Tag Archives: singer sunitha

Singer sunitha: 25 సంవత్సరాల సింగర్ గా తన ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సునీత..

Singer sunitha: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తన అద్భుతమైన గాత్రంతో ఎన్నో పాటలు పాడి ఎంతో మంది అభిమానులను దక్కించుకున్న సునీత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె సింగర్ గా తన ప్రస్థానం మొదలుపెట్టి పాతికేళ్ళు పూర్తి అయ్యింది. ఈ సందర్భంగా సునీత తన పాతికేళ్ల ప్రస్థానం పూర్తికావడంతో అభిమానులకు చిన్న ట్రీట్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.

Singer sunitha: 25 సంవత్సరాల సింగర్ గా తన ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సునీత..

ఈ సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 8 వ తేదీ సునీత శిల్పకళావేదికలో గాయని సునీత, సంగీత దర్శకుడు స్లీఫెన్‌ దేవస్సీల సంగీత విభావరి జరగనుంది. బంజారాహిల్స్‌ ప్రసాద్‌ ల్యాబ్స్‌లో గురువారం ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ను పోస్టర్‌ను సునీత, ఎన్ఎస్ఆర్ ఎస్టేట్స్‌ నిర్వాహకుడు నార్ల శ్రీనివా‌స్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సునీత కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

Singer sunitha: 25 సంవత్సరాల సింగర్ గా తన ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సునీత..

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సంగీత విభావరి తన జీవితంలో ఎప్పటికీ ఒక మైలు రాయిగా నిలిచిపోతుందని తెలిపారు. అలాగే ఈ పాతికేళ్ళ ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నప్పటికీ నిత్యం తన వెంటే ఉంటూ దివంగత బాలు గారు తనని ఎంతగానో ప్రోత్సహించారని బాలసుబ్రహ్మణ్యం గారిని గుర్తు చేసుకున్నారు.

కరోనా నిబంధనలు పాటిస్తూ.. విజయవంతం చేయాలి:

ఇక ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కరోనా నిబంధనలను పాటిస్తూ ఈ సంగీత విభావరిని విజయవంతంగా పూర్తి చేయాలని ఈ సందర్భంగా సునీత తెలియజేశారు. ఇకపోతే సునీత తన రెండవ వివాహం తర్వాత కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. సోషల్ మీడియాలో కూడా సునీత ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన పలు విషయాలను అభిమానులతో పంచుకుంటారు.

డబ్బు కోసమే రెండో పెళ్లి అంటూ.. తన భర్త రామ్ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన సింగర్ సునీత!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో పాపులర్ అయిన వారిలో సింగర్ సునీత ఒకరు. ఈమె తన మధురమైన గానంతో ఎన్నో పాటలు పాడి ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించుకుంది.ఈ క్రమంలోనే ఎన్నో సంవత్సరాల నుంచి ఒంటరి జీవితం గడుపుతున్న సునీత తన ఒంటరి జీవితానికి గుడ్ బై చెబుతూ తన జీవితంలోకి తన స్నేహితుడు అయినటువంటి రామ్ వీరపనేనిని రెండవ పెళ్లి చేసుకుని ఆహ్వానించింది.

ఈ క్రమంలోనే సింగర్ సునీత పై ఎన్నో విమర్శలు వెల్లువెత్తాయి. పెళ్లీడుకొచ్చిన పిల్లలను పెట్టుకుని తాను రెండో పెళ్లి చేసుకోవడం ఏంటి అంటూ అప్పట్లో పెద్దఎత్తున వీరిపై విమర్శలు కురిపించారు. అయితే సునీత తన జీవితంలో ఎదుర్కొన్న సవాళ్లను పడిన కష్టాలను చూస్తే మాత్రం ఆమె నిర్ణయం సరైనదేనని చెప్పవచ్చు. అందరి ఆడ పిల్లలలాగే తను కూడా తన జీవితం అలా ఉండాలి, ఇలా ఉండాలని ఎన్నో కలలు కన్నానని అయితే ఆ కలలన్నీ ఆవిరైపోయాయని ఎన్నో సందర్భాలలో తెలియజేశారు.

