు ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ సినిమాలో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. పరశురామ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో మహేశ్ ఎంతో గ్లామర్ గా కనపడుతుంటాడని టాక్.

యాక్షన్ ఎంటర్టైనర్‌‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్‌కు జోడీగా అందాల భామ కీర్తిసురేష్ నటిస్తుంది. బ్యాంకింగ్ రంగంలో జరిగే మోసాల నేపథ్యంలో సినిమా ఉండనుందని మొదటి నుంచి వినిపిస్తున్న టాక్. దీని తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో మరో సినిమాను చేయనున్నాడు. ఈ సినిమా నవంబర్ నుంచి షూటింగ్ స్టార్ట్ కాబోతుంది.

దీనిలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించనుంది. కాగా ప్రస్తుతం ప్రీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసే పనిలో ఉన్నారు చిత్ర యూనిట్. ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబంధించి ఓ అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. ఈ సినిమాలో మహేశ్ ఇంటి కోసం రూ.5 కోట్లు ఖర్చు పెట్టారట ఆర్ట్ డైరెక్టర్ ప్రకాశ్. ఈ సినిమాకి సంబంధించిన కీలకమైన సన్నివేశాలు ఈ సెట్ లోనే జరుగనున్నాయట. ఈ సినిమాకే ఈ సెట్ హైలైట్ అని సమాచారం.

ఆ విషయంలో అసంతృప్తి వ్యక్తం చేసిన మహేష్ బాబు.. రిపీట్ కాకూడదంటూ వార్నింగ్?

తెలుగు ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా కొనసాగుతున్న మహేష్ బాబు ఈ మధ్య కాలంలో ఫుల్ ఫామ్ లో ఉన్నారని చెప్పవచ్చు. మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు బ్లాక్ బస్టర్ విజయం తర్వాత పరశురామ్ దర్శకత్వంలో సర్కారీ వారి పాట చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ ఏడాది మొదట్లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించిన్నప్పటికీ మొదటి షెడ్యూల్ ని మాత్రమే పూర్తిచేసుకుంది.

కరోనా కారణం చేత సినిమా షూటింగ్ వాయిదా పడింది.ప్రస్తుతం రెండవ షెడ్యూల్ విదేశాలలో ప్లాన్ చేయడంతో పరిస్థితులు అనుకూలించక రెండవ షెడ్యూల్ లో పలు మార్పులు చేసి హైదరాబాద్ లోనే చిత్రీకరణ జరుపుతున్నారు. ప్రస్తుతం రెండవ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటుంది.

పని విషయంలో ఎంతో కమిట్మెంట్ చూపించే మహేష్ బాబు ఒక విషయంలో తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయమై చిత్ర బృందానికి గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్టు ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.మహేష్ బాబు నటిస్తున్నటువంటి సర్కారీ వారి పాట చిత్రానికి సంబంధించిన పలు ఫోటోలు వీడియోలు ఇప్పటికే ఎన్నోసార్లు లీకైన సంగతి మనకు తెలిసిందే.

ఈ విధంగా సినిమా నుంచి ఫోటోలు వీడియోలు లీక్ కావడంతో మహేష్ బాబు చాలా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది. ఈ విషయమై మహేష్ బాబు చిత్ర బృందం పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇదే విషయమై మరొకసారి రిపీట్ అయితే బాగుంటుంది చిత్ర బృందాన్ని హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా మైత్రి మూవీ మేకర్స్,14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలతో కలిసి మహేశ్ బాబు స్వయంగా నిర్మిస్తున్నారు.

మే 31 న ‘మహేష్’ ఫ్యాన్స్ కి అదిరిపోయే సర్ ప్రైజ్..!!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. తన తండ్రి పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు అదిరిపోయే సర్ప్రైజ్ ప్లాన్ చేసినట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి.సాధారణంగా మహేష్ తన పుట్టినరోజును ఎలా సెలబ్రేట్ చేసుకుంటాడో పెద్దగా బయటకు రానివ్వరు కానీ ఆయన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజున మాత్రం ఘనంగా జరుపుకుంటారు. పనిలో పనిగా ఆ రోజున తన సినిమాలకు సంబంధించి ఏదొక అప్ డేట్ ఇచ్చి ఆయన అభిమానులను కూడా సర్ ప్రైజ్ చేస్తుంటాడు.

