Tag Archives: vijayawada

Samantha: దేవుని దయవల్ల విజయవాడలో ఇడ్లీ స్టాల్ పెట్టుకొని పరిస్థితి రాలేదు… సమంత షాకింగ్ కామెంట్స్!

Samantha: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూ ఉన్నటువంటి సమంత ప్రస్తుతం ఏడాది పాటు సినిమాలకు విరామం ప్రకటించారు. అయితే ఈమె నటించిన ఖుషి సినిమా ప్రమోషన్లలో మాత్రం పాల్గొంటున్నారు. తాజాగా ఖుషి సినిమా మ్యూజిక్ కన్సర్ట్ కార్యక్రమంలో భాగంగా సమంత పాల్గొన్న సంగతి మనకు తెలిసిందే. ఈ కార్యక్రమంలో సమంతా లైవ్ పెర్ఫార్మన్స్ ఇచ్చి సందడి చేశారు.

ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా సమంత మాట్లాడుతూ ఎన్నో విషయాలను తెలియచేశారు. ఈ సినిమా తనకు ఎంతో అద్భుతంగా నచ్చిందనీ ముఖ్యంగా పాటలు చాలా అద్భుతంగా ఉన్నాయని తెలిపారు మీ అందరితో పాటు తాను కూడా ఒకటవ తేదీ ఈ సినిమా చూడటానికి ఎదురుచూస్తున్నానని వెల్లడించారు.

ఇక తన ఆరోగ్యం గురించి కూడా మాట్లాడుతూ ప్రస్తుతం చాలా హార్డ్ వర్క్ చేస్తున్నానని పూర్తి ఆరోగ్యంతో మీ ముందుకు తిరిగి వస్తాను అంటూ కూడా తన ఆరోగ్యం గురించి తెలియజేశారు అయితే ఈ కార్యక్రమంలో సమంతా మాట్లాడుతూ దేవుడు దయవల్ల తనకు విజయవాడ సెంటర్లో ఇడ్లీ స్టాల్ పెట్టుకునే పరిస్థితి ఇంకా రాలేదని తెలియజేశారు. అయితే ఉన్నఫలంగా సమంత ఇలాంటి కామెంట్స్ చేయడానికి కారణం ఏంటి అని ఆరాతీస్తున్నారు.

Samantha: సమంతను విమర్శించారా…


సమంత అనారోగ్యంగా ఉన్న సమయంలో తన గురించి ఎవరైనా ఇలాంటి విమర్శలు చేశారా అందుకే వారికి కౌంటర్ ఇచ్చే క్రమంలోనే సమంత ఈ వేదికపై తనకు ఇంకా అలాంటి పరిస్థితి రాలేదు అంటూ కామెంట్స్ చేశారా అన్న సందేహాలు కలుగుతున్నాయి ఏది ఏమైనా తన పట్ల విమర్శలు చేస్తున్నటువంటి వారికి ఈ మధ్య కాలంలో సమంత ఘాటుగానే సమాధానం చెబుతున్నారు. ప్రస్తుతం సమంత చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Preethi Nigam: ఆ ఊరికి వెళితే నన్ను కొడతామని చెప్పారు… బుల్లితెర నటి ప్రీతినిగమ్ కామెంట్స్ వైరల్!

Preethi Nigam: ఈటీవీలో ప్రసారమైన ఎన్నో సీరియల్స్ లో లేడీ విలన్ గా నటించి ప్రేక్షకులకు దగ్గరైన సీనియర్ నటి ప్రీతి నిగమ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఋతురాగాలు సీరియల్ ద్వారా నటిగా అడుగుపెట్టిన ప్రీతి ఆ తర్వాత వరుస సీరియల్స్ లో సినిమాలలో నటిస్తూ నటిగా మంచి గుర్తింపు పొందింది. ఇప్పటికీ సీరియల్స్ లో నటిస్తూ బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోంది.

