Tag Archives: tdp

Tarakaratna: తారకరత్నకు గుండెపోటు రావడానికి అదే కారణమా… అందుకే మరణం తప్పలేదా?

Tarakaratna: నందమూరి వారసుడు నందమూరి తారకరత్న అతి చిన్న వయసులోనే గుండెపోటుకు గురై మరణించిన విషయం మనకు తెలిసిందే. 39 సంవత్సరాల వయసులోనే తారకరత్న గుండెపోటుకు గురై ఫిబ్రవరి 18వ తేదీ మరణించారు. ఇలా చిన్న వయసులోనే గుండెపోటుకు గురై తారకరత్న మరణించడానికి గల కారణం ఏంటి అని అందరూ ఆరా తీస్తున్నారు.

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ ఈ ఉరుకుల పరుగుల జీవితంతో పాటు ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలోనే అధిక ఒత్తిడికి గురవుతూ రాత్రి పగలు అనే తేడా లేకుండా కష్టపడుతున్నారు. ఇలా తమపై అధిక ఒత్తిడి పడుతుండడం వల్ల చాలామంది చిన్న వయసులోనే గుండెపోటుకు గురవుతున్నారు. ఈ క్రమంలోనే తారకరత్న సైతం ఇలాంటి ఒత్తిడికి గురయ్యారని తన సన్నిహితులు తెలియచేస్తున్నారు.

తారకరత్న హీరోగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. అయితే ఈయన మాత్రం ఇండస్ట్రీలో సక్సెస్ సాధించలేకపోయారు. ఇలా ఇండస్ట్రీలో సక్సెస్ సాధించలేనని బాధ ఒత్తిడి ఈయనలో అధికంగా ఉంది అయితే ఇండస్ట్రీలో సక్సెస్ కాలేకపోయినా కనీసం రాజకీయాలలో అయినా రాణించాలని తారకరత్న భావించారు.

Tarakaratna: ఒత్తిడికి గురైన తారకరత్న…

వచ్చే సార్వత్రిక ఎన్నికలలో భాగంగా ఈయన పోటీ చేయడం కోసం పెద్ద ఎత్తున పార్టీ ప్రచార కార్యక్రమాలలో పాల్గొనారు. ఈ క్రమంలోనే లోకేష్ నిర్వహిస్తున్నటువంటి యువగలం పాదయాత్రలో భాగంగా ఆయనకు మద్దతు తెలుపుతూ ఈయన పాల్గొన్నారు. తారకరత్నకు గుండెపోటు వచ్చిందని ఈ గుండెపోటు కారణంగానే ఆయన మరణించారని సన్నిహితులు భావిస్తున్నారు. ఏది ఏమైనా తారకరత్న మరణ వార్త ఇటు చిత్ర పరిశ్రమకు నందమూరి కుటుంబ సభ్యులతో పాటు అభిమానులకు తీరని లోటు అని చెప్పాలి.

Tarakaratna: వైసీపీ నుంచి తారకరత్నను పోటీ చేయమని అడిగా… తారకరత్న అలాంటి సమాధానం చెప్పారు: కొడాలి నాని

Tarakaratna: నందమూరి తారకరత్న మరణించడంతో పెద్ద ఎత్తున సినీ సెలబ్రిటీలు రాజకీయ నాయకులు పార్టీలకు అతీతంగా వచ్చి ఆయన మృతికి నివాళులు అర్పిస్తున్నారు.తన కెరియర్లో ఒక్క శత్రువు కూడా లేకుండా అందరితోనూ ఎంతో సన్నిహితంగా మెలిగిన తారకరత్న గురించి ప్రతి ఒక్కరూ చెబుతున్నటువంటి మాటలు కనుక వింటే ఆయన ఎంత గొప్పగా బతికాడో అర్థమవుతుంది.