జీవితంపై విరక్తి వచ్చి బతుకుతున్న నాకు రామ్ జీవితం పై కొత్త ఆశలను కల్పించాడని అతడు నాకు ప్రపోజ్ చేసినప్పుడు అతని మాటల్లో నిజాయితీ కనిపించిందని, అందుకే తనని పెళ్లి చేసుకున్నానని సునీత తెలియజేశారు. రామ్ ని రెండవ పెళ్లి చేసుకున్న తర్వాత కూడా తనపై విమర్శలు ఏ మాత్రం తగ్గడం లేదని, కేవలం అతని వెనక ఉన్న ఆస్తిని, డబ్బును చూసి పెళ్లి చేసుకున్నాను అంటూ ఎంతో మంది విమర్శలు చేశారు.

నిజానికి రామ్ కి ఎన్ని ఆస్తిపాస్తులు ఉన్నాయో, అతని లావాదేవీలు తనకు తెలియదని, ఇలా తెలియదని చెప్పినా కూడా ఎవరు నమ్మరనే విషయం తనకు తెలుసని ఈ సందర్భంగా సునీత రామ్ ఆస్తుల గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఏది ఏమైనా ఎన్నో బాధలు, అవమానాలు పడిన తర్వాత సునీత రెండవ పెళ్లి చేసుకుని ప్రస్తుతం తన జీవితంలో సంతోషంగా ఉందని మాత్రం తెలుస్తోంది.

ఎంతోమందికి లింకులు పెట్టారంటూ ..రూమర్లపై క్లారిటీ ఇచ్చిన సింగర్ సునీత!

సింగర్ సునీత గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన అందం అభినయంతో, తన తీయనైన గాత్రంతో ఎన్నో వందల పాటలు పాడి ఎంతోమంది అభిమానులను ఆకట్టుకున్నారు. అయితే నిజ జీవితంలో మొదటి భర్తతో విడాకులు తీసుకున్న తర్వాత ఒంటరిగా జీవిస్తున్న సునీత గురించి ఎందరో ఎన్నో వార్తలు రాసేవారు. సునీతకు ఎవరితోనో లింకులు ఉన్నాయంటూ పెద్దఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం చేసేవారు. అయితే ఎప్పుడూ కూడా సునీత వాటిపై స్పందించలేదు.

ఈ క్రమంలోనే సునీత పై వస్తున్నటువంటి ఇలాంటి రూమర్స్ మాత్రమే కాకుండా తను రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే తన స్నేహితుడిని రెండవ పెళ్లి చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది.అయితే రెండవ పెళ్లి చేసుకున్న కూడా సునీత పై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. అయితే తాజాగా సునీత స్పందిస్తూ గతంలో తనపై వచ్చిన రూమర్ల గురించి క్లారిటీ ఇచ్చారు.

ఈ క్రమంలోనే సునీత స్పందిస్తూ తనపై ఎన్నో రూమర్లు వచ్చినప్పటికీ తన కుటుంబ సభ్యులు, తన వాళ్లు ఎప్పుడు వాటిని నమ్మి తనని ప్రశ్నించలేదని ఈ సందర్భంగా తెలిపారు. ఎందుకంటే వారికి నా గురించి తెలుసు కనుక వారి ఎప్పుడు ఇలాంటి విషయాలలో నన్ను ప్రశ్నించలేదని ఈమె తెలియజేశారు. ఒకవేళ ఇలాంటి విషయాలు మాట్లాడినా కూడా కొందరి ఎదవలు ఎప్పటికీ మారరు.. ఇలాగే రాస్తూ ఉంటారని వాళ్లు చెప్పే వారిని సునీత తెలియజేశారు.

కానీ ఎప్పుడైనా ఎవరైనా కలిస్తే సునీత వారితో కలిసింది కారణం అదేనా అంటూ వార్తలు రాసేవారు. ఆ వార్తలు చూసినప్పుడు ఓహో నా గురించి ఇలా అనుకుంటున్నారా? అని వదిలేసాను కానీ ఎప్పుడు వాటిపై స్పందించలేదని, అలాంటి వాటిపై స్పందించక పోవడం మంచిదని సునీత ఈ సందర్భంగా తెలియజేశారు.అయితే ప్రస్తుతం రెండవ పెళ్లి తర్వాత సునీత జీవితం ఎంతో సంతోషంగా ఉందని చెప్పవచ్చు.

