Tag Archives: vignesh

Nayanatara -Vignesh: నయనతార విగ్నేష్ ఎప్పటికీ విడిపోరు… అదిరిపోయే ప్లాన్ వేసిన డైరక్టర్!

Nayanatara -Vignesh: సినీ నటి నయనతార ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తే ఎంతో బిజీగా ఉన్నారు. ఈమె ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 20 సంవత్సరాలు అవుతున్నప్పటికీ వరుస సినిమా అవకాశాలను అందుకుంటు ఈమె కెరియర్ పరంగా ఎంతో బిజీ అయ్యారు. ఇలా హీరోయిన్గా ఒక వైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు వ్యాపారవేత్తగా ఎన్నో బిజినెస్లను ప్రారంభించి వ్యాపార వ్యవహారాలను కూడా చూసుకుంటూ ఉన్నారు.

ఈ విధంగా హీరోయిన్గా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి నయనతార డైరెక్టర్ విగ్నేష్ శివన్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. దంపతులకు ఇద్దరు కవల మగ పిల్లలు కూడా ఉన్నారు. ప్రస్తుతం తన బిడ్డల ఆలనా పాలన చూసుకుంటూనే మరోవైపు నయనతార సినిమాలలోనూ అలాగే వ్యాపార సంస్థలను కూడా ఎంతో విజయవంతంగా ముందుకు నడిపిస్తున్నారు.

ఇలా తన జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతున్నటువంటి నయనతార విడాకులు తీసుకోబోతుంది అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలు వైరల్ అవుతున్నటువంటి తరుణంలో నయనతార విగ్నేష్ ఇద్దరు కూడా ఎంతో సంతోషంగా ఉన్నటువంటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఆస్తులను నష్టపోవాల్సిందేనా..
ఇక వీరిద్దరి వ్యవహారం గురించి పలువురు సినీ విశ్లేషకులు స్పందిస్తూ వీరిద్దరూ అసలు విడిపోయే అవకాశాలు ఏమాత్రం లేవని స్పష్టం చేశారు. వీరిద్దరూ సినిమా ఇండస్ట్రీలో బిజీగా ఉంటూ వ్యాపారాలను కూడా నిర్వహిస్తున్నారు అయితే ఈ వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టాలని ఆలోచన ఇచ్చిందే విగ్నేష్. అంతేకాకుండా ఈ వ్యాపార సంస్థలన్నీటికి కూడా నయనతార ఆస్తుల ద్వారానే పెట్టారు అంతేకాకుండా ఆయన ఫౌండర్ గాను సీఈఓ గాను వ్యవహరిస్తున్నారు. కనుక భవిష్యత్తులో వీరిద్దరూ విడిపోతే నయనతార భారీ మొత్తంలో ఆస్తి నష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది అందుకే వీరిద్దరూ విడిపోయే అవకాశం లేదని తెలుస్తోంది.

Nayanathara -Vignesh: నయన్ విగ్నేష్ కవలల విషయంలో తప్పని తెలిస్తే శిక్ష తప్పదా.. ఎలాంటి శిక్ష పడుతుందో తెలుసా?

Nayanathara -Vignesh: ప్రస్తుతం సోషల్ మీడియా వార్తల్లో ఏదైనా హాట్ టాపిక్ ఉందా అంటే అది నయనతార విగ్నేష్ శివన్ కవల పిల్లల విషయం అని చెప్పాలి.నయనతార విగ్నేష్ గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమలో ఉండి ఈ ఏడాది జూన్ నెలలో పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే.అయితే పెళ్లయిన నాలుగు నెలలకే ఈ దంపతులు తల్లిదండ్రులు అయ్యారంటూ ఆదివారం పిల్లలతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేశారు.

ఈ క్రమంలోనే ఒక్కసారిగా ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పెళ్లయిన నాలుగు నెలలకే పిల్లలు పుట్టడం ఏంటి అసలు నయనతార ఎప్పుడు ప్రెగ్నెంట్ అయింది అంటూ కామెంట్ లు చేస్తున్నారు.ఈ క్రమంలోనే నయనతార విగ్నేష్ సరోగసి ద్వారా పెళ్లికి ముందే పిల్లలను ప్లాన్ చేశారని తెలుస్తోంది.