ఈ క్రమంలోనే వైసిపి మాజీ మంత్రి కొడాలి నాని తారకరత్న మరణం పై స్పందిస్తూ ఆయనకు నివాళులు అర్పించడమే కాకుండా తారకరత్న వ్యక్తిత్వం గురించి కూడా ఎంతో గొప్పగా చెప్పారు.తారకరత్న ఎప్పుడూ కూడా ఎవరిని పేరు పెట్టి పిలిచే వ్యక్తి కాదు అన్న తమ్ముడు బాబాయ్ అంకుల్ ఆంటీ అంటూ ఏదో ఒక సంబంధం కలుపుకొని మాట్లాడే వ్యక్తిత్వం తనదని తెలిపారు.

ఇక తారకరత్నకు అత్తగారి ఇంటి వైపు నుంచి చూస్తే వైసిపి పార్టీ పుట్టింటి వైపు చూస్తే తెలుగుదేశం పార్టీ రెండు పార్టీలు ఆయనకు ఎంతో దగ్గర సంబంధం కలిగి ఉన్నాయి.ఈ క్రమంలోని ఓ రోజు తారకరత్నతో మాట్లాడుతూ వైసీపీ పార్టీ నుంచి పోటీ చేయవచ్చు కదా అని అడిగాను అందుకు తారకరత్న సమాధానం చెబుతూ తెలుగుదేశం పార్టీ తాతగారు స్థాపించిన పార్టీ తాను ఈ పార్టీలోనే కొనసాగుతాను అంటూ సమాధానం చెప్పారు.

Tarakaratna:తాత స్థాపించిన పార్టీలోనే కొనసాగుతా….


తారకరత్న దేనికి ఆశపడకుండా తన కష్టాన్ని నమ్ముకుని తన తాతయ్య స్థాపించిన పార్టీలో కొనసాగాలని నిర్ణయించుకున్నాడు. ఆ ప్రయత్నంలో భాగంగానే ఆయన ఇలా మనకు అందనంత దూరానికి వెళ్లిపోయారని కొడాలి నాని తారకరత్న గొప్ప మనసు, ఆయన వ్యక్తిత్వం గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు. ఇలా తారకరత్న గురించి కొడాలి నాని చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Nara Lokesh: బావ అని పిలిచే గొంతు నాకు వినపడదు… తారకరత్న మృతి పై లోకేష్ ఎమోషనల్ ట్వీట్!

Nara Lokesh: నందమూరి తారకరత్న గత మూడు వారాలుగా బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చివరికి తుది శ్వాస విడిచిన విషయం మనకు తెలిసిందే. ఈ విధంగా తారకరత్న మృతి చెందడంతో ఒక్కసారిగా నందమూరి కుటుంబంలోనూ నందమూరి అభిమానులు టిడిపి కార్యకర్తలలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

లోకేష్ పాదయాత్రలో భాగంగా ఆయనకు మద్దతు తెలపడం కోసం వెళ్ళినటువంటి తారకరత్న ఉన్నఫలంగా కుప్పకూలిపోయారు. దీంతో ఆయనకు గుండెపోటు రావడం అనంతరం ఈ ప్రభావం మెదడుపై చూపించడంతో ఈయన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ 23 రోజులపాటు చికిత్స తీసుకుంటున్నప్పటికీ చివరికి విధి చేతిలో ఓడిపోయారు.

ఈ విధంగా తారకరత్న మరణించడంతో టీడీపీ యువ నాయకుడు లోకేష్ తన పాదయాత్రను రద్దు చేసుకొని తారకరత్నకు నివాళులు అర్పించడం కోసం హైదరాబాద్ బయలుదేరారు. ఈ క్రమంలోనే ఈయన సోషల్ మీడియా వేదికగా తారకరత్నకు కన్నీటి నివాళులు అర్పించారు. ఇక లోకేష్ పాదయాత్ర కూడా రద్దు అయింది. ఈ క్రమంలోనే ఈయన సోషల్ మీడియా వేదికగా తారకరత్న మృతి పై స్పందిస్తూ చేస్తున్నటువంటి పోస్ట్ వైరల్ గా మారింది.

