Tag Archives: warning

Anchor Rashmi : యాంకర్ రష్మీ ని ఫిలిం ఛాంబర్ గేటుకి కట్టేసి కొడతా అన్న నిర్మాత.. అసలేం జరిగిందంటే..?

Anchor Rashmi Gautam: తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్ రష్మి గౌతమ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగు బుల్లితెర పై తన యాంకరింగ్ తో, ముద్దు ముద్దు మాటలతో ఎంతో మంది ప్రేక్షకుల మనసులలో స్థానం సంపాదించుకుంది. యాంకర్ రష్మీ కి యూత్ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అంతేకాకుండా రష్మీ కు సహాయం చేసే గుణం ఎక్కువ. మూగజీవాల పై ఎక్కువగా సోషల్ మీడియాలో స్పందిస్తూ ఉంటుంది. ఇదిలా ఉంటే రష్మీ తనను బ్లాక్ మెయిల్ చేసింది అంటూ సీనియర్ నిర్మాత బాలాజీ నాగలింగం ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అసలు విషయంలోకి వెళితే.. ఇంటర్వ్యూ లో భాగంగా బాలాజీ నాగలింగం మాట్లాడుతూ.. నేను రష్మీ ని ఇచ్చిన మాట నిజమే.

Anchor Rashmi Gautam: యాంకర్ రష్మీ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన నిర్మాత.. అసలేం జరిగిందంటే..?

నేను సాధారణంగా ఎవరిని అంతగా తిట్టను.. కానీ రష్మీ ఎందుకు తింటాను అంటే.. రష్మీ మాతో రాణి గారి బంగ్లా అనే సినిమా చేయడానికి ఒప్పుకుంది. ఆ సినిమాకు దివాకర్ బాబు దర్శకుడిగా డెబిట్ చేస్తున్నాడు. దీంతో సినిమాలో మెయిన్ రోల్ కోసం రష్మి గౌతమ్ ను అనుకోని ఆ తర్వాత మాట్లాడి రెమ్యునరేషన్ గురించి చెప్పాను అని తెలిపాడు బాలాజీ. అయితే ఆ సినిమాను లిమిటెడ్ బడ్జెట్లో చేయాలి అనుకుంటున్నట్లు, అదేవిధంగా ఆ సినిమా మేకింగ్ కు ఎంత ఖర్చు పెడుతున్నా మన విషయాన్ని చెప్పి అనంతరం ఇంత రెమ్యూనరేషన్ ఇవ్వగలను అని చెప్పారట బాలాజీ.

Anchor Rashmi Gautam: యాంకర్ రష్మీ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన నిర్మాత.. అసలేం జరిగిందంటే..?

రష్మీ గుంటూరు టాకీస్ సినిమా ఓకే చేసిన తర్వాత సినిమా అంతా పూర్తి అయ్యి చివర్లో కేవలం ఒక సాంగ్ డబ్బింగ్ మాత్రమే మిగిలి ఉన్నప్పుడు రష్మీ నేను చేయలేను హీరో ని మార్చేయండి అని ఇబ్బంది పెట్టింది అని తెలిపాడు బాలాజీ నాగలింగం. అప్పుడు అతను రష్మీ తో మాట్లాడగా.. అప్పుడు రష్మీ నాకు నాగబాబు తెలుసు, మల్లెమాల శ్యాంప్రసాద్ రెడ్డి తెలుసు, మిమ్మల్ని టీవీ9 ఎక్కిస్తాను, అది చేస్తాను ఇంత దూరం వెళ్తాను అంటూ బెదిరించి ప్రయత్నం చేసిందట. అప్పుడు బాలాజీ నాకు కూడా నాగబాబు తెలుసు, శ్యాం ప్రసాద్ రెడ్డి గారు కూడా తెలుసు నేను భూమి పుట్టినప్పుడు పుట్టిన వాడిని. 1974లో ఇండస్ట్రీకి వచ్చాను.. అలాంటిది చిన్నాపెద్దా లేకుండా నాతో నువ్వు మాట్లాడిన మాటలు రికార్డింగ్ కూడా ఉన్నాయి.. నిన్ను ఫిలింఛాంబర్ గేటుకి కొట్టేసి కొడతాను అని అన్నారట బాలాజీ.

