Tag Archives: sridevi drama company

Anchor Rashmi: రష్మీ బ్యాచిలర్ పార్టీ.. 9 ఏళ్ళ ప్రశ్నకు సమాధానం చెప్పేసిన యాంకర్?

Anchor Rashmi: యాంకర్ రష్మీ ఈ పేరు గురించి పరిచయం అవసరం లేదు.జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రష్మీ అనంతరం పలు సినిమాలలో నటించి హీరోయిన్ గా ఇండస్ట్రీలో నిలదోక్కుకోవాలని ప్రయత్నం చేశారు.ఇలా ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటించిన ఈమెకు గుర్తింపు రాకపోవడంతో బుల్లితెర కార్యక్రమాలకు పరిమితమయ్యారు.

ఇలా బుల్లితెర కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తూ ఎంతో బిజీగా ఉన్న రష్మీ ప్రస్తుతం శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి కూడా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే.జబర్దస్త్ కార్యక్రమంలో సుడిగాలి సుదీర్ ఉన్నప్పుడు ఈమెకు సుడిగాలి సుదీర్ మధ్య లవ్ ట్రాక్ క్రియేట్ చేయడం, వీరిద్దరి మధ్య ఈ లవ్ ట్రాక్ హైలెట్ కావడంతో చాలామంది వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని భావించారు.

అదేవిధంగా ఎన్నోసార్లు జబర్దస్త్ కార్యక్రమం పై వీరికి పెళ్లి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.ఇకపోతే వచ్చేవారం ప్రసారం కాబోయే శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా మరో పెళ్లి తంతు కార్యక్రమం మొదలైంది.వచ్చేవారం అక్క బావేక్కడ అనే కాన్సెప్ట్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.ఈ క్రమంలోనే రష్మీ సిగ్గు పడుతూ తన పెళ్లి గురించి ప్రకటించడం అందరిని షాక్ కి గురి చేసింది.

పెళ్లి గురించి చెబుతూ ఎమోషనల్ అయిన రష్మీ…

త్వరలోనే తాను పెళ్లి చేసుకోబోతున్నట్లు రష్మీ ప్రకటించడంతో అందరూ నిజంగానే ఈమె పెళ్లి చేసుకోబోతోందా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా తన పెళ్లి గురించి చెబుతూ చివరిలో ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు.అయితే నిజంగానే రష్మి పెళ్లి కుదిరిందా లేకపోతే ప్రోమో కోసం ఇలా చేశారా అనే విషయం తెలియాల్సిందే.ఇక ప్రస్తుతం ఏమి జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమాలతో పాటు పలు సినిమాలలో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు.

Rithu Chowdhary: కాబోయే భర్తను పరిచయం చేసిన జబర్దస్త్ బ్యూటీ రీతూ… అతని బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

Rithu Chowdhary: యాంకర్ గా తన కెరియర్ మొదలుపెట్టి అనంతరం మోడలింగ్ రంగం వైపు అడుగులు వేసి అలాగే బుల్లితెర సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి రీతు చౌదరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె పలు బుల్లితెర సీరియల్స్ ద్వారా పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేసింది. అలాగే సినిమాలలో కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన ఈమె జబర్దస్త్ కార్యక్రమంలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.

జబర్దస్త్ కార్యక్రమంలో ఆది స్కిట్లో చేస్తున్నటువంటి ఈమె ఆది ఈ షో నుంచి వెళ్లిపోవడంతో అజర్ టీంలో సందడి చేస్తున్నారు.ఇలా జబర్దస్త్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు పొందిన ఈమె సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ నిత్యం తన గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నారు.

ఇదిలా ఉండగా తాజాగా ఈమె తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి దిగిన ఫోటోని షేర్ చేస్తూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించారు.ఇలా తన బాయ్ ఫ్రెండ్ పేరు శ్రీకాంత్ అని అందరికీ పరిచయం చేసిన రీతు ఈ ఫోటో షేర్ చేసిన కొన్ని క్షణాల్లోనే వైరల్ అయింది. అయితే ఈమె చేసుకోబోయే వ్యక్తి ఎవరు? అతని బ్యాక్ గ్రౌండ్ ఏంటి అనే విషయానికి వస్తే…

భారీ ఆస్తుపాస్తులు కలిగిన శ్రీకాంత్..