Nara Lokesh: నీ స్నేహబంధం బంధుత్వం కన్నా గొప్పది…

లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. బావ అంటూ ఆప్యాయంగా పిలిచే ఆ గొంతు ఇక నాకు వినపడదు.. నేనున్నానంటూ నా వెంట నడిచిన ఆ అడుగుల చప్పుడు ఆగిపోయింది. నంద‌మూరి తార‌క‌ర‌త్న మృతి దిగ్భ్రాంతికి గురి చేసింది. తెలుగుదేశం యువ‌తేజం తార‌క‌ర‌త్న మృతి మా కుటుంబానికి, తెలుగుదేశం పార్టీకి తీర‌ని లోటు. నిష్క‌ల్మ‌ష‌మైన నీ ప్రేమ‌, స్నేహ బంధం మ‌న బంధుత్వం కంటే గొప్ప‌ది. తార‌క‌ర‌త్న‌కి క‌న్నీటి నివాళి అర్పిస్తూ తారకరత్న మృతికి సంతాపం ప్రకటిస్తూ ఆయన ఆత్మ శాంతించాలని కోరుకున్నారు.

Tarakaratna: 23 రోజులు వైద్యం అందించిన తారకరత్న కోలుకోకపోవడానికి కారణం ఏంటి.. అసలేం జరిగింది?

Tarakaratna: నందమూరి తారకరత్న ఇకలేరనే వార్త నందమూరి అభిమానులలోను టిడిపి కార్యకర్తలలోనూ తీవ్ర విషాదం నింపింది.లోకేష్ పాదయాత్రలో భాగంగా ఆయనకు మద్దతు తెలుపుతూ పాల్గొన్నటువంటి తారకరత్న ఉన్నపలంగా హార్ట్ స్ట్రోక్ రావడంతో స్పృహ తప్పి పడిపోయారు. దీంతో ఈయనను సమీప ఆసుపత్రికి తరలించే అనంతరం మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించారు.

ఇలా నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో ఈయనకు ప్రత్యేక వైద్య బృందం సమక్షంలో గత 23 రోజులగా వెండిలేటర్ పై చికిత్స అందుతుంది. ఇలా 23 రోజుల నుంచి నిపుణుల సమక్షంలో చికిత్స అందుతున్నప్పటికీ ఈయన ఆరోగ్య విషయంలో ఏ మాత్రం మెరుగు కనిపించకపోవడంతో ఒకవైపు అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తూనే వచ్చారు.

తారకరత్న విషయంలో నందమూరి కుటుంబ సభ్యులకు కూడా చాలా కేర్ తీసుకున్నారు. ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్యం గురించి తెలుసుకుంటూనే ఉన్నారు. పెద్ద ఎత్తున పూజలు హోమాలు కూడా చేశారు. ఇలా ఒకవైపు విదేశీ వైద్యులు చికిత్స అందిస్తున్నప్పటికీ తారకరత్న ప్రాణాలు కోల్పోవడానికి అసలు కారణం ఏంటి అని ఆరా తీస్తున్నారు.

Tarakaratna: తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిన తారకరత్న….


ఈ విధంగా 23 రోజులపాటు వెంటిలేటర్ పై చికిత్స తీసుకుంటున్నటువంటి తారకరత్న ప్రాణాలు కోల్పోవడానికి గల కారణం ఆయన బ్రెయిన్ ఫంక్షన్స్ జరగకపోవడమే. ఈయన పాదయాత్రలో హార్ట్ స్ట్రోక్ రావడంతో ఆ ప్రభావం మెదడుపై పడిందని దాంతో మెదడు పనితీరు తగ్గిపోవడం వల్ల ఈయన వెంటిలేటర్ పై ఉన్నప్పటికీ ఆయన శరీరం వైద్యానికి సహకరించలేదని అలాగే వైద్యులు ఎంతో శ్రమించినప్పటికీ ఆయన మెదడు పనితీరులో ఏమాత్రం మెరుగు లేకపోవడంతోనే ఆయన మరణించారని తెలుస్తోంది.ఏది ఏమైనా క్షేమంగా తిరిగి వస్తారు అనుకున్న తారకరత్న ఇలా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారని తెలిసి నందమూరి కుటుంబ సభ్యులు, అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు

Sr.NTR: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ గారికి అరుదైన గౌరవాన్ని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం!

