Tag Archives: wife

Ntr: నేను ఈ స్థాయిలో ఉండడానికి ఆ ఇద్దరు మహిళలే కారణం.. ఎన్టీఆర్ కామెంట్స్ వైరల్!

Ntr: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరు. ఈయన సీనియర్ నటుడు నందమూరి తారక రామారావు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఇలా నటుడుగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు పొందారు.

ఇక మహిళా దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ తన జీవితంలో కీలకపాత్ర పోషించిన ఇద్దరు మహిళల గురించి ఆసక్తికరమైనటువంటి విషయాలను వెల్లడించారు ఇలా తను ఈ స్థాయిలో ఉన్నాను అంటే అందుకు మూల కారణం తన అమ్మ అని తెలిపారు తన అమ్మ నన్ను ఈ ప్రపంచానికి పరిచయం చేయడం కోసం తనకు చిన్నప్పటి నుంచి డాన్స్ నేర్పిందని తెలిపారు.

ఇలా డాన్స్ నేర్చుకోవడం ఒక మంచి ఆర్ట్ అని తనలో ఉన్నటువంటి భావాలన్నింటిని కూడా నేను డాన్స్ రూపంలో తెలియజేస్తానని ఈయన తెలియజేశారు ఇలా నా జీవితంలో అమ్మ కీలక పాత్ర పోషించిందని ప్రతి ఒక్క విషయంలో తాను నన్ను ఎంతగానో ప్రోత్సహించేదని తెలిపారు. ఇక నా జీవితంలో నా భార్య ప్రణతి కూడా కీలకపాత్ర పోషించారని తెలిపారు.

తన ఇష్టాలను నాపై రుద్దదు..

నేను ఇలా హోమ్లి మెన్ గా ఉన్నాను అంటే అందుకు కారణం ప్రణతి అని తెలిపారు. ఆమె తన ఇష్ట ఇష్టాలను ఎప్పుడూ కూడా నాపై రుద్దదు అంతేకాకుండా ప్రతిరోజు నేను వ్యాయామం చేసేలా నన్ను ప్రోత్సహిస్తూనే ఉంటారు.ఇలా ప్రణతి కూడా నా విజయంలో భాగం అంటూ ఈ సందర్భంగా ఎన్టీఆర్ తన తల్లి భార్య గురించి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఈయన దేవర సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

Ramya Krishna: ఓకే నటుడికి కూతురుగా, భార్యగా, చెల్లిగా నటించిన రమ్యకృష్ణ… ఆ నటుడు ఎవరో తెలుసా ?

Ramya Krishna: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఒక్కో సినిమాలో ఒక్కో విధమైన పాత్రల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తుంటారు. ఒక సినిమాలో ఒక నటుడికి చెల్లెలుగా నటిస్తే మరొక సినిమాలో భార్యగా నటించాల్సి ఉంటుంది. ఇలా ఇండస్ట్రీలో ఎంతోమంది భార్యాభర్తలుగా అన్నా చెల్లెలుగా నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. అయితే రమ్యకృష్ణ మాత్రం ఒక నటుడితో చెల్లిగా భార్యగా కూతురిగా నటించి మెప్పించారు.

ఈమె ఇండస్ట్రీలో ఎంతోమంది అగ్ర హీరోలు సరసన నటించే సందడి చేశారు. అయితే ఇండస్ట్రీలో ఈమె ఒక నటుడికి కూతురిగా చెల్లిగా భార్యగా కూడా నటించారు. ఇలా అన్ని రకాలుగా ఆ నటుడితో రమ్యకృష్ణ నటించిన సందడి చేశారు. మరి రమ్యకృష్ణ నటించిన ఆ హీరో ఎవరు? ఆ సినిమాలు ఏంటి అనే విషయానికి వస్తే?

రమ్యకృష్ణ నటుడు నాజర్ తో కలిసి వివిధ సినిమాలలో ఒక్కో పాత్ర ద్వారా ప్రేక్షకులను సందడి చేశారు. విలన్ పాత్రలలో తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరైన నటుడు నాజర్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమాలో రమ్యకృష్ణకు భర్త పాత్రలో నటించారు. ఇందులో రమ్యకృష్ణ శివగామి పాత్రలో నటించగా నాజర్ బిజ్జల దేవుడి పాత్రలో నటించారు.