ఇక ఈ విషయంపై కొందరు తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తం చేయగా ఏకంగా తమిళనాడు ప్రభుత్వం వీరిపై ఎంక్వయిరీకి ఆదేశాలు కూడా జారీచేస్తుంది.వీరు సరోగసి ద్వారా పిల్లలను కన్నట్టు ఎక్కడ చెప్పకపోవడంతో పెద్ద ఎత్తున వివాదాలు తలెత్తాయి. అయితే వీళ్ళు కనుక సరోగసి విధానంలో నిబంధనలను పాటించకపోయి ఉంటే తప్పనిసరిగా వీరికి చట్టపరమైన చర్యలు తప్పవంటూ పలువురు భావిస్తున్నారు.

Nayanathara -Vignesh: ఊచలు లెక్క పెట్టాల్సిందేనా..

ఇకపోతే సరోగసి ద్వారా పిల్లలను కనడానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి వివాహమైన తర్వాత ఐదు సంవత్సరాల వరకు పిల్లలు కలగని నేపథ్యంలో సరోగసి పద్ధతి ద్వారా పిల్లలకు జన్మనివ్వవచ్చు. అలాగే వైద్య పరమైన అనారోగ్య సమస్యలు కనుక ఉంటే ఈ సరోగసి పద్ధతి ద్వారా పిల్లలకు జన్మనివ్వవచ్చు అలా కాకుండా ఈ నిబంధనలను ఉల్లంగించిన వారికి 10 సంవత్సరాలు జైలు శిక్షతోపాటు 10 లక్షల అపరాధం కూడా విధించనున్నారు. మరి నయనతార విషయంలో తప్పు అని తేలితే కనుక వీరికి కూడా ఈ శిక్ష తప్పదా అంటూ కొందరు సందేహాలను వ్యక్తపరుస్తున్నారు.

Nayanathara: నయనతార తల్లి కాబోతుందా… విగ్నేష్ పోస్ట్ వెనుక అర్థం అదేనా… వైరల్ అవుతున్న న్యూస్!

Nayanathara:లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగుతున్న ఈమె వివాహం తర్వాత కూడా ఏ మాత్రం తగ్గకుండా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఇకపోతే నయనతార గత ఏడు సంవత్సరాల నుంచి దర్శకుడు విగ్నేష్ ప్రేమలో ఉన్నారు. ఇలా ఏడు సంవత్సరాలు పాటు ప్రేమలో ఉన్నటువంటి ఈ జంట ఈ ఏడాది ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు.

ఇలా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన ఈ జంట కొత్త జీవితంలో సంతోషంగా గడపడమే కాకుండా మరోవైపు సినిమా షూటింగ్ లతో కూడా బిజీగా ఉన్నారు. ఇక సినిమా షూటింగుల సమయంలో ఏమాత్రం ఖాళీ సమయం దొరికిన వెంటనే విదేశీ పర్యటనలకు వెళుతూ ఎంతో సంతోషంగా గడుపుతున్నారు.ఇదిలా ఉండగా వీరికి సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని విగ్నేష్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు.

ఈ క్రమంలోనే తాజాగా ఈయన సోషల్ మీడియా వేదికగా చేసిన ఒక పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. విగ్నేష్ ముగ్గురు పిల్లలతో కలిసి ఆడుకుంటూ ఉన్నటువంటి ఒక ఫోటోని షేర్ చేయడమే కాకుండా పిల్లలతో టైం స్పెండ్ చేస్తున్నాం… భవిష్యత్తులో ప్రాక్టీస్ అవుతుంది అంటూ క్యాప్షన్ పెట్టారు. ఇలా ఈయన పిల్లలతో ఫోటో షేర్ చేస్తూ ఇలాంటి క్యాప్షన్ పెట్టడంతో నయనతార తల్లి కాబోతున్నారా అందుకే ఇలాంటి పోస్ట్ షేర్ చేశారా అనే సందేహం అందరిలోనూ కలుగుతుంది.

Nayanathara: నయనతార నిజంగానే తల్లి కాబోతున్నారా…

ఈ క్రమంలోనే ఈ పోస్ట్ చూసిన కొందరు శుభాకాంక్షలు తెలియజేయడం గమనార్హం. నిజంగానే నయనతార తల్లి కాబోతున్నారా అనే విషయంపై ప్రతి ఒక్కరు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజము ఉందో తెలియాల్సి ఉంది. ఇదే కనుక నిజమైతే అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు.

