Tag Archives: suicide

ఆరెంజ్ సినిమా తర్వాత నాగబాబు సూసైడ్ విషయం పై అసలు నిజం బయట పెట్టిన డైరెక్టర్ భాస్కర్..!

డైరెక్టర్ భాస్కర్ దర్శకత్వంలో జెనీలియా సిద్ధార్థ జంటగా తెరకెక్కిన చిత్రం బొమ్మరిల్లు.ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకోవడంతో ఆ దర్శకుడి పేరు ఏకంగా బొమ్మరిల్లు భాస్కర్ గా మారిపోయింది. బొమ్మరిల్లు సినిమా తర్వాత పలు సినిమాలకు దర్శకత్వం వహించిన పెద్దగా గుర్తింపు రాలేదు.ఈ క్రమంలోనే బొమ్మరిల్లు భాస్కర్ అఖిల్ హీరోగా “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” ద్వారా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యారు.

అఖిల్ పూజా హెగ్డే జంటగా నటించిన “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” అక్టోబర్ 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దర్శకుడు ఈ సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. అదేవిధంగా తన జీవితంలో హిట్ ఫ్లాప్ అనేది రెండు సమానంగా ఉంటాయని మన జీవితంలో రెండింటిని సమానంగా తీసుకోవాలని తెలియజేశారు.

ఈ సందర్భంగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన “ఆరెంజ్” సినిమా గురించి మాట్లాడుతూ తన జీవితంలో ఏ సినిమాకి కూడా అంత కష్టపడి పని చేయలేదని ఆ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ ఆ సినిమా చేసినందుకు తనకు ఎంతో హ్యాపీగా ఉందని బొమ్మరిల్లు భాస్కర్ ఈ సందర్భంగా తెలియజేశారు. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నాగబాబు నిర్మాతగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.

ఈ క్రమంలోనే ఈ సినిమా ఫ్లాప్ కావడంతో నిర్మాత నాగబాబు ఎంతో నష్టపోయారు. ఇలా నష్టపోవడంతో నాగబాబు సూసైడ్ చేసుకోవాలని భావించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి ఇందులో ఎంత వరకు నిజం ఉందనే ప్రశ్న భాస్కర్ గారికి ఎదురవడంతో… ఆ వార్తలలో ఏ మాత్రం నిజం లేదని… అవన్నీ కేవలం కల్పితాలు మాత్రమేనని నాగబాబు గురించి వచ్చిన వార్తలను బొమ్మరిల్లు భాస్కర్ కొట్టిపారేశారు. ఒక సక్సెస్ ను మనం ఏ విధంగా అయితే రిసీవ్ చేసుకుంటామో ఫెయిల్యూర్ ను కూడా అదే విధంగానే యాక్సెప్ట్ చేయాలని తన దృష్టిలో రెండు ఒకటేనని తెలియజేశారు.

ఇక మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గురించి మాట్లాడుతూ ఈ సినిమా ప్రతి ఒక్క బ్యాచిలర్ ని ఆలోచింపజేస్తుందని… ఇందులో అఖిల్ క్యారెక్టర్,లుక్ అందరిని బాగా ఆకట్టుకుంటాయని తెలియజేశారు. ఈ సందర్భంగా అక్టోబర్ 8వ తేదీన రాబోతున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాను ప్రతి ఒక్కరు తప్పకుండా చూసి ఆదరించాలని తెలియజేశారు.

అత్తా, కోడలి మధ్య మొబైల్ విషయంలో గొడవ.. మనస్థాపంతో కోడలు ఏం చేసిందంటే..!

కొన్ని ఘటనలు మనం ఊహించకుండానే జరిగిపోతాయి. మనం అలర్ట్ అయిపోయేసరికి జరిగే నష్టం కాస్త జరిగిపోతుంది. తాజాగా ఇలాంటి ఘటన మధ్యప్రదేశ్‌లోని ఛత్తర్‌పూర్‌లో చోటుచేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్ ఛత్తర్‌పూర్‌ లోని సతాయ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పర్వ గ్రామానికి చెందిన మహిళకు తన అత్తకు మొబైల్ విషయంలో గొడవ జరిగింది.

