బిగ్ బాస్ షో ఎంతో రసవత్తరంగా సాగుతోంది. మరికొన్ని రోజులలో బిగ్ బాస్ షో ముగియనుండడంతో కంటెస్టెంట్ ల మధ్య పోటీ పెరుగుతోంది. మొత్తం బిగ్ బాస్ హౌస్ లో ఆరుగురు మాత్రమే కంటెస్టెంట్ లు మిగిలారు. టాప్ ఫైవ్ లో ఉండాలి అని కంటెస్టెంట్ లు నువ్వా నేనా అన్న విధంగా పోటీ పడుతున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా జరిగిన ఎపిసోడ్ లో కాజల్ కు మరీ ఎక్కువ అటాచ్ కావద్దు అంటూ సిరికు సలహా ఇచ్చాడు షణ్మఖ్.
ఆ తర్వాత కాజల్, సన్నీకి దిష్టి తీయగా, షణ్ముఖ్ కు సిరి దిష్టి తీసింది. ఇక తాజాగా బిగ్ బాస్ హౌస్ నుంచి ప్రియాంక ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. దీనితో ప్రియాంక వెళ్లిపోయిన బాధలో మానస్ ఒంటరిగా కూర్చున్నాడు.అప్పుడు కాజల్, సన్నీ వెళ్ళి మానస్ ని ఏడిపించారు. ప్రియాంక కోసం మానస్ పాడిన పాటను పాడుతూ అతని టీజ్ చేసారు.
మాది ఫ్రెండ్షిప్ రా లవ్ కాదురా అని మానస్ ఎంత మొత్తుకున్నా కూడా వాళ్లు వినిపించుకోలేదు. ఆ తరువాత మానస్, కాజల్..సన్నీ, సిరికి లింకు పెడుతూ.. సిరి కనపడగానే నీ ఆలియాభట్ వస్తుంది అంటూ కామెంట్ చేశారు. ఈ విషయంపై షణ్ముఖ్ జస్వంత్ సీరియస్ అయ్యాడు. సిరి పై అసహనం వ్యక్తం చేశాడు. మీ ఇద్దరి మధ్య ట్రాక్ క్రియేట్ చేయాలని చూస్తున్నారు. నువ్వు జాగ్రత్త పడకపోతే నీ క్యారెక్టర్ బ్యాడ్ అవుతుంది అంటూ సిరిని హెచ్చరించారు షణ్ముఖ్.
అప్పుడు సిరి వాళ్ళు సరదాగా అన్నారులే అంటూ లైట్ తీసుకోవడంతో షణ్ముక్ మళ్లీ చెప్పడం వల్ల నాకు ఒరిగేది ఏమీ లేదు అంటూ విసిగిపోయి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీనితో సిరి ఏడ్చేసింది. బిగ్ బాస్ ముగింపు దశకు చేరుకుంటుండడంతో ఎవరు టాప్ ఫైవ్ లో నిలుస్తారు, అలాగే బిగ్ బాస్ ట్రోఫీని ఎవరు గెలుచుకుంటారు అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
భారతదేశంలో ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన క్షేత్రాల్లో కాశీ ప్రత్యేక స్థానం పొందింది. అదే కాశీలో అరుదుగా దర్శనమిచ్చే దేవగురువు బృహస్పతి…
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న ప్రముఖ గాయని మంగ్లీకు సంబంధించిన మోసం ఆరోపణలు రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. మైక్రో…
పార్లమెంట్లో మహిళా సాధికారతకు సంబంధించిన కీలక చర్చలు ప్రారంభం కానున్న వేళ, ప్రధాని నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో…
ఉదయం నిద్రలేవగానే కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలతో చాలామంది ఇబ్బందిపడుతుంటారు. రాత్రి తిన్న ఆహారం పూర్తిగా జీర్ణం కాకపోవడం, తగినంత…
తిరుపతిలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ కోదండరామస్వామి ఆలయంలో ఆధ్యాత్మిక ఉత్సాహం నెలకొంది. ఏప్రిల్ 23న జరిగే పుష్పయాగ మహోత్సవానికి ఆలయ…
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…