Sr.NTR: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి కేంద్ర ప్రభుత్వం అరుదైన గౌరవాన్ని ప్రకటించింది. నందమూరి తారక రామారావు సినీ రాజకీయ సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఆయన శత దినోత్సవ కార్యక్రమాలలో భాగంగా వంద రూపాయల వెండి నాణెంపై ఎన్టీఆర్ బొమ్మతో విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

పూర్తిగా వెండితో తయారు చేసిన వంద రూపాయల నాణెంపై ఎన్టీఆర్ ప్రతిమ రూపొందించనున్న నాణెం నమూనాను మింట్ అధికారులు మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరికి చూపిస్తూ ఈ నాణెం పై సలహాలు సూచనలు కోరారు. 2022 మే 28వ తేదీ నుంచి ఎన్టీఆర్ గారి శత జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి.

ఇలా ఏడాది పాటు ఈ జయంతి ఉత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సాధారణంగా ఇలాంటి నాణేలపై
చారిత్రక ఘటనలు, , ప్రముఖల గుర్తుగా నాణెలను విడుదల చేస్తుంటారు. ఇక ఎన్టీఆర్ సినిమా రంగంలో మాత్రమే కాకుండా రాజకీయాలలో కూడా ఎంతో మంచి ఆదరణ గుర్తింపు సంపాదించుకున్నారు.

Sr.NTR: సంతోషంలో నందమూరి అభిమానులు….


ఈ క్రమంలోనే ఈయన ప్రతిమతో వెండి నాణెం విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో నందమూరి అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే 1964 నుండి ఇలా నాణెల విడుదల చేయడం ప్రారంభించారు.తొలుత నెహ్రు స్మారకార్ధం నాణెం విడుదల చేశారు.

Unstoppable: TDPలోకి చేరవచ్చు కదా… అన్ స్టాపబుల్ కార్యక్రమంలో పవన్ కు బాలయ్య సూటి ప్రశ్న!

Unstoppable: జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకవైపు సినిమాలలోను మరొకవైపు రాజకీయాలలోనూ కొనసాగుతున్నారు. ఇలా రాజకీయాలలో కూడా ఎంతో చురుగ్గా పాల్గొంటున్న బాలయ్య తాజాగా బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇదివరకే మొదటి ఎపిసోడ్ ప్రసారం కాగా త్వరలోనే రెండవ ఎపిసోడ్ కూడా ప్రసారం కానుంది.

ఈ క్రమంలోనే రెండవ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా బాలకృష్ణ పవన్ కళ్యాణ్ ను సూటి ప్రశ్నలు అడుగుతూ తన నుంచి సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే బాలయ్య పవన్ కళ్యాణ్ ను ప్రశ్నిస్తూ నీకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఇలా అభిమానులు తమ ప్రేమను ఓట్లుగా ఎందుకు కన్వర్ట్ చేయడం లేదు అంటూ ప్రశ్నించారు…

ఇక బాలకృష్ణ రాజకీయాల గురించి ప్రశ్నిస్తూ జనసేన పార్టీలో కాకుండా తెలుగుదేశం పార్టీలోకి చేరవచ్చు కదా అంటూ సూటిగా ప్రశ్నించారు.ఇలా బాలయ్య ఇలాంటి ప్రశ్నలు వేయడంతో పవన్ కళ్యాణ్ ఈ ప్రశ్నలకు ఎలాంటి సమాధానం చెప్పారో అనే విషయంపై ఆత్రుత నెలకొంది.

Unstoppable: బాలయ్య ప్రశ్నలకు పవన్ సమాధానం ఏంటి…


మరి బాలకృష్ణ ప్రశ్నలకు పవన్ కళ్యాణ్ ఎలాంటి సమాధానాలు చెప్పబోతున్నారు. బాలయ్య చెప్పినట్టుగానే పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారా తన అభిమానులు తనకు ఎందుకు ఓట్లు వేయడం లేదు అనే విషయంపై పవన్ కళ్యాణ్ వివరణ, తన అభిప్రాయం ఎలా ఉందో తెలియాలంటే ఈ ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు వేచి చూడాలి.