ఇదిలా ఉండగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రీతి నిగమ్ తన జీవితంలో జరిగిన సంఘటనల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఈ క్రమంలో విలన్ పాత్రలలో నటించటం గురించి ప్రీతినిగమ్ స్పందించింది. ఈ క్రమంలో ప్రీతి నిగమ్ మాట్లాడుతూ.. ” సీరియల్స్ లో అన్ని పాత్రల కన్నా విలన్ పాత్రలో నటించడం చాలా కష్టం అని తెలిపింది . విలన్ పాత్రలలో నటించటం వల్ల ఎదురైన ఇబ్బందుల గురించి మాట్లాడుతూ…” ఒకసారి విజయవాడలో హోటల్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఆఫీస్ బాయ్ నా వైపు ఏదోలా చూశాడు.

అతను అలా చూస్తుంటే మొదట భయపడ్డాను. ఆ తర్వాత ఎందుకలా చూస్తున్నావు అని అతన్ని అడిగితే.. ‘ మీరు ఆ సీరియల్లో చేశారు కదా.. ఇంట్లో మా నానమ్మ రోజు మిమ్మల్ని తిడుతూ ఉంటుంది’ అని చెప్పాడు. ఆ తర్వాత ఒకసారి వైజాగ్ వెళ్లడానికి ట్రైన్ లో ఎక్కినప్పుడు ఒక ఆవిడ దగ్గరకు వచ్చి’ మీరు మా ఊరు రావద్దండి. అక్కడికి వస్తే మా వాళ్ళు మిమ్మల్ని కొడతారు ‘ అని చెప్పింది అంటూ ప్రీతి తెలిపింది.

Preethi Nigam:ప్రేక్షకులు వార్నింగ్ ఇచ్చేవారు…

ఇలాంటి సంఘటనలు ఎదురైనప్పుడు నా పాత్ర వారికి అంతగా కనెక్ట్ అయ్యిందని సంతోషించేదాన్ని అంటూ ప్రీతి తెలిపింది. ఇక ప్రీతి నటించిన కావ్యాంజలి సీరియల్ లోని తన పాత్రకు నేషనల్ అవార్డు కూడా దక్కించుకుంది. అలాగే తన భర్త, కుమారుడి గురించి కూడా ఈ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించింది. తనకోసం, తన కొడుకు కోసం భర్త ఉద్యోగం వదులుకున్నాడని తెలిపింది.

Ashu Reddy: విజయవాడలో అంటూ లేటెస్ట్ ఫోటోలను షేర్ చేసిన అషు రెడ్డి… భారీగా ట్రోల్ చేస్తున్న నేటిజన్స్!

Ashu Reddy: అషు రెడ్డి పరిచయం అవసరం లేని పేరు. కాస్త సమంత పోలికలతో ఉండడంతో జూనియర్ సమంతగా ముద్ర వేయించుకున్న ఈమె ఏకంగా సమంతను మించి అందాలను ఆరబోస్తూ పెద్ద ఎత్తున అభిమానులను సొంతం చేసుకున్నారు.ఇలా సోషల్ మీడియా ద్వారా వచ్చిన పాపులారిటీతో ఏకంగా ఈమె రెండు సార్లు బిగ్ బాస్ అవకాశాన్ని అందుకున్నారు. ఇలా బిగ్ బాస్ ద్వారా మరింత మంది అభిమానులను సొంతం చేసుకున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చేసే రచ్చ మామూలుగా లేదని చెప్పాలి.

ఇలా సోషల్ మీడియా వేదికగా అషు రెడ్డి పెద్ద ఎత్తున గ్లామర్ షో చేస్తూ అభిమానులకు ఫుల్ ట్రీట్ ఇస్తున్నారు.ఈ క్రమంలోనే ఈమె అందాల ఆరబోతతో రెచ్చిపోవడంతో పెద్ద ఎత్తున నేటిజన్స్ ఈమె వ్యవహరి శైలిపై దారుణమైన కామెంట్లు చేస్తున్నారు. ఇలా తరచూ నెటిజన్స్ ట్రోలింగ్ కు గురైనప్పటికీ తాను ఏమాత్రం తగ్గేదిలే అంటూ తన గ్లామర్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వచ్చారు.

