Tag Archives: villain

Thyagaraju: కరుడుగట్టిన విలన్ పాత్రలో అందరినీ భయపెట్టి అర్థంతరంగా కన్నుమూసిన నటుడు.. త్యాగరాజు!

Thyagaraju: సినిమా ఇండస్ట్రీలో హీరోలకు ఎలాంటి గుర్తింపు ఉంటుందో విలన్ పాత్రలో నటించే వారికి కూడా అలాంటి గుర్తింపు ఉంటుంది.ఇలా విలన్ పాత్రలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు త్యాగరాజు గురించి ఇప్పటి వారికి తెలియకపోయినా ఎన్టీరామారావు నాగేశ్వరరావు సినిమాలలో ద్వారా ఎంతో అద్భుతంగా నటించారు.

Thyagaraju: కరుడుగట్టిన విలన్ పాత్రలో అందరినీ భయపెట్టి అర్థంతరంగా కన్నుమూసిన నటుడు.. త్యాగరాజు!

1964 లో మంచి మనిషి చిత్రం ద్వారా విలన్ పాత్రలో నటించి అందరి అభిమానాన్ని సంపాదించుకున్న త్యాగరాజు ఆ తర్వాత వరుస సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు పొందారు. ఇక కృష్ణ నటించిన అల్లూరి సీతారామరాజు సినిమాలో బ్రిటిష్ పోలీసాఫీసర్‌ బాస్టన్‌ దొరగా త్యాగరాజు నటన అద్భుతం అని చెప్పవచ్చు.

Thyagaraju: కరుడుగట్టిన విలన్ పాత్రలో అందరినీ భయపెట్టి అర్థంతరంగా కన్నుమూసిన నటుడు.. త్యాగరాజు!

త్యాగరాజు తన 27 సంవత్సరాల సినీ కెరీర్లో ఏడాదికి 10 సినిమాల చొప్పున నటిస్తూ ఎంతో బిజీగా గడపడమే కాకుండా మంచి నటుడిగా గుర్తింపు పొందారు.ఈ విధంగా వరుస సినిమాల్లో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు త్యాగరాజు యాభై సంవత్సరాల వయసులోనే అర్థంతరంగా కన్నుమూయడం సినిమా ఇండస్ట్రీకి తీరని లోటని చెప్పవచ్చు.

గుండెపోటు రావడంతో…

ఇలా సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్న త్యాగరాజు 1991 ఫిబ్రవరి 24వ తేదీ హైదరాబాద్లోని అశోక్ నగర్ లో తన సోదరుడి ఇంటిలో ఉండగా అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఈయన మృతి చెందారు. ఇలా ఇండస్ట్రీలో 50 సంవత్సరాలకి మృతిచెందిన నటుడు త్యాగరాజు మరణం సినిమా ఇండస్ట్రీకి తీరని లోటని చెప్పవచ్చు.

Gopi Chand: మరోసారి మహేష్ కు విలన్ గా మారిన యాక్షన్ హీరో గోపీచంద్.. డైరెక్టర్ ప్లాన్ మామూలుగా లేదుగా!

Gopi Chand: టాలెంటెడ్, యాక్షన్ హీరో గోపీచంద్ కెరియర్ మొదట్లో విలన్ గా ఎంట్రీ ఇచ్చి అనంతరం హీరోగా పలు సినిమాలలో నటిస్తూ హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా సంపత్ నంది దర్శకత్వంలో కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ హీరో మంచి విజయాన్ని అందుకున్నారు.

Gopi Chand: మరోసారి మహేష్ కు విలన్ గా మారిన యాక్షన్ హీరో గోపీచంద్.. డైరెక్టర్ ప్లాన్ మామూలుగా లేదుగా!

ఇదిలా ఉండగా తాజాగా గోపీచంద్ కు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గోపీచంద్ తన కెరియర్ మొదట్లో వర్షం, నిజం, జయం వంటి సినిమాలలో విలన్ పాత్రల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన అనంతరం హీరోగా ప్రేక్షకులకు దగ్గరయ్యారు.

Gopi Chand: మరోసారి మహేష్ కు విలన్ గా మారిన యాక్షన్ హీరో గోపీచంద్.. డైరెక్టర్ ప్లాన్ మామూలుగా లేదుగా!

