Political News

పవన్ కళ్యాణ్ పై తమిళ మీడియా సెటైర్లు.. అలాంటి రాజకీయ నేత అంటూ..?

2014 సార్వత్రిక ఎన్నికలకు రెండు నెలల ముందు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో జనసేన పార్టీ ఎన్నికల్లో పోటీ చేయకపోయినా టీడీపీ బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చింది. ఆ తరువాత టీడీపీతో నాలుగేళ్ల పాటు జనసేన కలిసి పని చేసినా 2019 ఎన్నికల్లో మాత్రం జనసేన రాష్ట్రంలో టీడీపీతో కలిసి పోటీ చేయలేదు. 2019 ఎన్నికల్లో చిన్న పార్టీలతో కలిసి పోటీ చేసిన జనసేన పార్టీకి ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు.

కేవలం 6 శాతం ఓట్లు మాత్రమే రావడం, పోటీ చేసిన రెండు చోట్ల పవన్ కళ్యాణ్ ఓడిపోవడం గమనార్హం. అయితే పవన్ కళ్యాణ్ ఓడిపోయినా ఆ పార్టీ తరపున తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన రాపాక వరప్రసాద్ మాత్రం విజయం సాధించారు. అయితే ఆ ఎమ్మెల్యే కూడా పవన్ కళ్యాణ్ పై అనేక సందర్భాల్లో తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. పేరుకు జనసేన ఎమ్మెల్యే అయినా రాపాక వైసీపీకి మద్దతు ఇస్తున్నారు.

మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మొదట్లో జనసేన పార్టీ పోటీ చేస్తుందని ప్రకటన చేసిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత పోటీ చేయడం లేదని చెప్పిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ అలా చెప్పడం పవన్ అభిమానులకే నచ్చలేదు. ఇదే సమయంలో తమిళనాడులోని పత్రికలలో ఒకటైన తమిళ మురసు పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో సెటైర్లు వేసింది.

ఆ పత్రిక పవన్ కళ్యాణ్ ను గందరగోళ రాజకీయవాదిగా పేర్కొంది. ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రజలు గందరగోళ రాజకీయవాది అని పవన్ కళ్యాణ్ ను విమర్శిస్తున్నారని ఆ పత్రిక కథనాన్ని ప్రచురించింది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

‘పసివాడి ప్రాణం’ నటుడు బాబు ఆంటోనీ లైఫ్ ఇలా మారిపోయింది!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాలు వచ్చినా, ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమాల్లో ‘పసివాడి ప్రాణం’…

1 day ago

చూపు లేకపోయినా సంగీతంతో ప్రపంచాన్ని గెలిచిన వైకమ్ విజయలక్ష్మి!

చూపు లేకపోయినా సంగీతంతో కోట్ల హృదయాలను గెలుచుకున్న గాయని వైకమ్ విజయలక్ష్మి జీవితం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. చిన్నప్పటి…

1 day ago

కురుక్షేత్ర యుద్ధానికి దూరంగా నిలిచిన మహా యోధులు వీరే..!

మహాభారతం భారతీయ ఇతిహాసాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహాగ్రంథంగా గుర్తింపు పొందింది. ధర్మం, అధర్మం మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం…

1 day ago

కొత్త దంపతులు ముత్యాలు ధరిస్తే ఇంత మార్పా..? ముత్యాలపై నిపుణుల విశ్వాసం ఇదే!

భారతీయ సంప్రదాయంలో రత్నాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందులోనూ ముత్యాలు ఎప్పటినుంచో పవిత్రత, ప్రశాంతత, శుభానికి ప్రతీకగా భావించబడుతున్నాయి. తెల్లని…

1 day ago

ఒకే రాశి వాళ్లు పెళ్లి చేసుకుంటే జీవితం ఎలా ఉంటుంది..? తెలుసుకుంటే ఆశ్చర్యమే!

వివాహం అనేది ఇద్దరి మనుషుల మధ్య బంధమే కాదు, వారి ఆలోచనలు, స్వభావాలు, జీవన విధానాల కలయిక కూడా. వేద…

1 day ago

ఇంట్లో ఈ మొక్క ఉంటే చాలు అంటున్న వాస్తు నిపుణులు.. లక్ష్మీ కటాక్షం కలుగుతుందట!

హిందూ సాంప్రదాయంలో కొన్ని మొక్కలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో పారిజాతం మొక్కకు ఎంతో విశిష్ట స్థానం ఉంది.…

1 day ago