Tag Archives: Sunny

బిగ్ బాస్ ట్రోఫీ అందుకున్న సన్నీ.. ఎన్ని ఓట్లు వచ్చాయో తెలుసా?

బుల్లితెర పై ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 5 మరొక రోజులో ముగిసిపోతుంది.ఈ క్రమంలోనే టైటిల్ ఎవరు గెలుస్తారనే విషయంపై తీవ్ర ఉత్కంఠత నెలకొంది. రోజురోజుకు ఓట్లు తారుమారు కావడంతో బిగ్ బాస్ విజేత ఎవరు అనే విషయం పై తీవ్ర ఉత్కంఠ ఏర్పడింది. ఇప్పటివరకు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సన్నీ మొదటి స్థానంలో ఉండి టైటిల్ గెలుచుకోవడానికి అర్హుడు అని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.

అలాగే రెండవ స్థానంలో షణ్ముఖ్ మూడవ స్థానంలో శ్రీ రామచంద్ర నిలబడ్డారు. ఇక ఫినాలే వారంలో భాగంగా వచ్చిన ఓట్లు ఎంతో కీలకమైనవి అని చెప్పాలి. ఒకానొక సమయం లో ఓటింగ్ శాతం లో సన్నీ వెనుకబడ్డారు కూడా పెద్ద ఎత్తున వార్తలు వచ్చినప్పటికీ చివరికి ఈ సీజన్ టైటిల్ మాత్రం సన్నీ అందుకోబోతున్నాడని తెలుస్తోంది.

ఇక ఈ వారం బిగ్ బాస్ హౌస్ లో ఉన్నటువంటి వారిలో సన్నీ ఓటింగ్ విషయంలో మొదటి స్థానంలో ఉండి టైటిల్ గెలుచుకున్నారు అంటూ ఇప్పటికే సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి షణ్ముఖ్ జస్వంత్ ను పక్కన పెట్టి సన్నీకి అభిమానులు పెద్ద ఎత్తున ఓటు వేసినట్లు తెలుస్తోంది. ముందు నుంచి కూడా బిగ్ బాస్ విన్నర్ సన్నీ అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన విధంగానే ట్రోఫీ అందుకున్నారని తెలుస్తోంది.

ఈ క్రమంలోనే బిగ్ బాస్ కంటెస్టెంట్ లో ఓట్లు చూస్తే అత్యధికంగా సన్నీ 34 శాతం ఓట్లతో అత్యధిక మెజారిటీతో ఉంటూ ట్రోఫీ అందుకున్నారని తెలుస్తోంది. అలాగే తాజాగా జరిగిన బిగ్ బాస్ వందరోజుల జర్నీలో భాగంగా బిగ్ బాస్ విజేత సన్నీ అంటూ హింట్ ఇచ్చారు. సన్నీ యువర్ టైమ్ ఆగయా అంటూ చెప్పడంతో అభిమానులు సన్నీ విజేత అని గట్టిగా ఫిక్స్ అయ్యారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా సన్నీ అత్యధిక ఓట్లు మెజార్టీతో ఉన్నాడని తెలియడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సన్నీతో గొడవలో సిరి బాగా హర్ట్ అయిందా..హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సిరి హనీమూన్ అంటూ.. !

బిగ్ బాస్ హౌస్ లో మొన్న జరిగిన టాస్క్ లో సిరికి.. సన్నీకి మధ్య విపరీతమైన గొడవ జరిగిన విషయం తెలిసిందే. దాని ఎఫెక్ట్ తో వారిద్దరు ఒకరినొకరు మాట్లాడుకోకపోవడంతో పాటు.. హౌస్ లో ఎవరికి వారు సపరేట్ గా కూర్చుని.. ఒంటరిగా కనిపించారు. సిరి.. సన్నీతో గొడవ కారణంగా బాగా హర్ట్ అయినట్లు కనిపించింది.