ఇలా హీరోగా పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ హీరోకి తిరిగి విలన్ పాత్రలో నటించే అవకాశాలు వస్తున్నాయని తెలుస్తోంది. ఇదివరకే మహేష్ బాబు హీరోగా నటించిన నిజం సినిమాలో గోపీచంద్ విలన్ పాత్ర ద్వారా మహేష్ బాబుతో పోటీపడ్డారు. ఈ క్రమంలోనే గోపీచంద్ కు మరోసారి మహేష్ బాబుతో పోటీ పడే అవకాశం వచ్చిందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

నెగిటివ్ పాత్రలకు గోపీచంద్ ఆసక్తి కనబరుస్తారా..

మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా అనంతరం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పాల్గొననున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా పూర్తి కాగానే మహేష్ బాబు దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి సినిమాల్లో బిజీగా ఉన్నారు.ఈ క్రమంలోనే రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమాలో మహేష్ బాబుతో పోటీ పడటం కోసం దర్శక ధీరుడు గోపీచంద్ ను సంప్రదించినట్లు తెలుస్తోంది.హీరోగా మంచి పేరు సంపాదించుకున్న గోపీచంద్ ఇలా నెగిటివ్ పాత్రలో నటించడానికి ఒప్పుకుంటారా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.

Harish Uthaman: మలయాళ నటిని రెండవ వివాహం చేసుకున్న టాలీవుడ్ విలన్ హరీష్ ఉత్తమన్..!

Harish Uthaman: హరీష్ ఉత్తమన్ ఈయన మలయాళ నటుడు అయినప్పటికీ తెలుగు తెరకు మాత్రం ఈయన ఒక పేరుమోసిన విలన్ గా అందరికీ పరిచయమే. ఈయన తెలుగులో ఎన్నో సినిమాల్లో విలన్ గా నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.ఇలా తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే విలన్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న హరీష్ తాజాగా రెండవ వివాహం చేసుకున్నారు.

Harish Uthaman: మలయాళ నటిని రెండవ వివాహం చేసుకున్న టాలీవుడ్ విలన్ హరీష్ ఉత్తమన్..!

ఈ క్రమంలోని ఈయనకు సంబంధించిన పెళ్లి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హరీష్ ఉత్తమన్ మలయాళ నటి చిన్ను కురువిల్లను జనవరి 20న కేరళలోని మవెలిక్కర వద్ద ఉన్న రిజిస్ట్రార్‌ ఆఫీస్‌లో రెండో పెళ్ళి చేసుకున్నాడు.కేవలం కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం నిరాడంబరంగా జరిగింది.

Harish Uthaman: మలయాళ నటిని రెండవ వివాహం చేసుకున్న టాలీవుడ్ విలన్ హరీష్ ఉత్తమన్..!

హరీష్ ఉత్తమన్ ఇదివరకే మేకప్ ఆర్టిస్ట్ అమృత కల్యాణ్‌ పుర్‌ను 2018 లో వివాహం చేసుకున్నాడు. అయితే వీరి వివాహం అయిన ఏడాది కూడా గడవకముందే వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడం చేత విడాకులతో విడిపోయారు.

గౌరవం చిత్రం ద్వారా తెలుగు తెరకు ఎంట్రీ..

ఈ క్రమంలోనే హరీష్ తిరిగి చిన్ను కురువిల్లను రెండవ వివాహం చేసుకున్నారు. ఇలా హరీష్ ఉత్తమన్ రెండవ వివాహం చేసుకున్నారనే విషయం తెలియడంతో ఇండస్ట్రీకి చెందిన వారు అలాగే అభిమానులు ఆయనకి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. హరీష్ ఉత్తమన్ 2013వ సంవత్సరంలో గౌరవం చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. పవర్, జిల్, పండగ చేస్కో, శ్రీమంతుడు, మలుపు, కృష్ణ గాడి వీర ప్రేమ గాథ, ఎక్స్ ప్రెస్ రాజా, కవచం, వంటి ఎన్నో సినిమాలలో విలన్ గా ప్రేక్షకులను సందడి చేశారు.

Bhalakrishana: బాలకృష్ణ సినిమాలో విలన్ పాత్రలో చేయనున్న మరొక హీరో.. ఎవరంటే?

