Categories: FeaturedGeneral News

అమ్మా నన్ను ఇంటికి తీసుకెళ్లండంటూ కూతురు ఫోన్.. వద్దన్న తల్లి.. అదే రోజు రాత్రి..

దంపతుల మధ్య చిన్నపాటి మనస్పర్థలు రావడం అనేది సాధారణం. కానీ అవి సాగదీసుకుంటూ.. ఉండకుండా సమస్యను పరిష్కరించుకోవడం అనేది మంచిది. లేదంటే ఈ గొడవలు చాలా దూరం వెళ్లి అనర్థాలకు దారి తీస్తాయి. ఇలాంటి ఘటనే ఒకటి ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఆదిలాబాద్ రూరల్ మండలం ఖండాల గ్రామపంచాయతీ పరిధిలోని మొలాలగుట్టకు చెందిన నాగోరావ్ తో గాదిగూడ మండలం పర్సువాడ గ్రామానికి చెందిన 21 ఏళ్ల మోతిబాయికి గత సంవత్సరం క్రితం వివాహం జరిగింది. రాఖీ పండుగ సందర్భంగా ఆమె పుట్టింటికి వెళ్లి.. తమ్ముడికి రాఖీ కట్టి మళ్లీ తిరిగి తన అత్త ఇంటికి వచ్చేసింది.

మరల ఇటీవల తన తల్లికి ఫోన్ చేసి ‘అమ్మా.. తాను పుట్టింటికి వస్తాను.. నన్ను తీసుకెళ్తేందుకు తమ్ముడిని పంపు ’అంటూ ఆమె మాట్లాడింది. దానికి ఆమె తల్లి మొన్ననే ఇంటికి వచ్చావు.. కదా .. మళ్లీ ఎందుకు అంటూ ప్రశ్నించింది. దీంతో ఆమె ఫోన్ పెట్టేసింది. ఫోన్ చేసి ఇలా ఇంటికి తీసుకెళ్లండి అని ఆమె ఏ కారణం చేత అన్నదో తెలియరాలేదు.. కానీ ఆమె భర్తతో గొడవ పడి శనివారం అర్థరాత్రి పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది.

విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని రిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి మరణించింది. భర్త వేధింపుల కారణంగానే తన బిడ్డ ఆత్మహత్య చేసుకుందని ఆమె ఆరోపించింది. దీనిపై కేసు నమోదు చేసి.. దర్యాప్తును ప్రారంభించినట్లు ఆదిలాబాద్‌ రూరల్‌ ఎస్సై అంజమ్మ తెలిపారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

ఊరగాయకు బూజు పట్టిందా? పారేయకండి.. ఈ సులభమైన చిట్కాలతో మళ్లీ తాజాగా మార్చుకోవచ్చు

తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…

1 day ago

హోటల్ రూమ్‌లోకి వెళ్లగానే బెడ్ కింద వాటర్ బాటిల్ వేయాలంటున్నారు.. కారణం ఏమిటో తెలుసా?

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…

1 day ago

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 86 మేనేజర్ ఉద్యోగాలు..

ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…

1 day ago

టీజీ20 లీగ్‌కు రంగం సిద్ధం.. బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ..

తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…

1 day ago

వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్‌గా మాట్లాడిన విష్ణుప్రియ.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…

1 day ago

సీఎం విజయ్ కీలక నిర్ణయం.. 14 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి..

వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…

2 days ago