Nayanathara: బుర్జ్ ఖలీఫా వద్ద భర్త పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరిపిన నయనతార.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Nayanathara: లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రస్తుతం తన వైవాహిక జీవితాన్ని ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు. గత ఏడు సంవత్సరాల నుంచి దర్శకుడు విగ్నేష్ ప్రేమలో ఉన్నటువంటి ఈమె ఈ ఏడాది జూన్ నెలలో తన భర్తను ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు. వీరి వివాహం తర్వాత నయనతార ఒకవైపు సినిమాలలో నటిస్తూనే తనకు ఏ మాత్రం విరామం దొరికిన విదేశాలకు వెళ్తూ భర్తతో కలిసి ఎంజాయ్ చేస్తుంది.

ఈ క్రమంలోనే నయనతార దంపతులు ప్రస్తుతం దుబాయ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక దుబాయ్ పర్యటనలో ఉన్నటువంటి ఈమె తన భర్త విగ్నేష్ పుట్టినరోజు కావడంతో తన భర్తకు సర్ప్రైజ్ పార్టీ అరేంజ్ చేశారు. దుబాయిలో అత్యంత అందమైనటువంటి
బుర్జ్ ఖలీఫా దగ్గర తన భర్త పుట్టినరోజు వేడుకలను ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేశారు. ఇలా తన భర్త వేడుకలలో భాగంగా విగ్నేష్ తల్లి ఆయన సోదరుడు కూడా పాల్గొన్నారు.

ఇలా దుబాయ్ లో విగ్నేష్ కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుక జరుపుకోవడమే కాకుండా పెద్ద ఎత్తున టపాసులు పేలుస్తూ ఈయన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇక ఈ పుట్టిన రోజు సందర్భంగా విగ్నేష్ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేశారు. స్వచ్ఛమైన ప్రేమను అందించి నా కుటుంబంతో పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నాను. నా ప్రియమైన వారందరితో కలిసి బుర్జ్ ఖలీఫా కింద నా భార్య కలలు కనే పుట్టినరోజు…ఇంతకన్నా గొప్పది ఏది ఉండదు ఇలా నా జీవితంలో ఆనందమైన క్షణాలను అందించినందుకు భగవంతునికి ధన్యవాదాలు అంటూ ఈయన ఎమోషనల్ పోస్ట్ చేశారు.

Nayanathara: జవాన్ సినిమాతో బిజీగా ఉన్న నయనతార..

ఈ విధంగా నయనతార తన భర్తకు పుట్టినరోజు వేడుకలు నిర్వహించినటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హీరో షారుక్ ఖాన్ తో కలిసి జవాన్ అనే సినిమాలు నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ద్వారా ఈమె బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇలా వివాహం తర్వాత కూడా ఈమె సినిమాలు చేస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు.

Nayan – Vignesh : నయన్ – విగ్నేష్ జంట సింప్లిసిటీ చూసి ఫిదా అవుతున్న నెటిజన్లు…

Nayan – Vignesh : నయన్ విగ్నేష్ లు వారి ప్రేమకు స్వస్తి చెప్పేసి జున్ 9 న వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. వీరి పెళ్లి మొదట స్వామి వారి సన్నిధి తిరుమలలో చేసుకోవాలి అనుకున్నా, కొన్ని కారణాల వలన మార్చుకున్నారు. కానీ వివాహం అనంతరం తిరుమల చేరుకొని దర్శనం చేసుకున్నారు. ఆ తరువాత కూడా పుణ్యక్షేత్రలను సందర్శిస్తూ మొక్కులు చెల్లించుకుంటున్నారు. మామూలుగా సెలబ్రిటీలు జనంలోకి వెళ్ళడానికి ఆలోచిస్తారు, అందులోను కొత్తగా పెళ్ళైన జంట అభిమానుల మధ్యలోకి వెళ్లడం వారితో సెల్ఫీలు దిగడం ఇలాంటి వాటికి దూరంగానే వుంటారు. అయితే నయన్ – విగ్నేష్ లు దీనికి విరుద్ధంగా చేస్తూ అందరిని ఆకర్షస్తున్నారు.

లోకల్ రెస్టారెంట్లో సందడి చేస్తూ….

ఈ జంట తిరుమల దర్శనం అనంతరం ఇటీవలనే కేరళలోని చెట్టికులంగర దేవిని దర్శించుకున్నారు. ఇద్దరూ స్టార్ డమ్ వున్న సెలబ్రిటీలు అయినప్పటికీ పెళ్లి తరువాత చాలా విరుద్దంగా ఇంకా సింప్లిసిటీతో మెలుగుతున్నారు. చాలా పురాతణమైన, వివిధ రూపాలలో భక్తులకు దర్శనమిచ్చే కేరళలోని చెట్టికులంగర దేవిని దర్శించుకున్న తరువాత కేరళలోని లోకల్ రెస్టారెంట్లలో వంటలు రుచి చూసారట.

