Nayanatara -Vignesh Shivan: దక్షిణాది సిని ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నయనతార పెళ్లి తర్వాత కూడా పలు సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే నయనతార చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇందులో ఈమె చిరంజీవికి చెల్లెలి పాత్రలో నటించారు. అదేవిధంగా బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ సినిమాలో కూడా నయనతార నటిస్తున్నారు.
ఈ సినిమా ఇప్పటికి విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది అయితే సెప్టెంబర్ 7వ తేదీ ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు. ఇందులో భాగంగా నయనతార ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్నటువంటి ఈ సినిమా ద్వారా నయనతార బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు.
ఈ క్రమంలోనే ఈ సినిమా నుంచి ఈమె ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయగా ఇందులో నయనతార కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని చేతిలో గన్ పట్టుకొని ఫుల్ యాక్షన్ మోడ్ లో ఉన్నారు. ఇక ఈ ఫోటోని విగ్నేష్ శివన్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ నయనతారపై ప్రశంశల వర్షం కురిపించారు. షారుక్ ఖాన్ అభిమానిగా ఆయన అన్ని సినిమాలు చూస్తూ వచ్చావు అయితే ప్రస్తుతం ఆయనతోనే కలిసి ప్రధాన పాత్రలో నటిస్తుండడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.
నిన్ను ఇలా చూస్తుంటే చాలా గర్వంగా ఉంది నువ్వు ఎందరికో స్ఫూర్తిగా నిలిచావు. నిన్ను చూస్తుంటే నేను మాత్రమే కాకుండా మన ఫ్యామిలీ మొత్తం ఎంతో గర్వపడుతుంది అంటూ విగ్నేష్ నయనతార పట్ల ప్రశంశలు కురిపిస్తూ చేసినటువంటి ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ సినిమాలో షారుక్ ఖాన్ హీరోగా నటించగా విలన్ పాత్రలో కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.
Nayanatara: సౌత్ సినీ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా కొనసాగుతున్నటువంటి నయనతార ప్రస్తుతం తన వ్యక్తిగత జీవితంలో చాలా సంతోషంగా గడుపుతున్నారు.నటిగా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందినటువంటి ఈమె ఒక భార్యగా తల్లిగా కూడా ప్రమోట్ అయ్యి తన వ్యక్తిగత జీవితంలో చాలా సంతోషంగా ఉన్నారని చెప్పాలి.
ఈమె హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలో ప్రభుదేవాతో పాటు నటుడు శింబుతో ప్రేమ ప్రయాణం నడిపించారు. అనంతరం వీరి ప్రేమ బ్రేకప్ కావడంతో దర్శకుడు విగ్నేష్ శివన్ తోప్రేమలో పడటం అనంతరం కొంతకాలం పాటు రిలేషన్ లో ఉన్నటువంటి వీరిద్దరూ ఎట్టకేలకు గత ఏడాది జూన్ 9వ తేదీ వివాహం చేసుకున్నారు.
ఇలా వివాహం చేసుకున్నటువంటి ఈ దంపతులు పెళ్లి జరిగినటువంటి నాలుగు నెలలకే సరోగసి ద్వారా ఇద్దరు కవల మగ పిల్లలకు జన్మనిచ్చారు.ఇలా సరోగసి ద్వారా తల్లిదండ్రులు కావడంతో ఈ విషయం అప్పట్లో పెద్ద ఎత్తున వివాదంగా మారింది. అయితే అందుకు సంబంధించిన అన్ని వివరాలను నయనతార దంపతులు ప్రభుత్వానికి సమర్పించడంతో ఈ వివాదం ముగిసిందని చెప్పాలి.
Nayanatara: వారే నా జీవితం…
ఈ విధంగా ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చినటువంటి నయనతార ప్రస్తుతం ఆ పిల్లలతో ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె తన పిల్లల గురించి మాట్లాడుతూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా నయనతార మాట్లాడుతూ పిల్లలను నా గర్భంలో పెంచకపోయిన తాను అమ్మతనాన్ని ఆస్వాదిస్తున్నానని తెలిపారు. వారు నా జీవితంలోకి వచ్చిన తర్వాత జీవితమే మారిపోయిందని వారితోనే రోజు మొదలై వారితోనే నా రోజు ముగుస్తుంది అంటూ ఈ సందర్భంగా నయనతార ఎమోషనల్ అవుతూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి..