Ramya Krishna: విలన్ గా మెప్పించిన రమ్యకృష్ణ..

రజనీకాంత్ సౌందర్య హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన నరసింహ సినిమాలో రమ్యకృష్ణ విలన్ పాత్రలో నటించారు. నీలాంబరి పాత ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన రమ్యకృష్ణ ఈ సినిమాలో నాజర్ కి చెల్లెలు పాత్రలో నటించారు. ఇలా విలన్ పాత్రలో రమ్యకృష్ణ అద్భుతంగా నటించిందని చెప్పాలి. ఇక తమిళంలో వంత రాజవతాన్ వరవెన్ సినిమాలో రమ్యకృష్ణ నాజర్ కూతురి పాత్రలో నటించారు. ఇక ఈ సినిమా మంచి విజయం అయింది. ఈ సినిమాకి రీమేక్ చిత్రంగా తెలుగులో అత్తారింటికి దారేది సినిమా వచ్చింది. ఈ సినిమాలో నదియా రమ్యకృష్ణ పాత్రలో నటించారు.

Kiraak RP: కిరాక్ ఆర్పీకి కాబోయే భార్య ఎంత కట్న కానుకలు ఇచ్చారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Kiraak RP: జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతోమంది విపరీతమైన పాపులారిటీ సంపాదించుకొని ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీలుగా కొనసాగుతున్నారు. ఈ విధంగా ఇండస్ట్రీలో కొందరు సినిమాలలో కమెడియన్స్ గా నటించగా మరికొందరి హీరోగా అవకాశాలను అందుకుంటు బిజీగా ఉన్నారు. ఇలా జబర్దస్త్ ద్వారా గుర్తింపు పొందిన వారిలో కమెడియన్ కిరాక్ ఆర్పీ ఒకరు.

Kiraak RP: కిరాక్ ఆర్పీకి కాబోయే భార్య ఎంత కట్న కానుకలు ఇచ్చారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు పొందిన ఆర్పీ కొన్ని కారణాలవల్ల ఈ కార్యక్రమం నుంచి బయటకు వచ్చారు. ప్రస్తుతం ఈయన స్టార్ మా లో ప్రసారమవుతున్న కామెడీ స్టార్స్ కార్యక్రమంలో సందడి చేస్తున్నారు. ఇకపోతే ఆర్పీ మెగా బ్రదర్ నాగబాబుకు పెద్ద అభిమాని అనే విషయాన్ని బయటపెట్టారు. ఏకంగా తన గుండెల పై నాగబాబు పేరును టాటూగా వేయించుకోవడం హాట్ టాపిక్ గా మారింది.

Kiraak RP: కిరాక్ ఆర్పీకి కాబోయే భార్య ఎంత కట్న కానుకలు ఇచ్చారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

ఈ విధంగా నాగబాబుకు అభిమానిగా ఉన్నటువంటి ఆర్పీ గత బుల్లితెర కార్యక్రమంలో తన కాబోయే అమ్మాయి లక్ష్మీప్రసన్నతో తన పరిచయం ఎలా ఏర్పడింది తన ప్రేమ పెళ్లికి ఎలా కష్టాలను పడ్డారనే విషయాలను బయటపెట్టారు. తాను సినిమా ఇండస్ట్రీలో ఉంటానని తనకు లక్ష్మీప్రసన్నని ఇచ్చి పెళ్లి చేయడానికి తన తల్లిదండ్రులు ఒప్పుకోకపోతే ఏకంగా కాళ్లు పట్టుకున్నారని డాన్స్ పెర్ఫార్మెన్స్ ద్వార తెలియజేశారు.