గొప్ప హీరోయిన్లను చూసాను…

అంతేకాకుండా ఆమెను నిజం చెప్పమని నిజాయితీగా ఉండమని బెదిరించాడట. నా వయసెంత రష్మీ వయసు ఎంత ఒప్పుకున్న అంత రెమ్యూనరేషన్ తీసుకుని చివరిలో ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసి చివరకు మూడు నెలల తర్వాత వచ్చి సినిమాల్లో నటించిందని చెప్పుకొచ్చారు బాలాజీ. నేను శ్రీదేవి గారు లాంటి గొప్ప గొప్ప హీరోయిన్స్ ని చూశాను అని తెలిపారు. కానీ నటన పరంగా మాత్రం రష్మీ బాగా నటించింది. అంతేకాకుండా సినిమాలో సన్నివేశాలు చిత్రీకరించారు సమయంలో వన్ మోర్ అని ఎప్పుడూ అడగలేదు.. కానీ మెంటాలిటీ బాగాలేదు అని చెప్పుకొచ్చారు బాలాజీ నాగలింగం. ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో రష్మీ బాలాజీ నాగలింగం వివాదం హాట్ టాపిక్ గా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది.

POLITICAL NEWS: యోగీకి ఓటేయకుంటే… యూపీ నుంచి పారిపోండి: రాజా సింగ్ వార్నింగ్

POLITICAL NEWS: ఎప్పుడూ వివాదస్పద వ్యాఖ్యలతో వార్తల్లో ఉంటే గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తాజాగా మరోసారి సంచలన వ్యాక్యలు చేశారు ఈసారి యూపీ ఎన్నికలు, యోగీ ఆదిత్య నాథ్ పై వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం 5 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నాయి. ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా, పంజాబ్ రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. 

POLITICAL NEWS: యోగీకి ఓటేయకుంటే… యూపీ నుంచి పారిపోండి: రాజా సింగ్ వార్నింగ్

ప్రస్తుతం ఏడుదశల్లో యూపీ ఎన్నికలు జరుగనున్నాయి. ఇప్పటికే రెండు దశల ఎన్నికలు జరిగాయి. యూపీలో బీజేపీ, ఎస్పీ ల మధ్య తీవ్ర పోటీ ఉంది. రెండు పార్టీల మధ్య తీవ్ర పోటీ ఉంది. ఇరు పార్టీ రాజకీయ నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. 

POLITICAL NEWS: యోగీకి ఓటేయకుంటే… యూపీ నుంచి పారిపోండి: రాజా సింగ్ వార్నింగ్

ఇప్పటికే పలు ఒపీనియన్ పోల్స్ ప్రకారం సీట్లు తగ్గినా బీజేపీ అధికారంలోకి వస్తుందంటూ.. జోస్యం చెబుతున్నాయి. అయితే ఎన్డీయేతర విపక్షాల మాత్రం ఎస్పీ అధికారంలోకి వస్తుందని, అఖిలేష్ సీఎం అవుతాడంటూ.. ధీమా వ్యక్తం చేస్తున్నాయి. 


ఓటేయకుంటే.. బుల్డోజర్లు పంపుతాం..

ఇదిలా ఉంటే.. ఎమ్మెల్యే రాజా సింగ్ యూపీ ఓటర్లకు వార్నింగ్ ఇచ్చాడు. యూపీ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయకుంటే… యూపీ వదిలి వెళ్లాలని వార్నింగ్ ఇచ్చారు. యోగికి ఓటు వేయకుంటే.. జేసీబీలు, బుల్డోజర్లు పంపిస్తాం అంటూ హెచ్చరించారు. యోగికి ఓటు వేయని ఏరియాలను గుర్తిస్తున్నామంటూ వ్యాఖ్యానించారు. యూపీలో ఉండాలంటే యోగీ అనాల్సిందే అంటూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తర్ ప్రదేశ్ లో యోగీ బాబా ప్రభుత్వం వస్తుందని రాజా సింగ్ అన్నారు.

Dethadi Harika: అలా పిలిస్తే గుడ్డలూడదీసి కొడతా… ట్రోలర్స్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన దేత్తడి హారిక!

Dethadi Harika: యూట్యూబ్ వీడియోస్ వెబ్ సిరీస్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో దేత్తడి హారిక ఒకరు.ఈమె యూట్యూబ్ వీడియోస్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుని అదే గుర్తింపుతో బిగ్ బాస్ అవకాశాన్ని అందుకున్నారు.ఇలా బిగ్ బాస్ ద్వారా మరింత గుర్తింపు సంపాదించుకున్న హారిక ప్రస్తుతం వరస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.

Dethadi Harika: అలా పిలిస్తే గుడ్డలూడదీసి కొడతా… ట్రోలర్స్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన దేత్తడి హారిక!

ఈ క్రమంలోనే ఈమె పలు వెబ్ సిరీస్ ద్వారా బిజీగా ఉన్నప్పటికీ సినిమా అవకాశాలను మాత్రం అందుకోలేకపోతుంది. అందుకు గల కారణం ఈమె హైట్ అని చెప్పాలి. దేత్తడి హారిక చాలా పొట్టిగా ఉండటం వల్ల పలు అవకాశాలను అందుకోలేకపోతుందని చెప్పవచ్చు.

Dethadi Harika: అలా పిలిస్తే గుడ్డలూడదీసి కొడతా… ట్రోలర్స్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన దేత్తడి హారిక!