రీతు చౌదరి పెళ్లి చేసుకోబోయే అబ్బాయి శ్రీకాంత్ పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న కుటుంబంలో జన్మించడమే కాకుండా కోట్లలో ఆస్తిపాస్తులు ఉన్నాయని తెలుస్తోంది. ఇలా భారీ బ్యాగ్రౌండ్ ఉన్న శ్రీకాంత్ ను రీతు చౌదరి త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు. అయితే వీరు పెళ్లి ఎప్పుడు ఏంటి అనే విషయాలను మాత్రం వెల్లడించలేదు. ఇకపోతే రీతు షేర్ చేసిన తన ప్రియుడు ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతుంది.

జబర్దస్త్ లో క్యాస్టింగ్ కౌచా!?.. ఇందులో నిజమెంత ?

గత కొన్ని సంవత్సరాల నుంచి బుల్లితెరపై అద్భుతమైన రేటింగ్స్ దూసుకుపోతూ అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్న కార్యక్రమాలలో జబర్దస్త్ కార్యక్రమం ఒకటి. ఈ కార్యక్రమం వారంలో రెండుసార్లు ప్రసారమవుతుంది. జబర్దస్త్ ఎక్స్ ట్రా జబర్దస్త్ గా ప్రసారం అవుతూ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న ఈ కార్యక్రమానికి ప్రస్తుతం టిఆర్పి రేటింగ్స్ పూర్తిగా పడిపోయాయని చెప్పవచ్చు.

ఉన్నఫలంగా రేటింగ్స్ తగ్గిపోవడానికి గల కారణం ఈ కార్యక్రమానికి పోటీగా ఎన్నో కార్యక్రమాలు రావడంతో వాటికి ఆదరణ పెరిగి ఈ కార్యక్రమాన్ని చూసే వారి సంఖ్య తగ్గిపోయింది. ఇప్పటికే జబర్దస్త్ తరహాలోనే శ్రీదేవి డ్రామా కంపెనీ, కామెడీ స్టార్స్ వంటి కార్యక్రమాలు ప్రసారం కావడంతో వాటికి బాగా ఆదరణ పెరిగింది.

ఇదిలా ఉండగా తాజాగా జబర్దస్త్ కార్యక్రమానికి మరో పెద్ద సమస్య వచ్చింది.ఇప్పటివరకు సినిమా ఇండస్ట్రీలో మాత్రమే క్యాస్టింగ్ కౌచ్ ఉంటుందని భావించాము. కానీ ఇప్పుడు జబర్దస్త్ కార్యక్రమంలో కూడా ఈ కాస్టింగ్ కౌచ్ సమస్యలు తలెత్తుతున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే కొందరు స్టార్ కమెడియన్ ఫీమేల్ కమెడియన్స్ ను ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు సమాచారం.

ఈక్రమంలోనే స్టార్ కమెడియన్స్ గా ఉన్నటువంటి వారు లేడీ కమెడియన్స్ తో సాయంత్రం ఖాళీగా ఉంటారా కలుద్దామా అంటూ డైరెక్ట్ గా మాట్లాడుతున్నారని ఇలాంటి మాటలు ఎంతో ఇబ్బంది పెట్టడంతో ఇదే విషయాన్ని మల్లెమాల వారికి ఫిర్యాదు చేస్తే వారు ఆ స్టార్ కమెడియన్ కూడా వారిలో ఏమాత్రం మార్పు రాలేదని తెలుస్తోంది. ఇలా బుల్లితెరపై ప్రసారమయ్యే ఈ కార్యక్రమంలో కూడా క్యాస్టింగ్ కౌచ్ ఉందన్న విషయం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

ఏడ్చేసిన సుధీర్.. తను నెల నెలా డబ్బులు పంపుతానన్న ఇంద్రజ..!

