Tag Archives: wife

ఢిల్లీ ఎయిమ్స్ లో చేరిన కెసిఆర్ భార్య శోభ.. కుటుంబం మొత్తం ఢిల్లీలోనే..!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి శోభ ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరారు. గతంలో ఈమె కరోనా బారిన పడిన సంగతి అందరికీ తెలిసిందే. కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఈమెకు ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు.ఈ క్రమంలోనే హైదరాబాద్ లోని పలు ఆసుపత్రిలో ఈమెకి చికిత్స చేయించినప్పటికీ కొందరు డాక్టర్ల సూచన ప్రకారం ఢిల్లీ
ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియాను కలవమని సలహా ఇచ్చారు.

ఈ క్రమంలోనే తన కొడుకు కేటీఆర్ కూతురు కవితతో కలిసి కేసీఆర్ సతీమణి శోభ శుక్రవారం ఢిల్లీకి వెళ్లారు.పరీక్షల నిమిత్తం వీరు శనివారం తిరిగే హైదరాబాద్ చేరుకోవాల్సి ఉండగా పరీక్ష ఫలితాలను చూసిన అనంతరం డాక్టర్ ఇన్ పేషెంట్ గా ఆస్పత్రిలో చేరాల్సిందిగా సూచించారు. ఈ క్రమంలోనే డాక్టర్ల సూచన మేరకు ఈమె ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు.

ఇక విషయం తెలిసిన కేసీఆర్ ఆదివారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్నారు. ఇలా కుటుంబం మొత్తం ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారు. ఇకపోతే ఈమెను కేవలం అబ్జర్వేషన్ లో ఉంచడం కోసమే అడ్మిట్ చేశారని శోభమ్మ ఆరోగ్య విషయంలో ఏ మాత్రం కంగారు పడాల్సిన పని లేదని వైద్యులు వెల్లడించారు.

కరోనా సెకండ్ వేవ్ సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా బారిన పడిన వెంటనే ఆయన సతీమణి శోభమ్మ, కొడుకు కేటీఆర్, కూతురు కవిత కూడా కరోనా బారినపడ్డారు. అయితే వీరందరూ కోలుకున్నప్పటికీ కేసీఆర్ సతీమణి మాత్రం ఊపిరితిత్తుల సమస్యతో బాధ పడటం వల్ల ఈమెకు ఢిల్లీలోని వైద్య పరీక్షలు నిర్వహించినట్లు తెలుస్తోంది.

పునీత్ స్థానం చూసి కళ్లలో నీళ్లు తిరిగాయి.. భర్త మరణం తర్వాత పునీత్ భార్య ఎమోషనల్ పోస్ట్ !

పునీత్ రాజ్ కుమార్ నటుడే కాదు.. ఎన్నో సేవా కార్యక్రమాలలో భాగస్వాముడు కూడా. ఆయన ఆధ్వర్యంలో 26 అనాథాశ్రమాలు, 25 పాఠశాలలు, 15 వృద్ధాశ్రమాలు, 19 గోశాలలు నడుస్తున్నాయి. 1800 మంది పేద విద్యార్ధులకు ఆయన చదువు చెప్పిస్తున్నారు. మైసూరులో బాలికా విద్యార్ధినులతో కూడిన శక్తి ధామ అనే ఓ అతిపెద్ద స్వచ్ఛంద సంస్థను కూడా ఆయన నడుపుతున్నారు.

ఇంకా ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. అయినా ఆ సేవలను ప్రచారం చేసుకోవడానికి అతడు ఏ మాత్రం ఇష్టపడలేదు. ఇంత గొప్ప వ్యక్తి మరణం ఎవరినీ జీర్ణించుకోలేక చేసింది. నిన్న జరిగిన సంస్మరణ సభలో దక్షిణాది నుంచి చాలామంది నటీనటులు పాల్గొని.. అతడికి నివాళులు అర్పించారు. ఎంతో మంది ఈ సభలో కన్నీటి పర్యంతం అయ్యారు.

అయితే భర్త మరణం తర్వాత రాజ్ కుమార్ భార్య అశ్విని తొలిసారి ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఓ లేఖను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇన్ స్టాగ్రామ్ లో అశ్విని అంతగా యాక్టివ్ గా ఉండరు. అయినా ఆమె ఆ పోస్టును చేయడానికి ఇన్ స్టాగ్రామ్ ఖాతాను ఓపెన్ చేసి తొలిపోస్ట్ ను పునీత్ కు అంకితమిచ్చారు. పునీత్ ఈ అకాల మరణం కర్టాటక ప్రజలను షాక్ కు గురి చేసిందని.. చెప్పుకొచ్చారు అశ్విని ఆ లేఖలో.