ఇక వీడియో సాంగ్స్ వెబ్ సిరీస్ ద్వారా ఎంతో బిజీగా ఉన్న హారిక సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకుంటారు. అయితే ఇలా ఈమె ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం చాలా మంది ఈమె హైట్ గురించి ప్రస్తావిస్తూ పొట్టిది, బుడ్డది అంటూ కామెంట్లు చేస్తుంటారు.

బుడ్డది అంటే గుడ్డలూడదీసి కొడతా…

ఈ విధంగా తన ఎత్తు గురించి ఇలాంటి కామెంట్లు చేసే వారికి తాజాగా ఈమె స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఎన్టీఆర్ నటించిన రామయ్యా వస్తావయ్యా చిత్రంలో ఎన్టీఆర్ చెప్పే డైలాగ్ అందరికీ గుర్తుండే ఉంటుంది.ఎవడు పడితే వాడు బుడ్డోడు.. బుడ్డోడు అంటే గుడ్డలూడదీసి కొడతా అలా అనడానికి ఒక అర్హత ఉండాలి లేదా వాడు నా అభిమాని అయిన అయుండాలి అంటూ ఎన్టీఆర్ డైలాగ్ ను ఇంస్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా షేర్ చేస్తూ… అది అర్థమయ్యింది కదా! అంటూ తనని బుడ్డది అంటూ కామెంట్ చేసే వారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

Bhairava Dweepam: భైరవ ద్వీపం సినిమా సెన్సార్ విషయంలో అంత కథ నడిచిందా.. గుర్రాల కోసం వార్నింగ్?

Bhairava Dweepam: సింగీతం శ్రీనివాస రావు-బాలకృష్ణ క్రేజీ కాంబినేషన్ అని చెప్పవచ్చు. వీరిద్దిరి కాంబినేషన్ లో వచ్చిన ‘ ఆదిత్య 369‘ బ్లాక్ బస్టర్ అయింది. ఈ సినిమా తరువాత వచ్చిన ‘ భైరవ ద్వీపం’ కూడా పెద్ద హిట్ గా నిలిచింది.

Bhairava Dweepam: భైరవ ద్వీపం సినిమా సెన్సార్ విషయంలో అంత కథ నడిచిందా.. గుర్రాల కోసం వార్నింగ్?

1994వ సంవత్సరంలో ఎప్రిల్ 14న ఈ విడుదలైన ఈ మూవీ అన్ని సెంటర్లలో కూడా హిట్ టాక్ తెచ్చుకుంది. అంతేకాదు ఏకంగా అన్ని విభాగాల్లో మొత్తం 9 నంది అవార్డులను సొంతం చేసుకుంది. 
బాలకృష్ణ సరసన రోజా హీరోయిన్ గా నటించింది. జానపద చిత్రంగా వచ్చిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Bhairava Dweepam: భైరవ ద్వీపం సినిమా సెన్సార్ విషయంలో అంత కథ నడిచిందా.. గుర్రాల కోసం వార్నింగ్?

ఓ సామాన్య వీరుడు.. ఓ రాజు కుమర్తెను భైరవుడనే మాంత్రికుడి నుంచి రక్షించే కథతో ఈ సినిమా వచ్చింది. రావి కొండలరావు అందించిన కథ, మాటలు, మాధవపెద్ది సురేష్ సంగీత దర్శకత్వం వహించిన పాటలు సినిమాకి హైలెట్ గా నిలిచాయి


వన్యప్రాణి సంరక్షణ సంఘం వాళ్లు ..

ఇదిలా ఉంటే ‘ భైరవ ద్వీపం’ సెన్సార్ సమయంలో చిత్ర యూనిట్ ఓ ఆసక్తికరమైన సంఘటన ఎదురైందట. అయితే ముందుగా అనుకున్న ప్రకారం సినిమాకు సెన్సార్ జరిగింది. అయితే చిత్ర యూనిట్ కు మాత్రం ఓ విషయంలో వార్నింగ్ ఇచ్చారట. మా వరకు సినిమాపై ఎలాంటి అభ్యంతరం లేదని.. కాకపోతే బాణాలకు గుర్రాలకు తగిలి పడిపోయిన సీన్లు కొన్ని ఉన్నాయని.. వాటికి అభ్యంతరం వ్యక్తం అవ్వచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయట. వన్యప్రాణి సంరక్షణ సంఘం వాళ్లు ఆబ్జెక్షన్ చెప్పే అవకాశం ఉందని వార్నింగ్ ఇచ్చారట. అలా జరిగితే ఆ సీన్లను తొలగించవచ్చు అని కోరే అవకాశం ఉందని అన్నారు. అయితే సినిమా విడుదలయ్యాక వీటిని ఏమాాత్రం పట్టించుకోలేదు. సినిమా సూపర్ హిట్ అయింది.