Chandrababu: గెలిపిస్తే అసెంబ్లీకి వెళ్తా.. లేదంటే ఇవే నా చివరి ఎన్నికలు: చంద్రబాబు నాయుడు

Chandrababu:తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా కర్నూలులో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే కర్నూలు పర్యటనలో భాగంగా ఈయన అధికార పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ పెద్ద ఎత్తున తర పార్టీని ప్రచారం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా అధికార పార్టీ ప్రజలను ఏ విధంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారో వివరించారు.

కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయడానికి తాను అడ్డుపడుతున్నానని అధికార పార్టీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అధికార పార్టీలో ఎంతోమంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేదని ఈయన మండిపడ్డారు. ఇకపోతే పత్తికొండలో చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్న సమయంలో ఆయనకు వికేంద్రీకరణ సెగ తగిలింది.

కొందరు రోడ్లపై బైఠాయించి గో బ్యాక్ చంద్రబాబు నాయుడు అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే పోలీసుల చోరవుతో చంద్రబాబు కాన్వాయ్ ను ముందుకు పంపించారు. ఇకపోతే బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా ఈయన మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలను ప్రశ్నిస్తుంటే వైసీపీ గుండాలు చెలరేగిపోతున్నారు అలాగే ప్రశ్నించిన వారిపై పోలీసు కేసులు పెడుతున్నారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదు.

Chandrababu: ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదు..

వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసి నన్ను గెలిపిస్తే అసెంబ్లీకి వెళ్తాను ఈ వైసీపీ గుండాల పని పడతాను అంటూ ఈయన మాట్లాడారు.ఓట్లు వేసి గెలిపిస్తే అసెంబ్లీకి వెళ్తానని లేదంటే ఇవే నాకు చివరి ఎన్నికలు అంటూ ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమంలో సంచలన వ్యాఖ్యలు చేయడం తీవ్ర దుమారం రేపుతుంది.

Un Stoppable 2: బాలయ్య టాక్ షోలో టీడీపీ నేత చంద్రబాబు.. బావను ప్రశ్నించడానికి సిద్ధమైన బావమరిది!

Un Stoppable 2: బాలకృష్ణ వ్యాఖ్యాతగా ఆహాలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రసారమైనటువంటి అన్ స్టాపబుల్ కార్యక్రమం ఎలాంటి విజయం సాధించిందో మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమాల ద్వారా ఎంతో మంది సెలబ్రిటీలను ఆహ్వానించి వారిని తనదైన శైలిలో ప్రశ్నలు అడుగుతూ వారిని నుంచి ఎన్నో సమాధానాలను రాబట్టారు. ఇలా మొదటి సీజన్లో పెద్ద ఎత్తున సెలబ్రిటీలు ఈ వేదికపై సందడి చేశారు.

ఇక ఈ కార్యక్రమం మంచి విజయం అందుకోవడంతో ఈ కార్యక్రమానికి సీక్వెల్ గా సీజన్ 2 కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన స్పెషల్ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.త్వరలోనే ఈ కార్యక్రమం ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. ఇకపోతే ఈ సీజన్ 2 కి ఓ ప్రత్యేకత ఉంది.

మొదటి సీజన్లో కేవలం సినీ సెలబ్రిటీలను మాత్రమే ఆహ్వానించారు. కానీ రెండవ సీజన్లో మాత్రం రాజకీయ నాయకులని కూడా ఈ కార్యక్రమానికి తీసుకువచ్చే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు హాజరుకానున్నట్లు సమాచారం.

Un Stoppable 2: ముఖ్యఅతిథిగా మెగాస్టార్…

చంద్రబాబు నాయుడు స్వయాన బాలకృష్ణకు బావ కావడంతో తనని ఈ కార్యక్రమానికి తీసుకువచ్చే బాధ్యత బాలకృష్ణ తన భుజాలపై వేసుకున్నారని చంద్రబాబు నాయుడుని తనదైన శైలిలో ప్రశ్నించడానికి బాలకృష్ణ కూడా సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది.ఇదే కనుక నిజమైతే మొదటిసారి రాజకీయ నాయకులను కూడా ఇలాంటి టాక్ షోలకు తీసుకువచ్చిన ఘనత ఆహా కి మాత్రమే చెల్లుతుందని చెప్పాలి.ఇకపోతే సీజన్ 2 లో బాలకృష్ణ చిరంజీవి ఇద్దరు ఒకే వేదికపై సందడి చేయబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది.