ఆత్మహత్య చేసుకోకుండా అలా అంటూ.. ఎమోషనల్ అయిన సింగర్ సునీత!

తెలుగు గాయని సునీత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన మృదువైన గాత్రం ద్వారా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న సునీతకు సోషల్ మీడియాలో కూడా అదే ఫాలోయింగ్ ఉంది.ఈమెకు కూడా అభిమానుల పట్ల ఎనలేని ప్రేమను చూపిస్తుంటారు. ముఖ్యంగా సునీత సింగర్ ఫాన్స్ గురించి చెబుతూ సునీత అప్పుడప్పుడు ఎంతో ఎమోషనల్ అవుతుంటారు. ఈ క్రమంలోనే ఓ సారి ఇంస్టాగ్రామ్ లైవ్ లో ముచ్చటించిన సునీత సునీత సింగర్ ఫాన్స్(ఎస్ఎస్ఎఫ్)కి నా జీవితంలో ఓ ప్రత్యేకమైన స్థానం ఉందని, నా ప్రాణంతో సమానం అని తెలిపారు.

ఈ విధంగా ఎస్ఎస్ఎఫ్ ద్వారా చేసే పలు పోస్టులు ఎందరికో ఆదర్శంగా ఉన్నాయని చెప్పవచ్చు. సునీతను ఆదర్శంగా తీసుకుని ఎంతోమంది తమ జీవితంలోకి ముందడుగు వేశారని, జీవితంలో ఉన్నత స్థానంలో ఉన్నవారు, సునీత వల్ల సాయం పొందిన వారు తమ జీవితం గురించి తెలియజేస్తుంటారు. ఈ విధంగా ఓ అభిమాని సునీతను కదిలించే పోస్ట్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.

ఈ సందర్భంగా సునీత అభిమాని పోస్ట్ చేస్తూ..సునీత ఉపద్రష్ట.. ఓ స్పూర్తి ప్రధాత అంటూ ఎస్ఎస్ఎఫ్‌లో మెంబర్ అయిన ఇందిరా ప్రియదర్శిని అనే అమ్మాయి తన జీవితం గురించి, తన జీవితంలో సునీత పాత్ర గురించి చెప్పుకొచ్చారు. నాకు ప్రాణబిక్ష పెట్టిన దేవత సునీత గారు. ఆమె పాట మనసుకు ప్రశాంతత కల్పిస్తే ఆమె మాట మనిషికి ప్రాణం పోసింది. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడమే ఆమెకు ఉన్న అలవాటు. ఆమెలో ఉన్న ఆత్మవిశ్వాసం నాలో నింపి ఆత్మహత్య చేసుకోకుండా చేసింది. ఆమె పలకరింపు అప్పుడే పుట్టిన పసి పిల్ల నవ్వులా ఉంటుంది. ఆవిడ ఎంతో మందికి ఆదర్శం..ఆవిడ ఎంతోమందికి దైర్యం…ఆవిడ పాటలు ఎంతో మంది మనసుకు ప్రశాంతత.. ఆవిడ దేవుడు నాకు పంపిన బహుమతి అంటూ పోస్ట్ చేసింది. ఈ విధంగా అభిమాని చెప్పిన మాటలకు సునీత ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

పెళ్లి తర్వాత అలాంటి డేరింగ్ డెసిషన్ తీసుకున్న సింగర్ సునీత!

టాలీవుడ్ ఇండస్ట్రీలో కొన్ని వందల పాటలను పాడి తన మధురమైన గాత్రంతో ఎంతోమందిని ఆకట్టుకున్న సింగర్ సునీత ఈ ఏడాది మొదట్లో రెండవ వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.రెండవ వివాహం చేసుకున్న తర్వాత సునీత సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని అభిమానులతో పంచుకునే వారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా సునీతకు ఎంతోమంది అభిమానులు అయ్యారు.