Balakrishna: దొరికితే దవడ పగిలిపోద్ది స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన బాలయ్య! ఎందుకో తెలుసా?

Balakrishna: అఖండ భారీ విజయంతో జోష్ లో ఉన్నాడు బాలక్రిష్ణ. బోయపాటి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా రికార్డుల దుమ్ము దులిపింది. ఏకంగా బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. బోయపాటి కాంబినేషన్ లో మూడో సినిమా కావడంతో సాధారణంగానే ప్రేక్షకులు, అభిమానుల్లో భారీ అంచానాలు నెలకొన్నాయి. దీనికి అనుగుణంగానే సినిమా భారీ విజయాన్ని నమోదు చేసింది.

వంద కోట్లను క్రాస్ చేసి విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ప్రస్తుతం గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో మరో సినిమా చేస్తున్నాడు బాలయ్య.  ఇదిలా ఉంటే మరోవైపు ఓటీటీలో కూడా అదరగొడుతున్నాడు బాలయ్య. ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న‘ అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే’  టాక్ షో భారీగా సక్సెస్ అయింది.

Balakrishna: దొరికితే దవడ పగిలిపోద్ది అంటూ రెచ్చిపోయిన బాలయ్య..ఇంతకు ఏం జరిగిందో తెలుసా..!

ఈ షోలో వన్ మ్యాన్ ఆర్మీగా బాలయ్య అదరగొడుతున్నాడు. బాలయ్య ఎనర్జీ లెవల్స్ పీక్స్ లో ఉంటున్నాయి. హోస్ట్ గా బాలయ్య గెస్టులుగా వచ్చే వారిని ఓ ఆట ఆడుకుంటున్నారు. ఇప్పటికే మోహన్ బాబు, రాజమౌళి, శ్రీకాంత్, అల్లు అర్జున్ వంటి వారితో టాక్ షో చేశారు. ఇటీవల మాస్ మహారాజ్ రవితేజతో కూడా ఓ షో చేశారు.


Balakrishna : వారందరికీ వార్నింగ్ ఇచ్చిన బాలయ్య..

ఈ షాట్లో బాలయ్య ఓ రేంజ్ లో మండిపడ్డారు. ‘దొరికితే దవడ పగిలిపోద్ది’ అంటూ వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఇంతకి ఈ వార్నింగ్ ఎవరికి ఇచ్చాడో చూద్దాం. ఇటీవల బాలయ్య షోకి గెస్ట్ గా రవితేజ వచ్చాడు. ఇందులో గతంలో మన ఇద్దరికి గొడవ అయిందట కదా..అని బాలయ్య అనగా.. పని పాట లేని డ్యాష్ గాళ్లు.. ఇలాంటి రూమర్లు పుట్టిస్తారని సమాధానం ఇచ్చాడు. కొంతమంది సెటబ్రెటీలతో బాలయ్యకు విరోధం ఉందని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. రవితేజతో గొడవ జరిగిందని, చిరంజీవి- బాలయ్య మాట్లాడుకోరని, నాహీరో తోపు నీహీరో సూపు అంటూ సోషల్ మీడియాలో కొంత మంది బాధ్యతారహితంగా కామెంట్లు చేస్తుంటారు. అయితే ఇలాంటి వారందరికి గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు బాలక్రిష్ణ. ఇలా తప్పుడు వార్తలు రాసి పబ్బం గడుపుకునేవారికి ఇదే నా వార్నింగ్.. లెఫ్ట్ హ్యాండ్ కూడా ఇప్పుడు బాగయింది…దొరికితే దవడ పగిలిపోద్ది అంటూ వార్నింగ్ ఇచ్చాడు. దీంతో బాలయ్య అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఇలా చేసేవారికి ఇలాంటి వార్నింగ్ లే కరెక్ట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Anchor Ravi-Siri: సిరి జోలికి వెళ్లకండి.. మంచిగా ఉండదు అంటూ వార్నింగ్ ఇచ్చిన రవి.. రవి కామెంట్స్ వైరల్!

Anchor Ravi-Siri: బిగ్ బాస్ సీజన్ 5 ముగిసినా.. ట్రోలింగ్ ఆగడం లేదు. ముఖ్యంగా దీప్తి – షన్నూ వివాదం, సిరి- శ్రీహాన్ పై తెగ ట్రోలింగ్ జరుగుతోంది. ముఖ్యం బిగ్ బాస్ పూర్తయినప్పటి నుంచి ఎక్కువగా నానుతున్న పేర్లు దీప్తి సునయన, షణ్ముఖ్ జశ్వంత్, సిరి ఈ ముగ్గురి చుట్టే వివాదాలు నడుస్తున్నాయి.

