సింగర్ సునీత గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన అందం అభినయంతో, తన తీయనైన గాత్రంతో ఎన్నో వందల పాటలు పాడి ఎంతోమంది అభిమానులను ఆకట్టుకున్నారు. అయితే నిజ జీవితంలో మొదటి భర్తతో విడాకులు తీసుకున్న తర్వాత ఒంటరిగా జీవిస్తున్న సునీత గురించి ఎందరో ఎన్నో వార్తలు రాసేవారు. సునీతకు ఎవరితోనో లింకులు ఉన్నాయంటూ పెద్దఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం చేసేవారు. అయితే ఎప్పుడూ కూడా సునీత వాటిపై స్పందించలేదు.
ఈ క్రమంలోనే సునీత పై వస్తున్నటువంటి ఇలాంటి రూమర్స్ మాత్రమే కాకుండా తను రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే తన స్నేహితుడిని రెండవ పెళ్లి చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది.అయితే రెండవ పెళ్లి చేసుకున్న కూడా సునీత పై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. అయితే తాజాగా సునీత స్పందిస్తూ గతంలో తనపై వచ్చిన రూమర్ల గురించి క్లారిటీ ఇచ్చారు.
ఈ క్రమంలోనే సునీత స్పందిస్తూ తనపై ఎన్నో రూమర్లు వచ్చినప్పటికీ తన కుటుంబ సభ్యులు, తన వాళ్లు ఎప్పుడు వాటిని నమ్మి తనని ప్రశ్నించలేదని ఈ సందర్భంగా తెలిపారు. ఎందుకంటే వారికి నా గురించి తెలుసు కనుక వారి ఎప్పుడు ఇలాంటి విషయాలలో నన్ను ప్రశ్నించలేదని ఈమె తెలియజేశారు. ఒకవేళ ఇలాంటి విషయాలు మాట్లాడినా కూడా కొందరి ఎదవలు ఎప్పటికీ మారరు.. ఇలాగే రాస్తూ ఉంటారని వాళ్లు చెప్పే వారిని సునీత తెలియజేశారు.
కానీ ఎప్పుడైనా ఎవరైనా కలిస్తే సునీత వారితో కలిసింది కారణం అదేనా అంటూ వార్తలు రాసేవారు. ఆ వార్తలు చూసినప్పుడు ఓహో నా గురించి ఇలా అనుకుంటున్నారా? అని వదిలేసాను కానీ ఎప్పుడు వాటిపై స్పందించలేదని, అలాంటి వాటిపై స్పందించక పోవడం మంచిదని సునీత ఈ సందర్భంగా తెలియజేశారు.అయితే ప్రస్తుతం రెండవ పెళ్లి తర్వాత సునీత జీవితం ఎంతో సంతోషంగా ఉందని చెప్పవచ్చు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…