ఈనెల 31న కృష్ణ పుట్టినరోజు కావడంతో మరోసారి అభిమానులకు సర్ ఫ్రైజ్ ఇవ్వడం గ్యారంటీగా కనిపిస్తుంది.గత ఏడాది పరశురామ్ దర్శకత్వంలో ప్రస్తుతం తెరకెక్కుతున్న ‘సర్కారు వారి పాట’ సినిమా టైటిల్ ప్రకటించి తండ్రికి మంచి గిప్ట్ ఇచ్చారు. ప్రతి పుట్టినరోజు లాగానే ఈ సారి కూడా తన కొత్త సినిమా టీజర్ రూపంలోనో, లేదా కనీసం తన కొత్త సినిమా ఫస్ట్ లుక్ తోనే, మహేష్ ఫ్యాన్స్ కి ట్రీట్ ఇస్తాడని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇప్పటికే త్రివిక్రమ్ – మహేష్ బాబు సినిమా ప్రకటన కూడా మేడే నాడే స్పెషల్ గా ఎనౌన్స్ చేశారు.మరి ఇప్పుడు త్రివిక్రమ్ సినిమాకు సంబంధించి ఏదైనా పోస్టర్, టైటిల్ ప్రకటిస్తారా.. లేక ఈ ఏడాది కూడా సర్కారు వారిపాటకు సంబంధించి ఏదైనా ట్రీట్ ఉంటుందా అన్నది చూడాల్సి ఉంది. కాగా, దర్శకుడు వంశీ పైడిపల్లితో మహేష్ ఓ సినిమా చేయనున్నాడని.. ఆ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారని ఈ మధ్య ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.

ఇప్పటికే ఈ సినిమా కథా చర్చలు పూర్తవగా సర్కారు వారి పాట పూర్తయిన వెంటనే ఈ ప్రాజెక్ట్ ను అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.ఇక ప్రస్తుతం మహేష్ నటిస్తున్న సర్కారు వారి పాట షూటింగ్ కరోనా వల్ల వాయిదా పడింది.ఈ సినిమాల మహేష్ ఓ బ్యాంక్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు.థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో మహేష్ సరసన మొదటిసారి హీరోయిన్ గా నటిస్తోంది కీర్తీ సురేష్..!!

బ్లాక్ బస్టర్ డైరెక్టర్‌తో మహేష్ కొత్త సినిమా.. ఈరోజే ప్రకటన!

టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా పేరు సంపాదించిన మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సర్కారీ వారి పాట చిత్రంలో బిజీగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్ర నిర్మాణం శరవేగంగా జరుగుతోంది.దుబాయ్ లో మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం తాజాగా రెండో షెడ్యూల్ ని కూడా ప్రారంభించింది. అయితే కరోనా పరిస్థితుల వల్ల ఈ సినిమా వాయిదా పడింది.సర్కారీ వారి పాట చిత్రం తర్వాత మహేష్ బాబు ఎవరి దర్శకత్వంలో చేస్తారా అనే విషయంపై పెద్ద చర్చ కొనసాగుతుంది. ఈ సినిమా తర్వాత మహేష్ రాజమౌళి దర్శకత్వంలో చేయనున్నాడని వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.

సర్కారీ వారి పాట తర్వాత మహేష్ బాబు రాజమౌళి తో సినిమా చేయడానికన్న ముందుగా మరొక సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది.ఈ క్రమంలోనే ఆ డైరెక్టర్ ఎవరు అనే అనుమానాలు కలిగాయి.సర్కారు వారి పాట తర్వాత మహేష్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడని తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి అధికారక ప్రకటనను ఈ రోజు విడుదల చేయనున్నట్లు సమాచారం.

ఇప్పటికే మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో విడుదలైన అతడు, ఖలేజా మంచి విజయాలను అందుకున్నాయి. అయితే వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమా ఏ విధంగా ఉంటుందో అనేది చర్చనీయాంశంగా మారింది.అయితే వీరి కాంబినేషన్ లో రాబోయే ఈ సినిమా ప్రకటన ఈ రోజు విడుదల కాకపోయినా ఈ నెల 31 తప్పకుండా వెలువడే అవకాశం ఉంది.

ఇకపోతే సర్కారీ వారి పాట సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మే 31న విడుదల చేయనున్నారు. అదేవిధంగా సినిమా టీజర్ ఆగస్టు 9 మహేష్ బాబు పుట్టినరోజు కావడంతో ఆ రోజున విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ పాత్రలో సందడి చేయనున్నారు.