పునీత్ కు ప్రజలు, అభిమానులు అంతిమ వీడ్కోలు పలికారని తెలిపారు. పునీత్ ను ఫాలో అవుతూ.. ఎంతో మంది నేత్రదానం చేయడానికి ముందుకు వస్తున్నారని.. అతడిపై ఉన్న అభిమానం చూస్తుంటూ కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయని ఆమె తెలిపారు. భౌతికంగా పునీత్ దూరం అయినా.. అభిమానుల గుండెల్లో ఎప్పుడూ సజీవంగానే ఉంటారని ఆమె భావోద్వేగపూరితమైన లేఖను షేర్ చేశారు.

ట్రాన్స్ జెండర్ తో స్నేహం చేశా.. ఆ విషయంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా: మెగా కోడలు ఉపాసన

ఉపాసన పేరు అందరికీ తెలిసే ఉంటుంది. మెగస్టార్ తనయుడు రామ్ చరణ్, ఉపాసన 2012లో వివాహం చేసుకున్న విషయం విధితమే. ఆమెకు పెళ్లి కాకముందే ఎన్నో బిజినెస్ లను చూసుకునేదట. ప్రస్తుతం ఆమె అపోలో సంస్థల అధినేతగా, ఫిట్నెస్ ఎక్స్పర్ట్ గా, సోషల్ వర్కర్ గా ఆమె పలు రంగాలలో రాణిస్తున్నారు.

ఆమె ఓ మ్యాగజైన్ ను కూడా నడుపుతున్నారు. ఇటీవల ఆమె ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. సమస్యలు అనేవి అందరికీ ఉంటాయి. ఉన్నత కుటుంబంలో పుడితే సమస్యలు ఉండవు అనేది కరెక్ట్ కాదని చెప్పింది. కొంతమంది చెప్పుకుంటారు.. మరికొంత మంది చెప్పుకోలేరు అంటూ చెప్పింది. ఇక ఆమె వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడుతూ ఇలా చెప్పింది..

తాను మొదట్లో లావుగా ఉన్నానని.. ఎంతో మంది నన్ను మనస్సును గాయపరిచే విధంగా మాట్లాడరని.. ప్రస్తుతం లావు తగ్గి.. ఇలా ఉన్నానని చెప్పింది. అయితే ఇప్పుడు నన్ను చూసి ఎంతో అందంగా ఉన్నవ్ అంటూ పొగుడుతున్నారని.. కానీ ఆ పొగడ్తను తాను తీసుకోలేకపోతున్నాను అంటూ చెప్పుకొచ్చింది. తాను లావు తగ్గడానికి ఎంతో కష్టపడ్డానని.. జిమ్ లు, ఆహార నియమాలు పాటించానని చెప్పారు.

కెరీర్ లో అయినా.. బలంలో అయినా ఆడవాళ్లకు, మగవాళ్లకు మధ్య తేడా లేదని.. ఎవరి బాలాలు వాళ్లకు ఉంటాయని చెప్పుకొచ్చింది. అంతెందుకు తన బెస్ట్ ఫ్రెండ్ ఓ ట్రాన్స్ జెండర్ అని.. తను ఏ విషయంలో కూడా డల్ గా ఉండరని.. ప్రతీ విషయంలో ఎంతో చురుకుగా ఉంటారని చెప్పారు ఉపాసన. ఇక పిల్లల గరించి అడినప్పుడు అది తన వ్యక్తిగతం అని చెప్పుకొచ్చారు.

పిల్లలను ఎప్పుడు కంటారు అని రిపోర్టర్ అడిగితే.. ఉపాసన ఎం చెప్పారో తెలుసా?

తెలుగు సినిమాలో బెస్ట్ అండ్ క్యూట్ కపుల్స్ లో చెప్పుకోదగిన జంట రామ్ చరణ్, ఉపాసన. ఎంతో అన్యోన్యంగా ఉంటుంది ఈ జంట. వీరికి పెళ్లై ఎనిమిదేళ్ళు అవుతోంది. అయితే ఇంకా పిల్లల విషయంలో ఎలాంటి ప్లాన్ చేసుకోలేదు. అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇలా అందరూ ఒకే పీరియడ్‌లో పెళ్లిళ్లు చేసుకున్నారు.

