Tag Archives: tamilnadu

నా భార్యను పెళ్లి చేసుకోండి.. మ్యాట్రిమోనీలో ప్రకటన చేసిన భర్త..!

సాధారణం గా పెళ్లి కానీ అమ్మాయిల ప్రకటనలను వారికి సంబంధించిన బయోడేటాను సంబంధిత కులానికి చెందిన మ్యాట్రిమోనీలో ప్రకటిస్తూ వివాహ సంబంధాలను వెతకడం మనం చూస్తుంటాము. అయితే మీరెప్పుడైనా మ్యాట్రిమోనీలో భర్త ఉండగానే భార్యకు వివాహ ప్రకటన చేయడం విన్నారా.. ఆ ప్రకటన కూడా భర్త చేయడం విశేషం. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఈ వింత ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే….

తిరువళ్లూరు జిల్లా కడంబత్తూరు యూనియన్‌కి చెందిన ఓ యువతి ఓంకుమార్‌ అనే యువకుడిని పెళ్లి చేసుకుంది. 2016 సంవత్సరంలో పెద్దల సమక్షంలో వీరి పెళ్లి ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. ప్రస్తుతం వీరికి నాలుగు సంవత్సరాల కుమారుడు ఉన్నారు. ఇన్ని రోజులు ఎంతో ఆనందంగా సాగిన వీరి సంసారంలో మనస్పర్థలు చోటు చేసుకున్నాయి.

ఇలా భార్య భర్తల మధ్య గొడవలు చోటు చేసుకోవడంతో ఆ గొడవలను సర్దిచెప్పే ప్రయత్నం కుటుంబ సభ్యులు చేసినప్పటికీ వినకపోవడంతో విడాకులు తీసుకోవాలని కోర్టును ఆశ్రయించారు. అయితే ప్రస్తుతం వీరి విడాకులు కోర్టులో పరిశీలనలో ఉండగానే ఓంకార్ తన నీచ బుద్ధిని బయటపెట్టారు.

తన భార్యకు సంబంధించిన బయోడేటాను మ్యాట్రిమోనీ వెబ్సైట్ లో అప్లోడ్ చేసి వరుడు కావలెను అంటూ తన తండ్రి ఫోన్ నెంబర్ పెట్టారు.ఈ క్రమంలోనే ఆ యువతి డీటెయిల్స్ చూసిన కొందరు వ్యక్తులు తమ కూతురిని పెళ్లి చేసుకోవడానికి ఎలాంటి అభ్యంతరం లేదంటూ తన తండ్రికి ఫోన్లు చేస్తున్నారు. ఇలా తన కూతురు గురించి తనని పెళ్లి చేసుకుంటామని ఫోన్ కాల్స్ రావడంతో ఎంతో ఆశ్చర్యానికి గురైన తన కుటుంబ సభ్యులు సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే పోలీసులు అసలు నిజం బయట పెట్టడంతో పాటు ఓంకార్ ను అదుపులోకి తీసుకున్నారు.

తన కొడుకులను 250 సార్లు కొట్టి.. చిత్రహింసలు పెట్టి.. వీడియో తీసింది.. ఎందుకంటే..

అన్ని బంధాలకంటే.. పేగు బంధం గొప్పది అంటారు పెద్దలు. వివాహేతర సంబంధాల వల్ల ఇలాంటి బంధాలు కూడా మట్టిలో కలిసిపోతున్నాయి. పెళ్లి అనే బంధానికి కూడా మాయని మచ్చ తెస్తున్నారు. పరాయి మహిళ లేదా పురుషుడి మోజులో పడి కుటుంబాలను నాశనం చేసుకుంటున్నారు. ఇలాంటిదే ఓ ఇల్లాలు వివాహేతర సంబంధం పెట్టుకొని తన పిల్లలపైనే ప్రతాపం చూపిస్తోంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడు విల్లిపురం జిల్లాకు చెందిన సత్యమంగళం గ్రామానికి చెందిన వడివేలన్‌, తులసి దంపతులు. వీరికి రెండు సంవత్సరాలు, నాలుగు సంవత్సరాల ఇద్దరు మగ బిడ్డలు ఉన్నారు. అయితే గత కొంత కాలంగా ఈ దంపతుల మధ్య గొడవలు మొదలయ్యాయి.