నైట్ అంతా ఏడుస్తూ కనిపించింది. ఒక్క గేమ్‌ ఓడిపోతే ఓడిపోయినట్లేనా అంటూ అర్ధరాత్రి 1 గంటలకు గుక్కపెట్టి ఏడ్చింది. తర్వాత ఆమెను షణ్ముక్ దగ్గరకు తీసుకొని ఓదార్చాడు. హౌస్ లో మిగతా వాళ్లు ఏమన్నా పట్టించుకోకు.. నేను ఏదైనా అంటే ఫీల్ అవ్వు సిరి అంటూ చెప్పుకొచ్చాడు. ఇక నిన్నటి ఎపిసోడ్ లో హౌస్ లోని జ్యోతిష్యురాలు శాంతిని పంపాడు బిగ్‌బాస్‌.

అందులో ఆమె సీక్రెట్ రూంలో ఉండి స్క్రీన్ పై ఆమె.. హౌస్ లో ఉన్న సభ్యుల జాతకాలు చెప్పింది. సిరి జాతకం చెబుతూ.. సిరి హౌస్ నుంచి బయటకు రాగానే పెళ్లి చేసుకొని.. హనీమూన్ కు వెళ్తుందని చెప్పింది. బిగ్ బాస్ ఓ అనౌన్స్ మెంట్ చేయగానే అందరూ షాక్ కు గురవుతారు. అందరూ సూట్ కేసులు సర్దుకొని రండి అంటూ చెప్పాడు. దీంతో ఇంటి సభ్యులందరూ సూట్‌కేసులు ప్యాక్‌ చేసుకోమని హౌస్ బయటకు వచ్చాడు.

ఇక మీలో ఒకరి ప్రయాణం ముగిసిందని.. బయటకు వెళ్లే సమయం ఆసన్నమైందని చెప్పుకొచ్చాడు. అందరు తమ అభిప్రాయాలు చెప్పిన తర్వాత ఇంటి నుంచి సిరిని బయటకు రావాలని బిగ్ బాస్ ఆదేశిస్తాడు. ఆమె ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టి కన్ఫెషన్ రూంలోకి పంపిస్తారు. తర్వాత మళ్లీ 5 నిమిషాలకే హౌస్ లోకి పంపి షాక్ ఇస్తాడు. దీంతో హౌస్ సభ్యులతో పాటు.. ఆమె కూడా ఆనందంతో ఉప్పొంగిపోయారు.

సన్నీని కావాలనే సిరి రెచ్చగొడుతుందా..? సన్నీ గెలుస్తాడని సిరికి ముందే తెలిసిపోయిందా..!

తెలుగులో ప్రసారం అవుతున్న అతిపెద్ద రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 5. ఇది ఒక్క తెలుగులోనే కాదు.. తమిళం, హిందీ మరియు ఇతర భాషల్లో కూడా రన్ అవుతోంది. తెలుగులో మాత్రం ఎండ్ కార్టు పడటానికి ఇంకా రెండు రోజులు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో హౌజ్ లో ఉన్న వాళ్లతో బిగ్ బాస్ అంతక ముందు ఇచ్చిన టాస్క్ లు ఇస్తూ.. వాళ్లతో కామెడీ యాంగిల్ ను తీసుకొస్తున్నాడు.

ఈ క్రమంలో నిన్న జరిగిన ఎపిసోడ్ లో కూడా ప్రతీ ఒక్కరూ టాస్క్ లను మరో సారి ఆడి.. చిన్న చిన్న గిఫ్ట్ లను గెలుచుకున్నారు. అందులో మొదటగా షణ్ముఖ్.. బెలూన్ లను ఊది.. అవి పగిలేవిధంగా చేసే టాస్క్ లో గెలుస్తాడు. అతడు ఆ టాస్క్ గెలిచిన తర్వాత ఒక కూల్ డ్రింక్ ను బహుమతిగా గెలుస్తాడు. ఇక రెండో టాస్క్ లో స్విమ్మింగ్ ఫూల్ లో లేబుల్ లేదు మచ్చా అనే టాస్క్ లో మానస్ గెలిచి.. చాక్లెట్లను బహుమతిగా గెలుస్తాడు. తర్వాత టాస్స్ లో సౌండ్స్ ను గుర్తించి రాయాలి.. ఈ టాస్క్ లో కామెడీ విపరీతంగా పండిందనే చెప్పాలి.