దీంతో ఆమె తీవ్ర మనస్థాపం చెందింది. ఇంట్లో పని లేని సమయంలో మొబైల్ చూడటం కూడా తప్పా.. అంటూ తనలో ఆమె మదనపడింది. ఆవేశంలో కఠిన నిర్ణయం తీసుకుంది. ఎప్పటిలాగా పశువులను తోలుకొని పొలానికి వెళ్లింది సదరు మహిళ. తనతో పాటు ఇద్దరు పిల్లలను కూడా తీసుకెళ్లింది. వెళ్తున్న దారి వెంట బావులను చూస్తూ ఉంది.

ఆమెతో పాటు పదేళ్ల కూతురుతో పాటు.. నాలుగేళ్ల చిన్నారి ఉంది. దగ్గర్లోనే ఆమెకు బావి కనిపించింది. ఇద్దరు పిల్లలను అందులో తోసేసి.. ఆమె కూడా అక్కడే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఘటనా స్థలంలోనే పెద్ద కూతురు, తల్లి అక్కడిక్కడే మరణించగా.. నాలుగేళ్ల చిన్నారి మాత్రం బావి ఇటుకల మధ్య చిక్కి.. ప్రాణాలతో బయటపడింది. అటుగా వెళ్తున్న స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించగా.. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని వివరాలు సేకరించారు.

అత్తతో మొబైల్ విషయంలో గొడవ కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు ఛతర్‌పూర్ సబ్ డివిజనల్ ఆఫీసర్ ఆఫ్ పోలీస్ శశాంక్ జైన్ వెల్లడించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. ఇలా కుటుంబంలో ఇద్దరు చనిపోవడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

అమ్మా నన్ను ఇంటికి తీసుకెళ్లండంటూ కూతురు ఫోన్.. వద్దన్న తల్లి.. అదే రోజు రాత్రి..

దంపతుల మధ్య చిన్నపాటి మనస్పర్థలు రావడం అనేది సాధారణం. కానీ అవి సాగదీసుకుంటూ.. ఉండకుండా సమస్యను పరిష్కరించుకోవడం అనేది మంచిది. లేదంటే ఈ గొడవలు చాలా దూరం వెళ్లి అనర్థాలకు దారి తీస్తాయి. ఇలాంటి ఘటనే ఒకటి ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఆదిలాబాద్ రూరల్ మండలం ఖండాల గ్రామపంచాయతీ పరిధిలోని మొలాలగుట్టకు చెందిన నాగోరావ్ తో గాదిగూడ మండలం పర్సువాడ గ్రామానికి చెందిన 21 ఏళ్ల మోతిబాయికి గత సంవత్సరం క్రితం వివాహం జరిగింది. రాఖీ పండుగ సందర్భంగా ఆమె పుట్టింటికి వెళ్లి.. తమ్ముడికి రాఖీ కట్టి మళ్లీ తిరిగి తన అత్త ఇంటికి వచ్చేసింది.

మరల ఇటీవల తన తల్లికి ఫోన్ చేసి ‘అమ్మా.. తాను పుట్టింటికి వస్తాను.. నన్ను తీసుకెళ్తేందుకు తమ్ముడిని పంపు ’అంటూ ఆమె మాట్లాడింది. దానికి ఆమె తల్లి మొన్ననే ఇంటికి వచ్చావు.. కదా .. మళ్లీ ఎందుకు అంటూ ప్రశ్నించింది. దీంతో ఆమె ఫోన్ పెట్టేసింది. ఫోన్ చేసి ఇలా ఇంటికి తీసుకెళ్లండి అని ఆమె ఏ కారణం చేత అన్నదో తెలియరాలేదు.. కానీ ఆమె భర్తతో గొడవ పడి శనివారం అర్థరాత్రి పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది.

విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని రిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి మరణించింది. భర్త వేధింపుల కారణంగానే తన బిడ్డ ఆత్మహత్య చేసుకుందని ఆమె ఆరోపించింది. దీనిపై కేసు నమోదు చేసి.. దర్యాప్తును ప్రారంభించినట్లు ఆదిలాబాద్‌ రూరల్‌ ఎస్సై అంజమ్మ తెలిపారు.

అతడు ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి.. పెళ్లి కావడం లేదని ఎంత పని చేశాడో తెలుసా..?

పెళ్లి అనేది చెప్పడానికి రెండక్షరాల పదమే అయినా ఆ రెండక్షరాలను కలపాలంటే రెండు కుటుంబాలు దగ్గరవ్వాలి. ప్రతీ ఒక్కరి ఆశీస్సులు తీసుకోవాలి. ఇలా చెప్పుకుంటూ పోతే మనకు సినిమా డైలాగ్ లే వస్తాయి. అయితే విషయానికి వస్తే.. ఎప్పుడు జరగాల్సిన కార్యం అప్పడే జరగాలి.. అని పెద్దలు అంటుంటారు.

పెళ్లి జరగాలంటే పరుషుడుకి 21 ఏళ్లు.. మహిళకు 18 ఏళ్లు ఉంటే.. చట్ట ప్రకారం పెళ్లి చేసుకోవచ్చు. కానీ కొంతమందికి 21 ఏళ్లు దాటిని తర్వాత జాబ్ అంటూ.. ఏదైనా ఒక బిజినెస్ పెట్టుకోవాలంటూ సమయాన్ని వృథా చేసుకుంటూ వెళ్తుంటారు. దీంతో వయస్సు అయిపోయి 30 ఏళ్ల వరకు వస్తుంది. అప్పటి నుంచి పెళ్లి జరగడం లేదని బెంగ, భయం ఉంటుంది. ఒక వేళ పెళ్లి ప్రయత్నాలు మొదలు పెట్టినా ఏదో ఒక కారణంతో సంబంధం కుదరకపోవడం వంటివి కూడా జరుగుతుంటాయి.

దాంతో విచిత్రమైన ఆలోచనలు, డిప్రెషన్ లోకి వెళ్లిపోవడం వంటివి సాధారణంగా జరుగుతాయి. ఇలాంటి ఘటనే ఒకటి కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు పూర్తి వివరాలను ఇలా తెలిపారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన 28 ఏళ్ల ఆకుల రాజ్ కుమార్ బాగా చదువుకున్నాడు. దీంతో ముంబైలోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. మంచి జీతం.

అయితే కరోనా కారణంగా పలు సాఫ్ట్ వేర్ కంపెనీలు వర్క్ ఫ్రం హోం చేయిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇలానే రాజ్ కుమార్ కూడా ఇంట్లో వర్క్ ఫ్రం హోం చేసుకుంటూ ఉన్నాడు. గత కొన్ని రోజుల నుంచి తనకు ఇంకా పెళ్లి కావడం లేదనే ఆలోచనలో పడ్డాడు. 28 సంవత్సరాలు వచ్చినా ఇంకా పెళ్లి కావడం లేదనే బెంగతో అర్థరాత్రి అతడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

కొద్దిక్షణాల్లో పెళ్లి.. వధువు తల్లిదండ్రులు ఆత్మహత్య.. చివరకు ఏం జరిగిందంటే..!

కాసేపట్లో వివాహం జరుగుతుందనగా.. పెళ్లి కూతురు తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో పెళ్లి ఆగిపోయింది. అసలేం జరిగింది.. ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణం ఏమిటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.. ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం జిల్లా మద్దిలపాలెంకు చెందిన జగన్నాథరావు (63), విజయలక్ష్మి (57) దంపతులు.