భర్త మీద కోపం ఆమె పిల్లలపై చూపించేది. ఎప్పుడు గొడవ జరిగినా వాళ్లను కొట్టడమే కాకుండా.. వీడియోలు తీసి తన భర్తకు పంపించడం అలవాటు చేసుకుంది. ఇలా ఓరోజు తన కొడుకులను 250 సార్లు కొట్టినట్టుగా తన భర్తకు వీడియో పంపింది. దీంతో అతడు తన భార్య వేధింపులకు విసిగి పోయాడు. లాభం లేదని వెళ్లి పోలీసులకు ఈ వీడియో చూపించాడు.

ఆమెకు ఓ ప్రియుడు ఉన్నాడని.. అందుకే రోజు తమ మధ్య గొడవలు మొదలయ్యేయని.. దానికి ప్రతీ కారంగా పిల్లలను చిత్రహింసలకు గురిచేస్తుందని చెప్పాడు. దీనిపై పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసుకోగా.. ఆమె పరారీలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆమె తమిళనాడు బోర్డర్ దాటి చిత్తూరుకు వెళ్లినట్లు సమాచారం.

అమాయకుడిని మోసం చేయాలని చూసిన మహిళా పోలీస్.. చివరకు ఏమైందంటే..!

చట్టం ఎవరికీ చుట్టం కాదు. చేతిలో అధికారం ఉంది కదా.. అని లంచాలకు పాల్పడితే ఏదో ఒక రోజు శిక్ష అనుభవించడం అనేది జరుగుతుంది. ఇలానే ఓ మహిళా పోలీసు ఓ అమాయకుడి దగ్గర డబ్బులు తీసుకొని అబద్దం ఆడింది. చివరకు అతడు ఉన్నతాధికారులను ఆశ్రయించాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడు శివగంగ జిల్లా ఇళయాంకుడికి చెందిన అర్షద్.. ఓ బిజినెస్ ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.

అతడికి తెలిసిన వారి వద్ద సుమారు రూ.10 లక్షల వరకు వసూలు చేశాడు. వాటిని అతడు తన బ్యాగ్ లో భద్రపరుచుకున్నాడు. ఇంకా తనకు డబ్బులు అవసరం ఉండటంతో అతడు తన సోదరుడితో బైక్ పై నాగమలై పుదుకొట్టైకు వెళ్లాడు. అక్కడ అర్షద్ తన సోదరుడు డబ్బులు ఇస్తామన్న స్నేహితుడి కోసం ఎదురుచూశారు. ఆ ప్రదేశానికి అక్కడే పోలీస్ స్టేషన్ మహిళా ఎస్సై వాసంతి వచ్చారు. ఆ బ్యాగ్ లో ఏముందంటూ తీసుకున్నారు.

రేపు స్టేషన్ కు వచ్చి ఆ బ్యాగ్ ను కలెక్ట్ చేసుకోమని చెప్పారు. దీంతో వాళ్లు తెల్లారి స్టేషన్ కి వెళ్లి బ్యాగ్ అడిగారు. అందులో న్యూస్ పేపర్స్ తప్ప.. డబ్బులు లేవని ఆ మహిళా ఎస్సై సమాధానం ఇచ్చింది. దీంతో అతడు మధురై జిల్లా ఎస్పీకి విషయం చెప్పాడు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు వాసంతిని, ఆమె సోదరుడు, మరో ముగ్గురు కింద పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

అంతే కాకుండా ఆమెను విధుల నుంచి కూడా సస్పెండ్ చేశారు. ఆమె దీనిపై కోర్టును ఆశ్రయించగా వాదోపవాదనల తర్వాత ఆమె వద్ద రూ.2.26 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. వారికి కోర్టు సెప్టెంబర్ 9 వరకు రిమాండ్ విధించింది.

ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ‘వంటలక్క’పేరు.. ఇంతకు ఆమె ఏం చేసిందంటే..!

వంటలక్క అని పేరు వినగానే మనకు టక్కున గుర్తుకు వచ్చేది కార్తీక దీపం సీరియల్ లోని దీప క్యారెక్టర్. అంతలా ఆమె ప్రతీ ప్రేక్షకుడి మదిలో నిండిపోయారు. ఆ నటన అంతలా మంత్ర ముగ్ధులను చేసింది. కానీ ఇక్కడ చెప్పుకునే వంటలక్క వేరు.

ఇక్కడ తమిళనాడులోని మదురై తిరుమంగళానికి చెందని ఇందిరా రవిచంద్రన్ తన వంటలతో సరికొత్త రికార్డును నెలకొల్పారు. ఇంతకు ఆమె చేసింది.. ఎంటో తెలుసా.. ఆ మహిళ అరగంట సమయంలోనే 134 రకాల ఆహార పదర్ధాలను తయారు చేసి ఔరా.. అనిపించింది.