చివరగా రోప్ వేవ్స్ టాస్క్ ని సిరి, సన్నీ, ఇంకా షణ్ముక్ లతో ఆడించాడు. ఈటాస్క్ లో సిరి ముందుగానే చేతులు నొప్పి పుట్టి వదిలేసింది. ఆ తర్వాత షణ్ముక్ అండ్ సన్నీ ఇద్దరూ కూడా నువ్వా నేనా అన్నట్లుగా చాలా సీరియస్ గా ఈ టాస్క్ ఆడారు. అయితే చివరి వరకు ఉన్న సన్నీ.. మధ్యలో ఆ తాడుతో వేవ్స్ రాకపోవడంతో సిరి బయట నుంచి కామెంట్ చేయడం మొదలుపెట్టింది. అయినా చివరకు సన్నీ విన్నర్ అయ్యాడు. ఇక్కడ సిరికి మరియు సన్నీకి మధ్య వాగ్వాదం పెరిగింది. నువ్వు గేమ్ గెలిచావ్ కానీ, వేవ్స్ రాలేదు అంటూ మాట్లాడింది.

సన్నీ నువ్వు ఓడిపోయావ్ కదా అంటూ మాట్లాడేసరికి ఓడిపోయావ్ అని అనొద్దని సీరియస్ గా చెప్పింది సిరి. జోక్ గా అన్నాను మచ్చా అన్నా గానీ ఆ వ్యవహారం తెగలేదు.. ఒకరిపై ఒకరూ దూషించుకుంటూ హౌజ్ అంతా రచ్చ రచ్చ చేశారు. సిరి చాలా వరకు సన్నీతో కోపంగా మాట్లాడింది. నువ్వు ఏమన్నా హీరో అనుకుంటున్నావా అంటూ రెచ్చిపోయింది. ఇక షణ్ముఖ్ విన్నర్ కాడనే కారణంగానే సన్నీతో ఆమె ఎక్కువగా వాదన చేసుకుంటుందనేది నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కావాలనే సన్నీని రెచ్చగొడుతుందనేది నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

పక్కనోడు గెలిస్తే సహించలేడు.. నాతో జోకులు వద్దంటూ సన్నీకి వార్నింగ్..!

బిగ్ బాస్ కార్యక్రమం మరొక మూడు రోజులలో ముగియడంతో ఈ కార్యక్రమం గురించి పలువురు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.ఈ క్రమంలోనే బిగ్ బాస్ గత ఎపిసోడ్ లో భాగంగా ఐదుగురు కంటెస్టెంట్ లకు పలు టాస్క్ లను ఇచ్చారు. మొదటి టాస్క్ బెలూన్ ఊది పగలగొట్టడంలో షన్ను గెలవగా, రెండవ టాస్క్ స్విమ్మింగ్ పూల్ లో దూకి టీ షర్టులు ధరించే టాస్క్ ఇచ్చారు. ఇందులో మానస్ గెలిచాడు.ఇక మూడవ టాస్క్ లో భాగంగా ఇంటి సభ్యులు అందరూ 13 క్షణాల పాటు లెక్కించాలని చెబుతూ బిగ్ బాస్ వారిని డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేశారు. ఈ టాస్క్ లో భాగంగా షణ్ను, శ్రీరామ్‌, మానస్‌, సన్నీ, సిరి వరుసగా ఐదు స్థానాల్లోనిలవగా మొదటి స్థానంలో నిలిచిన షణ్ముఖ్ జస్వంత్ బిర్యాని బహుమతిగా గెలుచుకోవడంతో అందరూ కలిసి తిన్నారు.

ఇక నాలుగవ టాస్క్ లో భాగంగా హౌ సభ్యులకు బిగ్ బాస్ కొన్ని శబ్దాలను వినిపించి జంతువుల పేర్లు రాయమని చెప్పారు. ఇందులో సిరి తప్పు సమాధానం రాయడంతో అందరూ ఒక్కసారిగా నవ్వుకున్నారు. ఇక ఐదవ టాస్క్ లో భాగంగా ఎక్కువ సేపు తాళ్ళు ఊపే టాస్క్ ఇవ్వగా ఇందులో సన్నీ,సిరి,షణ్ముఖ్ ఆడగా సన్నీ గెలిచాడు.

