కరోనా కాలంలో చాలామందికి ఉద్యోగాలు లేక.. ఉన్న ఉద్యోగం కూడా ఊడిపోయి ఇబ్బందులకు గురవుతుంటే.. ఆమెకు మాత్రం కరోనా కాలం కలిసొచ్చింది. ఏకంగా రూ. కోట్లు సంపాదించేందుకు వీలు కుదిరింది. ఆమె పేరు పప్పీ ఓ తూలే. కరోనా మహమ్మారి కారణంగా ఆమె చేస్తున్న ఉద్యోగం పోయింది.
ఏం చెయ్యాలో తెలియని స్థితి వచ్చేసింది. ఓ రోజు ఆమెకు మంచి ఆలోచన తట్టింది. బంగాళా దుంపలతో వంటలు చేస్తూ రోజూ రూ. లక్షలు సంపాదిస్తోంది. పూర్తి వివాల్లోకి వెళ్తే.. ఆమె వయస్సు 27 ఏళ్లు. బ్రిటన్ కు చెందిన యువతి. ఓ ప్రముఖ సంస్థలో రెసిపీలు ఎలా వండాలో నేర్చుకుంది. తర్వాత మరో కంపెనీలో ఉద్యోగం సంపాదించింది. నెలకు దాదాపు 280 గంటలు కష్టపడుతూ వంటలు చేసింది. కానీ ఏం లాభం.. వచ్చే జీతం మాత్రం సరిపోయేది కాదు.
తర్వాత కరోనా వచ్చి ఉద్యోగం పోయింది. అదే సమయంలో ఆమె తల్లిదండ్రుల సాయంతో టిక్ టాక్లో పర్సనల్ వీడియోలు పోస్ట్ చెయ్యడం ప్రారంభించింది. దానిలో భాగంగానే బంగాళదుంపతో రెసిపి వండి టిక్ టాక్ లో పోస్ట్ చేసింది. అంతే ఇక ఆ వీడియోని విపరీతంగా చూశారు. లక్షల కొద్దీ వ్యూస్ వచ్చాయి. ఇదేదో బాగుందనుకొని ఆలూతో చేసిన వంటలు అన్నీ చేసి.. వీడియో తీసి టిక్ టాక్ లో పోస్ట్ చేసింది. ఇక ఆమె వీడియోలు అన్నీ వైరల్ అయ్యాయి.
అమెరికా వాళ్లు ఆమె వీడియోలను తెగ చూసేశారు. ఏకంగా 2 కోట్లు వ్యూస్ వచ్చాయి. దీంతో ఆమెను ఫాలో అయ్యారు. దీంతో ఆమె వంటలకు సంబంధించిన బుక్ ను కూడా రిలీజ్ చేసింది పప్పీ. దానిపేరు రెసిప్ బుక్ సెప్టెంబర్ 2021. ఇలా ఆమె పాలపులారిటీ తెచ్చుకొని వ్యూస్ తెచ్చుకుంటూ.. ఫాలోవర్స్ పెంచుకుంటూ రెండు చేతులా సంపాదిస్తోంది.కరోనా కొందరికి దురదృష్టం అయితే మరికొందరికి అదృష్టం అని చెప్పడానికి ఇదే నిదర్శనం అని చెప్పవచ్చు.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…