కరోనా కాలంలో చాలామందికి ఉద్యోగాలు లేక.. ఉన్న ఉద్యోగం కూడా ఊడిపోయి ఇబ్బందులకు గురవుతుంటే.. ఆమెకు మాత్రం కరోనా కాలం కలిసొచ్చింది. ఏకంగా రూ. కోట్లు సంపాదించేందుకు వీలు కుదిరింది. ఆమె పేరు పప్పీ ఓ తూలే. కరోనా మహమ్మారి కారణంగా ఆమె చేస్తున్న ఉద్యోగం పోయింది.
ఏం చెయ్యాలో తెలియని స్థితి వచ్చేసింది. ఓ రోజు ఆమెకు మంచి ఆలోచన తట్టింది. బంగాళా దుంపలతో వంటలు చేస్తూ రోజూ రూ. లక్షలు సంపాదిస్తోంది. పూర్తి వివాల్లోకి వెళ్తే.. ఆమె వయస్సు 27 ఏళ్లు. బ్రిటన్ కు చెందిన యువతి. ఓ ప్రముఖ సంస్థలో రెసిపీలు ఎలా వండాలో నేర్చుకుంది. తర్వాత మరో కంపెనీలో ఉద్యోగం సంపాదించింది. నెలకు దాదాపు 280 గంటలు కష్టపడుతూ వంటలు చేసింది. కానీ ఏం లాభం.. వచ్చే జీతం మాత్రం సరిపోయేది కాదు.
తర్వాత కరోనా వచ్చి ఉద్యోగం పోయింది. అదే సమయంలో ఆమె తల్లిదండ్రుల సాయంతో టిక్ టాక్లో పర్సనల్ వీడియోలు పోస్ట్ చెయ్యడం ప్రారంభించింది. దానిలో భాగంగానే బంగాళదుంపతో రెసిపి వండి టిక్ టాక్ లో పోస్ట్ చేసింది. అంతే ఇక ఆ వీడియోని విపరీతంగా చూశారు. లక్షల కొద్దీ వ్యూస్ వచ్చాయి. ఇదేదో బాగుందనుకొని ఆలూతో చేసిన వంటలు అన్నీ చేసి.. వీడియో తీసి టిక్ టాక్ లో పోస్ట్ చేసింది. ఇక ఆమె వీడియోలు అన్నీ వైరల్ అయ్యాయి.
అమెరికా వాళ్లు ఆమె వీడియోలను తెగ చూసేశారు. ఏకంగా 2 కోట్లు వ్యూస్ వచ్చాయి. దీంతో ఆమెను ఫాలో అయ్యారు. దీంతో ఆమె వంటలకు సంబంధించిన బుక్ ను కూడా రిలీజ్ చేసింది పప్పీ. దానిపేరు రెసిప్ బుక్ సెప్టెంబర్ 2021. ఇలా ఆమె పాలపులారిటీ తెచ్చుకొని వ్యూస్ తెచ్చుకుంటూ.. ఫాలోవర్స్ పెంచుకుంటూ రెండు చేతులా సంపాదిస్తోంది.కరోనా కొందరికి దురదృష్టం అయితే మరికొందరికి అదృష్టం అని చెప్పడానికి ఇదే నిదర్శనం అని చెప్పవచ్చు.
వాతావరణ మార్పులు మన ఆరోగ్యంపై నేరుగా ప్రభావం చూపుతాయని వైద్యులు చెబుతున్నారు. ఒక రోజు ఎండగా ఉండగా, మరుసటి రోజు…
40 ఏళ్ల వయస్సు దాటిన తర్వాత ఆరోగ్యంపై మరింత శ్రద్ధ అవసరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ దశలో శరీరంలో…
మహిళా రిజర్వేషన్ అమలుకు సంబంధించిన డీలిమిటేషన్ అంశంపై రాజకీయ వాతావరణం మరింత వేడెక్కుతోంది. ఈ విషయంలో ఏపీ సీఎం ఎన్.…
అక్షయ తృతీయ సందర్భంగా కొనుగోళ్లు చేయడం శుభమనే నమ్మకం ప్రజల్లో బలంగా ఉంది. ముఖ్యంగా బంగారం, వెండి కొనడం ఆనవాయితీగా…
పిల్లల్లో ఆటిజం (Autism) సమస్యపై అవగాహన రోజురోజుకు పెరుగుతున్నప్పటికీ, చాలా మంది తల్లిదండ్రులు ప్రారంభ లక్షణాలను గుర్తించడంలో ఆలస్యం చేస్తున్నారు.…
తిరుమల దేవాలయం చుట్టూ ఉన్న మాడ వీధులు భక్తులకు కేవలం మార్గాలే కాదు, ఆధ్యాత్మిక సంప్రదాయానికి ప్రతీకలుగా నిలిచాయి. కలియుగ…