Parachuri Gopala Krishna : సినీ రచయిత, ప్రముఖ నటుడు పరుచూరి గోపాలకృష్ణ గురించి తెలియని వారంటూ ఉండరు. ఎన్నో సినిమాలకు కథా రచయితగా పనిచేసిన గోపాలకృష్ణ కొన్ని సినిమాలలో తన నటనతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అయితే ఇటీవల ఈయన మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమా మీద సంచలన కామెంట్స్ చేశాడు. ఇప్పుడు ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మహేష్ బాబు కీర్తి సురేష్ జంటగా నటించిన సర్కారు వారి పాట సినిమా ఇటీవల విడుదలై మంచి హిట్ అందుకున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా దాదాపు 200 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటి లో స్ట్రీమ్ అవుతోంది. అయితే ఈ సినిమా గురించి పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ.. ఈ రోజుల్లో మోడ్రన్ గా ఈ సినిమాకు సర్కారు వారి పాట అనే టైటిల్ పెట్టారు. కానీ ఆ రోజుల్లో అయితే దేశద్రోహులు అనే టైటిల్ పెట్టేవాళ్ళు. ఈ సినిమా మొదటి భాగంలో హీరో హీరోయిన్ మధ్య కామెడీ ప్రేక్షకులను బాగా అలరించింది. మొదటి 15 నిమిషాలు ఈ సినిమా చూస్తే సినిమా మొత్తం ఇలాగే సాగిపోతే బాగుంటుందని ప్రేక్షకులు అనుకున్నారు.
మహేష్ బాబు సడన్ గా అమెరికా నుండి ఇండియాకు పయనమవటంతో కథ మొత్తం అస్తవ్యస్తం అయ్యింది. హీరో హీరోయిన్ మధ్య ఉన్న కామెడీ సన్నివేశాలు చూస్తూ ఎంజాయ్ చేస్తున్న ప్రేక్షకులు ఇలా ఒక్కసారిగా యాక్షన్ టర్న్ తీసుకోవడంతో ప్రేక్షకులు బోరింగ్ గా ఫీల్ అయ్యారు. ఈ సినిమాలో రెండవ భాగం లో హీరో, విలన్ మద్య రివెంజ్ ఫైటింగ్ ఎక్కువ ఉండడం ప్రేక్షకులు విసిగిపోయారు.
ఈ సినిమా ఇలా ఉండడం వల్ల కేవలం 200 కోట్లు మాత్రమే వసూలు చేసింది. అలా కాకుండా ఈ సినిమాలో చిన్న చిన్న మార్పులు చేసి ఉంటే మరొక 100 కోట్లు వసూలు అయ్యేది అంటూ పరుచూరి గోపాలకృష్ణ తనదైన రీతిలో ఈ సినిమా గురించి రివ్యూ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ సినిమా గురించి గోపాలకృష్ణ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
తమిళనాడు రాజకీయాల్లో తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు, రాజకీయ నేత విజయ్పై ఆస్తుల వివరాల విషయంలో…
తెలుగు బుల్లితెరలో గుర్తింపు పొందిన బిగ్బాస్ ఫేమ్ తమన్నా సింహాద్రి మరోసారి వార్తల్లో నిలిచారు. గతంలో నటి హేమపై వచ్చిన…
తెలుగు సినిమా ప్రపంచంలో తన ప్రత్యేక హాస్యంతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన నటుడు వేణు మాధవ్ మరణం ఇప్పటికీ అభిమానులను…
తెలుగు సినీ పరిశ్రమలో మరో ఆసక్తికర కాంబినేషన్ తెరపైకి రానుంది. యువ నటుడు బెల్లంకొండ గణేష్ హీరోగా తెరకెక్కుతున్న కొత్త…
వేసవి కాలం వచ్చేసరికి చర్మ సమస్యలు, నీరసం, డీహైడ్రేషన్ వంటి ఇబ్బందులు ఎక్కువవుతాయి. కాలుష్యం, ఒత్తిడి కలిసివచ్చే ఈ రోజుల్లో…
మన దైనందిన జీవితంలో టీకి ప్రత్యేక స్థానం ఉంది. ఉదయం లేవగానే ఒక కప్పు వేడి టీ తాగడం చాలా…