ఇక ఈమె డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మతో కలిసి చేసినటువంటి బోల్డ్ ఇంటర్వ్యూ ఒక్కసారిగా సోషల్ మీడియాలో సెన్సేషనల్ గా నిలిచింది. ఈ వీడియో ద్వారా ఎంతో పాపులర్ అయినటువంటి ఈమె తీవ్ర స్థాయిలో విమర్శలను కూడా ఎదుర్కొంది. అయితే అవేమి తనకు పట్టనట్టుగా యధావిధిగా తన అందాల ఆరబోతతో కుర్రకారులకు పిచ్చెక్కిస్తోంది.

Ashu Reddy: వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోస్…


ఇలా తరచూ సోషల్ మీడియాలో గ్లామర్ షో చేస్తూ రెచ్చిపోయే ఈ ముద్దుగుమ్మ తాజాగా తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫోటోలను షేర్ చేస్తూ గత రాత్రి విజయవాడలో అంటూ క్యాప్షన్ పెట్టారు. ఈ క్రమంలోనే ఈ ఫోటోలు వైరల్ గా మారడమే కాకుండా నేటిజన్ల ట్రోలింగ్ కు కూడా గురవుతున్నాయి. ఇక ఈమె ఫోటోలపై నేటిజన్స్ యధావిధిగా కామెంట్లు చేస్తున్నారు.

Actress Hema: టికెట్ కొనుక్కునే వచ్చాను.. మీడియాపై ఫైర్ అయిన నటి హేమ!

Actress Hema: టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న హేమ దుర్గాష్టమి సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మ వారిని దర్శించుకున్నారు. ఈ క్రమంలోనే అమ్మవారి దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఏడాది దుర్గాష్టమి రోజు అమ్మవారిని దుర్గమ్మగా దర్శనం చేసుకుంటున్నాను అయితే ఈ ఏడాది కూడా తనకు ఆ భాగ్యం కలిగినందుకు ఎంతో సంతోషంగా ఉందని వెల్లడించారు.

నా ప్రోటోకాల్ ప్రకారం ఈ రోజు అమ్మవారి దర్శనం కాదనుకున్నాను అయితే అమ్మవారి దర్శనం అయినందుకు చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా ఈమె మాట్లాడారు.ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా మీడియా మిత్రులకు ఈమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

నేరుగా అమ్మవారి దర్శనం చేసుకోలేనటువంటి భక్తులకు ఉదయం నుంచి సాయంత్రం వరకు లైవ్ లో అమ్మవారిని చూపిస్తున్నందుకు మీడియా బృందానికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ క్రమంలోనే అమ్మవారి ఆశీస్సులు మీపై కూడా ఉండాలని అలాగే ప్రతి ఒక్కరిపై అమ్మ ఆశీస్సులు ఉండాలని ఈమె మాట్లాడారు. ఇంతవరకు అంతా సవ్యంగా సాగినప్పటికీ ఓ జర్నలిస్టు ఈమెను ప్రశ్నించడంతో హేమా ఒక్కసారిగా ఆ వ్యక్తిపై ఫైర్ అయ్యారు.

Actress Hema: 20వేల పట్టు చీర తీసుకొచ్చా..

మీరు ఫోటోగ్రాల్ ప్రకారమే వచ్చానని చెబుతున్నారు ఇంతకీ టికెట్ కొనుక్కొని వచ్చారా అంటూ ప్రశ్నించారు.ఇలా జర్నలిస్టు అడిగేసరికి ఆగ్రహం కట్టలు తెంచుకున్న హేమ నేను అమ్మవారికి 20వేల రూపాయలు పట్టుచీర తెచ్చాను, అలాగే హుండీలో 10000 వేశాను. అలాగే టికెట్టు కూడా కొనుక్కొని వచ్చాను ఇప్పుడు ఎందుకు దీనిని ఇంత రాద్ధాంతం చేస్తున్నారంటూ పెద్ద ఎత్తున మీడియా ప్రతినిధులపై హేమ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Mokshagna: కుక్కలు అరుస్తుంటాయ్… కాలమే సమాధానం చెబుతుంది.. వైరల్ అవుతున్న మోక్షజ్ఞ ట్వీట్!