ఒక్క రూపాయి కూడా కట్నం తీసుకోలేదు…

ఇకపోతే త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతుండగా ప్రస్తుతం ఆర్పీ తనకు కాబోయే భార్య లక్ష్మీ ప్రసన్న నుంచి ఎంత మొత్తంలో కట్న కానుకలు తీసుకున్నారనే విషయం హాట్ టాపిక్ గా మారింది.ఇక లక్ష్మీ ప్రసన్న తల్లిదండ్రులను నిశ్చితార్థానికి ఒప్పించిన తర్వాత నిశ్చితార్థానికి అయ్యే ఖర్చులు వారు కూడా భరిస్తామని చెప్పారు కానీ నేను అందుకు ఒప్పుకోలేదు ఎంతో ఘనంగా నిశ్చితార్థం జరుపుకున్నాను. అలాగే పెళ్లికి కానుకగా వారు ఒక ఫ్లాట్ ఇస్తామని చెప్పారు. దానిని కూడా రిజెక్ట్ చేసానని,పెళ్లి చేసుకొని అమ్మాయి ఇచ్చే కట్న కానుకలతో బ్రతకడం తనకు ఇష్టం లేదని అలా కట్నకానుకలు తీసుకోవడం, అలా తీసుకున్న వారు కూడా నాకు నచ్చరు అంటూ ఈ సందర్భంగా ఆయన ఒక్క రూపాయి కూడా కట్నం తీసుకోకుండా తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నానని తెలిపారు.

Prudhvi Raj: నాకు నా భార్యకు గొడవలు.. ఎనిమిదేళ్లుగా విడిగా ఉంటున్నాం.. కమెడియన్ పృథ్వీ రాజ్ కామెంట్స్ వైరల్!

Prudhvi Raj: కమెడియన్ పృథ్వీ రాజ్ ఎన్నో సినిమాలలో నటుడిగా, కమెడియన్ గా నటించి ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.ఇలా సినిమా ఇండస్ట్రీలో గుర్తింపు పొందిన ఈయన రాజకీయాల్లోకి ప్రవేశించారు.అయితే ఈయన దురుసు ప్రవర్తన కారణంగా రాజకీయాలలో చేదు అనుభవం ఎదుర్కొని ప్రస్తుతం అధికార పార్టీ నుంచి దూరమైన ఇతను జనసేన పార్టీలోకి వెళ్లడానికి ఆసక్తి కనబరుస్తున్నారు.

Prudhvi Raj: నాకు నా భార్యకు గొడవలు ఉన్నాయి.. ఎనిమిదేళ్లుగా విడిగా ఉంటున్నాం.. కమెడియన్ పృథ్వీ రాజ్ కామెంట్స్ వైరల్!

ఈ క్రమంలోనే వైసీపీ పార్టీ నుంచి బయటకు వచ్చిన పృథ్వీ రాజ్ ఆ పార్టీపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు.ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన రాజకీయాల గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. అలాగే తన వ్యక్తిగత విషయాల గురించి కూడా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

Prudhvi Raj: నాకు నా భార్యకు గొడవలు ఉన్నాయి.. ఎనిమిదేళ్లుగా విడిగా ఉంటున్నాం.. కమెడియన్ పృథ్వీ రాజ్ కామెంట్స్ వైరల్!

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన తండ్రి కూడా ఎన్టీఆర్ తో కలిసి ఎన్నో సినిమాలలో నటించారని చెప్పిన పృథ్వీ రాజ్ తన భార్య పిల్లల గురించి కూడా వెల్లడించారు.ప్రస్తుతం తన భార్య పిల్లలు విజయవాడలో ఉంటున్నారని తాను మాత్రం హైదరాబాద్ లో ఉంటున్నానని తెలిపారు. పిల్లలు లైఫ్ లో సెటిల్ అయ్యారు అయితే గత పది సంవత్సరాల నుంచి తనకు తన భార్యకు,తనకు మధ్య గొడవలు జరుగుతున్నాయని ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఆయన తెలిపారు.