ఇటీవల విడుదలైన శ్రీదేవీ డ్రామాకంపెనీ ప్రోమో అందరినీ ఆలోచింపచేసే విధంగా ఉంది. కడుపున పుట్టిన వారే కాదన్నారనే బాధలో ఉండే వారి మోముల్లో చిరు నవ్వులు విరబూయించే ప్రయత్నంలో భాగంగా వృద్ధాశ్రమంలో ఉంటున్న వారిని ఈ షోకు తీసుకొచ్చారు. అందులో వాళ్లల్లో కాస్త నవ్వులు పూయించేందుకు ప్రయత్నం చేశారు.

అందులో భాగంగానే ఆది ఓ బామ్మతో వేసిన డ్యాన్స్.. వాళ్లతో లవ్ చేస్తున్నా అంటూ చెప్పిన కామెడీ.. అందరిలోనూ ఆనందం నింపాయి. ఇక ఆదికి పెయిర్ దొరికినట్లే అని కామెడీ చేస్తే అలరించారు. అందులో ఓ పెద్దావిడ పాడిన పాటకు.. సుధీర్ భావోద్వేగానికి గురయ్యాడు.

‘అమ్మా చూడాలి.. నిన్నూ నాన్నని చూడాలి’ అంటూ ఆలపించి, హృదయాన్ని హత్తుకుంది. తన బిడ్డల్ని తలచుకుని కంటతడి పెట్టుకోవడంతో అందరి కళ్లూ చెమ్మగిల్లాయి. ఓ అమ్మ విషయంలో జరిగిన సంఘటనని గుర్తు చేసుకుంటూ కన్నీటి పర్యంతమయ్యాడు సుధీర్‌. ఇక్కడ ఉన్న తల్లిదండ్రలు ఇంత బాధ అనుభవిస్తుంటే.. మీతో పాటు వాళ్లను కూడా తీసుకెళ్లొచ్చు కదా.. అంటూ వీరిని ఆశ్రమంలో వదిలేసిన వారిని కోరాడు సుధీర్.

ఇక ఇదే వేధికపై వాళ్ల బాధను చూడలేక.. వర్ష, భాను రూ.లక్ష విరాళం అందజేశారు. అంతే కాకుండా ఇంద్రజ కూడా వాళ్ల మెడికల్ కు సంబంధించి ఎంత ఖర్చు అవుతుంతో కనుక్కొని.. ఒక్క వారం కాదు.. ప్రతీ నెలా తానే భరిస్తానని.. ఆ ఖర్చులకు డబ్బులు నేనే ఇస్తానంటూ హామీ ఇచ్చారు. ఈ ప్రోమో ప్రతీ ఒక్కరి హృదయాన్ని బరువెక్కిస్తోంది. ఈ ప్రోగ్రాం పూర్తి ఎపిసోడ్ అక్టోబర్ 3 న విడుదల కానుంది.

నీకెందుకు బే అంటూ.. స్టేజ్ పైనే సుడిగాలి సుదీర్ దారుణంగా అవమానించిన ప్రియదర్శి!

బుల్లితెరపై సుడిగాలి సుదీర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మెజీషియన్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సుడిగాలి సుదీర్ స్టేజ్ షోలను చేస్తూ జబర్దస్త్ లోకి ఎంటర్ అయ్యాడు.ఈ విధంగా జబర్దస్త్ లోకి ఎంటర్ అయిన సుడిగాలి సుదీర్ ఈ కార్యక్రమం ద్వారా వెనుతిరిగి చూసుకోలేదని చెప్పవచ్చు.జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఒక్కొక్కటిగా అవకాశాలను అంది పుచ్చుకుంటూ వెండితెరపై నటించే అవకాశాలను కూడా దక్కించుకున్నారు అంటే ఏ స్థాయిలో అతని పర్ఫార్మెన్స్ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