Mokshagna: విజయవాడలోనే హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడం పట్ల ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలలో ఒక్కసారిగా వేడి వాతావరణం నెలకొంది.ఈ క్రమంలోనే ఎన్టీఆర్ పేరు తొలగించి వైయస్సార్ పేరు పెట్టడం పట్ల ఎంతోమంది ఈ విషయంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీ నేతలు నందమూరి అభిమానులు పెద్ద ఎత్తున ఏపీ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు.

ఇదిలా ఉండగా గత రెండు రోజులుగా బాలకృష్ణ గురించి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో వైసిపి నేతల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఇలా తన తండ్రి గురించి పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో రంగంలోకి నందమూరి వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలోనే తన తండ్రి పై విమర్శలు చేసిన వారికి తనదైన శైలిలో స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఈ సందర్భంగా మోక్షజ్ఞ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. బాలయ్య గురించి గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో కుక్కలు మొరుగుతున్నాయి మీరు ఎంత అరిచిన కనీసం బాలయ్య వెంట్రుక కూడా పీకలేరు. ఒకప్పుడు అవసరముండి ఆయన కాళ్ల వద్దకు వచ్చిన వారందరూ అవసరం తీరిపోయాక ఆయనపై కారు కూతలు కూస్తున్నారు. ఇలాంటి కారు కూతలు కూసే వారికి కాలమే సమాధానం చెబుతుంది అంటూ మోక్షజ్ఞ చేసిన ఈ ట్విట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Mokshagna: భగ్గుమన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు..

ఇలా ఎన్టీఆర్ పేరు మార్చి వైయస్సార్ పేరు పెట్టడం పట్ల ఒకవైపు వైసీపీ నేతలు తెలుగుదేశం నేతలకు కౌంటర్ ఇవ్వగా తెలుగుదేశం నేతలు నందమూరి అభిమానులు పెద్ద ఎత్తున వైసిపి నేతలపై మండిపడుతున్నారు.మరి ఈ వివాదం ఇక్కడితో ఆగుతుందా లేకపోతే ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందా అనేది తెలియాల్సి ఉంది.

Anchor Anasuya: ఎన్నాళ్లకు మెడలో అది చూసాము.. అనసూయ పై మరోసారి రెచ్చిపోయిన ట్రోలర్స్!

Anchor Anasuya: బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. జబర్దస్త్ యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనసూయ వెండితెరపై అవకాశాలను అందుకొని ఇండస్ట్రీలో కూడా ఎంతో బిజీగా ఉన్నారు. అయితే గత వారం రోజుల నుంచి అనసూయ సోషల్ మీడియా వార్తల్లో నిలుస్తున్నారు.

విజయ్ దేవరకొండ నటించిన లైగర్ సినిమా ఫ్లాప్ కావడంతో ఈమె పరోక్షంగా విజయ్ దేవరకొండను ఉద్దేశిస్తూ చేసిన ట్వీట్ సంచలనం రేపింది.ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ అభిమానులతో పాటు నేటిజెన్లు సైతం అనసూయ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఇక ఈమెను ఏకంగా ఆంటీ అంటూ పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు.ఈ విధంగా తనని ఆంటీ అన్న వారిపై ఈమె కేసు వేస్తానంటూ ఏకంగా సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.

ఇలా నెటిజన్లతో తీవ్రస్థాయిలో గొడవకు దిగిన అనసూయ ఇక ఈ విషయంపై మర్చిపోయినప్పటికీ నెటిజెన్స్ మాత్రం అనసూయను ఇప్పటికి దారుణంగా ఆంటీ అంటూ పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు.ఇకపోతే తాజాగా అనసూయ విజయవాడలో తన ఫ్యామిలీతో కలిసి పలు పూజ కార్యక్రమాలలో పాల్గొన్నారు.ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ విజయవాడ అని క్యాప్షన్ పెట్టగా ఎంతోమంది నేటిజన్స్ ఈ ఫోటో పై స్పందిస్తూ వెల్కమ్ విజయవాడ ఆంటీ అంకుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Anchor Anasuya: తగ్గేదేలే అంటున్న నేటిజన్స్..