వీరికి ఒక కూతురు ఉన్నారు. ఆమెకు ఓ వ్యక్తితో నిశ్చితార్థం కూడా జరిపించారు. పెళ్లి పనులు కూడా మొదలు పెట్టారు. ఈ పెళ్లి ఓ ఫంక్షన్ హాల్ లో జరుగుతుండగా.. ఆ దంపతులు అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఇక పెళ్లి జరుగుతుండగా.. పంతులు కన్యాదానం చేయడానికి వధువు తల్లిదండ్రులు రావాల్సిందిగా కోరాడు. వాళ్ల కోసం బంధువులు వెతికారు.. అయినా ఎక్కడా కనిపించలేదు. ఇంటికి వెళ్లి చూడగా విగత జీవులుగా పడి ఉన్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలను సేకరించారు. విజయలక్ష్మి ఆరోగ్య పరిస్థతి గత కొంత కాలంగా మంచిగా లేదని.. మానసిక వ్యాధితో బాధపడేదని పోలీసులు తెలుసుకున్నారు. చుట్టు పక్కల వారితో ఎప్పుడూ గొడవ పడుతూ ఉండేదని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. పెళ్లింట్లో కూడా గొడవ పడిన ఆమె ప్రవర్తనతో జగన్నాథరావు విసుగు చెందాడు.

దీంతో ఆమెను చంపి.. తర్వాత అతడు కూడా ఆత్మహత్య చేసుకొని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇటు కన్న తల్లిదండ్రులు చనిపోయి.. అటు పీటల మీద పెళ్లి ఆగిపోవడంతో ఆ వధువు కన్నీరుమున్నీరుగా విలపించింది. ఈ ఘటనతో ఆ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఆత్మహత్య చేసుకుంటున్నట్లు పోలీసులకు వీడియో పంపించింది.. తీరా అక్కడికి వెళ్లి చూస్తే.. పోలీసులకే షాక్ ఇచ్చిన టిక్ టాక్ స్టార్..!

టిక్ టాక్ పుణ్యమా అని ఇండియాలో ఎంతో కొంత టాలెంట్ ఉన్నవాళ్లు సినీ ఇండస్ట్రీలో కొంతమందికి మంచి అవకాశాలే వచ్చాయి. ఇదిలా ఉండగా.. ఓ టిక్ టాక్ స్టార్ తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వీడియో తీసి అర్థరాత్రి పోలీసులకు పంపించారు. కంగారు పడిన పోలీసులు ఇంటికి వెళ్లి చూసేసరికి షాక్ కు గురయ్యారు.

ఇంతకు అక్కడ ఏం జరిగిందో.. పూర్తి వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం.. టిక్‌టాక్‌తో గుర్తింపు తెచ్చుకున్న సూర్య దేవి తమిళనాడు తిరుచ్చి జిల్లా మనప్పరాయిలోని గాంధీనగర్‌లో నివాసం ఉంటున్నారు. టిక్ టాక్ యాప్ నిషేధం విధించిన తర్వాత కూడా పబ్లిసిటీ కోసం ఆమె చేస్తున్న ప్రయత్నాలు అంతా ఇంతా కాదు. మధురై సుబ్రమణ్యపురం మార్కెట్ ప్రాంతానికి చెందిన సిక్కా అనే వ్యక్తి ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె తనపై దాడి చేసినట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా కూడా మారింది.

దీంతో ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా.. తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఓ వీడియో తీసి ఆమె పోలీసులకు పంపించింది. అర్థరాత్రి ఈ వీడియో పంపిండగా… కంగారు పడిన పోలీసులు హుటాహుటిన ఆమె ఉంటున్న ఇంటికి వెళ్లారు. అక్కడ బయట తలుపులు వేసి ఉన్నాయి. పోలీసులు ఆ తలుపులను పగలగొట్టి లోపలకి వెళ్లి చూడగా.. పోలీసులు షాక్ అయ్యారు. ఆమె గాఢ నిద్రలో ఉడటం గమనించారు.