బిగ్ బాస్ హౌజ్ లో సిరి- షన్నూల మధ్య రొమాన్స్ ఎక్కువ అవడంతో ఆడియన్స్ నుంచి వ్యతిరేఖత వచ్చింది. బిగ్ బాస్ విన్నర్ అవుతాడనుకున్న షణ్ముఖ్.. సిరి వివాదంతో ట్రోఫికీ దూరమయ్యాడు. ఈ ఇద్దరు హౌజ్ లో మితిమీరిన కిస్సింగ్, హగ్గింగులతో కాకపుట్టించారు.

Anchor Ravi-Siri: సిరి జోలికి వెళ్లకండి.. మంచిగా ఉండదు అంటూ వార్నింగ్ ఇచ్చిన రవి.. రవి కామెంట్స్ వైరల్!

ఒకే బెడ్ పై పడుకోవడం, ఒకరిపై ఒకరు అలగడం, మళ్లీ సారీలు చెప్పుకోవడం చూస్తే వీరిద్దరి మధ్య ఏదో ఉందని అనిపిస్తోంది. అయితే వీరిద్దరు మాత్రం తాము మంచి ఫ్రెండ్స్ అని చెబుతున్నప్పటికీ.. జనాలకు మాత్రం అనుమానాలు అలానే ఉన్నాయి.

వాటికంటే నేను మరింత స్ట్రాం గ్ ..

ఈ వివాదం వల్లనే ఐదేళ్లుగా రిలేషన్ షిప్లో ఉన్న దీప్తి, షన్ముఖ్ లు విడిపోయారు. అయితే ఇప్పుడు జరుగుతున్న ట్రోలింగ్ పై యాంకర్ రవి స్పందించాడు. ప్రస్తుతం ఆయన మాట్లాడిన మాటలు వైరల్ గా మారాయి. ’’ఎవరినీ ఏమనకండి. మరీ ముఖ్యంగా సిరిని ఏమనకండి. మంచిగా చెప్తున్నా,  దయచేసి నెగెటివ్ కామెంట్లు చేయడం మానేయండి. షణ్ను బాగానే ఉన్నా డు. త్వరలోనే అతడితో మాట్లాడి వీడియో కూడా చేస్తాను’ అని చెప్పుకొచ్చాడు. మరో వైపు సిరి కూడా ‘ఎవరైనా మీ దగ్గరిగ్గకి వచ్చి.. మీ జీవితం చాలా కఠినంగా ఉందే అని కామెంట్స్ చేస్తే.. వాటికంటే నేను మరింత స్ట్రాం గ్ అని చిరునవ్వుతో సమాధానం చెప్పం డి’ అని ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం సిరి గురించి రవి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Poojitha-Lakshmi Parvati: అలా చేసినందుకు బాంబులు వేసి లేపేస్తాం… యాసిడ్ పోస్తామని హెచ్చరించారు: నటి పూజిత

Poojitha-Lakshmi Parvati: అలనాటి నటి పూజిత మళ్లీ తెరపై యాక్టివ్ కాబోతున్నారు. ‘ఇద్దరు పెళ్లాల ముద్దుల పోలీస్’  వంటి ఎవర్ గ్రీన్ కామెడీ సినిమాలో పాటు 138కి పైగా సినిమాలు నటించిన పూజిత చాలా గుర్తింపు తెచ్చుకున్నారు. తాజగా మరోసారి ఆమె వెండితెరపై మెరవబోతున్నారు. వరసగా రెండు సినిమాలకు సైన్ చేశారు. అయితే తన కెరీర్లో జరిగిన ఓ విషయంపై ఆమె స్పందించారు. 

Poojitha-Lakshmi Parvati: అలా చేసినందుకు బాంబులు వేసి లేపేస్తాం… యాసిడ్ పోస్తామని హెచ్చరించారు: నటి పూజిత

లక్ష్మీ పార్వతితో తనకున్న విభేదాలను బయటపెట్టారు. అప్పట్లో ’అమ్మో అల్లుడా.‘ అనే సినిమా వచ్చిందని పూర్తిగా పొలిటికల్ సినిమా అని చెప్పింది. దీంట్లో నేను లక్ష్మీ పార్వతి క్యారెక్టర్ చేశానని చెప్పుకొచ్చింది పూజిత. కోనేరు రవీంద్ర ఆ చిత్రానికి నిర్మాత. ఆ సినిమాలో నా క్యారెక్టర్ చాలా గొప్పగా ఉంటుందని చెప్పి..  సినిమాలో నన్ను పెట్టారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ రోల్ కూడా ఉంటుందని ఆయనకు భార్యగా లక్ష్మీ పార్వతి పాత్రలో నటించాలని చెప్పారు. అయితే ఆమె పేరును ఎక్కడా కూడా వాడలేదని తెలిపారు. ఈ సినిమా క్లైమాక్స్ లో ఉండగానే ఎన్టీఆర్ గారు చనిపోయారని చెప్పింది.