ప్రస్తుతం సుడిగాలి సుదీర్ ఎక్స్ ట్రా జబర్దస్త్ లో టీం లీడర్ గా ఉండటమే కాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీకు యాంకర్ గా విధులు నిర్వహిస్తున్నారు. కేవలం యాక్టింగ్ పరంగా మాత్రమే కాకుండా క్రేజ్ పరంగా సుడిగాలి సుదీర్ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పటికే సోషల్ మీడియాలో సుడిగాలి సుధీర్, రష్మిక జంటకు ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

మామూలుగానే వీరు ఒక్కొక్కరు స్టేజ్ పై ఉంటే చేసే రచ్చ మామూలుగా ఉండదు. అలాంటి ఇద్దరు కలిస్తే ఇక ఆ షో కి వచ్చే రెస్పాన్స్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఇకపోతే సుడిగాలి సుదీర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నటువంటి శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఈ కార్యక్రమానికి అతిథిగా జాతిరత్నాలు ప్రియదర్శి వచ్చారు.

సుడిగాలి సుధీర్ కామెడీకీ, ప్రియదర్శి కామెడీ జోడయితే ఎలా ఉంటుందో ఈ ప్రోమోలో చూడొచ్చు. ఈ క్రమంలోనే ఈ షోకి వచ్చిన ప్రియదర్శిని సుడిగాలి సుదీర్ ఒక ప్రశ్న అడిగాడు.”నా చావు నేను చస్తా… నీకెందుకు అని ఒక పుస్తకం” రాశారు కదా.. దాన్ని పబ్లిష్ చేస్తున్నారా? అంటూ సుడిగాలి సుదీర్ ప్రియదర్శిని అడగడంతో.. అందుకు ప్రియదర్శి “నీకెందుకు బే.. హౌలే” అనేవాళ్ళు ఆ బుక్కును పబ్లిష్ చేస్తున్నారని అనడంతో సుడిగాలిసుధీర్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అయితే ఇదంతా కేవలం కామెడీ కోసమేనని తెలుసుకోవడంతో అందరూ ఒక్కసారిగా పగలబడి నవ్వారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

నగ్నంగా హీరో హీరోయిన్ హగ్ చేసుకున్న ఫోజ్ ట్రై చేసిన.. సుడిగాలి సుదీర్.. చివరకు ట్విస్ట్ అదిరింది!

బుల్లితెరపై ఒక యాంకర్ గా, డాన్సర్ గా, మెజీషియన్ గా, కమెడియన్ గా, టీమ్ లీడర్ గా చేసి ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న ఏకైక ఆర్టిస్ట్ ఎవరైనా ఉన్నారా అంటే వెంటనే అందరికీ సుడిగాలి సుధీర్ గుర్తుకు వస్తాడు. ఒక సాధారణ ఆర్టిస్ట్ గా ఎంటరైన సుడిగాలి సుదీర్ ఆ తర్వాత తన టాలెంట్ తో వరుస అవకాశాలను దక్కించుకుంటూ తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు.

ప్రస్తుతం సుడిగాలి సుదీర్ ఈటీవీలో ప్రసారమవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీకి యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమంలో జబర్దస్త్ కమెడియన్లు అందరూ తమదైన శైలిలో కామెడీలను పండిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం ఎపిసోడ్ కి సంబంధించిన కార్యక్రమంలో భాగంగా సుడిగాలి సుదీర్ తనదైన శైలిలో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాడు.

శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి అతిథిగా వరుణ్ సందేశ్ వచ్చారు. ప్రస్తుతం వరుణ్ సందేశ్ ఇందువదన అనే సినిమా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు. ఈ పోస్టర్ లో హీరో హీరోయిన్లు ఇద్దరూ నగ్నంగా హగ్ చేసుకోవడంతో ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో ఈ పోస్టర్ లోని ఫోజ్ చూపించడంతో అందరూ నవ్వుకున్నారు. ఈ క్రమంలోనే ఆటో రాంప్రసాద్ మాట్లాడుతూ…”ఈ ఫోటోలో ఫోజ్ లో నిన్ను, శాంతి స్వరూప్ ను చూడాలని ఉంది” అని అడగగా.. రాంప్రసాద్ అడగగానే సుడిగాలి సుదీర్, శాంతిస్వరూప్ తో కలిసి ఈ ఫోటోలో ఉన్న ఫోజ్ ఇచ్చారు. అయితే సుడిగాలి సుదీర్ మాత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ లో ఉన్న విధంగా నగ్నంగా కాకుండా.. బట్టలతోనే ఈ ఫోజు ఇవ్వడంతో వేదికపై ఉన్న వారందరూ ఎంతో నవ్వుకున్నారు.

