Tag Archives: support

ట్రాన్స్ జెండర్ ప్రియాంక సింగ్ కి మద్దతు తెలిపిన.. బిగ్ బాస్ కంటెస్టెంట్ తమన్నా సింహాద్రి!

తమన్నా సింహాద్రి ఈ పేరు తెలియని వారు ఎవరూ ఉండరు. బిగ్ బాస్ సీజన్ 3 కంటెస్టెంట్ గా హౌస్ లోకి వెళ్ళిన ఈమె సీరియల్ నటుడు రవి కృష్ణతో గొడవ పెట్టుకొని ఎంతో ఫేమస్ అయ్యింది. అయితే ఈమె ఎక్కువ కాలం బిగ్ బాస్ హౌస్ లో నిలబడ లేదనే చెప్పాలి.అలా బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎప్పుడూ కూడా తమన్నా సింహాద్రి బిగ్ బాస్ గురించి ప్రస్తావన తీసుకురాలేదు.

ఈ క్రమంలోనే బిగ్ బాస్ సీజన్ ఫైవ్ గురించి ఈమె ఒక వీడియోని చేస్తూ ట్రాన్స్జెండర్ ప్రియాంక సింగ్ కు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఈమె మీడియా చేస్తూ చాలా రోజుల నుంచి ఈ వీడియో చేయాలనుకుంటున్నాం అని తెలిపారు. సాధారణంగా ట్రాన్స్జెండర్ అంటే చాలా మందికి రోడ్డుపై వచ్చి పోయే వారిని డబ్బులు అడిగే వాళ్ళుని భావిస్తారు నిజానికి ఎంతో మంది తమ తల్లిదండ్రులకు దూరంగా వచ్చి గౌరవంగా బ్రతికే వాళ్ళు ఉన్నారు.

అలా గౌరవంగా బ్రతికే వారిలో ప్రియాంక సింగ్ ఒకరని ఈమె తెలిపారు.ఇప్పటివరకు బిగ్ బాస్ కార్యక్రమాలలో ట్రాన్స్జెండర్ లు పాటిస్పేట్ చేసినప్పటికీ కేవలం కొన్ని వారాలు మాత్రమే హౌస్ లో ఉండి బయటకు వచ్చారు. కానీ ప్రియాంక సింగ్ 12 వారాలు హౌస్లో ఉంది. ఈమెను తప్పకుండా ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసి గెలిపించాలని ఈమె కోరారు.

ఇలా బిగ్ బాస్ విజేతగా ఒక ట్రాన్స్ ఉమెన్ నిలబడితే అది ఇండియాలోనే రికార్డ్ కు ఎక్కతుందని ఈమె తెలిపారు. అందుకే నా మద్దతు ప్రియాంక సింగ్ కి తెలుపుతున్నాను మీరు కూడా తనకు సపోర్ట్ చేసి తన ని గెలిపించండి అంటూ తమన్నా సింహాద్రి చేసిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

నేను వెళ్తే నువ్వు గెలుస్తావ్ అంటూ షణ్ముఖ్ కి సపోర్ట్ చేసిన యాంకర్ రవి..!

బిగ్ బాస్ కార్యక్రమం చూస్తుండగానే 12 వారాలు పూర్తి చేసుకుంది.ఈక్రమంలోనే 12 వ వారం ఎలిమినేషన్ లో భాగంగా ఎవరూ ఊహించని విధంగా అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ యాంకర్ రవి హౌస్ నుంచి బయటకు వచ్చారు. సన్నీ ఎవిక్షన్ పాస్ ఉండగా ఆఖరి నిమిషంలో తనని ఎంతో సపోర్ట్ చేసిన కాజల్ కి ఉపయోగించడంతో తక్కువ ఓట్లు రవికి రావడం వల్ల అతను ఎలిమినేట్ కావాల్సి వచ్చింది.