Vignesh Shivan: సౌత్ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు పొందిన నయనతార వివాహం తర్వాత కూడా వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది. నయనతార లవ్ ఎఫైర్స్ గురించి అనేక వార్తలు వినిపించాయి. కొంతకాలం హీరో శింబుతో ప్రేమాయణం నడిపిన నయనతార ఆ తర్వాత అతనికి బ్రేకప్ చెప్పి ప్రభుదేవని ప్రేమించి పెళ్లి పీటల వరకు వెళ్ళింది. అయితే కొన్ని కారణాలవల్ల ప్రభుదేవాతో పెళ్లి రద్దు చేసుకొని చాలాకాలం ఒంటరిగా మిగిలిపోయింది.
కొంతకాలానికి డైరెక్టర్ విగ్నేష్ శివన్ తో ప్రేమలో పడింది. దాదాపు ఆరు సంవత్సరాలుగా ప్రేమించుకున్న వీరిద్దరూ గతేడాది మూడుముళ్ల బంధంతో ఒకటయ్యారు. ఇక ఇటీవల సరోగసి పద్ధతి ద్వారా కవల పిల్లలకు జన్మనిచ్చి తల్లిదండ్రులుగా మారారు. ఇదిలా ఉండగా తాజాగా విగ్నేష్ శివన్ నయనతార తో తన ప్రేమ మొదలైన క్షణాల గురించి వివరించాడు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న విఘ్నేష్ శివన్ మాట్లాడుతూ.. “డైరక్టర్ గా నా మొదటి సినిమా పోడా పోడి.
మొదటి సినిమాతోనే పరాజయం ఎదురయింది. ఆ తర్వాత జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆ సమయంలో “నేనూ రౌడీనే” సినిమా కథ రాశాను. ధనుష్ కి కథ నచ్చటంతో ఆయనే నిర్మాతగా మారాడు అంటూ విగ్నేష్ వెల్లడించాడు. ఆ తర్వాత నయనతార ని కలిసి కథ చెప్పమని ధనుష్ పంపించాడు. అయితే నయనతార అంగీకరించదేమో అని నజ్రియాని హీరోయిన్గా తీసుకుందామని భావించాను.
Vignesh Shivan: కెరవాన్ దగ్గరకు కూడా వెళ్లలేదు…
ధనుష్ చెప్పాడని నయన్ దగ్గరికి వెళితే ఆమె నన్ను ఎంతో గౌరవించింది. ఆ క్షణమే నేను నయన్ తో ప్రేమలో పడిపోయా అంటూ విగ్నేష్ చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత సినిమా షూటింగ్ ప్రారంభమైన సెకండ్ షెడ్యూల్ నుంచే మేము డేటింగ్ లో ఉన్నాం. కానీ మా ప్రేమ గురించి ఎవరికీ తెలియకుండా చాలా జాగ్రత్త పడ్డాను. మేము డేటింగ్ లో ఉన్న తర్వాత కూడా నయన్ ని మేడం అనే పిలిచేవాడిని. అంతేకాకుండా ఆమె కెరవాన్ దగ్గరికి కూడా ఎప్పుడు వెళ్లలేదు. ఇలా చాలా కాలం మా ప్రేమని రహస్యంగా ఉంచాము అంటూ విఘ్నేష్ వెల్లడించాడు.
Vignesh Shivan: ప్రముఖ తమిళ హీరో అజిత్ గురించి తెలియని వారంటూ ఉండరు. కోలీవుడ్ లో మాత్రమే కాకుండా టాలివుడ్ లో కూడా అజిత్ కి మంచి ఫాలోయింగ్ ఉంది. అజిత్ నటించిన ఎన్నో సినిమాలు తెలుగులో కూడా డబ్ చేసి విడుదల చేశారు. దీంతో టాలివుడ్ లో కూడా అజిత్ కి మంచి మార్కెట్ ఉంది. ఇదిలా ఉండగా ఇటీవల తునీవు సినిమా ద్వారా అజిత్ మంచి హిట్ అందుకున్నాడు.