తన భార్యతో విడాకులు రాలేదు కానీ గొడవలు ఉన్నాయి…

ఇక తన భార్యతో తనకు విడాకులు రాకపోయినప్పటికీ ఇద్దరి మధ్య గొడవల కారణంగా కోర్టులో కొన్ని కేసులు నడుస్తున్నాయని పృథ్వీ వెల్లడించారు. ఇక తాను చెన్నైలో ఉన్నప్పుడు తనకు దాసరి పద్మ రేఖ అనే మహిళతో పరిచయం అయ్యింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం తాను పద్మ రేఖతో కలిసి ఉంటున్నానని, ప్రస్తుతం తనకంటూ ఎవరైనా ఉన్నారు అంటే అది పద్మ రేఖ మాత్రమేనని ఆవిడ ఎంతో మంచిదని తనకి ఏ సహాయం కావాలన్నా చేయడానికి ముందుంటారు అంటూ పృథ్వీ చేసిన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Viral Video: పవిత్రమైన నదీ స్నానం చేస్తూ భార్యకి ముద్దు పెట్టిన భర్త.. చితక బాదిన జనం.. వీడియో వైరల్!

Viral Video: హిందువులు నదులను ఎంతో పవిత్రంగా భావిస్తారు.ఈ క్రమంలోనే ఎంతోమంది ఈ పవిత్రమైన నదులకు పెద్ద ఎత్తున పూజలు చేస్తూ పవిత్రమైన నదీ స్నానాలు ఆచరించడం వల్ల పుణ్యం కలుగుతుందని భావిస్తారు. అయితే ఈ విధమైనటువంటి పవిత్ర నదీ జలాలలో ఎలాంటి దుశ్చర్యకు పాల్పడిన కఠినమైన చర్యలు తీసుకుంటారు. ఈ క్రమంలోనే ఓ యువకుడు పవిత్ర నదీ స్నానం చేస్తూ తన భార్యకు ముద్దు పెట్టిన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Viral Video: పవిత్రమైన నదీ స్నానం చేస్తూ భార్యకి ముద్దు పెట్టిన భర్త.. చితక బాదిన జనం.. వీడియో వైరల్!

ఉత్తరప్రదేశ్ లోని శ్రీరాముడు జన్మస్థలమైన అయోధ్యలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయోధ్యలో ప్రవహిస్తున్న పవిత్ర నదిలో స్నానం చేయడానికి వెళ్లారు. గంగా నది ఉపనది అయినటువంటి సరయు నదిని ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఇలాంటి పవిత్రమైన నదిలో స్నానం చేయడానికి వెళ్లిన ఈ దంపతులు నదిలో స్నానమాచరిస్తూ ఉండగా భర్త తన భార్యకు ముద్దు పెట్టాడు.

Viral Video: పవిత్రమైన నదీ స్నానం చేస్తూ భార్యకి ముద్దు పెట్టిన భర్త.. చితక బాదిన జనం.. వీడియో వైరల్!

గంగా నది ఉపనదిగా సరియూ నది…

ఈ విధంగా తన భార్యకు ముద్దు పెడుతున్న ఘటనను అక్కడ కొందరు చూసి ఆయన పై దాడికి దిగారు. ఈ క్రమంలోనే కొందరు యువకులు అతనిని బయటికి ఈడ్చుకెళ్లి తనతో గొడవకు దిగడమేకాకుండా ఏకంగా తన పై చేయి కూడా చేసుకున్నారు. ఇదంతా చూస్తున్న భార్య తన భర్తను కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ అతనిపై పెద్దఎత్తున దాడికి ప్రయత్నించారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ వీడియో చూసిన కొందరు తక్షణమే ఈ ఘటనపై దర్యాప్తు జరిపి అవసరమైతే చర్యలు తీసుకోవాలని అధికారులు అయోధ్య పోలీసులకు సూచించారు.ఎంతో పవిత్రమైన శ్రీ రాముడు జన్మస్థలం అయోధ్యలో ప్రవహిస్తూ ఉన్నటువంటి సరియు నదిలో ఇలాంటి ఘటనకు పాల్పడటంతో పలువురు ఈ జంటపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

K.A Paul: చనిపోయిన నా భార్యను దేవుడితో మాట్లాడి బ్రతికించుకున్నా: K.A పాల్

K.A Paul: ప్రజాశాంతి పార్టీ అధినేత కె ఏ పాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన 2019 సార్వత్రిక ఎన్నికలలో భాగంగా ప్రజాశాంతి పార్టీ స్థాపించి పెద్దఎత్తున వార్తల్లో నిలిచారు. అప్పటి నుంచి ఈయన ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా వార్తల్లో నిలుస్తూ ఉన్నారు. ఇక కరోనా సమయంలో ఈయన తన ఇష్ట దైవం గురించి చేసిన వ్యాఖ్యలు మనకు తెలిసిందే.