ఇక యాంకర్ రవి ఎలిమినేట్ కావడంతో హౌస్ సభ్యులు ఈ విషయాన్ని జీర్ణించుకోలేక పోయారు. ఈ క్రమంలోనే హౌస్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క కంటెస్టెంట్ రవి హౌస్ ని వీడి వదులుతుంటే ఏమోషనల్ అయ్యారు.రవి ఎలిమినేట్ కావడంతో ఎంతో ఎమోషనల్ అయిన సన్నీ తనకు వచ్చిన గిఫ్ట్ వోచర్ ను తనకు బహుమతిగా ఇచ్చి పంపించారు.

ఇక హౌస్ నుంచి బయటకు వచ్చిన రవి హౌ సభ్యులను ఉద్దేశిస్తూ మాట్లాడారు. ఇక హౌస్ నుంచి బయటకు వచ్చిన రవికి నాగార్జున ఫెయిల్ పాస్ అనే గేమ్ ఆడాడు ఇందులో రవి షన్ను ,సన్నీ, శ్రీరామ్ కి ఫాస్ టాగ్ ఇవ్వగా.. సిరి కాజల్ ప్రియాంక మానస్ లకు ఫెయిల్ ట్యాగ్ ఇచ్చారు. రవి ఈ విధంగా చెప్పడంతో షన్ను ఎంతో ఎమోషనల్ అయ్యారు. ఈ క్రమంలోనే లేచి తనని బాధపెట్టి ఉంటే క్షమించనీ షన్ను చెబుతూ ఎమోషనల్ అయ్యారు.

ఇక షణ్ముక్ ఎంతసేపటికి కనీళ్ళు ఆపకపోవడంతో రవి తనకు సపోర్ట్ చేస్తూ లోపలి నుంచి నువ్వు ఆడు బయట నుంచి నేను ఆడతా.. నేను హౌస్ నుంచి వెళ్తేనే నువ్వు గెలుస్తావు అంటూ చివరి వీడ్కోలు చెబుతూ అక్కడి నుంచి బయటకు వెళ్లారు.

కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ కు అండగా మంచు విష్ణు..!

కరోనా తగ్గినట్లే తగ్గి చాపకింద నీరులా వ్యాపిస్తోంది. తాజాగా ఎంతో మంది సెలెబ్రిటీలకు ఆ వ్యాధి మళ్లీ సోకుతుంది. ఇలా ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టార్ అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. అతడు హైదరాబాద్‏లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. మరోవైపు శివశంకర్ మాస్టర్ భార్యకు కూడా కరోనా సోకడంతో ఆమె హోం క్యారంటైన్లో ఉన్నారు.

అతడి ఊపిరితిత్తులకు 75 శాతం ఇనెఫెక్షన్ సోకడంతో అతడి పరిస్థతి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఇప్పటికే ఆసుపత్రి బిల్లులు ఎక్కువయ్యాయని.. దాతలెవరైనా ముందుకు వచ్చి సాయం చేయాలని అతడి కుమారుడు అజయ్ కోరిన విషయం తెలిసిందే. అతడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న సినిమా తారలు స్పందిస్తున్నారు.

ఇప్పటికే సోనుసూద్ శివశంకర్ మాస్టర్ చిన్న కొడుకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నాడు. ఆయన ప్రాణాలను రక్షించేందుకు అన్ని విధాలుగా సహకరిస్తామని తెలిపారు. అంతే కాదు.. హీరో ధనుష్ కూడా అతడి వైద్య ఖర్చుల నిమిత్తం రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందించారు. తాజాగా మాస్టర్‌ గురించి నటుడు మరియు ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు ట్వీట్‌ చేశారు.

శివశంకర్‌ మాస్టర్‌ చికిత్స పొందుతోన్న ఏఐజీ ఆస్పత్రి బృందంతో తాను ఫోన్‌లో మాట్లాడినట్లు విష్ణు తెలిపారు. శివశంకర్‌ మాస్టర్‌ కోలుకునేందుకు అన్నివిధాలుగా చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తనతో తెలిపారని.. వాళ్లతో తాను ఫోన్లో మాట్లాడినట్లు తెలిపారు. మాస్టర్‌ రెండో కుమారుడు అజయ్‌తోనూ ఫోన్‌లో మాట్లాడాను అని విష్ణు ట్వీట్‌ చేశారు.