ఆ సినిమా తర్వాత నెక్స్ట్ సినిమా అప్డేట్ గురించి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో అజిత్ నెక్ట్స్ సినిమా డైరెక్టర్ విఘ్నేష్ శివన్తో ఉండబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. అయితే కొంత కాలానికి ఈ సినిమాకు విఘ్నేష్ శివన్ ని తొలగించి అతని స్థానంలో మగిజ్ తిరుమేనిని దర్శకుడిగా నిర్మాతలు ఎంపికచేశారు . అంతే కాకుండా విఘ్నేష్ కూడా తన ట్విట్టర్ ఖాతా నుంచి ఈ సినిమాకు సంబంధించిన ట్వీట్ తొలగించాడు.
ఇలా చేయడంతో అజిత్ సినిమా నుండి విఘ్నేష్ ని తొలగించటం కోలీవుడ్ ఇండస్ట్రీలో చర్చంశనీయంగా మారింది. తాజాగా ఈ సినిమా నుండి తనని తొలగించటం గురించి విగ్నేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న విగ్నేష్ ఈ సినిమా నుండి తనను తప్పించడానికి గల కారణాల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఈ ఇంటర్వ్యూలో విగ్నేష్ మాట్లాడుతూ….
Vignesh Shivan: నిర్మాతలకు నచ్చలేదు…
” ఈ సినిమాకి నేను రాసిన స్క్రిప్ట్ అజిత్ కి బాగా నచ్చింది. కానీ స్టోరీలో సెకండ్ పార్ట్ నిర్మాతలకు నచ్చలేదు. అయితే ఈ స్టోరీ అజిత్ కి నచ్చినా కూడా నిర్మాతలకు నచ్చకపోవడంతో ఈ సినిమా ఆగిపోయింది. ఈ సినిమా ఆగిపోవటానికి నిర్మాతలే కారణం అంటూ విష్నేష్ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Nayanatara: దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్రతారగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె గత కొన్ని సంవత్సరాలుగా దర్శకుడు విగ్నేష్ తో ప్రేమలో ఉంటూ గత ఏడాది జూన్ 9వ తేదీ తనని ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు. అయితే వీరి వివాహం జరిగిన నాలుగు నెలలకే కవల పిల్లలకు సరోగసి ద్వారా జన్మనిచ్చారు.
ఇలా తల్లిదండ్రులుగా మారిన నయనతార దంపతులు ప్రస్తుతం తన పిల్లల ఆలనా పాలన చూసుకుంటూనే మరోవైపు సినిమా షూటింగ్ పనులలో బిజీగా మారిపోయారు. అయితే పిల్లలు పుట్టిన తర్వాత నయనతార దంపతులు మొదటిసారి తమకుల దైవం ఆలయానికి వచ్చారు.
ఈ క్రమంలోనే ఈ దంపతులు కుంభకోణం సమీపంలో కులదైవం మేలవళత్తూర్ ఆట్రంగరై శ్రీ కాంచి కామాక్షి అమ్మవారి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలను చేయించారు. అయితే గుడిలోకి నయనతార దంపతులు వచ్చారనే విషయం తెలియగానే పెద్ద ఎత్తున అభిమానులు అక్కడికి చేరుకొని గోల చేశారు. కనీసం పూజ కూడా ప్రశాంతంగా చేసుకోనివ్వకుండా గోల చేశారు.
Nayanatara: మేము కూడా పూజ కోసమే వచ్చాము…
ఇలా అభిమానులు గోల చేయడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన నయనతార ఒక్కసారిగా ఆలయం గేటు వద్దకు వచ్చి అభిమానులపై మండిపడ్డారు.మేము కూడా పూజ కోసమే వచ్చాం ఐదు నిమిషాలు ఆగితే పూజ పూర్తి అవుతుంది కనీసం ఐదు నిమిషాలు ఎదురు చూడలేరా అంటూ అభిమానులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇలా నయనతార వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉండగా అనంతరం విగ్నేష్ వచ్చి వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు వైరల్ అవుతున్నాయి.
Nayanatara: దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్రతారక దాదాపు రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇలా ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్నటువంటి సౌత్ హీరోయిన్ గా ఈమె రికార్డ్ సృష్టించారు. నయనతార దాదాపు పది కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.