K.APaul: చనిపోయిన నా భార్యను దేవుడితో మాట్లాడి బ్రతికించుకున్నా: పాల్

తాజాగా కేఏ పాల్ ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో పాల్గొని గతంలో కే ఏ పాల్ చేసిన వ్యాఖ్యల గురించి ప్రశ్నించారు. కరోనా సమయంలో తన భార్య కరోనా సోకీ చనిపోయి తన భార్యను బ్రతికించుకున్నానని ఈయన చేసిన వ్యాఖ్యల పై స్పందించి అసలు విషయం వెల్లడించారు.

K.APaul: చనిపోయిన నా భార్యను దేవుడితో మాట్లాడి బ్రతికించుకున్నా: పాల్

తన భార్య కరోనా సోకిన 2 నెలల పాటు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్న సమయంలో నేను నా మిగతా పనులన్నింటినీ పక్కనపెట్టి కేవలం తన భార్య కోసమే దేవుడిని ప్రార్థించానని తన ప్రార్థనతో తన భార్యను బ్రతికించుకున్నానని ఈ సందర్భంగా పాల్ తెలియజేశారు. తన భార్యను బ్రతికించమని దేవుడికి కండిషన్ పెట్టి నిరంతరం రెండు నెలలపాటు దేవుడి ప్రార్థనలో ఉన్నానని పాల్ వెల్లడించారు.

డ్రగ్స్ లో కూరుకుపోయాయి…

అదేవిధంగా మీ ఇంటర్వ్యూ సందర్భంగా తనకు వచ్చిన భారతరత్న, నోబెల్ అవార్డులు అన్నింటిని తానే రిజెక్ట్ చేశానని పాల్ వెల్లడించారు. అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల గురించి మాట్లాడారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం డ్రగ్స్ కూబిలో ఇరుక్కుపోయిందని రెండు తెలుగు రాష్ట్రాలు ఇలాగే ఉన్నాయని ఆయన రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడారు.

S.S Thaman: మొదటిసారి భార్య పిల్లల గురించి ప్రస్తావించిన తమన్… భార్యతో కలిసి స్టేజి షో చేయాలని ఉంది?

S.S Thaman: ఎస్ ఎస్ తమన్ ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న తమన్ ఈ మధ్య సినిమా అవకాశాలను అందుకొని ఎంతో అద్భుతమైన విజయాలను అందుకుంటున్నారు. తాజాగా ఈయన సంగీత సారథ్యంలో తెరకెక్కిన రాధేశ్యామ్, భీమ్లా నాయక్, అఖండ వంటి సినిమాలు మ్యూజికల్ పరంగా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్నాయి.

S.S Thaman: మొదటిసారి భార్య పిల్లల గురించి ప్రస్తావించిన తమన్… భార్యతో కలిసి స్టేజి షో చేయాలని ఉంది?

ఇకపోతే తాజాగా తమన్ మ్యూజిక్ అందించిన చిత్రం సర్కారు వారి పాట. ఈ సినిమా కూడా మంచి మ్యూజికల్ హిట్ కావడంతో తమన్ ఈ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు.ఇకపోతే ఎప్పుడు తన వ్యక్తిగత విషయాల గురించి ప్రస్తావించని తమన్ తాజాగా తన భార్యా పిల్లల గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ క్రమంలోనే తన భార్య శ్రీ వర్దిని గురించి ఆయన పలు విషయాలను తెలిపారు.

S.S Thaman: మొదటిసారి భార్య పిల్లల గురించి ప్రస్తావించిన తమన్… భార్యతో కలిసి స్టేజి షో చేయాలని ఉంది?