రెండవ వివాహం తర్వాత ఇటు కుటుంబ పరంగా అటు వృత్తి పరంగా ఎంతో బిజీగా మారిన సునీత తాజాగా తన భర్తతో కలిసి వ్యాపార రంగంలోకి రావడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. సునీత భర్త రామ్ మ్యాంగో మీడియాతో పాటు మరికొన్ని డిజిటల్ ఛానళ్లకు అధిపతిగా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే తన బిజినెస్ మరింత డెవలప్ చేయడం కోసం తన భార్య సింగర్ సునీతను సహాయం కోరినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సునీత తన భర్త రామ్ తో కలసి మ్యాంగో బ్యానర్‌పై వెబ్‌ సిరీస్‌లు నిర్మించేందుకు ప్లాన్‌ చేస్తున్నారట. ఈ వెబ్‌ సిరీస్‌ల బాధ్యత మొత్తం రామ్ సునీతకు అప్పగించినట్లు తెలుస్తోంది. నటీనటులను ఎంపిక చేసి వారిని ప్రోత్సహించే దగ్గర నుంచి నిర్మాణ బాధ్యతలను కూడా సునీత తీసుకోనుంది.

ప్రస్తుత కాలంలో డిజిటల్ మీడియాకు ఎంతో డిమాండ్ పెరగడంతో ఈ విధంగా సునీత బిజినెస్ రంగం వైపు అడుగు వేయడం మంచి నిర్ణయం అని కొందరు భావిస్తున్నారు. అయితే ఈ విషయానికి సంబంధించిన మరిన్ని విషయాలను త్వరలోనే వెల్లడించనున్నారని తెలుస్తోంది.

తెలంగాణ మందుబాబులపై షాకింగ్ కామెంట్స్ చేసిన ‘సింగర్ సునీత’..!!

కరోనా సెకండ్ వేవ్ ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్రంగా విజృంభిస్తోన్న నేపథ్యంలో తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పది రోజుల పాటు లాక్ డౌన్ ని ప్రకటించిన సంగతి తెలిసిందే.. ఇక ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించగానే హైదరాబాద్ జిల్లాల్లో వైన్స్ షాపులకు పోటెత్తారు. ఏమాత్రం కరోనా భయం లేకుండా మద్యం కోసం ఎగబడ్డారు. నిజానికి అందరూ కూరగాయలు, నిత్యావసర సరుకుల కోసం తాపత్రయపడుతారని అనుకున్నాం.

కానీ మందుబాబులు మాత్రం ఒక్కరోజులోనే షాపులు ఖాళీ చేసేంతగా మద్యాన్ని కొనేశారని తెలిసి అందరూ విస్తుపోయారు.ఎన్ని కరోనా వైరస్ లు వచ్చినా.. ఎంత తీవ్రంగా ఉన్నా మందుబాబుల ఆ దాహం మాత్రం తీరడం లేదు. మద్యం కోసం వారంతా ఎగబడుతూనే ఉన్నారు. పోయిన సారి కరోనా మొదటి వేవ్ లాక్ డౌన్ లో మద్యం షాపుల మూతతో ఎంత ఇబ్బంది అయ్యిందో అందరూ చూశారు.

మద్యం దొరక్క చాలా మంది మందుబాబులకు పిచ్చెక్కింది.అందుకే కేసీఆర్ ఇలా లాక్ డౌన్ అనడగానే అలా వైన్స్ షాపులపై పడిపోయి సంచుల్లో మద్యాన్ని కొని తీసుకెళ్లిన దృశ్యాలు మీడియాలో వైరల్ అయ్యాయి.వీటిని చూసి తాజాగా ప్రముఖ సింగర్ సునీత కూడా హాట్ కామెంట్స్ చేసింది. ఇలాంటి క్లిష్ట సమయంలో లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూ ఇంట్లోనే సేఫ్ గా ఉండాల్సింది పోయి ఇలా మద్యం కోసం ఎగబడడం ఏంటి అని ప్రశ్నించారు.