ఇకపోతే నయనతార గత కొన్ని సంవత్సరాలుగా డైరెక్టర్ విగ్నేష్ శివన్ ప్రేమలో ఉన్న విషయం మనకు తెలిసిందే ఇలా కొంతకాలంగా వీరిద్దరూ సహజీవనం చేస్తూ గత ఏడాది జూన్ నెలలో వివాహం చేసుకున్నారు. ఇక వివాహమైనటువంటి నాలుగు నెలలకే ఈ దంపతులు పండంటి కవల పిల్లలకు సరోగసి ద్వారా జన్మనిచ్చి తల్లిదండ్రులుగా మారిపోయారు.
ఇలా పిల్లలు పుట్టిన తర్వాత నయనతార తన సినిమా షూటింగ్ పనులతో పిల్లలతోనూ ఎంతో బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం ఈమె బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ తో కలిసి కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో జవాన్ సినిమాలో నటిస్తున్నారు.ఇలా సినిమాలతో బిజీగా ఉంటూనే తల్లిగా బాధ్యతలు కూడా ఎంతో చక్కగా నిర్వర్తిస్తున్నారు.
Nayanatara: ప్రాణం… ప్రపంచం
ఇక నయనతార విగ్నేష్ దంపతులు ఇదివరకు తమ పిల్లల ఫోటోలను అభిమానులతో పంచుకున్నప్పటికీ ఇప్పటివరకు వారి ఫేస్ మాత్రం రీవీల్ చేయలేదు. అయితే తాజాగా నయనతార విగ్నేష్ దంపతులు తమ పిల్లల పూర్తి పేర్లను ప్రకటించారు. ఇక వారి పెద్ద కుమారుడి పేరు ఉయిర్ రుద్రోనీల్ ఎన్ శివన్ కాగా రెండవ కుమారుడు పేరు ఉలగ్ దైవిక్ ఎన్ శివన్. నిజానికి వీరు పుట్టినప్పుడే ఉయిర్, ఉలగం అని చెప్పారు. ఇక తమిళంలో ఉయిర్ అంటే ప్రాణం అని, ఉలగం అంటే ప్రపంచం అని అర్థం.
Nayanathara -Vignesh Shivan: ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచినటువంటి నయనతార విగ్నేష్ దంపతులు గురించి అందరికీ తెలిసిందే.పెళ్లయిన నాలుగు నెలలకే కవల పిల్లలకు జన్మనివ్వడంతో పెద్ద ఎత్తున ఈ విషయం విభాగంగా మారింది. ఈ క్రమంలోనే సరోగసికి సంబంధించిన అన్ని వివరాలను ప్రభుత్వానికి సమర్పించడంతో ఈ వివాదం కాస్త సద్దుమణిగింది.
ఇలా కవల పిల్లలకు జన్మనిచ్చిన నయనతార దంపతులు ఎన్నో వివాదాలు ఎదుర్కొన్న అనంతరం మొదటిసారిగా తన పిల్లలతో కలిసి దీపావళి పండుగను జరుపుకున్నారు.ఈ క్రమంలోనే నయనతార దంపతులు ఇద్దరు వారి పిల్లలను ఎత్తుకొని ఎక్కడ తన పిల్లల మొహాలు కనపడకుండా జాగ్రత్త పడుతూ సాంప్రదాయ దుస్తులలో ఈ పండుగను జరుపుకున్నట్టు తెలుస్తుంది.
ఈ క్రమంలోనే పిల్లలతో కలిసి వీరు అభిమానులకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ సందర్భంగా విగ్నేష్ శివన్ ఇంస్టాగ్రామ్ ద్వారా ఒక వీడియోని షేర్ చేస్తూ.. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ప్రతి సందర్భంలోనూ అందరూ సంతోషంగా ఉండాలి జీవితంలో ఎలాంటి ఆటంకాలు ఎదురైనా వాటిపై పోరాడండి.
Nayanathara -Vignesh Shivan: ప్రేమలో విశ్వాసం అవసరం…
ప్రేమ జీవితంలో ఎంతో ఆనందాన్ని ఇస్తుంది.. ప్రేమలో విశ్వాసం,మంచితనం ఎల్లప్పుడూ ఉండాలంటూ ఈ సందర్భంగా విగ్నేష్ నయనతార తన పిల్లలతో కలిసి దిగినటువంటి వీడియోనిషేర్ చేస్తూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జూన్ 9వ తేదీ వివాహం చేసుకున్న ఈ దంపతులు అక్టోబర్ 9వ తేదీ కవల పిల్లలకు జన్మనిచ్చారంటూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే.