దీంతో ఆమె ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో రికార్డు సొంతం చేసుకున్నారు. అంతకు ముందు ఈ రికార్డు అరగంటలో 122 రకాల వంటలను తయారు చేసి కేరళకు చెందిన 10 ఏళ్ల బాలుడు హాయెన్ పేరిట ఉండేంది. తాజాగా ఆ రికార్డును 134 రకాల వంటలలో వెజ్, నాన్ వెజ్ తయారు చేసి అతడి రికార్డును చెరిపేసి సరికొత్త రికార్డును స్పష్టించారు. దీంతో ఆమెకు పలు ఛానల్ లు అవకాశం కల్పిస్తున్నాయి.

లైవ్ కార్యక్రమాల్లో వంటలకు సంబంధించి ప్రోగ్రామ్ లు చేసేందుకు ఆమెకు ఆఫర్లను ఇస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఆమె రికార్డు నెలకొల్పే ముందు ఎంతో శ్రమించిందట. చాలా రోజుల శిక్షణ తర్వాత ఈ అరుదైన గౌరవం దక్కిందని ఆమె ఆనందం వ్యక్తం చేశారు. తాను చేసిన వంటకాల్లో ఇడ్లీ, దోశ, వడ లాంటి వంటకాలతో పాటు మాంసహార వంటకాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు.

గుడిలో పెళ్లి.. బంధువుల లొల్లి.. చివరకు ఇలా జరిగింది..!

సాధారణంగా పెళ్లి అనేది ఇంటి దగ్గర పందిరి వేసి.. మేలతాళాల మధ్య పంతులు కుదిర్చిన ముహుర్తానికి పెళ్లి చేసుకుంటారు. మరికొంతమంది అయితే ఫంక్షన్ హాల్ లాంటివి బుక్ చేసుకొని అక్కడే పెళ్లి చేసుకొని.. వింధు కార్యక్రమాలు కూడా నిర్వహించుకుంటారు. అయితే మరికొంత మంది దైవ సన్నిధిలో పెళ్లి చేసుకొని రిసెప్షన్ మాత్రం ఇంటి దగ్గర పెట్టుకుంటారు.

ఇలా తమిళనాడులోని ఓ దేవాలయంలో కొన్ని జంటలు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. అనుకున్నట్లుగానే అక్కడకు వెళ్లి పెళ్లి ఏర్పాట్లలో ఉన్నారు. ఇది పెళ్లిళ్ల సీజన్ కావడంతో ప్రతీ ఏడాది ఆ దేవాలయంలో వందల పెళ్లిళ్లు జరుగుతాయి. అయితే ఒకొక జంటకు కేవలం 30 నిమిషాలు మాత్రమే కేటాయిస్తారు. ఈ లోపు ముహూర్తం చూసుకొని తాళి కట్టి.. పెళ్లి కార్యక్రమం పూర్తి చేయాల్సి ఉంటుంది.

తర్వాత మరో జంటకు అక్కడ మరో 30 నిమిషాల్లో తాళి కట్టి జరుగుతుంది. ఈ నేపథ్యంలో అక్కడకు వచ్చిన వధూవరుల కుటుంబసభ్యులు ఒకరినొకరు కొట్టుకున్నారు. మా వాళ్ల పెళ్లి జరగాలని ఒకరు అంటే.. లేదు మావాళ్ల పెళ్లి జరగలాని మరొకరు పట్టుపట్టడంతో ఇలా గొడవ చోటు చేసుకుంది. ఇలా గుడిలోని పెళ్లి వేడుకల్లో వధూవరులతో సహా బంధువులు కొట్టుకోవడం వైరల్‌గా మారింది.

అక్కడకు చేరుకున్న దేవాదాయ అధికారులు ఎంత చెప్పినా వినిపించుకోలేదు. దీనికి సంబంధించి వీడియో ను ఒకరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ గా మారింది. దేవాలయంలో ఇలా వాగ్వాదం చోటుచేసుకోవడంతో దేవాదాయ శాఖ అధికారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. దేవాలయంలో కనీసం నిబంధనలు పాటించకుండా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడంలో నెటిజన్లు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

బస్సులో బాలికతో పాటు ముగ్గురు యువకులు.. జరిగిన ఘటన చూసి షాక్ అయిన సెక్యూరిటీ గార్డు..