Poojitha-Lakshmi Parvati: అలా చేసినందుకు బాంబులు వేసి లేపేస్తాం… యాసిడ్ పోస్తామని హెచ్చరించారు: నటి పూజిత

ఎన్టీఆర్ చనిపోయినప్పడు.. ఆయన ఇంటికి వెళ్లానని.. స్టేడియంకి కూడా వెళ్లానని చెప్పింది. అయితే ఆ సందర్భంలో లక్ష్మీ పార్వతి చేసిన కొన్ని విషయాలను… నేను సినిమాలో అలాగే చేశానని చెప్పుకొచ్చింది. అయితే ఈ సన్నివేశాలు లక్ష్మీ పార్వతికి బలంగా తాకినట్లు చెప్పింది.

బాంబులతో లేపేస్తా అన్నారు…

ఎన్టీఆర్ చనిపోయిన సందర్భంలో కాఫీ తాగుతున్న లక్ష్మీ పార్వతి.. పీవీ నరసింహరావు రాగానే తాగే కప్పును పక్కన పెట్టి ఏడ్వడం స్టార్ట్ చేసిందని… చెప్పింది పూజిత. అయితే ఆ సన్నివేశం నామదిలో అలాగే ఉందని తెలిపింది. ఎవరైనా వస్తే ఉన్నపళంగా బాగా ఏడవాలన్నమాట అని అర్థమైంది. ఈ సన్నివేశాన్ని సినిమాలో యదాతథంగా నేను చేశాను. ఈసీన్ చూసి లక్ష్మీ పార్వతి నున్ను బాంబులతో లేపేస్తా.. యాసిడ్ పోయిస్తా.. అని చెప్పి అప్పట్లో నాపై కేసు పెట్టారు. అయితే దాన్ని చిత్ర నిర్మాత, డైరెక్టర్ చూసుకున్నారన్నారు. నేను ఓ నటిని.. డైరెక్టర్, నిర్మాతలు చెప్పినట్లు నటించడం మాత్రమే నాపని అని చెప్పుకొచ్చింది పూజిత. కేసులతో నాకేంటి సంబంధం అని అంది.  అయితే ఆ తరువాత లక్ష్మీ పార్వతిని రెండు మూడు సార్లు కలిశాను ఆమె సరిగ్గా మాట్లాడలేదని చెప్పింది పూజిత.

Tabu: జాగ్రత్తగా చేయండి అంటూ..బాలీవుడ్ యంగ్ హీరోకు స్వీట్ వార్నింగ్ ఇచ్చిన టబు..!

Tabu: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘అల వైకుంఠపురం’ సినిమా ఎంత పెద్ద హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్, హూజా హెగ్డే అందాలు ఈ ఫ్యామిలీ డ్రామాను హిట్ చేశాయి.

Tabu: జాగ్రత్తగా చేయండి అంటూ..బాలీవుడ్ యంగ్ హీరోకు స్వీట్ వార్నింగ్ ఇచ్చిన టబు..!

దీంతో పాటు తమన్ అందించిన మ్యూజిక్ అందర్నీ మెస్మరైజ్ చేసింది. ఇంతే కాకుండా బన్నీ క్యారెక్టరైజేషన్, సముద్ర ఖని విలనిజం సినిమాకు ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా తల్లి పాత్రలో టబు ఒదిగిపోయింది. చాలా కాలం తరువాత తెలుగులో స్ట్రేయిట్ మూవీ చేసింది.

Food Delivery: ఆత్మహత్య చేసుకుందామని అనుకున్న వ్యక్తిని..! డెలివరీ బాయ్ ఎలా కాపాడాడో తెలుసా..!

అయితే ఇంతలా హిట్ అయిన ఈ సినిమా పై మొదటి నుంచి బాలీవుడ్ నజర్ పెట్టింది.  తాజాగా ఈసినిమాను హిందీలో రిమేక్ చేస్తున్నారు. కార్తిక్ ఆర్యన్, కృతి జంటగా నటిస్తున్నారు. ఈసినిమాను షెహ్ జాదాగా టైటిల్ ను కూడా నిర్ణయించారు. రోహిత్ ధావన్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా చేస్తున్న కార్తిక్ ఆర్యన్ కు స్వీట్ వార్నింగ్ ఇచ్చింది టబు. తన సినిమాను రీమేక్ చేస్తున్నారని.. జాగ్రత్తగా రీమేక్ చేయాలంటూ కార్తిక్ ఆర్యన్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్ కు రిప్లై ఇచ్చింది టబు. 

Tabu: జాగ్రత్తగా చేయండి అంటూ..బాలీవుడ్ యంగ్ హీరోకు స్వీట్ వార్నింగ్ ఇచ్చిన టబు..!

