S.S Thaman: ఎస్ ఎస్ తమన్ ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న తమన్ ఈ మధ్య సినిమా అవకాశాలను అందుకొని ఎంతో అద్భుతమైన విజయాలను అందుకుంటున్నారు. తాజాగా ఈయన సంగీత సారథ్యంలో తెరకెక్కిన రాధేశ్యామ్, భీమ్లా నాయక్, అఖండ వంటి సినిమాలు మ్యూజికల్ పరంగా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్నాయి.
ఇకపోతే తాజాగా తమన్ మ్యూజిక్ అందించిన చిత్రం సర్కారు వారి పాట. ఈ సినిమా కూడా మంచి మ్యూజికల్ హిట్ కావడంతో తమన్ ఈ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు.ఇకపోతే ఎప్పుడు తన వ్యక్తిగత విషయాల గురించి ప్రస్తావించని తమన్ తాజాగా తన భార్యా పిల్లల గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ క్రమంలోనే తన భార్య శ్రీ వర్దిని గురించి ఆయన పలు విషయాలను తెలిపారు.
శ్రీ వర్దిని ప్లేబ్యాక్ సింగర్ గా పని చేస్తారని ఆమె ఇప్పటివరకు తన సినిమాలలో నాలుగు పాటలు పాడారని అలాగే, గతంలో యువన్ శంకర్ రాజా, మణి శర్మ వంటి వారి సినిమాలకు పాటలు పాడారని తెలిపారు. అయితే గాయనిగా తనకు ఇంకా మంచి గుర్తింపు రాలేదు. ఆ గుర్తింపు వచ్చినప్పుడు తనతో తప్పకుండా స్టేజ్ షోలు చేస్తానని తమన్ ఈ సందర్భంగా వెల్లడించారు.
ఇక తన కుమారుడు గురించి మాట్లాడుతూ నా ట్యూన్స్ ముందుగా తన కొడుకుకి వినిపిస్తానని ఈ సందర్భంగా తమన్ వెల్లడించారు. పియానోలో నాలుగో గ్రేడ్ కూడా పూర్తి చేశాడని తమన్ వెల్లడించారు. ఇక పోతే తన కుమారుడికి ఎలక్ట్రిక్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ వాడటంలో మంచి పట్టు ఉందని , పెద్దయిన తర్వాత తాను ఏ రంగం వైపు అడుగులు వేస్తాడో తనకు తెలియదని ఆ విషయం పూర్తిగా తన నిర్ణయానికే వదిలేస్తానని ఈ సందర్భంగా తమన్ తన కొడుకు గురించి తెలిపారు.
విదేశాల్లో మంచి ఉద్యోగం అనే ఆశతో నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని భారీ మోసాలకు పాల్పడుతున్న గ్యాంగ్ను హైదరాబాద్ పోలీసులు బయటపెట్టారు.…
మెదక్ జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రంగా మారడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. శివంపేట…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశ ప్రధాని నరేంద్ర మోదీకు బహిరంగ లేఖ రాయడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.…
సినిమా ఇండస్ట్రీలో హీరో–హీరోయిన్ల మధ్య వయసు తేడా ఇప్పుడు పెద్దగా చర్చనీయాంశం కాకపోయినా, కొంతమంది నటులు మాత్రం తమ వ్యక్తిగత…
హైదరాబాద్ నగరంలో పోలీస్ కస్టడీలో ఉన్న ఓ మహిళా రిమాండ్ ఖైదీ ఆస్పత్రి నుంచి తప్పించుకోవడం కలకలం రేపింది. భద్రతా…
తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో నిర్వహించే గరుడ వాహన సేవకు భక్తుల్లో ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది. ఈ…