ఈ తతంగం మొత్తం జరుగుతుండగా అక్కడికి చుట్టుపక్కల వారు మొత్తం వచ్చారు. ఆమె చేసిన పనికి అక్కడ ఉన్న వాళ్లతో పాటు పోలీసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదంతా సూర్య దేవి పబ్లిసిటీ కోసమే చేసినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ పనికి ఆ కాలనీ వాసులు అంతా ఆమెను మందలించారు.

ఇద్దరూ కలిసి సహజీవనం చేశారు.. అతనిలో అనుమానం.. ఊహించని విధంగా శవమై తేలింది..

ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేసుకుంటూ ఇద్దరు ప్రేమలో పడ్డారు. ఒకరిని విడిచి ఒకరు విడిపోయి ఉండలేనంతగా ప్రేమించుకున్నారు. ఇద్దరు కలిసి పెద్దలను ఒప్పించి పెళ్లి కూడా చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. కానీ ఇరు కుటుంబాల్లో వీళ్లకంటే పెద్ద వాళ్లకు పెళ్లిళ్లు కాలేదు. ఇప్పుడు ఈ విషయం ఇంట్లో చెబితే ఒప్పుకోరనే ఉద్దేశ్యంతో చెప్పలేదు. కొన్నాళ్లు ఆగిన తర్వాత చెబుదాం అనుకొని అక్కడే ఓ రూం తీసుకొని ఉంటున్నారు.

చివరకు ఓ రోజు ఆమె ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మరణించింది. దీనికి సంబంధించి వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా రేణిగుంటకు చెందిన అంటోనీ గీత అనే యువతి.. కడప నగరంలోని నాగరాజుపేటకు చెందిన అనిల్ కుమార్.. అదే ప్రాంతంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తున్నారు. అక్కడ వీరిద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డారు. జాబ్ బంద్ చేసిన తర్వాత వీళ్లు అదే ప్రాంతంలోనే వేర్వేరు ఆసుపత్రుల్లో పనిచేస్తున్నారు.

ప్రేమించుకున్న వీళ్లు పెళ్లి కూడా చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. కానీ ఇంట్లో చెప్పలేక పోయారు. ఇద్దరి ఇళ్లలో పెళ్లికావాల్సిన పెద్దవాళ్లుండటంతో కొన్నాళ్లు ఆగుదామని భావించారు. అయితే వీరిద్దరు ఒకే ప్రాంతంలో ఉండటంతో రూం తీసుకొని అక్కడే సహజీవనం చేస్తున్నారు. కొన్నాళ్ల వరకు బాగానే ఉన్నా తర్వాత అనిల్ కు గీతపై అనుమానం పెంచుకున్నాడు. నిన్ను నమ్మి నీతో ఉంటున్నా.. నన్ను మోసం చేస్తున్నావంటూ అతడు అనడంతో .. ఆమె తీవ్ర మనస్థాపం చెందింది.

అతడు లేని సమయం చూసి ఓ రోజు డాబాపైకి ఎక్కి ఇంజక్షన్ ద్వారా విషం ఎక్కించుకొని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించారు. గీత తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అనిల్ ను తమ అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

ఆట ఫేమ్ భరత్ ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏమిటో తెలుసా?

బుల్లితెరపై ఓంకార్ ఎన్నో కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఓంకార్ సిక్స్త్ సెన్స్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్నో కార్యక్రమాల ద్వారా ఎంతోమందిని ఇండస్ట్రీకి పరిచయం చేసిన గుర్తింపు ఓంకార్ కి ఉంది. ఈ క్రమంలోనే ఒకప్పుడు ఆట అనే కార్యక్రమాన్ని కూడా ఓంకార్ చేసేవారు.ఆట కార్యక్రమం ద్వారా ఎంతో మంది కొరియోగ్రాఫర్లు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.