అయితే ఇందులో రామ్ చరణ్ తప్పా మిగిలిన హీరోలిద్దరూ తండ్రులు అయ్యారు. దీంతో ఎక్కడికెళ్ళినా పిల్లలు ఎప్పుడనే ప్రశ్న ఉపాసనకు ఎదురవుతోంది. ఈ క్రమంలో తాజాగా ఓ ఛానల్‌‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పిల్లల విషయంలో క్లారిటీ ఇచ్చింది ఉపాసన. పిల్లల విషయం ఎందుకు లేట్ చేస్తున్నారంటూ ప్రశ్నించగా.. ఆ ప్రశ్నకు ఆమె కాస్త అసహనానికి లోనయింది.

జూనియర్ రామ్ చరణ్.. జూనియర్ ఉపాసన ఎప్పుడు వస్తుందని అభిమానులు ఎదురు చూస్తున్నారు. దానికి మీ సమాధానం ఏంటి? అని యాంకర్ అడిగింది. దానికి ఉపాసన కాస్త ఘాటుగా స్పందించింది. పిల్లల విషయం తన వ్యక్తిగతమని చెప్పుకొచ్చింది ఉపాసన. దీనిపైన చాలామంది అడుగుతున్నప్పటికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని ఆమె స్పష్టం చేసింది.

ఇప్పుడు నేను దాని మీద ఎలా స్పందించినా కూడా మీడియాలో సెన్సేషన్ అవుతుంది. అనుకునే వాళ్లు ఏదైనా అనుకోనివ్వండి.. నేను దీనికి సమాధానం చెప్పను. మీరు ఏమనుకున్నా నాకు అభ్యంతరం లేదు. దీనికి సరైన సమాధానం చెప్పే రోజు ఒకటి వస్తుందని తెలిపింది. కాగా రామ్ చరణ్ నటించిన సినిమాలలో రంగస్థలం చిత్రం తనకెంతో ఇష్టమని వెల్లడించింది ఉపాసన.

‘నీ పెళ్లాం ఏదిరా.. ’’ ఆనంద్ ను ప్రశ్నించిన విజయ్ దేవరకొండ.. ఆనంద్ సమాధానం ఏంటో తెలుసా..?

విజయ్ దేవరకొండ ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో మాస్ ప్రేక్షకులకు దగ్గర అవ్వడమే కాకుండా యూత్ లో ఓ ట్రెండ్ ను సెట్ చేశాడు. ఆ సినిమా నుంచే అతడికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. అయితే ఇటీవల విజయ్ దేవరకొండ నిర్మాతగా అవతారమెత్తిన విషయం తెలిసిందే. అతడు తన సినిమాల షూటింగ్ లకు హాజరవుతూనే.. ఇటు నిర్మాణ బాధ్యతలను చూస్తున్నాడు.

అయితే తన సోదరుడు ఆనంద్ దేవరకొండ హీరోగా.. విజయ్ నిర్మించిన చిత్రం ‘పుష్పక విమానం’. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్లలో విజయ్ దేవరకొండ ఫుల్ బిజీ అయిపోయాడు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. దీంతో విజయ్ అభిమానుల కేరింతలతో వైజాగ్ లో ఆ ప్రదేశం అంతా సందడిగా మారింది.

తనను ఆదిరించినట్లే తన సోదరుడు ఆనంద్ ను కూడా ఆదిరించాలని అభిమానులను కోరాడు. ఈ ఈవెంట్ కు ముందు ఆ చిత్ర సభ్యులు ఓ హోటల్లో బస చేశారు. అందులో విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ ఇద్దరూ కలిసి ఒకే బెడ్ ను షేర్ చేసుకున్నారు. దీనిని ఉదయం లేవగానే విజయ్ నాతో ఈ రోజు బెడ్‌ షేర్‌ చేసుకుంది ఎవరో చూడండి అంటూ కెమెరాను తన పక్కనే పడుకున్ వ్యక్తి వైపు తిప్పుతూ.. దుప్పటిని లాగాడు.