ఆ కార్యక్రమంలో బిగ్ బాస్ కంటెస్టెంట్ కు ఘోర అవమానం.. పందికొక్కు అంటూ!

బుల్లితెరపై ప్రసారమయ్యే జబర్దస్త్ కార్యక్రమంలో గెటప్ శీనుకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ కార్యక్రమంలో తన కామెడీ పంచుల ద్వారా ప్రేక్షకులను నవ్విస్తూ అందరిని ఆకట్టుకుంటాడు.ఈ విధంగా జబర్దస్త్ కార్యక్రమంలో ఎంతో గుర్తింపును సంపాదించుకున్న గెటప్ శీను బుల్లితెరపై ప్రసారమయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా తనదైన శైలిలో పంచులు వేస్తూ అందరిని ఆకట్టుకున్నాడు.

తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ కార్యక్రమానికి సంబంధించిన ఓ ఎపిసోడ్ లో భాగంగా జబర్దస్త్ కమెడియన్స్ తో పాటు పలువురు సినీ సెలబ్రిటీలు వచ్చి ఎంతో సందడి చేశారు. ఈ ఎపిసోడ్ లో భాగంగా గెటప్ శీను తన గెటప్ లో ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను సందడి చేశారు. ఈ క్రమంలోనే ఈ షోలో భాగంగా మరొక లేడీ కమెడియన్ ను పందికొక్కు అంటూ గెటప్ శీను దారుణంగా ట్రోల్ చేశాడు.

ఈ కార్యక్రమంలో భాగంగా గెటప్ శీను ఎంట్రీ ఇస్తూ లేడీ కమెడియన్ రోహిణితో ఏంటి డల్ గా ఉన్నావ్.. అంటూ కామెడీ వాయిస్ తో ప్రశ్నించాడు. అందుకు రోహిణి బాధతో తాను పండించిన పంటను మొత్తం పందికొక్కులు తింటున్నాయని చెబుతుంది.అప్పుడు గెటప్ శీను నువ్వు పండించిన పంటను నువ్వే తినడం ఏంటి అంటూ.. తన పై పంచ్ డైలాగ్ వేశాడు. అంటే రోహిణి కూడా పందికొక్కు అని చెప్పకనే చెబుతూ ఆమెను అతి దారుణంగా ట్రోల్ చేశాడు.

మరో వివాదంలో చిక్కుకున్న కమెడియన్ పృథ్వీరాజ్… ఆ నటుడిని అలా అన్నందుకే!

బుల్లితెరపై ఈటీవీలో ప్రసారమయ్యే “శ్రీదేవి డ్రామా కంపెనీ” కార్యక్రమంలో కమెడియన్లు చేసే స్కిట్ లు తీవ్ర వివాదాలకు దారి తీస్తున్నాయి. ఇదివరకే హైపర్ ఆది తెలంగాణ సంస్కృతిని తప్పుబడుతూ చేసిన స్కిట్ ఏకంగా పోలీస్ కేసు దాకా వెళ్ళిన సంగతి మనకు తెలిసిందే. తాజాగా ఈ కార్యక్రమంలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి రాజ్ గెస్ట్ రోల్ లో కనిపించాడు. ఈ క్రమంలోని శ్రీమంతుడు కాన్సెప్ట్ ద్వారా ఈ కార్యక్రమంలో ఎంట్రీ ఇచ్చి సందడి చేశారు.