ఈ క్రమంలోనే ఆట కార్యక్రమం ద్వారా ఎంతో ఫేమస్ అయినటువంటి కొరియోగ్రాఫర్ భరత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భరత్ చూడటానికి కొద్దిగా లావుగా ఉన్నప్పటికీ ఎంతో అద్భుతంగా డాన్స్ పర్ఫార్మెన్స్ చేసేవారు. ఆట కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న భరత్ తనకు మంచి భవిష్యత్తు ఏర్పడేలోగా ఈ లోకం వదిలి వెళ్లిపోయిన సంగతి అందరికీ తెలిసిందే.

అప్పుడప్పుడే కెరీర్ గాడిలో పడుతున్న క్రమంలో భరత్ 2015 వ సంవత్సరంలో హైదరాబాదులోని మోతీ నగర్ లో తన సొంత ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పట్లో ఈ విషయం సంచలనంగా మారింది. అయితే భరత్ చనిపోవడానికి గల కారణం ఏమిటి అనే విషయాలు తెలియకపోయినప్పటికీ భరత్ మృతి మాత్రం అందరినీ కృంగ తీసిందని చెప్పవచ్చు.

భరత్ ఈ విధంగా చనిపోవడానికి గల కారణం ఆర్థిక ఇబ్బందులేనని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు అధికమవడంతో ఎంతో మానసికంగా క్రుంగిపోయిన భరత్ ఈ విధమైనటువంటి దారుణానికి పాల్పడ్డారని తెలుస్తుంది. 2015 సంవత్సరంలో నిశ్చితార్థం జరుపుకున్న భరత్ 2016 ఫిబ్రవరిలో పెళ్లి కూడా నిర్ణయించారు.ఈ క్రమంలోనే భరత్ చనిపోయేముందు తను పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి పలుమార్లు ఫోన్ చేసినప్పటికీ ఆమె రెస్పాండ్ కాలేదు. ఈ క్రమంలోనే భరత్ ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది.

ఆత్మహత్య చేసుకోకుండా అలా అంటూ.. ఎమోషనల్ అయిన సింగర్ సునీత!

తెలుగు గాయని సునీత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన మృదువైన గాత్రం ద్వారా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న సునీతకు సోషల్ మీడియాలో కూడా అదే ఫాలోయింగ్ ఉంది.ఈమెకు కూడా అభిమానుల పట్ల ఎనలేని ప్రేమను చూపిస్తుంటారు. ముఖ్యంగా సునీత సింగర్ ఫాన్స్ గురించి చెబుతూ సునీత అప్పుడప్పుడు ఎంతో ఎమోషనల్ అవుతుంటారు. ఈ క్రమంలోనే ఓ సారి ఇంస్టాగ్రామ్ లైవ్ లో ముచ్చటించిన సునీత సునీత సింగర్ ఫాన్స్(ఎస్ఎస్ఎఫ్)కి నా జీవితంలో ఓ ప్రత్యేకమైన స్థానం ఉందని, నా ప్రాణంతో సమానం అని తెలిపారు.

ఈ విధంగా ఎస్ఎస్ఎఫ్ ద్వారా చేసే పలు పోస్టులు ఎందరికో ఆదర్శంగా ఉన్నాయని చెప్పవచ్చు. సునీతను ఆదర్శంగా తీసుకుని ఎంతోమంది తమ జీవితంలోకి ముందడుగు వేశారని, జీవితంలో ఉన్నత స్థానంలో ఉన్నవారు, సునీత వల్ల సాయం పొందిన వారు తమ జీవితం గురించి తెలియజేస్తుంటారు. ఈ విధంగా ఓ అభిమాని సునీతను కదిలించే పోస్ట్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.