అందులో ఉన్నది అతడి సోదరుడు ఆనంద్. కెమెరా అతడివైపు చూపిస్తూ.. నీ పెళ్లాం ఎక్కడరా.. అంటూ అడుగుతాడు విజయ్ దేవరకొండ. నిద్ర మత్తులో ఉన్న ఆనంద్ కొద్దిగా చిరాకు పడతాడు. నువ్వెందుకు ఇక్కడ పడుకున్నావ్.. నీ పెళ్లాం ఏదిరా అంటూ విజయ్ అడుగుతాడు. దానికి అతడు.. కొద్ది సేపు కెమెరా వైపు చూసి.. ‘లేచిపోయిందిరా భయ్’ అంటూ చెబుతాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

దారుణం: భర్తను చంపి జైలుకెళ్లి లొంగిపోయిన భార్య.. ఎక్కడంటే?

ప్రస్తుత కాలంలో భార్య భర్తల మధ్య ఏ చిన్నపాటి మనస్పర్థలు వచ్చినా అవి ఎన్నో సమస్యలకు కారణమవుతున్నాయి. ఈ క్రమంలోనే తొందరపాటు నిర్ణయం వల్ల ఎందరో ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. తాజాగా ఇలాంటి క్షణికావేశం ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుని చివరికి బిడ్డను ఒంటరి పాలు చేసిన ఘటన హైదరాబాద్లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు…

హైదరాబాదులోని సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భాగంగా గత కొంత కాలం నుంచి మురళీధర్ రెడ్డి, మౌనిక అనే దంపతులు నివసిస్తున్నారు. వీరికి 11 సంవత్సరాల క్రితం వివాహం జరగగా తొమ్మిది సంవత్సరాల బాబు ఉన్నాడు. గత 11 సంవత్సరాల నుంచి వీరి మధ్య ఎలాంటి గొడవలు లేకుండా ఎంతో సంతోషంగా ఉన్నారు.

అయితే గత కొద్దిరోజుల నుంచి భార్యాభర్తల మధ్య ప్రతి చిన్న విషయంలోనూ మనస్పర్థలు చోటు చేసుకున్నాయి. ఇలా వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. ఈ క్రమంలోనే గత రెండు రోజుల క్రితం మరోసారి భార్యాభర్తల మధ్య గొడవ చోటుచేసుకోవడంతో ఆవేశంలో మౌనిక వంటగదిలో కూరగాయలు కట్ చేసే కత్తితో తన భర్తపై విచక్షణారహితంగా దాడి చేసింది.

ఈ క్రమంలోని తన భర్త పట్ల ఎంతో దారుణంగా ప్రవర్తించిన మౌనిక తిరిగి పోలీస్ స్టేషన్ కి వెళ్లి జరిగిన విషయం చెప్పి ఆమె పోలీసుల ఎదుట లొంగిపోయింది. ఈ క్రమంలోనే పోలీసులు కేసు నమోదు చేసుకుని తనని అరెస్ట్ చేశారు.

వామ్మో.. పెళ్లికి ముందే ఎన్టీఆర్ కు తన భార్య ఇన్ని కండిషన్లు పెట్టిందా?

సాధారణంగా ప్రతి ఒక్కరి జీవితంలో వివాహమనేది ఎంతో కీలకమైన ఘట్టం.వివాహం తర్వాత ప్రతి ఒక్కరు తమ భర్త అలా ఉండాలని తమ భార్య అలా ఉండాలని కోరుకుంటారు. ఈ క్రమంలోనే వివాహం చేసుకున్న తర్వాత ఎంతోమంది అబ్బాయిలు అమ్మాయిలలో మార్పులు రావడం మనం చూస్తుంటాము. ఇలా వివాహం తర్వాత చాలా మందిలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి.వివాహం జరిగి ఒక వ్యక్తి మన జీవితంలోకి వచ్చిన తర్వాత వారి పెట్టె కొన్ని కండిషన్స్ కూడా మనం భరించాల్సి ఉంటుంది.

తాజాగా నటుడు ఎన్టీఆర్ గురించి ఒక ఆసక్తికరమైన విషయం బయటపడటంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందరి జీవితంలో మాదిరిగానే ఎన్టీఆర్ జీవితంలో కూడా వివాహం ఎన్నో మార్పులను తీసుకు వచ్చిందని చెప్పవచ్చు.వివాహానికి ముందే ఎన్టీఆర్ భార్య లక్ష్మీప్రణతి తనకు ఎన్నో కండిషన్స్ పెట్టిందని వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వివాహానికి ముందు లక్ష్మీ ప్రణతి ఎలాంటి కండిషన్లు పెట్టిందిఅనే విషయానికి వస్తే… వివాహం జరిగిన తర్వాత ఎక్కువగా స్నేహితులతో తిరగకుండా ఉండాలని కండిషన్ పెట్టిందట. అదేవిధంగా అవుట్ డోర్ షూటింగ్ ఉన్న సమయంలో తన వస్త్రధారణ విషయంలో పూర్తి బాధ్యత తాను తీసుకుంటానని, అలాగే భోజనం విషయంలో కూడా స్పెషల్ కేర్ తీసుకుంటానని ప్రణతి కండిషన్లు పెట్టినట్టు తెలుస్తోంది.