ఈ క్రమంలోనే జూలై 11 న ప్రసారమైన ఈ కార్యక్రమంలో కమెడియన్ పృథ్వి రాజ్ మరొక కమెడియన్ గౌతమ్ రాజు పేరును ప్రస్తావించడంతో ఇది కాస్త వివాదానికి దారి తీసింది. ఈ స్కిట్ లో భాగంగా కమెడియన్ నూకరాజు పృథ్వీరాజ్ తో మాట్లాడుతూ… సార్ మేము ఇప్పుడైతే పేదోళ్లం కానీ ఒకప్పుడు రాజులం సార్’.. అని అంటారు. రాజులా.. అదేంటి? అని పృథ్వీ అడగ్గా.. ‘నేను నూకరాజు.. మా తమ్ముడు లోక రాజు.. మా నాన్న పోతురాజు అని నూకరాజు చెప్పగానే అందుకు పృధ్విరాజ్… ఆ ఇది చెప్పుకుని ఆ గౌతమ్ రాజు గాడు కూడా బతికేస్తున్నాడు. అని పంచు డైలాగ్ వేశాడు.

ఈ విధంగా పృద్వి రాజ్ గౌతమ్ రాజు పై పంచులు వేయడం ఇప్పుడు తీవ్ర వివాదానికి దారి తీసింది. పృథ్వీరాజ్ గౌతమ్ రాజును ఉద్దేశించే ఈ డైలాగ్ వేశారని ఈ విషయం కాస్తా హాట్ టాపిక్ గా మారడంతో తను ఆ గౌతమ్ రాజును దృష్టిలో ఉంచుకొని ఈ మాట అనలేదని, పొరపాటుగా జరిగిపోయిందని నటుడు పృథ్వీరాజ్ ఒప్పుకున్నారు.

ఈ స్క్రిప్ట్ లో భాగంగా కావాలని నేను గౌతమ్ రాజు పేరు వాడుకుంటున్నట్లు వస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదు. ఏదో సందర్భానుసారంగా నా ప్రమేయం లేకుండా జరిగిపోయిందని, ఏది ఏమైనా పొరపాటు జరిగింది ఈ విషయం ఇక్కడితో వదిలేయండి అంటూ పృధ్వీరాజ్ ఒక వీడియోలో సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు.

వానలో చిందులేస్తూ రచ్చ చేసిన ఇంద్రజ.. ఆమె డాన్స్ చూసి అంతమాటన్న సుడిగాలి సుదీర్?

బుల్లితెరపై సుడిగాలి సుదీర్ యాంకర్ గా వ్యవహరిస్తున్న కార్యక్రమం “శ్రీదేవి డ్రామా కంపెనీ”.అన్ని రకాల ప్రేక్షకులకు వినోదం పంచుతూ ఎంతో విజయవంతంగా దూసుకుపోతున్న ఈ కార్యక్రమం తాజాగా 25వ ఎపిసోడ్ ను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఈ వారం ప్రసారమయ్యే కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.

ఈ ప్రోమోలో భాగంగా సీనియర్ హీరోయిన్లు ఇంద్రజ లైలా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఈ క్రమంలోనే ఇంద్రజ స్టేజి మీద వానలో “మెరిసింది మేఘా మేఘా” అంటూ చిందులు వేస్తూ రచ్చ రచ్చ చేశారు. ఈ క్రమంలోనే ఇంద్రజకు తోడుగా లైలా కూడా కాలు కదిపారు. ఈ విధంగా స్టేజ్ పై ఇంద్రజ వేసిన స్టెప్పులు చూసి అందరూ ఎంతో ఆశ్చర్యపోయారు.

ఈ సందర్భంగా ఇంద్రజ మాట్లాడుతూ దాదాపు 18 సంవత్సరాల తర్వాత స్టేజ్ పై డాన్స్ వేశానని చెప్పడంతో సుడిగాలి సుదీర్ అందరూ చూస్తుండగానే…” 18 ఏళ్ల తర్వాత చేసినప్పటికీ, 18 ఏళ్ల పిల్లల డాన్స్ చేశారు” అని అనడంతో అందరూ ఎంతో ఆశ్చర్యపోయారు. ఇక ఈ ప్రోమోలో హైపర్ ఆది చేసిన రచ్చ మామూలుగా లేదు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఎంతోమంది నెటిజన్లను ఆకట్టుకుంది.