లాక్ డౌన్ అనగగానే కిరాణా సామాగ్రి కోసం జనం షాపుల ముందు క్యూ కడుతారని అనుకున్నారని.. కానీ మద్యం కోసం వైన్ షాపుల ముందు క్యూ కట్టడం తాను ఊహించలేదన్నారు. నిజంగా ఇది దురదృష్టకర అంశమని పేర్కొన్నారు.ఇలా మద్యం కోసం తెలంగాణలో మందుబాబు ఎగబడ్డ తీరుపై మేధావులు, సినీ సెలెబ్రెటీలు, ఇతరులు కూడా షాక్ అవుతున్నారు.. ఈ నేపథ్యంలో సింగర్ సునీత.. మందుబాబులపై చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..!!

సింగర్ సునీత షాకింగ్ కామెంట్స్.. సోషల్ మీడియాలో వైరల్!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో సింగర్ సునీత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన తియ్యని గాత్రం తో ఎన్నో మధురమైన పాటలను పాడి ఎంతోమంది తెలుగు వారిని ఆకట్టుకుంది. అయితే ఈ ఏడాది మొదటలో సునీత రామ్ వీరపనేని రెండవ పెళ్లి చేసుకున్న తర్వాత సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా కనిపిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఇంతకుమునుపు మనం ఎన్నడూ చూడని సునీతను చూస్తున్నాము.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటమే కాకుండా బుల్లితెరపై డ్రామా జూనియర్స్ కార్యక్రమానికి న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇన్స్టాగ్రామ్ ద్వారా లైవ్ లోకి వచ్చిన సునీత తన అభిమానులతో కాసేపు ముచ్చటించారు. ప్రస్తుతం బయట ఉన్న భయాందోళన పరిస్థితులను గురించి తెలియజేస్తూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

ఈ క్రమంలోనే నిన్న రాత్రి 8 గంటలకు లైవ్ లోకి వచ్చిన సునీత అభిమానులు అడిగిన పాటలను పాడుతూ అందరిని సంతోష పెట్టారు. ఈ క్రమంలోనే సునీత కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఇలా చెబితే అందరికీ కోపం వస్తుంది. కానీ ఎవరు బయటికి వెళ్లకుండా, తప్పనిసరి అయితే తప్ప తగు జాగ్రత్తలు పాటిస్తూ బయటికి వెళ్ళండి.ఈ విధంగా నేను పాటలు పాడితే కొందరు తమ బాధలను మర్చిపోతారు అంటే ప్రతిరోజు రాత్రి ఇదే సమయానికి ఓ అరగంట మీ కోసం సమయం కేటాయిస్తానని మీకోసం లైవ్ లో పాటలు పాడుతానంటూ అభిమానులకు తెలిపారు.

ఆ డైరెక్టర్ నన్ను బాగా ఇబ్బంది పెట్టాడు : సింగర్ సునీత

చలన చిత్ర పరిశ్రమలో గాయని గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది సింగర్ సునీత.. ఈమె మధురమైన గాత్రంతో ఎన్నో పాటలు పాడి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది..ఇక తెలుగు ఆడియన్స్ లో ఆమెను ఇష్టపడనివారు లేరు. అయితే, ఆ ఇష్టాల్లో తేడా చూపించే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ విషయాన్ని స్వయంగా సునీత సోషల్‌ మీడియాలో పంచుకుంది. ఆమె ఓ సినిమాకు డబ్బంగ్‌ చెప్పడానికి స్టూడియోకి వెళ్ళింది.

అప్పటికే ఆమె రాక కోసం ఎదురుచూస్తున్న ఆ సినిమా డైరెక్టర్ ఆమె రాగానే ఎదురువెళ్లి ఆహ్వానించి లోపలికి తీసుకువెళ్లాడు.ఆ సయమంలో సునీతతో ఆ డైరెక్టర్‌ వ్యవహరించిన తీరుకు సునీత ఇప్పటికీ షాక్ గానే ఫీల్ అవుతూ ఉంటుందట. అసలు విషయాన్ని సునీత మాటల్లోనే.. ‘నేను డబ్బింగ్‌ చెప్పేటప్పుడు సింపుల్ గానే వెళ్తాను. అలా నేను స్టూడియోలో అడుగుపెట్టాగానే ఆ సినిమా దర్శకుడు హాలో మేడమ్‌ అంటూ నన్ను రిసీవ్ చేసుకుని, నేను మీకు పెద్ద అభిమానిని అంటూ చెప్పుకొచ్చాడు.