శ్రీ వర్దిని ప్లేబ్యాక్ సింగర్ గా పని చేస్తారని ఆమె ఇప్పటివరకు తన సినిమాలలో నాలుగు పాటలు పాడారని అలాగే, గతంలో యువన్ శంకర్ రాజా, మణి శర్మ వంటి వారి సినిమాలకు పాటలు పాడారని తెలిపారు. అయితే గాయనిగా తనకు ఇంకా మంచి గుర్తింపు రాలేదు. ఆ గుర్తింపు వచ్చినప్పుడు తనతో తప్పకుండా స్టేజ్ షోలు చేస్తానని తమన్ ఈ సందర్భంగా వెల్లడించారు.

S.S Thaman: నాలుగో గ్రేడ్…

ఇక తన కుమారుడు గురించి మాట్లాడుతూ నా ట్యూన్స్ ముందుగా తన కొడుకుకి వినిపిస్తానని ఈ సందర్భంగా తమన్ వెల్లడించారు. పియానోలో నాలుగో గ్రేడ్‌ కూడా పూర్తి చేశాడని తమన్ వెల్లడించారు. ఇక పోతే తన కుమారుడికి ఎలక్ట్రిక్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ వాడటంలో మంచి పట్టు ఉందని , పెద్దయిన తర్వాత తాను ఏ రంగం వైపు అడుగులు వేస్తాడో తనకు తెలియదని ఆ విషయం పూర్తిగా తన నిర్ణయానికే వదిలేస్తానని ఈ సందర్భంగా తమన్ తన కొడుకు గురించి తెలిపారు.

Cricket-rohit sharma: నన్ను పట్టించుకో … ఒకసారి ఫోన్ చేయండి అంటున్న రోహిత్ శర్మ భార్య రితికా..!

Cricket-rohit sharma: సెలబ్రెటీ హోదా ఉన్నవారు ఎక్కువగా కుటుంబానికి సమయం కేటాయించే అవకాశం ఉండదు. ముఖ్యంగా క్రీడాకారులు మరింతగా ఇంటికి దూరంగా ఉండాల్సి వస్తుంది. వివిధ టోర్నీలకతో బిజీగా ఉంటారు. ఒక్కోసారి కట్టుకున్న భార్యతో మాట్లాడే సమయం కూడా ఉండదు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్శ కూడా దీనికి అతీతం కాదు. తాజాగా భార్య రితికా మిస్ కాల్ ఇచ్చినా.. రోహిత్ స్పందించకపోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

Cricket-rohit sharma: నన్ను పట్టించుకో … ఒకసారి ఫోన్ చేయండి అంటున్న రోహిత్ శర్మ భార్య రితికా..!

తాజాగా బీసీసీఐ అన్ని క్రికెట్ ఫార్మాట్లకు రోహిత్ శర్మను కెప్టెన్ గా ప్రకటించింది. దీంతో వరస టోర్నీలతో రోహిత్ శర్మ బిజీగా ఉంటున్నాడు. ఇప్పటికే స్వదేశంలో వెస్టిండీస్ తో వన్డే, టీ20 సిరీస్ లు జరిగాయి. దీని తర్వాత.. లంక జట్టు ఇండియాలో టూర్ కు రాబోతున్నారు. దీంతో వరస టోర్నీలు, బిజీ షెడ్యూల్ తో రోహిత్ శర్మ బిజీగా ఉన్నారు.

Cricket-rohit sharma: నన్ను పట్టించుకో … ఒకసారి ఫోన్ చేయండి అంటున్న రోహిత్ శర్మ భార్య రితికా..!

ఇటీవల వెస్టిండీస్ తో జరిగిన వన్డే, టీ20 సిరీస్ లను క్లీన్ స్వీప్ చేసిన రోహిత్ సేన మరింత ఉత్సాహంతో ఉన్నారు. తను నాయకత్వం వహించిన సీరీస్ క్లీన్ స్వీప్ చేయడంతో రోహిత్ శర్మ ఫుల్ జోష్ లో ఉన్నారు. 