చంద్రబాబుకు మద్దతుగా నిలబడిన బాలయ్య ఫ్యాన్స్.. వారి దిష్టిబొమ్మలను తగలబెట్టాలంటూ పిలుపు..!

మీడియా ఎదుట ఆంధ్రప్రదేశ్ టిడిపి నేత చంద్రబాబు నాయుడు కన్నీళ్లు పెట్టుకోవడం రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే శాసనసభలో వైఎస్ఆర్ సిపి నాయకులు చంద్రబాబు నాయుడు అతని భార్య దివంగత నేత ఎన్టీ రామారావు కూతురు భువనేశ్వరి పట్ల అవమానకరంగా మాట్లాడారని చంద్రబాబు నాయుడు మీడియా ఎదుట కన్నీళ్లు పెట్టుకున్నారు.

ఈ క్రమంలోనే ఈ విషయం గురించి పలువురు టీడీపీ నేతలు స్పందించారు. అదే విధంగా ఈ విషయంపై నందమూరి బాలకృష్ణ అభిమానులు చంద్రబాబునాయుడుకు మద్దతుగా సంఘీభావం తెలియజేస్తూ వైసిపి నాయకులకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు.

ఈ క్రమంలోనే ఆల్ ఇండియా ఎన్.బి.కె  (balakrishna) ఫ్యాన్స్ కన్వీనర్ జి ఎల్ శ్రీధర్, నంబూరి సతీష్ , బి.బి.జి తిలక్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార పక్ష నాయకులు ఏ విధమైనటువంటి భాష మాట్లాడుతున్నారు యావత్ రాష్ట్రం మొత్తం గమనిస్తున్నారని ఇలాంటివారిని మనం ఎన్నుకున్నది అంటూ ఆంధ్ర ప్రజలు విస్తుపోతున్నారని తెలియజేశారు. ఈరోజు అసెంబ్లీ సాక్షిగా ఒక మహిళకు జరిగిన అవమానం చరిత్రలో మాయని మచ్చగా నిలబడి పోతుందని వీరు వెల్లడించారు.

ఈ క్రమంలోనే అసెంబ్లీ సాక్షిగా భువనేశ్వరికి జరిగిన అవమానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ సీపీ నాయకులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, అంబటి రాంబాబు, కొడాలి నాని, కన్నబాబు, రోజా, చంద్రశేఖర్ రెడ్డి దిష్టిబొమ్మలను తగలబెట్టాలని బాలకృష్ణ
ఫాన్స్ కన్వీనర్ జి ఎల్ శ్రీధర్, నంబూరి సతీష్ ,బి బి జి తిలక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇకపోతే సినీ నిర్మాత అశ్వినీదత్ కూడా చంద్రబాబునాయుడు కుటుంబానికి మద్దతు తెలిపారు.

అతడికే నా సపోర్టు.. నీ బెస్టు ఇవ్వు మ్యాన్ : సోనూసూద్

తెలుగులో ప్రసారం అవుతున్న అతి పెద్ద రియాల్టీ షో బిగ్ బాస్ 5. ఇది దాదాపు ఎండ్ కు వచ్చేసింది. హౌస్ లో కేవలం 10 మంది మాత్రమే ఉన్నారు. త్వరలో ఒకరు ఎలిమినేట్ అయిపోయి 9 మందితో ముందుకు సాగనుంది. అయితే ప్రస్తుతం హౌస్ లో ఉన్నవాళ్లు అంతా స్ట్రాంగ్ అనే చెప్పాలి. వీళ్లకు బయట సెలబ్రిటీల తమదైన శైలిలో సపోర్ట్ చేస్తున్నారు.