మా పరిచయం పూర్తయ్యాక కాసేపు బాగానే మాట్లాడిన అతను, ఉన్నట్టు ఉండి వెంటనే నన్ను సునీత అని పిలవడం స్టార్ట్‌ చేశాడు. ఇక ఆ తరువాత కొన్ని డబ్బింగ్‌ సెషన్స్‌ ముగిసాక, అతని ప్రవర్తనలో చాల మార్పు వచ్చింది. చనువుగా మూవ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇందులో భాగంగా ఆ డైరెక్టర్‌ నాకు పలు సలహాలు ఇస్తూ మధ్యలో అరేయ్‌, కన్నా, బుజ్జి అని పిలవడం మొదలెట్టాడు. అల ఆ డైరెక్టర్ బాగా ఇబ్బంది పెట్టాడు..అసలు అతని మాటలు అతని ప్రవర్తన చూసి నాకు ఆశ్చర్యం వేసింది.

మేడం అని పిలుస్తూనే.. వెంటనే అరేయ్‌, బుజ్జి అంటూ ఎలా పిలుస్తున్నాడు అంటూ నేను షాక్ అయ్యాను. అతని ఉద్దేశ్యం ఏమిటో నాకు అర్ధం అయ్యాక, నాకు చిరాగ్గా అనిపించింది. అయితే, అక్కడి నుండి నేను వచ్చే వరకూ అతను నా వెంటే ఉన్నాడు. నా అదృష్టం ఏంటంటే దాని తర్వాత ఆ డైరెక్టర్ ను కలిసే అవకాశం రాలేదు’ అంటూ సునీత తనకు ఎదురైన చేదు సంఘటన గుర్తు చేసుకుంది..అయితే ఇన్ని విషయాలు చెప్పిన ఈమె.. ఆ డైరెక్టర్ ఎవరో మాత్రం బయటపెట్టలేదు.. దీంతో ఈమెను ఇబ్బంది పెట్టిన ఆ డైరెక్టర్ ఎవరా అని ఆరాతీస్తున్నారు కొందరు నెటిజన్లు…!!

ఆ డైరెక్టర్ మామూలోడు కాదంటున్న సింగర్ సునీత!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ సింగర్ గా ఎన్నో వందల పాటలు పాడి ఎంతో మంది మనసును దోచుకున్న వారిలో సింగర్ సునీత ఒకరు. ఈమె గాత్రంతో పాడే పాటలు ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉండగా సునీత రామ్ ను రెండవ పెళ్లి చేసుకున్న తర్వాత ఈమె సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా కనిపిస్తున్నారు. తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

ఈ క్రమంలోనే సునీత తన జీవితంలో జరిగినటువంటి ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. తన ఓ సినిమాకి డబ్బింగ్ చెబుతున్న సమయంలో ఆ సినిమా డైరెక్టర్ తనతో వ్యవహరించిన తీరు గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా డబ్బింగ్ చెప్పే సమయంలో మొదటి రోజు స్టూడియోలో అడుగు పెట్టగానే దర్శకుడు హలో మేడం అంటూ పలకరించి తను నా అభిమాని అంటూ పరిచయం చేసుకున్నారు.

ఈ విధంగా డబ్బింగ్ చెబుతున్న సమయంలో కొంత సమయానికి ఆ దర్శకుడు నన్ను సునీత అని పిలవడం మొదలు పెట్టాడు. ఈ విధంగా ఈ సినిమా డబ్బింగ్ కొన్ని సెషన్స్‌ పూర్తి అయిన తర్వాత ఆ దర్శకుడు నాకు మధ్య మధ్యలో సలహాలిస్తూ అరే బుజ్జి ,నాన్న అని పిలవడం మొదలుపెట్టారు. ఈ విధంగా దర్శకుడు నన్ను అలా కలవడం ఎంతో చిరాగ్గా అనిపించిందని సునీత తాజాగా తెలియజేశారు.