సరదాగా సన్నీ ఓడిపోయారు కదా మరొకసారి ఆడదామా అంటూ తమాషాగా అనడంతో ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని అతనితో గొడవకు దిగింది.ఇక తన సరదాగా అన్నాను అని చెప్పే ప్రయత్నం చేసిన సిరి మాత్రం ఓడిపోయావు అన్నావు నాకు నచ్చలేదు అది సరదాగా అంటారా అంటూ తనపై గట్టి గట్టిగా అరిచింది. ఇక సహనం కోల్పోయిన సన్నీ చివరికి తనని ఇమిటేట్ చేశాడు.

పక్కనోడు గెలిస్తే సహించలేడు అంటూ గట్టిగా అరవడం కాకుండా నాతో జోకులు వద్దు అంటూ సన్నీకి వార్నింగ్ ఇస్తూ నువ్వు ఏమైనా హీరో అనుకుంటున్నావా అంటూ అతని పై పెద్ద ఎత్తున గొడవకు దిగింది. ఇక దీంతో తినడానికి రమ్మన్న సిరి అలిగి కూర్చుంది. తరువాత మానస్, సన్నీ మాట్లాడుతూ ఎప్పుడు ఏ గొడవ అయినా నేనే వెళ్తాను ఇంత ఓవర్ యాక్టింగ్ బ్యాచ్ ఏంట్రా? నన్ను వెళ్లే ముందు ఇలా బ్యాడ్ చేస్తే వాళ్లకు ఏం వస్తది? నేనేమైనా హీరోనా అంటుంది నా దునియాకు నేను హీరో నన్ను అభిమానించే వాళ్లకు నేను హీరో అంటూ సన్నీ మానస్ దగ్గర చెప్పుకొచ్చాడు.

విన్నర్ అతడే.. ప్రేక్షకులు కూడా ఫిక్స్ అయ్యారు.. అనౌన్స్ మెంటే తరువాయి..!

బిగ్ బాస్ తెలుగు 5 విజేత ఎవరు అవుతారని తెలుసుకోవడానికి బిగ్ బాస్ ప్రేక్షకులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ డిసెంబర్ 19, 2021న జరుగుతుంది. అయితే తాజాగా తెలిసిన సమాచారం ప్రకారం.. గ్రాండ్ ఫినాలే ఈవెంట్ రేపటి నుంచి (డిసెంబర్ 17) నుంచి మొదలవుతుందని.. రెండు రోజుల్లో పూర్తి చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని టాక్.

అయితే హౌజ్ లో షణ్ముఖ్, సిరి, శ్రీ రామచంద్ర, మానస్, సిరిలు టైటిల్ విన్నర్ కోసం పోటీ పడుతున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. బిగ్ బాస్ తెలుగు 5 ముగింపు ఎపిసోడ్‌కు ముఖ్య అతిధులుగా వచ్చే సెలబ్రిటీలు ఎవరనేది పక్కా సమాచారం తెలియదు.

కానీ రామ్ చరణ్-ఆలియా భట్ మరియు దీపికా-రణ్‌వీర్ సింగ్ పాల్గొంటారని విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తోంది. గత రెండేళ్లుగా బిగ్ బాస్ తెలుగు ఫైనల్ ఎపిసోడ్‌కు మెగాస్టార్ చిరంజీవి అతిథిగా విచ్చేశారు. ఇప్పుడు ఫైనల్ ఎపిసోడ్‌ని వీక్షకులకు డబుల్ స్పెషల్‌గా మార్చేందుకు షో నిర్వాహకులు అతిథి జాబితాను మార్చినట్లు తెలుస్తోంది.

విన్నర్ ఎవరు అవుతారనే విషయానికి వస్తే.. సోషల్ మీడియాలో అన్ అఫీషియల్ పోలింగ్ ప్రకారం..వీజే సన్నీకి మునుపెన్నడూ లేని విధంగా విపరీతంగా ఓట్లు వేస్తున్నారు. దాదాపుగా 50శాతం మించి అతడికి ఓటింగ్ అనేది జరుగుతోంది. దీంతో విన్నర్ సన్నీనే అని బయట ప్రేక్షకులు కూడా ఫిక్స్ అయిపోయారు. ఇక రన్నర్ విషయంలో కాస్త సమీకరణాలు మారుతున్నట్లు అనిపిస్తోంది. దీనిలో షణ్ముఖ్, శ్రీరామచంద్ర పోటీ పడుతున్నారు.