ఇలా అనసూయ పోస్ట్ పై స్పందించిన 80 శాతం మంది నేటిజన్స్ ఆమెను ఆంటీ అనే పదంతోనే కామెంట్ చేస్తూ చేస్తున్నారు. ఇక మరొక నెటిజన్ అయితే దారుణంగా ఎన్ని రోజులకు మీ మెడలో ఇలా తాళిబొట్టు చూసాము అంటూ కామెంట్ చేశారు.మొత్తానికి అనసూయ ఎన్ని కేసులు పెట్టిన నేటిజన్స్ మాత్రం తగ్గేదే అంటూ ఈమెను ఆంటీ అంటూ ట్రోల్ చేస్తున్నారు.

Actress Rambha: మనస్పర్ధల వల్ల విడాకుల వరకు వెళ్లిన రంభ.. వీరి కాపురాన్ని నిలబెట్టిన స్టార్ డైరెక్టర్?

Actress Rambha: నటి కిరీటి రాజేంద్రప్రసాద్ హీరోగా ఆ ఒక్కటి అడక్కు సినిమా ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు నటి రంభ. ఈమె స్వస్థలం విజయవాడ ఈమె అసలు పేరు విజయలక్ష్మి.ఇలా తెలుగమ్మాయిగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన రంభ మొదటి సినిమాతోనే ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా తర్వాత ఈమెకు తెలుగులో వరుస సినిమా అవకాశాలు వచ్చాయి.

ఇకపోతే రంభ ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే ఆగ్ర హీరోలైన చిరంజీవి బాలకృష్ణ వెంకటేష్ వంటి తదితర హీరోల సినిమాలలో నటించే అవకాశాన్ని అందుకున్నారు. ఇలా దాదాపు 7, 8 సంవత్సరాలు ఇండస్ట్రీలో అగ్రతారగా ఓ వెలుగు వెలిగిన రంభ కెనడాకు చెందిన ఓ ప్రముఖ వ్యాపారవేత్తతో ప్రేమలో పడి అతనిని పెళ్లి చేసుకుంది.

ఈ విధంగా ఈ దంపతులు చాలా సంవత్సరాల పాటు అన్యోన్యంగా ఉన్నారు. ఈ దంపతులకు ముగ్గురు సంతానం.భార్య భర్తలన్న తర్వాత వారి మధ్య గొడవలు రావడం సర్వసాధారణం అయితే ఇలాంటి గొడవలు వచ్చినప్పుడు సామరస్యంగా పరిష్కరించుకుంటే వారి వైవాహిక జీవితం ఎంతో సంతోషంతో గడిచిపోతుంది. కానీ తన భర్తతో వచ్చిన విభేదాల వల్ల రంభ ఏకంగా విడాకులు తీసుకొని విడిపోవాలని నిర్ణయం తీసుకుంది.

Actress Rambha: భవిష్యత్తు గురించి వివరించిన రాఘవేంద్రరావు…

ఈ క్రమంలోనే ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేసిన ఈమె ప్రతినెల భరణం కింద తనకు ఐదు లక్షల కావాలని పిటిషన్ లో పేర్కొన్నారు.ఇలా ముగ్గురు పిల్లల పోషణ భారం అవుతుందని ఈమె మరికొంత డబ్బును కూడా డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.ఈ విధంగా రంభ విడాకులు తీసుకొని విడిపోవడానికి సిద్ధమైందని తెలుసుకున్న ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ కె రాఘవేంద్రరావు రంభతో మాట్లాడి తనకు భవిష్యత్తు ఎలా ఉండబోతుందో వివరించారట. భర్తతో విడిపోయి ముగ్గురు పిల్లల పోషణ వారి భవిష్యత్తు చాలా ఇబ్బందికరంగా మారుతుందని చెప్పడమే కాకుండా భార్య భర్తల మధ్య ఈ చిన్నపాటి మనస్పర్ధలు సర్వసాధారణమే అని ఆయన నచ్చ చెప్పడం వల్ల రంభ విడాకులు వెనక్కి తీసుకుందని సమాచారం. ఇలా రాఘవేంద్రరావు రంభ వైవాహిక జీవితాన్ని నిలబెట్టారని తెలుస్తోంది.

ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తానంటూ బెదిరించి.. శారీరకంగా దగ్గరయ్యాడు..

ఆమె సోషల్ మీడియాలో తన ప్రోడక్ట్స్ ను ప్రమోట్ చేస్తూ వ్యాపారం చేస్తుండేది. ఈ క్రమంలో ఆమెకు ఓ యువకుడు పరిచయం అయ్యాడు. చాటింగ్ చేస్తూ..ప్రేమ పేరుతో దగ్గర అయ్యాడు. ఫుల్ గా అతడు ఆమెను ట్రాప్ చేసి.. తన న్యూడ్ ఫొటోలను ఆమె పంపించేలా తనని మాయ చేశాడు. తర్వాత తనను పెళ్లి చేసుకోవాలని ఆమె అతడిని నిలదీసింది.

అతడు దానిని పట్టించుకోకుండా.. న్యూడ్ ఫొటోలతో బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణాజిల్లా విజయవాడ సమీపంలోని పెనమలూరు మండలం కానూరుకు చెందిన యువతికి తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాకు చెందిన చింతలపల్లికి చెందిన సులేమాన్ తో ఆన్ లైన్ లో పరిచయం ఏర్పడింది.

అది కాస్త ప్రేమగా మారి.. మరింత దగ్గరయ్యాడు. పెళ్లి కూడా చేసుకుంటానని అతడు ఆమెను నమ్మించి శారీరకంగా దగ్గరయ్యాడు. అప్పటి నుంచి పెళ్లి చేసుకోవాలని ఎన్ని సార్లు అడిగినా దాట వేస్తూ వచ్చాడు. చివరకు ఓ రోజు తనను పెళ్లి చేసుకోవాలని నిలదీసింది.

తనను పెళ్లి, గిల్లీ అంటూ వెంటపడితే తన దగ్గర ఉన్న న్యూడ్ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తానంటూ బెదిరించాడు. ఇలా అతడు బెదిరింపులకు దిగుతూ.. ఆమెకు వచ్చే సంబంధాలను కూడా చెడగొడుతూ ఉన్నాడు. ఇక ఆ వేధింపులు భరించలేక ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

భార్యను చిత్రహింసలకు గురిచేసిన శాడిస్టు భర్త.. దేని కోసమో తెలుసా..

విజయవాడకు చెందిన జ్యోత్స్న ఎంబీఏ పూర్తి చేసి బెంగళూరులో ఉద్యోగం చేస్తుంది. అక్కడనే సుశాంత్ చౌదరి అనే యువకుడు ప్రేమ పేరుతో వెంటపడ్డాడు. ఆమె దానికి అంగీకరించలేదు. కానీ తర్వాత అతడు చనిపోతానని బెదిరించడంతో ఆమె అతడి ప్రేమకు లొంగడం తప్పలేదు. దీంతో ఇద్దరు కలిసి ఓ రోజు నెల్లూరులోని కామాక్షి దేవాలయంలో దండలు మార్చుకొని.. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు.

విషయం ఆ యువతి తల్లిదండ్రులకు తెలవడంతో విజయవాడలోనే బంధువలందరినీ పిలిపించి ఘనంగా రిసెప్షన్ చేయించారు. అతడికి బాగానే కట్నకానుకలు కూడా ముట్టజెప్పారు. తర్వాత బెంగళూరుకు వెళ్లి అక్కడే కాపురం పెట్టారు. తర్వాత కొన్నాళ్లకు నెల్లూరుకు వచ్చి అతడి తల్లిదండ్రులతో కలిసి ఉన్నారు. అప్పటి నుంచి ఆమెకు వేధింపులు ఎక్కువ అయ్యాయి.