అయితే నా అదృష్టం ఏమిటంటే ఇప్పటివరకు ఆ దర్శకుడిని కలిసే అవకాశం మరోసారి రాలేదని ఆమె తెలిపారు.అప్పుడు ఆ డైరెక్టర్ తనతో ఆ విధంగా ప్రవర్తించడం ఆశ్చర్యం కలిగించిన ఇప్పుడు నవ్వొస్తుంది అంటూ ఆమె తెలిపారు. అయితే సింగర్ సునీతతో ఆ విధంగా ప్రవర్తించడం డైరెక్టర్ ఎవరు? తన డబ్బింగ్ చెప్పిన ఆ సినిమా ఏమిటి? అనే విషయాల గురించి ఎక్కడ చెప్పకపోవడం ఆశ్చర్యం. ప్రస్తుతం సునీత డ్రామా జూనియర్స్ అనే కొత్త షో కి న్యాయనిర్ణేతగా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది

ఈ మహిళా దినోత్సవం నాడు సింగర్ సునీత పోస్ట్ ఎందుకు వైరల్ అవుతుందో తెలుసా?

నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈ దినోత్సవం సందర్బంగా ప్రతి ఒక్కరు దేశం లోని మహిళలందరికీ సోష మీడియా వేదికగా విషెస్ తెలుపుతున్నారు. స్త్రీ లేకుంటే ఈ సృష్ట్టి లేదంటూ మరియు మహిళల ఆవశ్యకతను వివరిస్తూ సోషల్ మీడియా లో కామెంట్స్ పెడుతుండం విశేషం. ప్రతి ఒక్క మహిళా ఈరోజు తమ గెలుపుని సెలెబ్రేట్ చేసుకోవలసిందే. అయితే ఈ పండగ సందర్బంగా ప్రముఖ సింగర్ సునీత సోషల్ మీడియా లో ఒక పోస్ట్ ని పెడుతూ మెసేజ్ ని కూడా జత చేసారు.

నన్ను నిలదీశారు, నన్ను ఎగతాళిచేసారు, నన్ను తప్పుబట్టారు, విమర్శించారు,నన్ను ఇబ్బందిపెట్టారు, ఇన్ని చేసి ఇప్పుడు విషెస్ చెబుతున్నారా అని పోస్ట్ ని పెట్టింది సునీత. అయితే సునీత ఆలా పోస్ట్ పెట్టడం పై నెట్ లో రకరకాల గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆమె ఆ పోస్ట్ ఎవరిని ఉద్దేశించి పెట్టిందనే వార్తలు వస్తున్నాయి.

సింగర్ సునీత ఇటీవలే రామ్ వీరపనేని అనే బిజినెస్ పర్సన్ ని రెండో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఒక మహిళగా, నేను వెనక్కి తగ్గను మీరు ఎన్నిసార్లు నన్ను ఎత్తిచూపాలని చూసి నేను నవ్వుతు సమాధానం ఇస్తానని పోస్ట్ చేసారు సునీత.

సునీత తెలుగు సినిమాలకు ఎన్నో పాటలను పాడారు. రామ్ తో వివాహం జరిగిన తర్వాత సింగర్ నుండి బిజినెస్ పర్సన్ గా కూడా మారిపోయారు సునీత. ఒక పక్క సినిమాల్లో మరోపక్క బిజినెస్ లో రెండింటిలోనూ సమానమైన పాత్రలను పోషిస్తుంది. రెండో పెళ్లి అనగానే చాలా మందికి ఒక రకమైన అభిప్రాయం ఉంటుంది. మరి ముఖ్యంగా సినీ ప్రముఖులు చేసుకుంటే అదొక వార్తగా సోషల్ మీడియా లో తిరుగుతూ ఉంటుంది. కాని సింగర్ సునీత వివాహం మాత్రం ఆమెకు అన్ని విధాలా లాభం తో పాటు బిజీగా మారిందనే చెప్పుకోవాలి.