తాజాగా అల వైకుంఠపురం హిందీ రిమేక్ హెహ్ జాదా కూడా సక్సెస్ కావాలని టబు కోరుకుంది. అయితే తెలుగులో సూపర్ హిట్ అయిన ఈ సినిమాను ఎలాంటి మార్పులు లేకుండా.. హిందీలోకి అనువదిస్తున్నారట. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం తుది దశకు చేరుకుంది. హిందీలో ఎలాగైనా సూపర్ హిట్ సాధించాలని చిత్ర యూనిట్ గట్టి పట్టుదలతో ఉంది.

పక్కనోడు గెలిస్తే సహించలేడు.. నాతో జోకులు వద్దంటూ సన్నీకి వార్నింగ్..!

బిగ్ బాస్ కార్యక్రమం మరొక మూడు రోజులలో ముగియడంతో ఈ కార్యక్రమం గురించి పలువురు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.ఈ క్రమంలోనే బిగ్ బాస్ గత ఎపిసోడ్ లో భాగంగా ఐదుగురు కంటెస్టెంట్ లకు పలు టాస్క్ లను ఇచ్చారు. మొదటి టాస్క్ బెలూన్ ఊది పగలగొట్టడంలో షన్ను గెలవగా, రెండవ టాస్క్ స్విమ్మింగ్ పూల్ లో దూకి టీ షర్టులు ధరించే టాస్క్ ఇచ్చారు. ఇందులో మానస్ గెలిచాడు.ఇక మూడవ టాస్క్ లో భాగంగా ఇంటి సభ్యులు అందరూ 13 క్షణాల పాటు లెక్కించాలని చెబుతూ బిగ్ బాస్ వారిని డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేశారు. ఈ టాస్క్ లో భాగంగా షణ్ను, శ్రీరామ్‌, మానస్‌, సన్నీ, సిరి వరుసగా ఐదు స్థానాల్లోనిలవగా మొదటి స్థానంలో నిలిచిన షణ్ముఖ్ జస్వంత్ బిర్యాని బహుమతిగా గెలుచుకోవడంతో అందరూ కలిసి తిన్నారు.

ఇక నాలుగవ టాస్క్ లో భాగంగా హౌ సభ్యులకు బిగ్ బాస్ కొన్ని శబ్దాలను వినిపించి జంతువుల పేర్లు రాయమని చెప్పారు. ఇందులో సిరి తప్పు సమాధానం రాయడంతో అందరూ ఒక్కసారిగా నవ్వుకున్నారు. ఇక ఐదవ టాస్క్ లో భాగంగా ఎక్కువ సేపు తాళ్ళు ఊపే టాస్క్ ఇవ్వగా ఇందులో సన్నీ,సిరి,షణ్ముఖ్ ఆడగా సన్నీ గెలిచాడు.

సరదాగా సన్నీ ఓడిపోయారు కదా మరొకసారి ఆడదామా అంటూ తమాషాగా అనడంతో ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని అతనితో గొడవకు దిగింది.ఇక తన సరదాగా అన్నాను అని చెప్పే ప్రయత్నం చేసిన సిరి మాత్రం ఓడిపోయావు అన్నావు నాకు నచ్చలేదు అది సరదాగా అంటారా అంటూ తనపై గట్టి గట్టిగా అరిచింది. ఇక సహనం కోల్పోయిన సన్నీ చివరికి తనని ఇమిటేట్ చేశాడు.

పక్కనోడు గెలిస్తే సహించలేడు అంటూ గట్టిగా అరవడం కాకుండా నాతో జోకులు వద్దు అంటూ సన్నీకి వార్నింగ్ ఇస్తూ నువ్వు ఏమైనా హీరో అనుకుంటున్నావా అంటూ అతని పై పెద్ద ఎత్తున గొడవకు దిగింది. ఇక దీంతో తినడానికి రమ్మన్న సిరి అలిగి కూర్చుంది. తరువాత మానస్, సన్నీ మాట్లాడుతూ ఎప్పుడు ఏ గొడవ అయినా నేనే వెళ్తాను ఇంత ఓవర్ యాక్టింగ్ బ్యాచ్ ఏంట్రా? నన్ను వెళ్లే ముందు ఇలా బ్యాడ్ చేస్తే వాళ్లకు ఏం వస్తది? నేనేమైనా హీరోనా అంటుంది నా దునియాకు నేను హీరో నన్ను అభిమానించే వాళ్లకు నేను హీరో అంటూ సన్నీ మానస్ దగ్గర చెప్పుకొచ్చాడు.

నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నా ఆగుతున్నా.. సిరి లేకపోతే షన్నూ ఎప్పుడో పిచ్చోడు అయ్యేవాడు.! : సిరి బాయ్ ఫ్రెండ్ శ్రీహాన్..