Bhalakrishana: సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని సినిమాతో బిజీ కానున్నారు. ఈ ఏడాది గోపీచంద్ మలినేని క్రాక్ఈ సినిమా ద్వారా అద్భుతమైన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఇదే ఊపుతో ఒక అద్భుతమైన కథతో బాలకృష్ణ హీరోగా మరొక సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.

Bhalakrishana: బాలకృష్ణ సినిమాలో విలన్ పాత్రలో చేయనున్న మరొక హీరో.. ఎవరంటే?

ఇదిలా ఉండగా బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలకృష్ణతో పోటీ పడటానికి గోపీచంద్ మరో హీరోని రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే ఎన్నో సినిమాల ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న హీరో అర్జున్ బాలకృష్ణ సినిమాలో విలన్ గా నటిస్తున్నట్లు సమాచారం.

Bhalakrishana: బాలకృష్ణ సినిమాలో విలన్ పాత్రలో చేయనున్న మరొక హీరో.. ఎవరంటే?

త్వరలోనే ఈ విషయాన్ని చిత్రబృందం అధికారిక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే అర్జున్ ఇప్పటికే “లై”, “నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా”వంటి చిత్రాలలో విలన్ పాత్రలో నటించారు.ప్రస్తుతం అర్జున్ రవితేజ ఖిలాడీ సినిమాలో కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నారు.

జనవరి చివరిలో షూటింగ్ ప్రారంభం:

ఈ క్రమంలోనే ఈ సారి ఏకంగా బాలకృష్ణతో పోటీకి ఈ హీరో సై అంటున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాలో బాలకృష్ణ సరసన శృతిహాసన్ హీరోయిన్ పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా జనవరి చివరి వారం నుంచి వరుస షూటింగ్ ప్రారంభించబోతుంది.

విలనిజంలో కూడా కామెడీ..విలన్ క్యారెక్టర్ లో సునీల్ తేలిపోయాడా.. !

పుష్ప చాలా అంచనాల మధ్య నిన్నినే విడుదలైంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ వచ్చి భారీ మాస్ మసాల మూవీ. రంగస్థలం సక్సెస్ తరువాత సుకుమార్, అల వైకుంఠపురం తరువాత బన్నీ చేస్తున్న మూవీ కావడంతో పుష్ప సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి అనుగుణంగానే మూవీ రిలీజ్ కు ముందే సినిమా బిజినెస్ కూడా బాగా నడిచింది.

అయితే పుష్ఫ అనుకున్నంత అంచనాలను అందుకోలేకపోయిందని తెలుస్తోంది. యావరేజ్ టాక్ వచ్చినా.. కలెక్షన్ల విషయంలో మాత్రం తగ్గేదే లేదని అంటోంది. ముఖ్యంగా చాలా వైవిధ్యంగా ఉంటుందనుకున్న సునీల్ మంగళం శ్రీను పాత్ర అనుకున్నంత స్థాయిలో లేదని ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. ఎంత శ్రద్ద పెట్టి క్యారెక్టర్ చేసినా.. సునీల్ విలనీజంలో కామెడి తాలూకు ఛాయలే కనిపించాయని సగటు ఆడియన్స్ అనుకుంటున్నారు. విలన్ అవుదాం అనుకుని ఇండస్ట్రీకి వచ్చిన సునీల్ కు.. చాలా రోజుల తరువాత పుష్ఫ సినిమాలో పర్పెక్ట్ క్యారెక్టర్ పడిందనుకున్నారు జనాలు.

అయితే సినిమాలో చూస్తే సునీల్ క్యారెక్టరైజేషన్ తేలిపోయింది. ముందుగా కమెడియన్ గా ఉన్న సునీల్ ను విలన్ పాత్రలో ఊహించుకోలేకపోయారు ప్రేక్షకులు. ఇక్కడే ముందుగా సునీల్ విలనిజంపై దెబ్బపడింది. సుకుమార్ మాత్రం మంగళం శ్రీను పాత్రకు సునీల్ కరెక్ట్ అనుకున్నప్పటికీ సినిమాలో మాత్రం కొన్ని సన్నివేశాల్లో కమెడియన్ కనిపించాడని అంటున్నారు. సునీల్ ను క్రూరమైన విలన్ గా  చూపిద్దాం అని అనుకున్నా… సినిమాలో ఆరేంజ్ లో సునీల్ క్యారెక్టర్ లేదని తెలుస్తోంది.