Nayanathara-Vignesh Shivan: చంద్రముఖి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నయనతార గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సౌత్ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు పొందిన నయనతార నాలుగు నెలల క్రితం విగ్నేష్ శివన్ అనే తమిళ దర్శకున్ని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆరు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్న వీరిద్దరూ ఇటీవల వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.
వీరి వివాహం జరిగినప్పటి నుండి ఇద్దరు ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటున్నారు. తాజాగా సరోగసి పద్ధతి ద్వారా కవల పిల్లలకు జన్మనిచ్చిన ఈ దంపతులపై తమిళనాడు ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. నిబంధనలకు వ్యతిరేకంగా నయనతార దంపతులు పెళ్లయిన నాలుగు నెలలకే ఇలా సరోగసి ద్వారా పిల్లలకు జన్మనివ్వడంతో తీవ్రదుమారం రేపుతుంది.
విచారణలో భాగంగా తమకి ఆరు సంవత్సరాల క్రితమే పెళ్లి అయినట్లు దంపతులు ప్రభుత్వానికి తెలియజేశారు. అంతేకాకుండా ఏడాది క్రితమే సరోగసి కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు కూడా వెల్లడించారు.
అయితే నయన్ విగ్నేష్ రిజిస్ట్రేషన్ పెళ్లికి సంబంధించిన ఆధారాలతో పాటు ఏడాది క్రితం సరోగసి కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు ఆధారాలను ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంది.
Nayanathara-Vignesh Shivan: ఆధారాలు సమర్పించని నయన్ దంపతులు…
ప్రస్తుతం ఈ ఆధారాలు సంపాదించే పనిలో నయన్ దంపతులు ఉన్నారు. అయితే ఈ విషయంలో నయన్ దంపతులు ప్రభుత్వానికి ఆధారాలు సమర్పించలేదని… ఈ విషయంలో వీరిద్దరితో పాటు సరోగసికి సహకరించిన మరో వ్యక్తికి కూడా జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వివాదం నుండి నయనతార దంపతులు ఎలా బయటపడతారో చూడాలి మరి.
Nayanathara – Vignesh Shivan: సౌత్ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు పొందిన నయనతార గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చంద్రముఖి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నయనతార అటు తమిళ్ తెలుగు భాషలలో స్టార్ హీరోల సరసన నటించి తన ఆనందం, అభినయంతో బాగా ఆకట్టుకుంది.కెరీర్ ప్రారంభంలో గ్లామర్ పాత్రలలో నటించిన నయనతార ప్రస్తుతం నటనకు ప్రాధాన్యత ఉన్న వైవిధ్యమైన పాత్రలలో నటిస్తూ లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది.
తమిళ దర్శకుడు విగ్నేష్ శివన్ తో ప్రేమలో పడిన నయనతార ఇటీవల అతన్ని పెళ్లి చేసుకుని వివాహ బంధంలోకి అడుగు పెట్టింది. వివాహం జరిగిన దగ్గరినుండి వీరిద్దరూ ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటూ ఉన్నారు. తాజాగా ఈ జంట మరొకసారి వివాదంలో నిలిచింది. సరోగసి పద్ధతి ద్వారా కవల పిల్లలకు జన్మనిచ్చిన నయనతార దంపతులు చట్టానికి విరుద్ధంగా పిల్లలకు జన్మనిచ్చినట్లు వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ క్రమంలో నయనతార తన పెళ్లికి సంబంధించిన ఒక పెద్ద ట్విస్ట్ రివిల్ చేసింది.సరోగసి ద్వారా ఏ విధంగా పిల్లల్ని కన్నారనే విషయాలకు సంబంధించి పూర్తి ఆధారాలను విగ్నేష్ నయన్ దంపతులు ప్రభుత్వానికి అందజేసినట్లు సమాచారం. ఈ క్రమంలో వీరిద్దరికి ఆరు సంవత్సరాల క్రితమే రిజిస్టర్ మ్యారేజ్ జరిగిందని ఆధారాలు కూడా సమర్పించినట్లు తెలుస్తోంది. అయితే గతేడాది డిసెంబర్ నెలలో పిల్లల కోసం సరోగసి రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు నయన్ విగ్నేష్ దంపతులు ఆధారాలు సమర్పించినట్లు తెలుస్తోంది.
