Tag Archives: Veera Simha Reddy

Veera Simha Reddy: బాలయ్య వీర సింహ సినిమాలో ఛాన్స్ మిస్ చేసుకుని బాధపడుతున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్..?

Veera Simha Reddy: సాధారణంగా హీరో హీరోయిన్లు సినిమా స్టోరీ నచ్చిన తర్వాతనే ఆ సినిమాలలో నటించడానికి అంగీకరిస్తారు. కొన్ని సందర్భాలలో సినిమా స్టోరీ నచ్చక లేక ఇతర కారణాలవల్ల కొన్ని సినిమాలలో నటించకుండా రిజెక్ట్ చేస్తారు. అయితే ఇలా వారు రిజెక్ట్ చేసిన సినిమాలు వేరొకరు చేసి ఆ సినిమా హిట్ అయితే అనవసరంగా మిస్ చేసుకున్నామని వారు తప్పకుండా బాధ పడతారు.

తాజాగా సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన అనుష్క శెట్టి కూడా వచ్చిన అవకాశాన్ని వదులుకొని బాధపడుతున్నట్లు తెలుస్తోంది. సూపర్ సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అనుష్క శెట్టి ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందింది. ఇక బాహుబలి సినిమాలో ప్రభాస్ సరసన నటించి పాన్ ఇండియా హీరోయిన్ గా క్రేజ్ సొంతం చేసుకుంది. అయితే చాలాకాలంగా అనుష్క సినిమాలకు దూరంగా ఉంటుంది.

ఇక ప్రస్తుతం ఆమె చేతిలో కేవలం ఒకే ఒక్క సినిమా ఉంది. కొందరు దర్శకులు ఆమె కోసం ప్రత్యేకంగా కథ తయారు చేసుకుని వెళ్లినా కూడా ఆమె సున్నితంగా తిరస్కరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా ఇటీవల అనుష్క తనకి వచ్చిన అవకాశాలు అన్నింటిని రిజెక్ట్ చేస్తూ వస్తుంది. తాజాగా బాలకృష్ణ హీరోగా నటించిన వీరసింహారెడ్డి సినిమాలో కూడా అనుష్కకి అవకాశం వచ్చింది. అయితే అనుష్క ఆ ఆఫర్ ని రిజెక్ట్ చేయడంతో అనుష్క స్థానంలో మలయాళీ బ్యూటీ హనీ రోజ్ బాలకృష్ణ సరసన నటించిన. మొట్టమొదటిసారిగా వీర సింహారెడ్డి సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన హనీ రోజ్ పాత్ర ఈ సినిమాలో అద్భుతంగా ఉంది.

Veera Simha Reddy: సున్నితంగా సినిమాను రిజెక్ట్ చేసిన అనుష్క…

ఈ సినిమాలో మొదట హనీ రోజు స్థానంలో అనుష్కని సంప్రదించగా ఆమె కారణం చెప్పకుండా ఆఫర్ ని రిజెక్ట్ చేయటంతో ఆ తర్వాత హనీ రోజ్ ఆ పాత్రలో నటించింది. ఈ సినిమాలో హనీ రోజ్ పాత్ర మంచి గుర్తింపు వచ్చింది. అయితే వీర సింహారెడ్డి సినిమాలో బాలకృష్ణ సరసన నటించే అవకాశం వచ్చినా కూడా అనుష్క దానిని తిరస్కరించి ఇప్పుడు బాధపడుతున్నట్లు తెలుస్తోంది.

Prabhas: అన్నయ్యతో కలిసి వీరసింహారెడ్డి సినిమా చూసిన ప్రభాస్.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Prabhas: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ తాజాగా ఏఎంబి సినిమాస్ లో సందడి చేశారు.సంక్రాంతి పండుగ సందర్భంగా బాలకృష్ణ చిరంజీవి నటించిన సినిమాలు విడుదలైన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రభాస్ తన అన్నయ్య ప్రమోద్ తో కలిసి హైదరాబాదులోని ఏఎంబి మల్టీప్లెక్స్ లో బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమాను చూశారు.