బిగ్ బాస్ తెలుగు హౌజ్ లో సిరి, షణ్ముఖ్ ప్రయాణం.. అందరి కంటే డిఫిరెంట్ అనే చెప్పాలి. ఇక ఫినాలేకు కేవలం రెండు రోజుల మాత్రమే మిగిలి ఉంది. కానీ బయట మాత్రం ఉండడంతో ఆ వేడి రోజురోజుకూ పెరిగిపోతోంది. సిరికి అప్పటికే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఫ్యామిలీతో ఇంటరాక్ట్ సమయంలో శ్రీహాన్ స్టేజ్ పైకి వచ్చి.. సిరిపై నమ్మకం ఉందని.. షణ్ముఖ్ తన ఫ్రెండ్ అంటూ చెప్పి.. ఎవరు ఏమన్నా పట్టించుకోవద్దు అంటూ చెప్పి వెళ్లిపోయాడు.

ఆ సమయంలో శ్రీహాన్ ను చాలామంది ప్రశంసించారు. ఇదిలా ఉండగా.. సిరి టాప్ 5లోకి వెళ్లిన తర్వాత సీన్ అంతా రివర్స్ అయిపోతోంది. సిరి వల్ల షణ్ముఖ్ నెగెటివ్ అవుతున్నాడని.. హగ్ ఇవ్వొద్దని చెప్పినా ఆమె దగ్గరకు వెల్లి హగ్గులు ఇవ్వడం ఏంటని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. అయితే దీనిపై సిరిది, షణ్ముఖ్ ది కూడా తప్పు ఉందంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

ఇదిలా ఉండగా.. ఇప్పటి వరకు ఎంతో కామ్ గా ఉన్న శ్రీహాన్ ఈ వ్వహారాలపై తనదైన శైలిలో స్పందించాడు. సోషల్ మీడియాలో ఓ భారీ పోస్టును షేర్ చేశాడు. అందులో ఏ రాశాడంటే.. ‘‘ఒక క్యారెక్టర్ ను బ్లేమ్ చేస్తూ పోస్టులు పెట్టడంలోనే తెలుస్తుంది వీళ్ల మెచ్యూరిటీ. 10 రోజుల క్రితమే తన దగ్గరకు ఓ స్క్రీన్ షాట్ వచ్చింది. నన్ను ఎంతోమంది ఏవేవో అంటున్నా ఏ రోజూ నేను పోస్ట్‌ చేయలేదు. ఎందుకంటే వాటివల్ల పేరెంట్స్‌ బ్లేమ్‌ అవ్వకూడదని ఆలోచించాను. కానీ ఈ రోజు ఎవరి ద్వారానో ఒక స్క్రీన్‌షాట్‌ బయటకు వస్తే పాపం సిరి ఏం చేసిందని, ఒక అమ్మాయని కూడా చూడకుండా క్యారెక్టర్‌ బ్లేమ్‌ అయ్యేలా పోస్టులు పెడుతున్నారు. మీ అమ్మ గురించి నేను ఆగిపోయాను.

ఎంత సేపటికీ సిరి వల్ల నెగెటివ్ అయ్యాడు అయ్యాడు అంటారేంటి ఎవరి గేమ్ ఏంటో తెలిసి కూడా… నెగెటివ్‌ అవ్వడం కాదు, ఒకవేళ సిరి తోడుగా లేకపోతే వేరే సపోర్ట్‌ లేక అతడు పిచ్చోడయ్యేవాడు. ఎందుకంటే వేరే ఎవ్వరితో కలవడు కాబట్టి.. ఇక్కడ సిరి వేరేవాళ్లతో మాట్లాడినా తప్పే, డ్యాన్స్‌ వేసినా తప్పే, నవ్వినా తప్పే, నేనే నీకు ప్రపంచం అని క్రియేట్‌ చేస్తే తను మాత్రం ఏం చేస్తుంది.. ఇంకా ఎవరి దగ్గరకని వెళ్తుంది.. ఫ్రెండ్‌ బాధపడకూడదని ఆలోచించి ఆగుతుంటే అడ్జస్ట్‌ అవుతుంటే వీళ్లు ఇచ్చే విలువ ఇదా..?..

బిగ్‌బాస్‌ చివరి రోజుల్లో ఎందుకు ఈ నెగెటివిటీలు అని నా దగ్గర ప్రూఫ్స్‌ ఉన్నా ఆగుతుంటే అనవసరంగా సిరి అనడం ఏంటి బ్రదర్’’.. అంటూ నెటిజన్లపై మండిపడ్డాడు. అయితే అతడు పోస్టు చేసిన కొన్ని నిమిషాలకే డిలీట్ చేసేశాడు. మొత్తానికి శ్రీహాన ఇటు ట్రోలర్స్ కి.. ఇటు షణ్ముఖ్ కు గట్టిగానే ఇచ్చాడంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.