ముఖ్యంగా ఎర్రచందనం సిండికేట్ లీడర్ గా పుష్ప రాజ్ ను చేసినప్పుడు.. మంగళం శ్రీను తన బావమరిది శవం పెట్టె మీదే తను ఉన్నాడని తెలిసినప్పడు.. సునీల్ ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ తనలో విలన్ కన్నా కమెడియన్ నే ఎక్కువగా చూపించాయని సగటు ప్రేక్షకుడు భావిస్తున్నాడు. ఇంతకుముందు కలర్ ఫోటో సినిమాలో సునీల్ ను విలన్ గా చూపించినప్పుడు.. విలన్ క్యారెక్టర్ కు బాగా న్యాయం చేశాడని ఆడియన్స్ అనుకున్నారు. అయితే మంగళం శ్రీను పాత్రలో మాత్రం సునీల్ విఫలమయ్యాడని తెలుస్తోంది. అనవసరంగా సునీల్ ఈ పాత్రను చేసి బ్లేమ్ అయ్యాడని ప్రేక్షకులు అనుకుంటున్నారు.

విలన్ గా ఎంట్రీ ఇవ్వనున్న నటుడు ఆదిత్య ఓం..!

తెలుగులో సుమన్, దివంగత నందమూరి హరికృష్ణ కీలక పాత్రలో నటించిన లాహిరి లాహిరి లాహిరిలో చిత్రంలో ప్రధాన పాత్రలో కనిపించి ప్రేక్షకులను సందడి చేసిన నటుడు ఆదిత్య ఓం ఒకరు. ఇతను పలు సినిమాలలో ప్రధాన పాత్రలలో నటించి బీ టౌన్ ఎంట్రీ ఇచ్చారు. సాధారణంగా హీరో పాత్రలో నటించడం మనం చూస్తూ ఉంటాము కాని ఒకే హీరో విలన్, కమెడియన్, డైరెక్టర్ హీరో పాత్రలో నటించాలంటే ఎంతో కష్టం. అలాంటి హీరోలు చాలా అరుదుగా ఉంటారు. అలా అరుదైన హీరోలలో ఆదిత్య ఓం ఒకరు.

ఇలా తెలుగు తమిళ హిందీ భాషలలో నటుడిగా దర్శకుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఆదిత్య ప్రస్తుతం విలన్ పాత్రల ద్వారా ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమయ్యారు.ఈ క్రమంలోనే ఇతను ఏకంగా మూడు సినిమాలలో నెగిటివ్ పాత్రలో కనిపిస్తూ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. కొత్తగా ఇండస్ట్రీలోకి నాగ వర్మ అనే హీరో ఎంట్రీ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమాకు విక్రమ్ అనే టైటిల్ ను ఎంపిక చేశారు.

విక్రమ్ సినిమాలో ఆదిత్య ఓం మాఫియా బాస్ గా నెగిటివ్ పాత్రలో నటిస్తున్నారు.దీనితోపాటు అమరం, పవిత్ర అనే సినిమాలో కూడా ఈయన విలన్ పాత్రలో నటిస్తూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇక అమరం సినిమాలో ఆదిత్య ఆది సాయి కుమార్ తో పోటీ పడుతున్నారు.అలాగే వెబ్ ఫిలింలో కూడా ఈయన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. హీరోగా దర్శకుడిగా ఎంతో మంచి ఆదరణ దక్కించుకున్న ఆదిత్య ఓం విలన్ పాత్ర ద్వారా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటారో తెలియాల్సి ఉంది.

అఖండలో విలన్ గా నటించిన శ్రీకాంత్ రెమ్యునరేషన్ ఎన్ని కోట్లో తెలుసా?

బాలకృష్ణ తాజాగా నటించిన చిత్రం అఖండ. ఈ సినిమా ఇటీవలే డిసెంబర్ 2న విడుదల అయిన సంగతి మనకు తెలిసిందే. విడుదల అయిన రెండు రోజులకే దాదాపుగా 40 కోట్ల గ్రాస్ ను కొల్లగొట్టింది. మొత్తం రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా అఖండ హవా కొనసాగుతోందని చెప్పవచ్చు. ఈ సినిమా విడుదల అయి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ను అందుకుంది. ఈ సినిమా విడుదల అయ్యి నాలుగు రోజులు అవుతున్నా కూడా టికెట్ల కొరత ఏర్పడుతోంది. ఆన్ లైన్ లో సైతం టికెట్లు దొరకడం లేదు. థియేటర్ వద్ద హౌస్ ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి.