చాలా సింపుల్ గా లోకల్ రెస్టారెంట్లకు వెళ్లడం, అక్కడ వంటలను రుచి చూడటం అందరిని ఆకట్టుకుంటోంది. అక్కడి అభిమానులతో సరదాగా గడుపుతూ సెల్ఫీలకు ఫోజులు కూడా ఇచ్చారు. వీరి సింప్లిసిటీని చూసిన నెటిజెన్లు వీరిద్దరి జంట మీద ప్రశంసలు కురిపిస్తున్నారు.

Nayanathara -Vignesh Wedding : నయనతార విగ్నేష్ పెళ్లికి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదా.. మరి ఖర్చు ఎవరిదో తెలుసా?

Nayanathara -Vignesh Wedding :లేడీ సూపర్ స్టార్ నయనతార విగ్నేష్ వివాహం జూన్ 9వ తేదీ ఎంతో ఘనంగా జరిగిన విషయం మనకు తెలిసిందే. కేవలం అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. వీరి వివాహం కోసం మహాబలిపురంలోని ఒక రిసార్ట్ వేదికగా మారింది.ఇలా మహాబలిపురంలో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్న ఈ జంట పెళ్లి కోసం కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఉంటారని అందరూ భావించారు.

Nayanathara -Vignesh Wedding : నయనతార విగ్నేష్ పెళ్లికి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదా.. మరి ఖర్చు ఎవరిదో తెలుసా?

పెళ్లి కోసం రిసార్ట్స్ ఎంతో అందంగా ముస్తాబు చేశారు. భోజనాల దగ్గర నుంచి అతిథుల గదుల వరకు కూడా అన్ని ఎంతో ఘనంగా ఉండేలా ఏర్పాట్లు చేశారు. ఇలా ఎంతో ఘనంగా జరుపుకున్న ఈ వివాహానికి కోట్ల రూపాయలు ఖర్చుకావడం సర్వ సాధారణం. అయితే ఈ పెళ్లికి అయిన ఖర్చు మొత్తం నయనతార విగ్నేష్ మాత్రం భరించలేదట. వీరిద్దరూ వీరు పెళ్లి కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని తెలుస్తోంది.

Nayanathara -Vignesh Wedding : నయనతార విగ్నేష్ పెళ్లికి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదా.. మరి ఖర్చు ఎవరిదో తెలుసా?

ఇక పెళ్లి కోసం వీరిద్దరూ రూపాయి ఖర్చు చేయకుండా ఇంత ఘనంగా ఎలా పెళ్లి చేసుకున్నారనే విషయానికి వస్తే… వీరి పెళ్లిని ప్రముఖ డిజిటల్ మీడియా నెట్ ఫ్లిక్స్ కి అమ్మిన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే వీరి పెళ్లి ఖర్చులన్ని కూడా నెట్ ఫ్లిక్స్ భరించి ఉందని తెలుస్తోంది. పెళ్లి కోసం మేకప్ ఆర్టిస్టుల నుంచి సెక్యూరిటీ సిబ్బంది, వచ్చిన అతిథులకు గదులు భోజనాలు వంటి సదుపాయాలు వరకు అన్ని ఖర్చులను నెట్ ఫ్లిక్స్ భరించినట్లు తెలుస్తోంది.

ఖర్చులన్నీ భరించిన నెట్ ఫ్లిక్స్ …

నయనతార పెళ్లి కోసం నెట్ ఫ్లిక్స్ సుమారు 25 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్లు సమాచారం. ఇక వీరి వివాహాన్ని ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ పర్యవేక్షణలో చిత్రీకరించారు. ఇలా నయనతార విగ్నేష్ పెళ్లి ఖర్చులను నెట్ ఫ్లిక్స్ భరించడంతో వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు బయటకు రాకుండా ఎంతో జాగ్రత్తపడ్డారు. ఇకపోతే త్వరలోనే పెళ్లి వీడియో నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం కానుంది.నయనతార విగ్నేష్ పెళ్లి గురించి వస్తున్న ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాలంటే ఈ విషయంపై నయనతార దంపతులు స్పందించాల్సి ఉంది.