రోహిత్ నీ భార్యను కాస్త పట్టించుకో:

ఇదిలా ఉంటే… టీమిండియా కెప్టెన్‌ హోదాలో ఫుల్‌ జోష్‌లో​ ఉన్న రోహిత్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫోటోలను షేర్‌ చేశాడు. ఫోటోలతో పాటు ”తర్వాతి టార్గెట్‌ లంక అని.. నెక్ట్స్‌ అప్‌.. బీ రెడీ” అంటూ క్యాప్షన్‌ జత చేశాడు. ఇది చూసిన భార్య రితికా.. రోహిత్‌ను ఉద్దేశించి ఫన్నీ క్యాప్షన్‌ రాసుకొచ్చింది. ”అంతా గ్రేట్‌గా కనిపిస్తుంది.. ప్లీజ్‌ నాకు ఒకసారి ఫోన్‌ చేయ్‌” అంటూ పేర్కొంది. ఇది చూసిన క్రికెట్‌ ఫ్యాన్స్‌ రితికా శర్మ మెసేజ్‌కు లైక్‌లు, షేర్స్‌ కొడుతూ కామెంట్‌ చేశారు. ”రోహిత్‌ నీ భార్యను కాస్త పట్టించుకో.. ఎంత కెప్టెన్‌ అయితే మాత్రం కట్టుకున్న భార్యను మరిచిపోతావా” అంటూ పేర్కొన్నారు.

Nikhil: నిఖిల్ ప్రపోజ్ చేసిన నేను నమ్మలేదు… ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన నిఖిల్ భార్య పల్లవి!

Nikhil: హ్యాపీడేస్ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటుడు నిఖిల్ ఆ తర్వాత ఎన్నో అద్భుతమైన చిత్రాలను ద్వారా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఈ క్రమంలోనే నిఖిల్ 2020సంవత్సరంలో తాను ప్రేమించిన అమ్మాయి డాక్టర్ పల్లవిని వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఇప్పటివరకు నిఖిల్ తన భార్యతో కలిసి ఏ ఇంటర్వ్యూలలో పాల్గొనలేదు.

మొదటిసారిగా వాలెంటైన్స్ డే సందర్భంగా నిఖిల్ తన భార్యతో కలిసి ఇంటర్వ్యూలో పాల్గొని ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ క్రమంలోనే నిఖిల్, పల్లవి గురించి ఎన్నో ప్రశ్నలు అడుగుతూ వారి గురించి ఆసక్తికరమైన సమాధానాలు రాబట్టారు. ఈ క్రమంలోనే ఒక డాక్టర్ మరొక యాక్టర్ మధ్య ప్రేమ ఎలా చిగురించింది అనే విషయాలను ఇంటర్వ్యూలో వెల్లడించారు.

Nikhil: నిఖిల్ ప్రపోజ్ చేసిన నేను నమ్మలేదు… ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన నిఖిల్ భార్య పల్లవి!

ఇక ఈ ఇంటర్వ్యూలో భాగంగా యాంకర్ వీరిద్దరిని ఎన్నో ప్రశ్నలు అడిగారు అసలు ఎక్కడ పరిచయం ఏర్పడింది మీ ఇద్దరికీ అని అడగగా నిఖిల్ పార్టీలో చూశానని అక్కడున్న వారందరి లో చాలా స్పెషల్ గా కనిపించడంతో తన వెనకే తిరిగాననీ నిఖిల్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.ఇక ఇన్స్టాగ్రామ్ ద్వారా తనతో చాటింగ్ చేస్తూ అలా ఫోన్ నెంబర్ తీసుకున్నట్లు కూడా తెలియజేశారు.

Nikhil: నిఖిల్ ప్రపోజ్ చేసిన నేను నమ్మలేదు… ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన నిఖిల్ భార్య పల్లవి!

పల్లవి స్మైల్ అంటే ఇష్టం..

మొట్టమొదటిసారి నిఖిల్ ని కలిసిన తర్వాత ఆయనతో మాట్లాడగా తను నాకు ప్రపోజ్ చేశారని, ఇలా నిఖిల్ ప్రపోజ్ చేసినప్పుడు నేను నమ్మలేదని పల్లవి ఈ సందర్భంగా తెలియజేశారు. ఎందుకు నమ్మలేదు అని ప్రశ్నించగా ఎందుకో అలా జరిగిపోయింది ఆయన సీరియస్ గా తీసుకోలేదేమో అనుకున్నాను అంటూ పల్లవి ఈ ఇంటర్వ్యూలో తెలియజేశారు. అదేవిధంగా వీరిద్దరి మధ్య ఉన్న అనుబంధం గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ఇంటర్వ్యూ ద్వారా చెప్పుకొచ్చారు. పల్లవిలో మీకేం నచ్చింది అని ప్రశ్నించగా తన నవ్వు చాలా ఇష్టం అసలు కోప్పడదూ అంటూ నిఖిల్ తన భార్య గురించి చెప్పుకొచ్చారు.