Divyavani: టీడీపీలో మహిళలకు పదవులు రావాలంటే వ్యక్తిగత పనులు చేయాల్సిందే.. వైరల్ అవుతున్న దివ్యవాణి ఆడియో కాల్ లీక్ !

Divyavani: ఎన్నికలకు మరో రెండేళ్ల సమయం ఉండగానే ఇప్పటికే ఏపీ రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇప్పటికే అధికార ప్రతిపక్ష పార్టీలు ఒకరికొకరు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఉండగా టీడీపీలో పార్టీలో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా భగ్గుమంటున్నాయి. తాజాగా టీడీపీ పార్టీలో ఎంతో కీలకంగా వ్యవహరించిన నటి దివ్యవాణి ఈ పార్టీ నుంచి బయటకు వచ్చారు.

Divyavani: టీడీపీలో మహిళలకు పదవులు రావాలంటే వ్యక్తిగత పనులు కూడా చేయాల్సిందే.. దివ్యవాణి ఆడియో సంభాషణ వైరల్!

ఈ విధంగా ఈమె పార్టీని వదిలి బయటకు రావడమే కాకుండా టీడీపీ నేతలపై పలు ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు.ఈ క్రమంలోనే దివ్యవాణి మరొక టీడీపీ మహిళా నేతతో మాట్లాడిన ఫోన్ కాల్ సంభాషణ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే మరొక టీడీపీ మహిళా నేత దివ్యవాణికి ఫోన్ చేసి ఎందుకు మీరు పార్టీ నుంచి బయటకు వెళ్లారు అని ప్రశ్నించారు.

Divyavani: టీడీపీలో మహిళలకు పదవులు రావాలంటే వ్యక్తిగత పనులు కూడా చేయాల్సిందే.. దివ్యవాణి ఆడియో సంభాషణ వైరల్!

పెద్దాయన (చంద్రబాబు) తో కలిసి మీటింగ్ పెట్టిన తర్వాత నిర్ణయం తీసుకోవాల్సింది. ఈసారి గవర్నమెంట్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తొందరపడి నిర్ణయం తీసుకున్నావేమో అంటూ అవతలి మహిళ దివ్యవాణితో మాట్లాడారు. ఈ సందర్భంగా దివ్యవాణి సమాధానం చెబుతూ మీకు తెలిసినదే కదా నాకు పదవి ముఖ్యం కాదు.పార్టీ కోసం గత మూడున్నర సంవత్సరాల నుంచి ఎంతో కష్టపడ్డాను అయితే అక్కడ తనకు ఏమాత్రం గౌరవం లేదని దివ్యవాణి తెలిపారు.

పదవుల కోసం కుక్కల మాదిరి అందరి చుట్టూ తిరగాలి అంటే నేను చేయలేను ఒక లిమిట్ వరకు పనులు చేస్తున్నాం అంటూ ఈమె తెలిపారు. నన్ను పార్టీలో ఎవరో టార్గెట్ చేశారు అంటూ ఈమె పలు విషయాలను వెల్లడించారు. నేను రాజకీయాల కోసం బ్రతకడం లేదు. మేము పబ్లిక్ ఫిగర్స్ వంద మందికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది అంటూ దివ్యవాణి తెలిపారు.

కష్టపడే వారికి పార్టీలో ప్రాధాన్యత లేదు..