ఇక ఇందులో విలన్ క్యారెక్టర్ లో హీరో శ్రీకాంత్ అద్భుతంగా నటించారు. అలాగే ఈ మధ్య కాలంలో సరైన సక్సెస్ లేని శ్రీకాంత్ ఈ సినిమాతో సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్నారు. ఇందులో విలన్ క్యారెక్టర్ వరదరాజులు పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేశారు శ్రీకాంత్. ఇకపోతే ఈ సినిమాకు గాను శ్రీకాంత్ ఎన్ని కోట్లు రెమ్యూనరేషన్ అందుకున్నాడన్న వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

ఇక సోషల్ మీడియాలో వినిపిస్తున్న కథనాల ప్రకారం ఈ సినిమా కోసం శ్రీకాంత్ కోటి రూపాయల కంటే ఎక్కువ మొత్తంలో పారితోషికం అందుకున్నారని సమాచారం. ఈ సినిమాలో కొన్ని పలు సన్నివేశాల్లో నటించిన శ్రీకాంత్ ఊహించని స్థాయిలో పారితోషకం తీసుకోవడం గమనార్హం. దర్శకుడు బోయపాటి తన సినిమాలలో శ్రీకాంత్ కు మంచి మంచి పాత్రలు ఇస్తూ కెరిర్ కు బాగా హెల్ప్ అవుతున్నారు

శ్రీకాంత్ కూడా విలన్ జగపతి బాబులాగా సినిమాలలో బిజీ అవుతారని ఫ్యాన్స్ భావించినప్పటికీ, శ్రీకాంత్ ఫ్యాన్స్ కు మాత్రం నిరాశే ఎదురవుతోంది. ఈ సినిమాతో సూపర్ హిట్ టాక్ ను అందుకున్న శ్రీకాంత్ తర్వాత ఇది ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారో చూడాలి మరి. ఈ మధ్యకాలంలో శ్రీకాంత్ పలు సినిమాల్లో నటించినప్పటికీ, అవి పెద్దగా గుర్తింపు తెచ్చి పెట్టలేక పోయాయి. శ్రీకాంత్ కు ప్రేక్షకులలో ఉన్న క్రేజ్ ను దృష్టిలో ఉంచుకొని ఈ సినిమాకు నిర్మాతలు భారీగానే పారితోషికం ఇచ్చినట్లు తెలుస్తోంది.

రాజమౌళి-మహేష్ సినిమాలో విలన్ పాత్రలో నటించనున్న స్టార్ హీరో.. ఎవరంటే?

దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన RRR సినిమా జనవరి 7వ తేదీ విడుదలకు సిద్ధమైంది.ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమా కోసం గత నాలుగు సంవత్సరాల నుంచి రాజమౌళి ఎంతో కష్టపడ్డారు. ఇదిలా ఉండగా ఈ సినిమా తర్వాత రాజమౌళి మహేష్ బాబు హీరోగా మరొక భారీ బడ్జెట్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు ఇదివరకే అధికారికంగా వెల్లడించారు.

ఇకపోతే మహేష్ బాబు కోసం రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ కథను కూడా దాదాపు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా హాలీవుడ్ తరహాలో ఉంటుందని విజయేంద్రప్రసాద్ వెల్లడించారు.ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా గురించి సరికొత్త సమాచారం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ బాబుతో పోటీ పడటానికి ఒక స్టార్ హీరోని రంగంలోకి దించడానికి రాజమౌళి సిద్ధమైనట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించడం కోసం తమిళ స్టార్ హీరో విక్రమ్ అయితే బాగుంటుందని రాజమౌళి భావించారట.

విక్రమ్ ఏదైనా ఒక పాత్ర కోసం ఎంతగా కష్టపడతారో మనకు ఎన్నో సినిమాల ద్వారా నిరూపితమైంది. ఇక రాజమౌళి సినిమాలో అవకాశం అంటే విక్రమ్ నో చెప్పే ఆస్కారం లేదని తప్పకుండా ఈ చిత్రంలో నటిస్తారని తెలుస్తుంది. ఏదిఏమైనా ఈ క్రేజీ కాంబినేషన్ గురించి ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అయితే ఈ విషయం గురించి రాజమౌళి అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.