ఓ పాఠశాల ఆవరణలో పార్కింగ్ చేసిన వాహనంలో జరిగిన ఘటన చూసి సెక్యూరిటీ గార్డ్ ఆశ్చర్యపోయాడు. అక్కడ ఏం జరిగిందంటే.. పాఠశాలకు ఎదరురుగా ఓ వాహనం పార్క్ చేసి ఉంది. దానిని తొలగించేందుకు అతడు ప్రయత్నించాడు. ఆ వాహనంలో ఒక 16 ఏళ్ల అమ్మాయితో పాటు.. ముగ్గురు అబ్బాయిలు ఉండటం చూసి షాక్ అయ్యాడు.

ఈ ఘటన తమిళనాడులోని చెన్నైలోని అరుంబాక్కంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. అరుంబాక్కంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న కోటీశ్వరన్.. పాఠశాల ఆవరణలో పార్క్ చేసిన వాహనాన్ని తరలించడానికి ప్రయత్నించాడు. ఆ తర్వాత ఆ బస్సులో నలుగురు వ్యక్తులను చూశాడు. అందులో మగ డ్రస్ లో 16 ఏళ్ల బాలికతో పాటు మరో ముగ్గరు అబ్బాయిలు ఉన్నారు. అతడిని చూసిన ముగ్గురు వ్యక్తులు అక్కడ నుంచి పారిపోయారు.

అక్కడే ఉన్న ఆ బాలికను అతడు పోలీసులకు అప్పగించాడు. విచారణ చేపట్టిన పోలీసులు ఆ యువతిది చెన్నైలోని జామ్‌బజార్ మీర్జాకిపేట్‌ అని తెలుసుకున్నారు. ఆమెతో పాటు మరో ముగ్గురు స్నేహితులు నిజాం, కార్తీక్, దేవ లతో కలిసి బయటకు వచ్చినట్లు పోలీసులకు ఆమె తెలిపింది. వారు ప్రైవేట్ స్కూల్ గోడ దూకి.. అక్కడ పార్క్ చేసిన బస్సులో గంజాయి తాగినట్లు విచారణలో ఆ బాలిక చెప్పింది. ఆ తర్వాత ఆ బాలిక నిద్రలోకి జారుకున్నట్లు పోలీసులు తెలిపారు.

పోలీసులు ఆ బాలిక తండ్రిని పిలిపించారు. అతడిని కూడా విచారించారు. ఆ తర్వాత జిల్లా శిశు సంక్షేమ అధికారి.. యువతిని తన తండ్రితో కలిసి పంపించారు. దీనిపై పోలీసులు.. యువతి వేధింపులకు గురైందా.. అన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. పరారీలో ఉన్న వ్యక్తుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

వామ్మో ఇది నాలుకా లేక పామా.. అతడి నాలుక చూస్తే ఆశ్చర్యపోతారు!

మీరు మీ నాలుకతో ముక్కను అందుకోగలరా? ట్రై చేస్తున్నారు కదా…నాలుకతో ముక్కు అందుకోవడానికి కొద్దిగా కష్టం అనిపించిన ప్రయత్నిస్తే తప్పకుండా అందుతుంది. కానీ ఒక వ్యక్తి మాత్రం తన నాలుకతో ఎంతో అవలీలగా ముక్కును అందుకోవడమే కాకుండా ఏకంగా తన కళ్ళను కూడా అందుకుని అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. ఏంటి నమ్మ బుద్ధి కావడం లేదా… అయితే ఈ వీడియో మీరు చూడాల్సిందే.

విరుధునగర్‌లోని తిరుదంగల్‌‌కు చెందిన కె.ప్రవీణ్ కుమార్ అనే 20 ఏళ్ల యువకుడు తన నాలుకతో కంటిని అందుకొని వార్తల్లోకి ఎక్కాడు. సాధారణంగా పురుషులకు నాలుక పొడువు 8.5 సెంటీ మీటర్లు, మహిళల నాలుక 7.9 సెంటీమీటర్లు ఉంటుంది. కానీ ప్రవీణ్ కుమార్ అనే యువకుడు ముక్కు మాత్రం ఏకంగా 10.8 సెంటి మీటర్ల పొడవు ఉండటం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ప్రవీణ్ కుమార్ కు ఇంత పొడవైన నాలుక ఉండటంతో ఇతను ఏకంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సంపాదించాడు