ఇకపోతే అవతల మహిళ మాట్లాడుతూ నా పదవి నీకు ఇస్తే తీసుకుంటావా అని ప్రశ్నించగా…అశోక్ బాబు, అచ్చెన్నాయుడు,జనార్థన్ ప్రస్తుతం రాజకీయం అంతా వీళ్ల చుట్టే ఉందన్నారు. వారి చెప్పినట్లే చేయాలి లేదంటే పదవులు ఎవరికి ఇవ్వరు. దివ్యవాణికి అంగన్వాడి పదవి బాధ్యతలు ఇవ్వాలన్నారు అంటూ మహిళా నేత చెప్పగా.. ఆమెపర్సనల్ పని చేయదు కదా అన్నారు అంటూ మహిళా నేత చెప్పగా దివ్యవాణి అంగన్వాడి పదవి ఇస్తే ఇలా బాడ్ పనులు చేయాలా అంటూ ప్రశ్నించారు. కష్టపడిన వాళ్ళకు పార్టీలో విలువ లేదని ఈ సందర్భంగా దివ్యవాణి అవతలి మహిళా నేతతో మాట్లాడిన ఈ సంభాషణ ప్రస్తుతం వైరల్ అవుతోంది.

TDP-Congress: మళ్లీ ఒక్కటైన టీడీపీ, కాంగ్రెస్..! కలిసి బరిలోకి..!

TDP-Congress: రాజకీయాల్లో ఎవరు ఎప్పుడు శత్రువులు, మిత్రులు ఉండరని చాలా సార్లు పెద్దలు చెబుతుంటారు. రాజకీయ విశ్లేషకులు కూడా ఇదే మాటను చెబుతూ వస్తున్నారు. ఈ విషయాన్ని ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే.. మొదటి నుంచి కూడా టీడీపీ, కాంగ్రెస్ ఒకరినొకరు పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనే విధంగా ఉన్నాయి.

TDP-Congress: మళ్లీ ఒక్కటైన టీడీపీ, కాంగ్రెస్..! కలిసి బరిలోకి..!

2019లో జరిగిన ఎన్నికల సమయంలో కూడా బద్ద శత్రువులుగా భావించిన ఈ రెండు పార్టీలు కలిసి పోయి మరీ పోటీ చేశాయి. ఇక ఇదే తరహా పంథాను త్వరలో అండమాన్ నికోబార్‌లో జరగనున్న మునిసిపల్, పంచాయతీ ఎన్నికల కోసం టీడీపీ, కాంగ్రెస్ చేతులు కలిపాయి.

TDP-Congress: మళ్లీ ఒక్కటైన టీడీపీ, కాంగ్రెస్..! కలిసి బరిలోకి..!

ఈ ఎన్నికల్లో ఇరు పార్టీలు కలిసి బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యాయి. దీనికి సంబంధించి ఏఎన్‌టీసీసీ అధ్యక్షుడు రంగలాల్ హల్దార్, టీడీపీ స్థానిక అధ్యక్షుడు మాణిక్యరావు యాదవ్ పోర్టు బ్లెయిర్‌లో గాంధీ భవన్‌లో సమావేశమయ్యారు.

ఎవరేం చేసినా అభివృద్ధి కోసమే అని..

ఈ నేపథ్యంలో ఈ విషయాలను వెల్లడించారు. అండమాన్ లో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ రెండు పార్టీలు కలిసి పోటీ చేసేందుకు నిర్ణయించామన్నారు. ఇక ఈ పొత్తులో భాగంగా మున్సిపాలిటీలోని వార్డులను పంచుకున్నారు. పోటీ చేసే అభ్యర్థులు ఏ పార్టీ నుంచి చేయాలనే దానిపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. పోర్టు బ్లెయిర్ మునిసిపాలిటీలోని 2, 5, 16 వార్డుల్లో టీడీపీ పోటీ చేస్తుందన్నారు. ఇక్కడ వచ్చేనెల 6వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి.. మార్చి 8న ఫలితాలు వెలువడనున్నాయి. ఇదే సమావేశంలో రంగలాల్ హల్దార్ మాట్లాడుతూ.. ఎవరేం చేసినా అభివృద్ధి కోసమే అని.. ప్రజాస్వామ్యయుత పాలన కోసం తాము టీడీపీతో కలిసి పోటీ చేసేందుకు బరిలో దిగనున్నామన్నారు. తమను ప్రజలు ఆదరించాలని కోరారు.