సన్నీ ఫ్యాన్స్ దూకుడు.. 52 శాతంకిపైగా ఓటింగ్.. షణ్ముఖ్ టైటిల్ ఆశలు గల్లంతేనా..?

బిగ్ బాస్ 5 తెలుగు చూస్తుండగానే ముగింపు దశకు వచ్చేసింది. మరో వారం రోజుల్లోనే ఈ సీజన్‌కు ఎండ్ కార్డ్ పడనుంది. ప్రస్తుతం ఇంట్లో ఐదుగురు సభ్యులు మాత్రమే ఉన్నారు. వాళ్లే ఫైనలిస్టులు అంటూ నాగార్జున అధికారికంగా ప్రకటించాడు కూడా. కాజల్ ఎలిమినేషన్ తర్వాత టాప్ 5 కంటెస్టెంట్స్ మిగిలారు. అందులో మొదట అందరికంటే ముందుగానే శ్రీరామచంద్ర ఫైనల్ చేరుకున్నాడు.

తర్వాత రెండో ఫైనలిస్టుగా సన్నీ, మూడో ఫైనలిస్టుగా సిరి హన్మంతు, నాలుగో ఫైనలిస్టుగా షణ్ముఖ్.. ఇక చివరి ఫైనలిస్టుగా మానస్ చోటు సంపాదించుకున్నారు. అయితే బిగ్ బాస్ సీజన్ 5 మొదలైన మొదటి వారం నుంచే షణ్ముఖ్ పై ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు చాలామంది. కచ్చితంగా ఈ సీజన్ విన్నర్ అతడే అవుతాడు అని. ఎందుకంటే.. అతడి బయటక ఫ్యాన్స్ కూడా అలా ఉన్నారు.

తెలుగులో ఎక్కువగా యూట్యూబ్ ఫ్యాన్స్ ఉన్న వ్యక్తి షణ్ముఖ్. ఇక అనుకున్నట్లుగానే అతడు నామినేషన్లో మొదటి మూడు వారాలు లేడు. నాలుగో వారం నుంచి నామినేషన్లోకి రావడం మొదలైంది. అప్పుడు అందరి కంటే ఎక్కువ ఓట్లతో ముందుకు సాగాడు. అలా రెండు మూడు సార్లు అన్ అఫిషియల్ ఓటింగ్ లో మొదటిస్థానంలో కొనసాగాడు. తర్వత హౌజ్ లో జరిగిన కొన్ని పరిణామాల కారణంగా అతడి గ్రాఫ్ తగ్గుకుంటూ వచ్చింది. అనూహ్యంగా సన్నీ ముందు వరుసలోకి వచ్చాడు. ఏడో వారం నుంచి సన్నీనే టాప్ ప్లేస్ లో కనిపిస్తున్నాడు. సీజన్ మొదలైనపుడు సన్నీపై ఎవరికీ అంచనాలు లేవు.

అస్సలు సన్నీ అంటే ఎవరకీ పెద్దగా తెలియదు కూడా. రానురాను సన్నీ ఫాలోయింగ్ భయంకరంగా పెరిగిపోయింది. ముఖ్యంగా సెకండ్ సీజన్‌లో కౌశల్‌ను ఇంటి సభ్యులు ఎలాగైతే టార్గెట్ చేసి హీరోను చేసారో.. ఇప్పుడు సన్నీ విషయంలోనూ ఇదే జరుగుతుంది. ఈయనకు ఇప్పుడు మంచి ఫాలోయింగ్ ఉంది. బయట కొన్ని యూట్యూబ్ ఛానల్లో పోల్స్ ప్రకారం చూస్తూంటే విపరీతంగా ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగిపోయింది. దాదాపు 52 శాతంకు పైగా ఓట్లు పడుతున్నాయి.