ప్రస్తుతం కాలిఫోర్నియాకు చెందిన యువకుడు సలినాస్‌లోని నిక్ స్టోబెర్ల్ అనే వ్యక్తి నాలుక పొడవు 10.1 సెంటి మీటర్ నుండి గిన్నిస్ బుక్ సాధించాడు. అయితే తాజాగా ప్రవీణ్ కుమార్ తన నాలుక పొడవుతో రికార్డులను తిరగరాశారు. ఇంత పొడవు నాలుక కలిగి ఉండడంతో ప్రవీణ్ కు ఎలాంటి ఇబ్బంది లేదని తెలియజేశారు. అదేవిధంగా నిమిషానికి ఏకంగా 216 సార్లు తన నాలుకతో ముక్కును తాకి రికార్డు సృష్టించారు. అలాగే కళ్ళ వరకు తన నాలుకతో అందుకోగలడు. త్వరలోనే తన నాలుకతో కనుబొమ్మలను అందుకుంటానని ప్రవీణ్ తెలియజేశారు.

లిక్కర్ షాపుకు హారతి ఇచ్చి పూజ చేసిన మందుబాబులు!

సాధారణంగా మనం ఉదయం లేవగానే ఆ దేవుడికి హారతి ఇచ్చి దండం పెట్టుకుంటాము. కానీ ఓ మహానుభావుడు మాత్రం ఉదయం లేవగానే లిక్కర్ షాప్ కు హారతులిచ్చి పూజ చేశాడు. లిక్కర్ షాప్ కి హారతి ఇవ్వడం అంటే వ్యాపారం బాగా జరగాలని పూజ చేశాడు అనుకుంటే మీరు పొరపాటు పడ్డట్లే. అతను మద్యం కొనడానికి వచ్చి ఏకంగా షాప్ కు హారతులిచ్చి మద్యం బాటిళ్లను కొనుగోలు చేసిన ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది.మద్యం తాగడానికి ఇంత హంగామా అవసరం అనుకుంటే అందుకు కూడా ఒక కారణం ఉంది.

కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతి కారణంగా తమిళనాడు ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. ఈ క్రమంలోనే మందు షాపులు కూడా మూతపడ్డాయి. తాజాగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో 27 జిల్లాలలో మందు షాపులు తెరచుకోవడానికి ప్రభుత్వం అనుమతి తెలపడంతో మందుబాబుల ఆనందాలకు అవధులు లేకుండా పోయాయి.

ఈ క్రమంలోనే మందు షాపులు ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అమ్మడానికి అనుమతులు తెలపడంతో మందుబాబులు కోడి కూయక ముందే వైన్ షాప్ ముందు బారులు తీరారు. ఈ క్రమంలోనే మధురైలో ఓ వ్యక్తి.. లిక్కర్ షాప్ అలా ఓపెన్ చేయగానే హారతి ఇచ్చి మరీ మందు బాటిళ్లు కొనుగోలు చేశాడు. ఆ తర్వాత అతను కొన్న మందు బాటిల్ లను హారతి ముందు పెట్టి దండం పెట్టుకొని ఎంతో సంబరపడిపోయాడు.

ఈ విధంగా మందు కోసం వైన్ షాప్ ముందు ఈ వ్యక్తి చేసిన హంగామా చూసి పలువురు ఎంతో ఆశ్చర్యపోయారు. ఈ విధంగా ఈ వ్యక్తి వైన్ షాప్ కి హారతి ఇస్తూ మందు బాటిల్ కు దండం పెడుతున్నటువంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన పలువురు నెటిజన్లు ఆస్కార్ అవార్డ్ గెలుపొందిన కూడా ఇంత సంబరపడిరేమో.. అని కొందరు కామెంట్ చేయగా మరికొందరు మందును బాగా మిస్ అయినట్టు ఉన్నాడంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ వీడియోపై మీరు ఓ లుక్కేయండి.

కరోనా దేవి నీలానే ఉందంటూ ఆ నటిపై కామెంట్స్.. ఆమె ఏం చేసిందంటే?

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రస్థాయిలో వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరగడమే కాకుండా పెద్ద ఎత్తున మరణాలు కూడా సంభవిస్తున్నాయి. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలో ఈ మహమ్మారిని కట్టడి చేయడం కోసం లాక్ డౌన్ విధించాయి. ఈ క్రమంలోనే తమిళనాడు రాష్ట్రంలో కూడా కరోనా వైరస్ తీవ్రత అధికంగా ఉండటంతో తమిళనాడులో కూడా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.