ఈ సందర్భంగా సునీత అభిమాని పోస్ట్ చేస్తూ..సునీత ఉపద్రష్ట.. ఓ స్పూర్తి ప్రధాత అంటూ ఎస్ఎస్ఎఫ్‌లో మెంబర్ అయిన ఇందిరా ప్రియదర్శిని అనే అమ్మాయి తన జీవితం గురించి, తన జీవితంలో సునీత పాత్ర గురించి చెప్పుకొచ్చారు. నాకు ప్రాణబిక్ష పెట్టిన దేవత సునీత గారు. ఆమె పాట మనసుకు ప్రశాంతత కల్పిస్తే ఆమె మాట మనిషికి ప్రాణం పోసింది. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడమే ఆమెకు ఉన్న అలవాటు. ఆమెలో ఉన్న ఆత్మవిశ్వాసం నాలో నింపి ఆత్మహత్య చేసుకోకుండా చేసింది. ఆమె పలకరింపు అప్పుడే పుట్టిన పసి పిల్ల నవ్వులా ఉంటుంది. ఆవిడ ఎంతో మందికి ఆదర్శం..ఆవిడ ఎంతోమందికి దైర్యం…ఆవిడ పాటలు ఎంతో మంది మనసుకు ప్రశాంతత.. ఆవిడ దేవుడు నాకు పంపిన బహుమతి అంటూ పోస్ట్ చేసింది. ఈ విధంగా అభిమాని చెప్పిన మాటలకు సునీత ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

దారుణం: ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకోవాలంటే కుటుంబ పెద్దలు ఒప్పుకోలేదు… చివరికి ఇలా చేశారు?

ప్రేమ ఎప్పుడు ఎవరి జీవితంలో ఎలా పుడుతుందో ఎవరికీ తెలియదు. ఒకసారి ప్రేమ పుడితే ప్రేమ కోసం ఎంతటి సాహసానికైనా వెనుకాడరు. ఈ విధంగా ప్రేమించుకున్న ఓ జంట పెళ్లి చేసుకోవాలని ఇరు కుటుంబాల పెద్దలకు తమ ప్రేమ విషయాన్ని చెప్పారు. అయితే వీరి పెళ్లికి పెద్దలు అంగీకారం తెలుపక పోవడంతో ప్రేమలో ఓడిపోయిన వీరు చావులో నైనా కలిసే చనిపోవాలని భావించారు. ఈ క్రమంలోనే ఇద్దరు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకోగా యువతి మరణించి యువకుడు ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే…

కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం ఐలాపూర్ గ్రామానికి చెందిన నీర‌డి రాజు పదవ తరగతి వరకు చదివి 2 సంవత్సరాల క్రితం దుబాయ్ వెళ్ళాడు. అయితే కరోనా సమయంలో తిరిగి సొంత గ్రామానికి వచ్చిన రాజు అదే గ్రామానికి చెందిన మాధవి అనే యువతితో ప్రేమలో పడ్డాడు.సంవత్సరంపాటు ప్రేమించుకుంటున్న ఈ జంట పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకోవాలని ఎంతో ధైర్యంగా వారి పెద్దలకు ప్రేమ విషయాన్ని చెప్పారు.

వీరి పెళ్లికి పెద్దలు అంగీకారం చెప్పకపోవడంతో పెళ్లి ద్వారా జీవితంలో ఒకటి కాలేని వీరు చావులోనైనా కలిసి చనిపోవాలనే కఠిన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ క్రమంలోనే గత నెల 30వ తేదీన గ్రామ శివారులో పంట పొలంలోకి వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు.ఈ విధంగా అపస్మారక స్థితిలో ఉన్న వీరిని చూసిన స్థానికులు ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలపడంతో చికిత్స నిమిత్తం వీరిని హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు.

ఆస్పత్రికి వెళ్లేలోగా మాధవి మృతి చెందడంతో ప్రాణాపాయ స్థితిలో రాజు చికిత్స పొందుతున్నారు.రాజు పరిస్థితి కూడా విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ మేరకే మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.