Nayanathara -Vignesh Shivan: ఆరు సంవత్సరాల క్రితమే వివాహం…
వీరిద్దరూ ఇలా చట్టప్రకారం ఆరు సంవత్సరాల క్రితమే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొని దాదాపు ఏడాది క్రితం సరోగసి కోసం రిజిస్టర్ చేసుకున్నట్లు పక్క ఆధారాలు ఉండటంతో వీరు ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించలేదని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా వీరిద్దరూ ఆరు సంవత్సరాల క్రితమే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న విషయం బయటపడటంతో ఇంతకాలం ఈ విషయాన్ని దాచి ఉంచినందుకు అభిమానులు షాక్ లో ఉన్నారు.
Nayanathara -Vignesh Shivan: నయనతార విగ్నేష్ దంపతులు పెళ్లయినప్పటి నుంచి ఏదో ఒక వివాదం ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు.తాజాగా ఈ దంపతులు కవల పిల్లలకు జన్మనిచ్చామంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయడంతో ఈ వ్యవహారం కాస్త తీవ్ర వివాదంగా మారింది.నయనతార దంపతులు కవలలకు జన్మనిచ్చామని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఈమె ప్రెగ్నెంట్ అయిన దాఖలాలు కూడా లేవు అలాగే తను పెళ్లి చేసుకొని నాలుగు నెలలు మాత్రమే అయింది. ఇలా పిల్లలకు జన్మనివ్వడం ఎలా సాధ్యమైంది అంటూ కామెంట్ చేశారు.
అయితే నయనతార విగ్నేష్ పెళ్లికి ముందే సరోగసి విధానం ద్వారా పిల్లలను ప్లాన్ చేసినట్టు స్పష్టం అవుతుంది.ఇక ఈ విషయంపై నటి కస్తూరి 2022 నుంచి ఇండియాలో సరోగసి విధానాన్ని బ్యాన్ చేశారంటూ చేసిన ట్వీట్ తీవ్ర దుమారం రేపింది.ఇలా ఈమె నయనతార విగ్నేష్ పేర్లు ప్రస్తావించకపోయిన వారి గురించే ఇలాంటి ట్వీట్ చేశారనీ అభిమానులు మండిపడ్డారు.
ఇకపోతే ఈ విషయంపై ఏకంగా తమిళనాడు ప్రభుత్వం కూడా స్పందించడంతో ఈ వివాదం మరింత ముదిరింది.సాధారణంగా సరోగసి విధానం ద్వారా పిల్లలకు జన్మనివ్వలంటే వారి పెళ్లి జరిగే ఐదు సంవత్సరాలు పూర్తి అయి ఉండాలి అలాగే పిల్లలు కోసం దంపతులలో ఎవరికైనా ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు మాత్రమే డాక్టర్ల ధ్రువీకరణ పత్రంతో సరోగసి విధానంలో పిల్లలను కనడానికి ఎలాంటి అభ్యంతరాలు లేవు.
కానీ నయనతార విగ్నేష్ పెళ్లి జరిగి కేవలం నాలుగు నెలలు మాత్రమే అయింది. ఈ క్రమంలోనే వారు ఎలాంటి దృవీకరణ పత్రాన్ని సమర్పించకపోవడంతో ఈ విషయంపై తమిళనాడు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి స్పందిస్తూ పిల్లలు విషయంలో ప్రభుత్వానికి క్లారిటీ ఇవ్వాలని నోటీసులు జారీ చేయడమే కాకుండా ఈ విషయంపై స్పెషల్ ఎంక్వైరీకి ఆదేశాలు జారీ చేసింది.ఈ ఎంక్వైరీలో భాగంగా నయనతార దంపతులది తప్పు అని తెలిస్తే పెద్ద ఎత్తున ఈ దంపతులకు శిక్ష పడే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది.
Top Telugu website in the world | Telugu Gossips | Breaking News Headlines, Latest Andhra News, Telangana News, India News, World News – Telugudesk.net