ఇలా థియేటర్లో తన అన్నయ్యతో కలిసి సినిమా వీక్షిస్తున్నటువంటి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమా జనవరి 12 వతేదీ విడుదల అయ్యి ప్రేక్షకులను సందడి చేస్తుంది. ఈ క్రమంలోనే ప్రేక్షకులు అభిమానులతో పాటు సినీ సెలబ్రిటీలు కూడా ఈ సినిమాలను థియేటర్లకు వెళ్లి వీక్షిస్తున్నారు.

ఈ క్రమంలోనే ప్రభాస్ కూడా వీరసింహారెడ్డి సినిమాని చూశారు. ఇక ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే రాదే శ్యామ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ప్రభాస్ బాక్స్ ఆఫీస్ వద్ద చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నారు. ఇక ఈయన ప్రస్తుతం వరుస సినిమా షూటింగులతో ఎంతో బిజీగా ఉన్నారు.

Prabhas: వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్…

ఈ క్రమంలోనే ప్రభాస్ ప్రస్తుతం సలార్, ప్రాజెక్టుకే సినిమా షూటింగులతో బిజీగా ఉన్నారు. ఇక ఈయన నటించిన ఆది పురుష్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. త్వరలోనే స్పిరిట్ సినిమా షూటింగ్ పనులను ప్రారంభించుకోనుంది. ఇలా వరుస సినిమాలతో ప్రభాస్ ఎంతో బిజీగా ఉన్నారు.

Balakrishna: వీర సింహారెడ్డి ప్రీరిలీజ్ వేడుకలో బాలయ్య ధరించిన వాచ్ ధర తెలిస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే!

Balakrishna: నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమయ్యారు. అఖండ వంటి బ్లాక్ బస్టర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాలకృష్ణ జనవరి 12వ తేదీ వీరసింహారెడ్డి సినిమా ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇక ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు కూడా ఏర్పడ్డాయి.

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ శృతిహాసన్ జంటగా నటించిన ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల కానుంది. ఇకపోతే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా బాలకృష్ణ ఎంతో సాంప్రదాయ బద్ధంగా ధోతి గోల్డ్ కలర్ బ్లేజర్ ధరించి ఈ కార్యక్రమానికి హాజరవడంతో అందరి దృష్టి ఈయన డ్రెస్ పై పడింది. అదేవిధంగా బాలకృష్ణ ధరించిన వాచ్ కూడా అందరిని ఎంతగానో ఆకట్టుకుంది.

ఈ క్రమంలోనే బాలయ్య ధరించిన ఈ వాచ్ ఖరీదు ఎంత అనే విషయం గురించి అభిమానులు ఆరా తీస్తున్నారు. అయితే బాలకృష్ణ ఈ సినిమా వేడుకలో ధరించిన వాచ్ కార్టియర్ కి చెందినది ఈ వాచ్ ధర అక్షరాల రూ.24,58,987 అని ఉండడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు.

Balakrishna: బాలయ్యకు గిఫ్టుగా ఇచ్చిన బ్రాహ్మణి


బాలకృష్ణ ధరించిన వాచ్ ఖరీదు అన్ని లక్షల అని ఆశ్చర్యపోతున్నారు. అయితే కార్టియర్ సాంటోస్ 100 స్కెలెటన్ పేరుతో ఉన్న ఈ వాచ్ ను బాలకృష్ణకు తన పెద్ద కుమార్తె బ్రాహ్మిని గిఫ్ట్ గా ఇచ్చారని తెలుస్తోంది. ఇలా బాలయ్య వాచ్ ధర తెలిసి అభిమానులతో పాటు నేటిజన్ లు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి కొన్ని గంటలలో వీర సింహారెడ్డి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో తెలియాల్సిందే.

Waltair Veerayya -Veera Simha Reddy: వాల్తేరు వీరయ్య VS వీర సింహారెడ్డి…. సంక్రాంతి విజయం ఎవరిది?