ఇంట్లో లంకెబిందెలు ఉన్నాయని.. అవి దక్కాలంటే తనకు పుట్టే పిల్లల్ని బలివ్వాలంటూ చెప్పాడు ఓ మాంత్రికుడు. దీంతో ఆమెను భర్త, అత్త, ఆడబిడ్డలు ఆమెను చిత్రహింసలు పెట్టసాగారు. త్వరగా పిల్లలను కనాలని.. కని తనకు ఇస్తే బలి ఇచ్చి లంకె బిందెలను తన సొంతం చేసుకుంటానని ఆమెను వేధించాడు. ఇంట్లో ముగ్గు పోసి ఆమెను మధ్యలో కూర్చోబెట్టి తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు.

దీంతో యువతి తల్లిదండ్రులు గట్టిగా నిలదీయడంతో మళ్లీ బెంగళూరలో కాపురం పెట్టాడు. అక్కడ కూడా ఆమెను పట్టించుకోకుండా మరో ఇద్దరు యువతులతో లవ్ అఫైర్ పెట్టుకుంటూ.. పిల్లల్ని కని ఇస్తావా.. లేదా వాళ్లతో కని తీసుకుంటా అంటూ బెదిరించాడు. దీంతో ఆమె తన భర్త ఆగడాలను భరించలేక విజయవాడలోని తల్లిదండ్రుల దగ్గరకు చేరుకోని పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఆ సినిమా తరువాత కోటా శ్రీనివాసరావును రక్తం కారేటట్టు కొట్టారు.. ఎందుకంటే!

ప్రస్తుతం ఎంత సుఖాన్ని అనుభవిస్తున్నా దాని వెనకాల ఎంతో శ్రమ దాగి ఉంటుంది. అప్పుడు పడిన కష్టాలకు ఇప్పుడు దాని ఫలితం అనుభవిస్తుంటారు. అలా ఎదిగే క్రమంలో ఎన్నో ఆటుపోటులను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇలా తన కెరీర్ ప్రారంభంలో కోటా శ్రీనివాసరావు ఎన్నో ఇబ్బందులకు ఎదుర్కొన్నాడు. తర్వాత తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయనకు కోట్లలో అభిమానులున్నారు. అయితే అతడి జీవితంలో కొన్ని ఘటనలు మర్చిపోకుండా ఉండేవి ఉన్నాయని అతడు చెప్పుకొచ్చాడు. అందులో ఓ సంఘటన తాను ఎప్పటికీ మర్చిపోనని.. ఆ ఘటనలో తాను చనిపోయే స్థితికి వచ్చిందని చెప్పాడు. ఇంతకు ఆ ఘటన ఏంటంటే.. సీనియర్ ఎన్టీఆర్ నటించిన చిత్రాల్లో కోటా చాలా వరకు కమెడియన్, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసిన సినిమాలు చాలా ఉన్నాయి.

అయితే 1987 నాటి రాజకీయ నేపథ్యమున్న ‘మండలాధీశుడు’ సినిమాను ప్రభాకరరెడ్డి దర్శకత్వం వహించారు. అందులో ఎన్.టి.రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నరోజుల్లో అతని వ్యవహారశైలి మీద, ప్రభుత్వం మీద వ్యంగ్యంగా విమర్శించే కథాంశంతో ఈ సినిమా తీశారు. ఆ పాత్రలో కోట శ్రీనివాసరావు నటించారు. దీంతో కోటాపై ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.

తన అభిమాన నటుడిని ఇంత ఘోరంగా అవమాన పరిచేలా.. ఈ చిత్రంలో కోటా నటిస్తారా.. అంటూ ఆగ్రహంతో ఊగిపోయి ఎప్పుడు బయట దొరుకుతాడా అని ఎదురు చూశారు. ఎట్టకేలకు విజయవాడ రైల్వే స్టేషన్ వద్ద అభిమానులకు దొరకగా.. అతడిని విపరీతంగా రక్తం కారేటట్టు కొట్టారట. తర్వాత అతడు చనిపోతాడేమోననే భయంతో అక్కడ నుంచి వెళ్లిపోయారు అభిమానులు. ఆ సమయంలో తాను చనిపోతానని అనుకున్నట్లు కోటా శ్రీనివాసరావు చెప్పుకొచ్చాడు.