రెండో స్థానంలో షణ్ముఖ్ 30 నుంచి 40 శాతం మధ్యలో ఉంటున్నాడు. ఇక మూడో స్థానంలో శ్రీరామ చంద్ర కొనసాగుతుండగా.. మానస్ నాలుగు.. సిరి ఐదో స్థానంలో ఉన్నారు. ప్రస్తుతం ఉన్న ట్రేడ్ ప్రకారం చూస్తుంటే మాత్రం సన్నీకే గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇదే ట్రెండ్ కొనసాగితే.. షన్ను గెలవడం నల్లేరు మీద నడకే అని చెప్పాలి.

ఒక్క ఎపిసోడ్ తో మారిపోయిన సమీకరణాలు.. డేంజర్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్..?

బిగ్ బాస్ 5 తెలుగు 14వ వారం వినోదాత్మకంగా సాగుతోంది. హౌస్‌లో ప్రస్తుతం మానస్ , వీజే సన్నీ, ఆర్‌జే కాజల్, శ్రీరామ చంద్ర, షణ్ముఖ్ జస్వంత్ మరియు సిరి హన్మంత్‌ లు ఉన్నారు. ఇక 14 వ వారం ముంగింపు దశకు చేరుకుంటుండటంతో టాప్ 5 లో ఎవరు ఉంటారనే దానిపై ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

షోలో ఫస్ట్ ఫైనలిస్ట్‌గా శ్రీరామ చంద్ర నిలవగా.. ఇక మిగిలిన ఆ నలుగురు ఎవరనే దానిపై కాస్త ఉత్కంఠనే చెప్పాలి. ఎలిమినేషన్ లో ఉన్న 5 గురులో షణ్ముఖ్, సన్నీకి ఎక్కువగా ఓట్లు పోలవుతున్నాయి. వీళ్లిద్దరి ఫ్యాన్ ఫాలోయింగ్‌ను పరిశీలిస్తే.. వీరిద్దరూ కూడా టాప్ ఫైనలిస్ట్‌లలో ఖచ్చితంగా ఉంటారని స్పష్టంగా తెలుస్తుంది. ఇక ఈ వారం కాజల్, సిరి, మానస్ లల్లో మాత్రం హౌజ్ నుంచి ఒకరు వెల్లి పోయే అవకాశం ఉంది. అయితే దీనిలో సిరి సేవ్ అయిపోతుందని చెప్పవచ్చు.

ఎందుకంటే.. రీసెంట్ ఎపిసోడ్లలో షణ్ముక్ ఎక్కువగా సిరిని తిడుతూ తననీ కమాండ్ చేయడం వల్ల ఈమెకు ప్లస్ అయ్యిందని.. అందుకే ఆమెకు కూడా ఓట్లు బాగానే వస్తున్నట్లు తెలుస్తోంది. ఇక శ్రీరామ చంద్ర, కాజల్ మధ్య గొడవలో కాజల్ కు మైనస్ అయిందనే చెప్పాలి. ఈ ఒక్క ఎపిసోడ్ కారణంగానే ఓట్ల శాతం తారుమారయ్యాయి.

మానస్ ఈ వారం మొదటి నుంచి డేంజర్ జోన్లోనే ఉన్నాడు. ఇతడికి ఇంతకాలం కలిసి వచ్చిన అంశం ఏంటంటే.. కేవలం సన్నీతో స్నేహం మాత్రమే. ఇప్పుడు సన్నీ ష్యాన్స్ కేవలం అతడికే ఓట్లు వేస్తున్నారు. దీంతో ఒట్ల పరంగా మానస డేంజర్లోనే ఉన్నాడు. మానస్ టాస్క్‌లలో శారీరక బలం మరియు కాజల్ మైండ్ గేమ్‌లు వారి ప్రయాణానికి హైలైట్‌గా నిలిచాయి. వీరిద్దరిలో ఆదివారం ఎపిసోడ్‌లో ఎవరు బ్యాగ్ ప్యాక్ చేస్తారో వేచి చూడాలి.

ఆ భయంతో పోస్ట్ డిలీట్ చేశా.. బిగ్ బాస్ విజేత తనే అంటూ జోస్యం చెప్పిన సోహైల్‌!

మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ సోహైల్ సీజన్ ఫోర్ లో పాల్గొని టాప్ త్రీ కంటెస్టెంట్ గా ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఇలా బిగ్ బాస్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సోహైల్‌ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఇదిలా ఉండగా ఇదివరకు బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొన్న ఎంతో మంది కంటెస్టెంట్ లు బిగ్ బాస్ విన్నర్ వాళ్లేం అంటూ ఎన్నో సార్లు ఈ కార్యక్రమం పై స్పందించారు.

అలాగే సోహైల్ కూడా బిగ్ బాస్ కార్యక్రమం గురించి గతంలో ఒకసారి పోస్ట్ చేశారు తప్పకుండా టాప్ ఫైవ్ లో కాజల్, మానస్, సన్నీ ఉంటారని పోస్ట్ పెట్టడంతో చాలామంది ఇతనికి నెగిటివ్ గా కామెంట్ చేశారు. వీళ్లు టాప్ ఫైవ్ లో ఉంటే మరి మా అభిమాన కంటెస్టెంట్ లు ఎక్కడికి వెళ్తారు అంటూ దారుణంగా కామెంట్లు చేయడంతో వారికి భయపడి వెంటనే ఆ పోస్ట్ డిలీట్ చేశానని వెల్లడించారు.

ఇదిలా ఉండగా మరొక రెండు వారాలలో బిగ్ బాస్ విజేత ఎవరు అనే విషయం తెలియనుంది. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమంపై సోహైల్ మాట్లాడుతూ బిగ్ బాస్ విజేత ఎవరు అనే విషయం గురించి జోస్యం చెప్పారు.ఇక ఈ సందర్భంగా సోహైల్ మాట్లాడుతూ ఈ సీజన్ లో సన్నీని చూస్తుంటే తనని తాను చూసుకున్నట్లు ఉందని సన్నీ గురించి వెల్లడించారు.ఇక ఈ సీజన్ లో శ్రీ రామచంద్ర సన్నీ వీరిద్దరిలో ఒకరు టైటిల్ తప్పకుండా గెలుస్తారని ఈయన తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

మరి సోహైల్‌ చెప్పిన విధంగానే బిగ్ బాస్ ట్రోఫీ సన్నీ అందుకు ఉంటారా లేక శ్రీ రామ్ చంద్ర అందుకుంటారా తెలియాల్సి ఉంది. ఇప్పటివరకు సోషల్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం ఎక్కువగా సన్నీకి బిగ్ బాస్ ట్రోఫీ అందుకునే అవకాశాలు ఉన్నాయని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నప్పటికీ షన్ను కూడా టైటిల్ రేసులో ఉన్నా సిరితో తన ప్రవర్తన కారణంగా పూర్తిగా నెగిటివిటీ ఏర్పర్చుకొని టైటిల్ రేసు నుంచి తప్పుకునే పరిస్థితికి వచ్చారని చెప్పవచ్చు.

సన్నీకి అత్త అవుదామనుకున్నా.. కానీ నా కూతురు.. ఉమాదేవి షాకింగ్ కామెంట్స్!

బిగ్ బాస్ సీజన్ పై కంటెస్టెంట్ గా హౌస్ లోకి వెళ్ళిన వారిలో కంటెస్టెంట్ ఉమాదేవి ఒకరు.ఈమె కార్తీకదీపం సీరియల్ లో అర్థ పావు భాగ్యం పాత్రలో నటించి ఎంతోమంది ప్రేక్షకాదరణ దక్కించుకున్నారు. ఈ పాపులారిటి తోనే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన ఈమె తన ముక్కుసూటి తనంతో రెండవ వారమే హౌస్ నుంచి బయటకు వచ్చారు. ఇలా బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఉమా దేవి సన్నీకి మద్దతు తెలుపుతున్నారు.

ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఉమాదేవి సన్నీ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. కల్యాణ వైభోగం సీరియల్ ప్రారంభం అవుతున్న సమయంలో ఈ సీరియల్ లో హీరో సన్నీ అని చెప్పారు. ఇక ఇందులో తనకు నేను మేనత్త పాత్రలో నటించాను. సన్నీ ఎవరు అని అనుకుంటూ ఉండగా అంతలో తన కూతురు వీజే అని సమాధానం చెప్పింది. షూటింగ్ మొదటి రోజు సన్నీని చూడగానే అబ్బాయి చాలా బాగున్నాడు తన పెద్ద కూతురుకి ఇచ్చి పెళ్లి చేద్దామని ఆశ పడ్డాను.