Waltair Veerayya -Veera Simha Reddy: సంక్రాంతి పండుగ వచ్చిందంటే సినిమాల సందడి మామూలుగా ఉండదు. సంక్రాంతి పండుగ సందర్భంగా పెద్ద ఎత్తున సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తూ ఉంటాయి.అయితే చాలా సంవత్సరాలు తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోలుగా కొనసాగుతున్నటువంటి చిరంజీవి బాలకృష్ణ మధ్య పెద్ద ఎత్తున పోటీ ఏర్పడింది. ఈ సంక్రాంతికి వీరిద్దరీ సినిమాలు పోటీకి సై అంటున్నాయి.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో చిరంజీవి హీరోగా వాల్తేరు వీరయ్య బాలకృష్ణ హీరోగా వీరసింహారెడ్డి అనే సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ రెండు సినిమాలలో శృతిహాసన్ హీరోయిన్ గా నటించిన విశేషం. ఇప్పటికే ఈ రెండు సినిమాల ప్రీ రిలీజ్ వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి. ఇద్దరు హీరోల అభిమానుల మధ్య కూడా తీవ్ర స్థాయిలో పోటీ ఏర్పడింది.

ఈ సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా 88 కోట్ల రూపాయల బిజినెస్ జరుపుకోగా బాలయ్య వీర సింహారెడ్డి సినిమా 73 కోట్ల బిజినెస్ జరుపుకుంది. ప్రీరిలీజ్ బిజినెస్ పరంగా చూసుకుంటే చిరంజీవి ముందు వరుసలో ఉన్నారు. అయితే ఈ సినిమాల ఫలితం పై వీరి ముందు సినిమాల ప్రభావం కూడా చూపుతుందని పలువురు ట్రేడ్ వర్గాల నిపుణులు చెబుతున్నారు.

Waltair Veerayya -Veera Simha Reddy: సంక్రాంతి బరిలో సై అంటున్న మెగా నందమూరి హీరోలు…

ఈ క్రమంలోనే చిరంజీవి ముందుగా నటించిన ఆచార్య సినిమా డిజాస్టర్ గా నిలిచింది. అనంతరం వచ్చిన గాడ్ ఫాదర్ పాజిటివ్ టాక్ వచ్చిన పెద్దగా వసూలు రావట్లేదు అయితే బాలకృష్ణ విషయంలో అఖండ మాత్రం బ్లాక్ బాస్టర్ గా నిలిచింది.ఇక బాలకృష్ణ అన్ స్టాపబుల్ కార్యక్రమంలో ద్వారా కూడా మంచి పాజిటివ్ ఒపీనియన్ కలిగి ఉన్నారు.మొత్తానికి ఈ సంక్రాంతి కానుకగా ఈ ఇద్దరు హీరోల సినిమాలు పోటీపడి ప్రేక్షకుల ముందుకు రావడంతో ఈ సినిమాలపై అభిమానులు కూడా ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ సంక్రాంతి ఎవరికి విజయం అందిస్తుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి ఉండాలి.

Honey Rose: వీర సింహారెడ్డి సినిమాలో నటించిన నటి హనీ రోజ్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

Honey Rose: బాలకృష్ణ గోపీచంద్ మలినేనీ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం వీర సింహారెడ్డి.ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒంగోలులో ప్రీ రిలీజ్ వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించారు.

ఇక ఈ కార్యక్రమంలో చిత్ర బృందం మొత్తం పాల్గొన్నారు. ఈ వేదికపై బాలయ్య ఒక నటితో కలిసి మలయాళంలో మాట్లాడటంతో ఆమె ఈ కార్యక్రమంలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఇంతకీ ఆమె ఎవరు ఏంటి అని నేటిజన్స్ ఆరా తీస్తున్నారు. ఇలా బాలకృష్ణతో మలయాళంలో మాట్లాడి సందడి చేసిన నటి హనీ రోజ్ ఈమె వీరసింహారెడ్డి సినిమాలో మా బావ మనోభావాలు అనే పాటలో బాలకృష్ణతో కలిసి సందడి.