ఇక పెళ్లి తర్వాత ఎన్టీఆర్ లక్ష్మీప్రణతి తన కోసం కనీసం ఒక రెండు నెలల సమయాన్ని కేటాయించాలని ఎన్టీఆర్ ను కోరినట్లు తెలుస్తోంది. ఇలా ప్రతి తన భర్త పట్ల ఎంతో శ్రద్ధ చూపించడంతో భార్య అంటే ఇలా ఉండాలి అనే విధంగా లక్ష్మీ ప్రణతి నడుచుకోవడంతో ఎన్టీఆర్ అభిమానులు తెగ సంబర పడిపోతున్నారు.

పక్కింటి వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్న భార్య.. విషయం తెలిసిన భర్త ఏం చేశాడంటే?

ప్రస్తుత కాలంలో ఒకరి భార్య మరొకరికి భర్తతో మరొకరి భార్య వేరొకరి భర్తతో వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం అధికమయ్యాయి. ఈ క్రమంలోనే ఇలాంటి వివాహేతర సంబంధాలు ఉండటం వల్ల రోజుకు ఎంతో మంది హత్యలకు గురవుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటన రాజమహేంద్రవరంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే…

రాజమహేంద్రవరంలోని బొమ్మూరు బత్తిన నగర్ కు చెందిన దుర్గాప్రసాద్ అనే వ్యక్తి నగరంలోనీ ఓ ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలో పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ దంపతులకు ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. ఇదిలా ఉండగా వీరి పక్క వాడలో నివసిస్తున్న అటువంటి రమేష్ అనే వ్యక్తితో దుర్గాప్రసాద్ భార్య అక్రమ సంబంధం పెట్టుకుంది. అయితే ఈ విషయం ఆ నోటా ఈ నోటా పాకి చివరికి దుర్గాప్రసాద్ కు తెలిసింది.

ఈ క్రమంలోనే తన భార్య గురించి తెలుసుకున్న దుర్గాప్రసాద్ ఎంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆమెతో తీవ్రంగా గొడవ పడ్డాడు.ఈ క్రమంలోనే తన భార్య పిల్లలను తన పుట్టింటికి పంపించిన దుర్గాప్రసాద్ ఎలాగైనా రమేష్ ను హత్య చేయాలని భావించాడు. దుర్గా ప్రసాద్ పథకం ప్రకారమే మరొక ఇద్దరి సహాయంతో రమేష్ హత్యకు ప్లాన్ వేశారు.

ఆదివారం దేవి చౌక్ ప్రాంతానికి వచ్చిన దుర్గాప్రసాద్ ను వెంబడించి లింగంపేట వాంబే కాలనీ వద్దకు రాగానే కత్తితో అతనిపై దాడి చేసి అక్కడ నుంచి పరారైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ సమాచారాన్ని పోలీసులకు చేరవేయగా అప్పటికే రమేష్ మృతి చెందినట్లు పోలీసులు పేర్కొన్నారు.ఇక హంతకులు ఎవరు అనే విషయం గురించి పోలీసులు ఆరా తీస్తూ ఆ రోజు సాయంత్రానికి హంతకుడు దుర్గా ప్రసాద్ ను పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు.

ఆరువేల కోసం గొడవ పడిన భార్య భర్త.. చివరికి ఏం చేశారంటే?

సాధారణంగా భార్యాభర్తల మధ్య చిన్నపాటి గొడవలు మనస్పర్థలు రావడం సర్వసాధారణం.అయితే ఇలాంటి గొడవలు వచ్చిన సమయంలో ఎవరో ఒకరు సర్దుకుని ముందుకు వెళితే వారి సంసారం పదికాలాలపాటు పచ్చగా ఉంటుంది.కానీ ప్రస్తుత కాలంలో ఏ చిన్నపాటి గొడవ జరిగినా క్షణికావేశంలో ఎంతో కఠినమైన నిర్ణయాలు తీసుకొని బంగారంలాంటి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే కామారెడ్డి జిల్లాలో ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు…