Upasana: పెళ్ళిలు స్వర్గంలో కాదు.. భూమిపై నిర్ణయించబడతాయి..ఉపాసన కొణిదెల!

Upasana: ప్రేమించడం.. ప్రేమలో పడటం అనేది ఎవరికైనా సులభంగానే ఉంటుంది. అయితే ఆ ప్రేమలో చాలా కాలం ఉండటం అనేది కొంతమందికే సాధ్యం అవుతుంది. పార్క్ లో సాయంత్రం వేల అలా.. సరదాగా కాలక్షేపం చేసినంత సులభంగా మాత్రం ప్రేమలో ఉండటం కుదరదు అని.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన అన్నారు.

Upasana: పెళ్ళిలు స్వర్గంలో కాదు.. భూమిపై నిర్ణయించబడతాయి..ఉపాసన కొణిదెల!

ప్రేమికులు దినోత్సవం సందర్భంగా ఆమె నెటిజన్లతో ముచ్చటించారు. ప్రస్తుతం ఆమె మాట్లాడిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఆమెకు వివాహం అయి దాదాపు 10 సంవత్సరాలు పూర్తయిందని.. మా ఇద్దరి మధ్య ప్రేమ ఇంత అన్యోనంగా ఉండటానికి గల కారణం ఏంటో చెప్పారు. ఆ రహస్యాన్ని నెటిజన్లతో పంచుకున్నారు.

Upasana: పెళ్ళిలు స్వర్గంలో కాదు.. భూమిపై నిర్ణయించబడతాయి..ఉపాసన కొణిదెల!

నీ అది ఎప్పటికీ నిజం కాదు అని..

అంతే కాదు జీవిత భాగస్వామితో ఎక్కువ కాలం సుఖంగా ఉండాలంటే ఏం చేయాలనే విషయాన్ని కూడా చెప్పారు. ప్రేమికుల దినోత్సవం తనకు ప్రత్యేకమైనది అని చెబుతూ.. బంధం బలంగా ఉండేందుకు కొన్ని టిప్స్ చెప్పారు. అవి ఏంటంటే.. ఆరోగ్యంగా ఉంటే ఏ పని అయినా చేయగలం. కాబట్టి ఆరోగ్యంపై ఎక్కువగా శ్రద్ధ వహించాలని చెప్పారు. దానికే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ప్రతీ రోజు వ్యాయామం చేయడం కూడా ముఖ్యమంటూ చెప్పుుకొచ్చారు. తమ భాగస్వామితో కొత సమయాన్ని అయినా స్పెండ్ చేయాలని.. దీనిని అలవాటు చేసుకోవాలని చెప్పారు. ఖాళీ సమయం దొరికితే.. డిన్నర్ డేట్, సినిమాలు చూడటం లాంటి పనులు పెట్టుకోవాలని అన్నారు. ఇక ప్రతీ ఒక్కరి పెళ్లి స్వర్గంలో నిర్ణయిస్తారు(Marriages Are Made In Heaven) అని అంటుంటారు. కానీ అది ఎప్పటికీ నిజం కాదు అని.. ఇద్దరు వ్యక్తులు మనసు పడి..భూమిపైనే శ్రమిస్తే.. ఆ వివాహం అవుతుందని.. శ్రమ ఒక్కటే వివాహానికి పునాది అంటూ చెప్పారు. ఇక అంతే కాకుండా ఎదుటి వ్యక్తిపై ఎక్కువగా ప్రేమ, గౌరవం చూపించాలని.. అప్పుడే మనస్సు ప్రశాంతంగా ఉంటుందన్నారు.