ఒకొక్కరూ ఒక్కో విధంగా సోషల్ మీడియాలో ఓట్ ఫర్ శ్రీరామ్, ఓట్ ఫర్ రవి అంటూ.. ఇలా ప్రేక్షకులను వేడుకుంటున్నారు. అయితే సోనుసూద్ కూడా తెలుగు బిగ్ బాస్ హౌస్ లో ఉన్న ఒక వ్యక్తికి సపోర్ట్ చేస్తూ.. తన ఇన్ స్టాలో ఓ వీడియోను పోస్టు చేశాడు. అందులో ఏముందంటే.. ‘‘అందరికీ హాయ్.. బిగ్ బాస్ సీజన్ 5 చూస్తున్నారా.. నేను కూడా చూస్తున్నాను.. షోలో నీ బెస్ట్‌ ఇవ్వు శ్రీరామ్‌.

అతడికే నా సపోర్ట్.. లవ్‌ యూ మ్యాన్‌’’ అని చెప్పుకొచ్చాడు. దీంతో శ్రీరామ చంద్ర అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. ఇక బిగ్ బాస్ సీజన్ 5 టైటిల్ కచ్చితంగా శ్రీరామ్ దే అంటూ కామెంట్లు చేస్తున్నారు. సోనుసూద్ శ్రీరామ్ కు మద్ధతు తెలపడంతో అతడి ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉంటుందనేది నెటిజన్లు అభిప్రాయం.

ఎవరు గెలుస్తారు.. ఎవరు ఇంటి నుంచి బయటకు వస్తారు.. అనేది తెలియాలంటే.. మరి కొన్ని వారాలు ఆగాల్సిందే. ఇప్పటికే హౌస్ లో ఈ వారం బయటకు రావడానికి నామినేట్ అయిన సభ్యులు రవి, సన్ని, మానస్, కాజల్ మరియు సిరి. దీనిలో ఎక్కువగా ఎలిమినేట్ ఛాన్స్ కాజల్, రవికి ఉన్నాయనేది నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

వామ్మో.. ఆ కంటెస్టెంట్ కోసం రంగంలోకి దిగిన ఆర్ ఎక్స్ బామ..?

బుల్లితెరపై బిగ్ బాస్ సీజన్ 5 షో రసవత్తరంగా సాగుతోంది. మొదట 19 మంది కంటెస్టెంట్ లతో గ్రాండ్ గా మొదలైన విషయం అందరికి తెలిసిందే. ఇప్పటికే 6 వారాలు పూర్తి చేసుకుంది. మొదట 19 మంది కంటెస్టెంట్ లు ఉండగా ప్రస్తుతం 13 మంది మాత్రమే మిగిలారు. ఇక ఈ వారం కూడా హౌస్ మేట్స్ నుంచి ఒకరు బయటకు వెళ్లనున్నారు. ఈసారి నామినేషన్ లో సిరి, రవి, కాజల్, యానీ మాస్టర్, ప్రియ, శ్రీరామ్, జెస్సీ, లోబో ఇలా ఎనిమిది మంది ఉన్నారు.

అయితే బిగ్ బాస్ లో తమ అభిమాన కంటెస్టెంట్ లను కాపాడుకోవడం కోసం ఇప్పటికే పలువురు బుల్లితెర సెలబ్రిటీలు ప్రచారానికి దిగిన విషయం అందరికీ తెలిసిందే. ఇక తాజాగా ఒక కంటెస్టెంట్ కోసం ఈ విధంగా టాలీవుడ్ హీరోయిన్ రంగంలోకి దిగింది. ఆ హీరోయిన్ ఎవరు? ఎవరి కోసం రంగంలోకి దిగింది? అన్న విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఆ హీరోయిన్ ఎవరో కాదు టాలీవుడ్ బ్యూటీ ఆర్ఎక్స్ 100 హీరోయిన్ పాయల్ రాజ్ పుత్. ఈమె హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా గుర్తింపు తెచ్చుకున్న శ్రీ రామచంద్ర కు తన మద్దతు తెలిపింది. నా ఫ్రెండ్ శ్రీరామ్ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నాడు. అతను చాలా బాగా ఆడుతున్నాడు. అంతే కాకుండా కొన్ని ఎపిసోడ్లు శ్రీరామ్ పర్ఫామెన్స్ చూసి నేను ఓ మై గాడ్ అనుకున్నాను. మీరు కూడా శ్రీ రామ్ కి ఓటు వేసి అతను గెలిపించండి అంటూ పాయల్ చెప్పుకొచ్చింది.

