Political News

పవన్ కళ్యాణ్ పై తమిళ మీడియా సెటైర్లు.. అలాంటి రాజకీయ నేత అంటూ..?

2014 సార్వత్రిక ఎన్నికలకు రెండు నెలల ముందు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో జనసేన పార్టీ ఎన్నికల్లో పోటీ చేయకపోయినా టీడీపీ బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చింది. ఆ తరువాత టీడీపీతో నాలుగేళ్ల పాటు జనసేన కలిసి పని చేసినా 2019 ఎన్నికల్లో మాత్రం జనసేన రాష్ట్రంలో టీడీపీతో కలిసి పోటీ చేయలేదు. 2019 ఎన్నికల్లో చిన్న పార్టీలతో కలిసి పోటీ చేసిన జనసేన పార్టీకి ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు.

కేవలం 6 శాతం ఓట్లు మాత్రమే రావడం, పోటీ చేసిన రెండు చోట్ల పవన్ కళ్యాణ్ ఓడిపోవడం గమనార్హం. అయితే పవన్ కళ్యాణ్ ఓడిపోయినా ఆ పార్టీ తరపున తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన రాపాక వరప్రసాద్ మాత్రం విజయం సాధించారు. అయితే ఆ ఎమ్మెల్యే కూడా పవన్ కళ్యాణ్ పై అనేక సందర్భాల్లో తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. పేరుకు జనసేన ఎమ్మెల్యే అయినా రాపాక వైసీపీకి మద్దతు ఇస్తున్నారు.

మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మొదట్లో జనసేన పార్టీ పోటీ చేస్తుందని ప్రకటన చేసిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత పోటీ చేయడం లేదని చెప్పిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ అలా చెప్పడం పవన్ అభిమానులకే నచ్చలేదు. ఇదే సమయంలో తమిళనాడులోని పత్రికలలో ఒకటైన తమిళ మురసు పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో సెటైర్లు వేసింది.

ఆ పత్రిక పవన్ కళ్యాణ్ ను గందరగోళ రాజకీయవాదిగా పేర్కొంది. ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రజలు గందరగోళ రాజకీయవాది అని పవన్ కళ్యాణ్ ను విమర్శిస్తున్నారని ఆ పత్రిక కథనాన్ని ప్రచురించింది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 weeks ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 weeks ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 weeks ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 weeks ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 weeks ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

3 weeks ago