ఈ సినిమాలో హాని రోజ్ కీలక పాత్రలో కూడా నటించినట్టు సమాచారం. హనీ కేరళలో పుట్టి పెరిగింది. ఈమె 14 సంవత్సరాల వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. మొదట్లో పలు అడపాదడపా పాత్రలలో నటించిన హనీ రోజ్ 2012లో రిలీజైన ‘త్రివేంద్రం లాడ్జ్’ అనే సినిమాతో హానీ రోజ్ కు బ్రేక్ వచ్చింది. అప్పటినుంచి పలు సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తూ సందడి చేశారు. ఇక తెలుగులో ఈమె వీరసింహారెడ్డి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు అనుకుంటే పొరపాటే.

Honey Rose: 14 ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీలోకి వచ్చిన హనీ రోజ్….


ఈమె వీర సింహారెడ్డి సినిమా కన్నా ముందుగా.. ఆలయం, ఈ వర్షంసాక్షిగానే సినిమాలలో నటించారు. అయితే ఈ రెండు సినిమాలు పెద్దగా తనకు గుర్తింపు తీసుకురాలేదు. అయితే ఇప్పుడు బాలయ్య నటించిన వీర సింహారెడ్డి సినిమా ద్వారా ఈమె మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అయితే ఈ సినిమాలో హనీ రోజ్ కీలకపాత్రలో నటించారు మరి ఈ సినిమా తనకు ఎలాంటి గుర్తింపు తీసుకువస్తుందో వేచి చూడాలి.

Dil Raju: వారసుడు విషయంలో విజయం సాధించారుగా.. దిల్ రాజుకు అండగా సీనియర్ నిర్మాతలు!

Dil Raju: సాధారణంగా సంక్రాంతి పండుగ వచ్చిందంటే సినిమాల జాతర ఉంటుంది. ఈ క్రమంలోనే వచ్చే ఏడాది సంక్రాంతి పండుగకు పెద్ద ఎత్తున సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి ముఖ్యంగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి మధ్య పెద్ద ఎత్తున పోటీ ఏర్పడింది.ఈ క్రమంలోనే తెలుగు నిర్మాత మండలి సంక్రాంతి పండుగకు కేవలం తెలుగు సినిమాలకు మాత్రమే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి అంటూ ప్రెస్ నోట్ విడుదల చేసింది.

ఇలా నిర్మాత మండలి తెలుగు సినిమాలకే ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పడంతోనే దిల్ రాజు వారసుడు సినిమాకు థియేటర్లో ఇవ్వద్దని చెప్పకనే చెప్పేశారు. ఇలా వారసుడు విషయం గురించి తెలుగు చిత్ర పరిశ్రమలో కాస్త వివాదాలు చోటు చేసుకున్నాయి. అయితే ఈ సమస్యను వదిలేయకుండా ఆ సమస్యపై ఆయన మాట్లాడకుండా ఆయన స్నేహితులు నోరు విప్పడంతో ఈ వివాదంలో చివరికి దిల్ రాజు విజయం సాధించారు.

నిర్మాత మండలి కేవలం తెలుగు సినిమాలకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పడంతో సీనియర్ నిర్మాతలైనటువంటి అశ్వినీ దత్ అల్లు అరవింద్ వంటి వారు ఈ విషయంపై నోరు విప్పారు.పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు విడుదల అవుతుంటే ఇక్కడ భాషతో కొట్లాడుకోవడం సరికాదు కంటెంట్ ఉన్న సినిమాలు ఎలా విడుదల చేసిన సక్సెస్ సాధిస్తాయి అంటూ వాదించారు.

Dil Raju: సంక్రాంతి బరిలో పోటికి దిగిన వారసుడు…

ఈ విధంగా అల్లు అరవింద్ మాట్లాడటంతో చివరికి నిర్మాత మండలి తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని వారసుడు సినిమా విడుదలకు కూడా అనుమతి తెలిపారు. దీంతో సంక్రాంతి బరిలో వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి సినిమాలతో పాటు వారసుడు కూడా గట్టి పోటీకి దిగబోతున్నారు.ఈ క్రమంలోనే ఈ సినిమా విడుదల విషయాన్ని కూడా దిల్ రాజు ప్రకటించారు. అయితే ఈ మూడు సినిమాలు ఒకేసారి విడుదల కావడంతో అభిమానులలో సైతం ఎంతో ఆసక్తి నెలకొంది.