మళ్లీ వెనకనుంచి వచ్చి పట్టుకున్న 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి రాజ్.. వీడియో వైరల్!

మల్లెమాల వారు నిర్వహిస్తున్న శ్రీదేవి డ్రామా కంపెనీ మొదట్లో పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయినా సుడిగాలి సుధీర్ యాంకర్ గా ఎంటర్ అవడంతో ఈ కార్యక్రమానికి అమాంతం క్రేజ్ పెరిగింది. జబర్దస్త్ కార్యక్రమం మాదిరిగానే శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమం కూడా దూసుకుపోతోంది. ఈ షోలో భాగంగా సుడిగాలి సుధీర్ యాంకర్ గా వ్యవహరించగా హైపర్ ఆది, గెటప్ శీను, సుధాకర్ వంటి జబర్దస్త్ కమెడియన్ తమదైన శైలిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.. తాజాగా జులై 11 ఆదివారం ప్రసారం కాబోయే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో నిర్వాహకులు విడుదల చేశారు.

ఈ ప్రోమోలో హైపర్ ఆది, గెటప్ శీను, సుధాకర్ కమెడియన్లు చేసిన కామెడీ అంతా ఇంతా కాదని చెప్పవచ్చు. ఈ వారం కమెడియన్స్ అందరూ శ్రీమంతుడు సినిమాలో గ్రామాన్ని దత్తత తీసుకొనే కాన్సెప్టుతో చేశారు. ఈ కాన్సెప్ట్ లో 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి రాజ్ శ్రీమంతుడు దర్శనమిచ్చాడు.పోరా శ్రీమంతుడా అంటూ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన పృథ్విరాజ్ వచ్చి రాగానే తనదైన శైలిలో పంచ్ లు వేసి అందరిని నవ్వించారు.

ఈ విధంగా స్టేజ్ పైకి వచ్చిన పృథ్విరాజ్ వచ్చీరాగానే…. ఆది… వెనక నుంచి వచ్చానని కంగారు పడ్డావా? అని అడగగా అందుకు ఆది” మీరు వెనక నుంచి వస్తారని మాకు తెలుసు…కానీ మా కోసం వస్తారు అని మాత్రం తెలియదు అంటూ” తనదైన శైలిలో పంచ్ వేశాడు. అయితే గతంలో పృథ్వి రాజ్ ఎస్వీబీసీ చైర్మన్‌గా చేసిన పృధ్విరాజ్ ఓ మహిళతో ఫోన్ కాల్ అసభ్యకరంగా మాట్లాడుతూ దొరికిపోయిన సంగతి మనకు తెలిసిందే. ఈ ఫోన్ కాల్ లో భాగంగా పృద్విరాజ్ మహిళతో వెనుక నుంచి వచ్చి పెట్టుకుందాం అనుకున్నా అంటూ పృథ్వీరాజ్ మాట్లాడిన మాటలు లీక్ అవడంతో అప్పటినుంచి వెనకనుంచి పట్టుకొని పృథ్వి రాజ్ అయ్యాడు.అయితే ఈ వార్తలపై స్పందించిన పృథ్వీ రాజ్ కావాలని తనపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు.

ఈ విధంగా శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ కార్యక్రమంలో ఓ స్కిట్లో భాగంగా ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని ఆ గ్రామంలోని ప్రజల సమస్యలను తీర్చి గ్రామ అభివృద్ధికి కృషి చేసే కాన్సెప్ట్ ద్వారా సందడి చేశారు. ఈ కార్యక్రమానికి సంబంధించి పూర్తి ఎంటర్టైన్మెంట్ చూడాలనుకుంటే వచ్చే వారం వరకు ఎదురు చూడాల్సిందే.