నిన్ను అభినందించకుండా ఉండలేకపోతున్నాను. నా బెస్ట్ విషెస్ ఎప్పుడూ నీకే ఉంటాయి అని తెలిపింది. మీరు కూడా శ్రీ రామ్ కి ఓటేసి మీ ప్రేమాభిమానాలు చాటుకోండి. ప్రతి ఒక్క ఓటు కూడా విలువైనదే అంటూ ఆమె తెలిపింది. ఇక శ్రీరామ్ కూడా హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. శ్రీరామ్ హమీద హౌస్ నుంచి వెళ్లిపోయిన దగ్గర్నుంచి కాస్త డీల పడినట్లు కనిపిస్తున్నారు. స్క్రీన్ పై కూడా పెద్దగా స్పేస్ దొరకడం లేదు.

మా ఎన్నికలలో మంచు విష్ణుకు మద్దతు కరువైందా.. మంచు మనోజ్ ఎక్కడా?

అక్టోబర్ 10వ తేదీ జరగబోయే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో భాగంగా అధ్యక్ష పదవి కోసం మంచు విష్ణు నటుడు ప్రకాష్ రాజ్ పోటీ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే .ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య తీవ్ర స్థాయిలో పోటీ ఏర్పడి పరస్పరం ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇదిలా ఉండగా ప్రకాష్ ప్యానెల్ కి మెగా కుటుంబం మద్దతుతో పాటు శ్రీకాంత్ వంటి స్టార్ హీరోల మద్దతు కూడా ఉంది.

మంచు విష్ణు ప్యానెల్ లో అవుట్‌ డేటెడ్‌ య్యాక్టర్లు ఉన్నారనే విమర్శలు కూడా వచ్చాయి. మంచు విష్ణు ప్యానెల్ లో ఒక నరేష్ మినహా మిగతా ఎవరు బలంగా లేరని తెలుస్తోంది. అయితే గత ఎన్నికలలో భాగంగా నరేష్ శివాజీ రాజా పై మెగా కుటుంబం మద్దతుతోనే గెలిచారు.అయితే ప్రస్తుతం మెగా కుటుంబం మద్దతు తెలుపుతున్న ప్రకాష్ రాజ్ కి కాకుండా మంచు విష్ణుకు మద్దతు తెలుపుతున్నారు.

ఇకపోతే మా ఎన్నికలలో భాగంగా మంచు విష్ణుకు ఓటు వేయాలంటూ మోహన్ బాబు కోరారు. ఈ క్రమంలోనే మంచు విష్ణుకి మద్దతుగా మంచు మనోజ్ మద్దతు తెలపగా పోవడం గమనార్హం. మంచు మనోజ్ విష్ణు కేవలం మద్దతు తెలపకపోవడమే కాకుండా కనీసం మంచు విష్ణు ఓటు వేయాలని కూడా ఎవరిని అడుగక పోవటంతో వీరిద్దరి మధ్య ఏదైనా విభేదాలు ఉన్నాయా అంటూ సందేహాలు తలెత్తుతున్నాయి.

మంచు విష్ణుకు సొంత తమ్ముడు మద్దతు తెలపక పోవడంతో మంచు విష్ణుకు మా ఎన్నికల్లో మద్దతు కరువైందా.. అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరి అక్టోబర్ 10వ తేదీ జరిగే మా ఎన్నికలలో ఎవరు అధ్యక్ష పదవిని కైవసం చేసుకుంటారో వేచి చూడాలి.