ఈ క్రమంలోనే తమిళనాడులోని కోయంబత్తూరులో మాత్రం ఈ మహమ్మారిని అంతం చేయడం కోసం అక్కడి ప్రజలు కరోనా దేవతను ఏర్పాటు చేశారు. అక్కడి ప్రజలు కరోనా దేవతా విగ్రహాన్ని ప్రతిష్టించి 48 రోజులపాటు భక్తిశ్రద్ధలతో హోమాలు నిర్వహించాలని భావించారు. ఈ విధంగా కరోనా దేవతకు పూజలు చేయటం వల్ల ఈ వైరస్ వ్యాప్తిని నియంత్రించవచ్చని అక్కడి ప్రజలు విశ్వసిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే కోయంబత్తూరులోని ప్రజలు కరోనా దేవి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతం కరోనా దేవతకు సంబంధించినటువంటి ఫోటోలు బయటకు వచ్చాయి. ఈ ఫోటో చూసిన నెటిజన్లు అందరూ తమ క్రియేటివిటీని బయట పెడుతున్నారు.కరోనా దేవత ఫోటో చూసిన నెటిజన్లు కరోనా దేవత అచ్చం సినీనటి విజయ్ కుమార్ పోలికలతో ఉందని మీమ్స్ త‌యారు చేసి కామెంట్లు పెడుతున్నారు.

ఈ క్రమంలోనే సినీనటి వనిత విజయ్ కుమార్ స్పందిస్తూ.. “ఓరి దేవుడా! ఇదేంటి ప్రతి ఒక్కరు ఈ ఫోటో తో పాటు మీమ్స్ పంపుతున్నారు” అంటూ నెటిజన్లు చేసే కామెంట్లపై వనిత విజయ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.ప్రస్తుతం కరోనా దేవతకు సంబంధించినటువంటి ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

‘రష్మీక’ పెళ్లి ఫిక్స్.. వరుడు మాత్రం ఆ ఇంటివాడేనట..??

టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతోంది రష్మీక మందన్న.. తెలుగులో ఛలో సినిమాతో హీరోయిన్ గా వెండితెరకు పరిచయం అయిన ఈ బ్యూటీ..ఆ సినిమా విజయం తర్వాత తెలుగులో వరుస అవకాశాలను అందుకుంది..ఇక ఇటీవలే సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన నటించి మెప్పించిన రష్మీక.. ప్రస్తుతం వరుస ఆఫర్లను అందుకుంటుంది..ఇక తాజగా బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టబోతోంది రష్మీక..

ఇక ఇటీవలే ఇండియన్ క్రష్ గా పేరు తెచ్చుకున్న రష్మిక.. సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది. ఇదిలా ఉంటే రష్మిక నోట నుండి మొత్తానికి పెళ్లి వార్త వినిపించింది.ఇటీవలే తమిళ సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన ఈ బ్యూటీ.. సుల్తాన్ సినిమాతో తమిళ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇందులో పల్లెటూరి అమ్మాయి గా నటించిన ఈ కన్నడ బ్యూటీ.. తన పాత్రతో ప్రేక్షకులను ఫిదా చేసింది.

అంతే కాకుండా ఈ సినిమా మంచి సక్సెస్ ను అందుకున్న నేపథ్యంలో తాజాగా కొన్ని విషయాలు పంచుకుంది రష్మిక మందన.తనకు తమిళ సంప్రదాయం, సంస్కృతి చాలా భిన్నంగా అనిపించిందని తెలిపింది.అవి తనను ఎంతగానో ఆకర్షించాయని, అక్కడ భోజనం, వంటలు చాలా రుచి గా ఉన్నాయని తెలిపింది ఈ బ్యూటీ. తమిళ వంటకాలంటే చాలా ఇష్టమని.. అందుకే ఎప్పటికైనా తమిళ ఇంటి కోడలు కావాలనే కోరిక ఉందని తెలిపింది.

ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నటిస్తున్న పుష్ప సినిమాల్లో బిజీగా ఉంది. ఇక బాలీవుడ్ లో డెడ్లీ, మిషన్ మజ్ను వంటి వరుస సినిమాలలో నటించనుండగా.. హిందీలో మరో అవకాశాన్ని కూడా అందుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. విజయ్ దేవరకొండ తో ప్లాన్ చేస్తున్న సుకుమార్ సినిమాల్లో కూడా నటించే అవకాశం ఉందని తెలుస్తోంది…సో మొత్తానికి రష్మీక మాత్రం ఎప్పటికైనా తమిళ ఇంటి కోడలిగానీ వెళ్లాలనుకుంటోందన్నమాట..!!