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గోసాంగికాలనీకి చెందిన కోదండం సాయిలు, పోచవ్వ దంపతులకు 8 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది అయితే ఈ దంపతులకు పిల్లలు లేరు. ఈ క్రమంలోనే ఈ దంపతుల మద్య అక్టోబర్ 27వ తేదీ రాత్రి ఆరువేల డబ్బుల విషయంలో గొడవ చోటుచేసుకుంది.ఈ క్రమంలోనే 28వ తేదీ ఉదయం మరోసారి డబ్బు గురించి గొడవ పడిన భార్య భర్తలు ఆ రోజు సాయంత్రానికి కనిపించకుండా వెళ్లిపోయారు.

ఈ క్రమంలోనే దంపతుల కోసం అన్ని చోట్ల గాలించిన బంధువులు చివరికి మిస్సింగ్ కేసు కింద పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి వీరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే ఈ దంపతుల కోసం గాలింపు చర్యలు చేపట్టగా ఆదివారం సాయంత్రం రాజనగర్ ప్రాంతంలోని చర్చి కాలనీలో వీరి మృతదేహాలు బయటపడ్డాయి.

సాయిలు ఒంటికి పట్టించుకోని ఆత్మహత్యకు పాల్పడగా పోచవ్వ పక్కనే ఉన్న కొలనులో దూకి ఆత్మహత్య చేసుకుంది. అయితే అక్కడ వదిలేసినటువంటి వీరి చెప్పులు, దుస్తులు ఆధారంగా పోలీసులు వీరిని గుర్తించారు. ఇలా చిన్న విషయానికి గొడవపడి ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకోవడంతో ఇరు కుటుంబాల మధ్య పెద్దఎత్తున విషాదఛాయలు అలుముకున్నాయి.

భార్య ఉండగా.. ఓ అమ్మాయితో రొమాన్స్ చేసిన సీరియల్ నటుడు..

తెలుగు సినీ పరిశ్రమలో టాప్‌ సీరియల్స్‌లో ఒకటి మొగలిరేకులు. దీనిలో దయా అలియాస్ పవిత్ర నాథ్ నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. అయితే అతడి చీకటి వ్యవహారాన్ని అతడి భార్య శశిరేఖ బయటపెట్టింది. మొగలిరేకులు సీరియల్‌లో దయ పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న పవిత్ర నాథ్‌ రియల్‌ లైఫ్‌లో మాత్రం విలన్‌ అని ఆయన భార్య శశిరేఖ పేర్కొంది.

తాజాగా ఓ యూట్యూబ్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడింది. 2009లో అతడు తనను పెళ్లి చేసుకున్నాడని.. కొన్నాళ్ల వరకు సంసారం బాగానే సాగిందని.. తర్వాత తమకు పాప కూడా జన్మించిందని చెప్పింది. పెళ్లయిన దగ్గర నుంచే అతడికి అమ్మాయిలు అంటే పిచ్చి అని.. జాతకం పేరుతో ఎంతోమంది అమ్మాయిలను నేరుగా ఇంటికే తీసుకొచ్చేవాడని సంచలన నిజాలను బయటపెట్టింది.

ఏంటని ప్రశ్నించిన ప్రతీసారి చేయి చేసుకున్నట్లు తెలిపింది. ఓ అమ్మాయితో దాదాపు 8 ఏళ్లు రిలేషన్ లో ఉన్నాడని.. తాగి వచ్చి ఎంతో టార్చర్ పెట్టేవాడని తెలిపింది. అతడిలో మార్పు తీసుకొద్దామని ఎంత ప్రయత్నం చేసినా రాలేదని.. రాత్రి పగలు తేడా లేకుండా తిరుగుతూ జల్సాలకు అలవాటు పడ్డాడని వాపోయింది.

ఈ విషయంపై తన అత్తమామలకు చెప్పినా పట్టించుకోలేదని.. వాళ్లు కూడా అతడికే సపోర్ట్ పలికారన్నారు. విడాకులు సైతం ఇవ్వకుండా టార్చర్‌ పెడుతున్నాడంటూ ఆవేదన వ్యక్తం చేసింది. తనకు జరిగిన అన్యాయం మరే ఆడపిల్లకు జరగొద్దని ఆవేదన వ్యక్తం చేసింది. ఇలాంటి దారుణంపై తనకు న్యాయం చేయాలని తాజాగా ఆమె కోర్టు మెట్లెక్కింది.