అంతలోగా తన కూతురు వచ్చి సన్నీ అన్నా అని పిలవడం వీళ్లిద్దరు తనని అన్నా అనడంతో సన్ని కూడా వీరిద్దరిని చెల్లెలుగా భావించి ఎంతో ఆప్యాయంగా చూసుకున్నారు.అలా సన్నీకి అత్తను అవ్వాలనుకుంటే చివరికి పిన్నిని చేశారు. ఆ ఒక్క రోజు నా కూతురు రాకపోయి ఉంటే కథ మరోలా ఉండేదని ఉమాదేవి సన్నీ గురించి షాకింగ్ కామెంట్ చేశారు.

హౌస్ లో సిరి, సన్నీ లింక్.. అసహనం వ్యక్తం చేసిన షణ్ముఖ్!

బిగ్ బాస్ షో ఎంతో రసవత్తరంగా సాగుతోంది. మరికొన్ని రోజులలో బిగ్ బాస్ షో ముగియనుండడంతో కంటెస్టెంట్ ల మధ్య పోటీ పెరుగుతోంది. మొత్తం బిగ్ బాస్ హౌస్ లో ఆరుగురు మాత్రమే కంటెస్టెంట్ లు మిగిలారు. టాప్ ఫైవ్ లో ఉండాలి అని కంటెస్టెంట్ లు నువ్వా నేనా అన్న విధంగా పోటీ పడుతున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా జరిగిన ఎపిసోడ్ లో కాజల్ కు మరీ ఎక్కువ అటాచ్ కావద్దు అంటూ సిరికు సలహా ఇచ్చాడు షణ్మఖ్.

ఆ తర్వాత కాజల్, సన్నీకి దిష్టి తీయగా, షణ్ముఖ్ కు సిరి దిష్టి తీసింది. ఇక తాజాగా బిగ్ బాస్ హౌస్ నుంచి ప్రియాంక ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. దీనితో ప్రియాంక వెళ్లిపోయిన బాధలో మానస్ ఒంటరిగా కూర్చున్నాడు.అప్పుడు కాజల్, సన్నీ వెళ్ళి మానస్ ని ఏడిపించారు. ప్రియాంక కోసం మానస్ పాడిన పాటను పాడుతూ అతని టీజ్ చేసారు.

మాది ఫ్రెండ్షిప్ రా లవ్ కాదురా అని మానస్ ఎంత మొత్తుకున్నా కూడా వాళ్లు వినిపించుకోలేదు. ఆ తరువాత మానస్, కాజల్..సన్నీ, సిరికి లింకు పెడుతూ.. సిరి కనపడగానే నీ ఆలియాభట్ వస్తుంది అంటూ కామెంట్ చేశారు. ఈ విషయంపై షణ్ముఖ్ జస్వంత్ సీరియస్ అయ్యాడు. సిరి పై అసహనం వ్యక్తం చేశాడు. మీ ఇద్దరి మధ్య ట్రాక్ క్రియేట్ చేయాలని చూస్తున్నారు. నువ్వు జాగ్రత్త పడకపోతే నీ క్యారెక్టర్ బ్యాడ్ అవుతుంది అంటూ సిరిని హెచ్చరించారు షణ్ముఖ్.

అప్పుడు సిరి వాళ్ళు సరదాగా అన్నారులే అంటూ లైట్ తీసుకోవడంతో షణ్ముక్ మళ్లీ చెప్పడం వల్ల నాకు ఒరిగేది ఏమీ లేదు అంటూ విసిగిపోయి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీనితో సిరి ఏడ్చేసింది. బిగ్ బాస్ ముగింపు దశకు చేరుకుంటుండడంతో ఎవరు టాప్ ఫైవ్ లో నిలుస్తారు, అలాగే బిగ్ బాస్ ట్రోఫీని ఎవరు గెలుచుకుంటారు అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.