Tammareddy Bharadwaj: బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన చిత్రం ఆది పురుష్ ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ విడుదల చేయగా ఈ టీజర్ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో విమర్శలకు కారణమైంది. ఈ సినిమా గ్రాఫిక్స్ ఏమాత్రం బాగాలేవని ఈ టీజర్ కన్నా కార్టూన్ ఛానల్ ఏంతో అద్భుతంగా ఉందంటూ చాలామంది ఈ సినిమా టీజర్ పై విమర్శలు చేశారు.
ప్రభాస్ అభిమానులు సైతం ఈ టీజర్ చూసి ఇందులో ప్రభాస్ గెటప్ చూసి ఏమాత్రం జీర్ణించుకోలేకపోయారు. అయితే కొంతమంది సినీ సెలబ్రిటీలు ఈ టీజర్ పై స్పందిస్తూ విమర్శలు చేయడం మరికొందరు మాత్రం కొన్ని సినిమాలు బిగ్ స్క్రీన్ లోనే అద్భుతంగా ఉంటాయని ఆ ఎక్స్పీరియన్స్ చేసినప్పుడే బాగుంటాయని తెలిపారు.మరో 20 రోజులలో ఈ సినిమా నుంచి ఇంకొక టీజర్ విడుదల చేస్తామని తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ టీజర్ చూసి సంతోష పడతారు అంటూ తెలియచేశారు .
ఇకపోతే ఈ టీజర్ పై ప్రముఖ నిర్మాత నటుడు తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. ఆది పురుష్ టీజర్ చూశాను. ప్రభాస్ సినిమా అంటే వాడి వేడిగా ఉంటుంది పైగా 500కోట్ల బడ్జెట్ అంటే సినిమా భారీ స్థాయిలో ఉంటుందని ఊహించాను అయితే ఈ సినిమా ఒక యానిమేషన్ సినిమా లాగా ఉందని ఈయన తెలియజేశారు. ఈ సినిమా టీజర్ పై వస్తున్న విమర్శలపై ఇప్పటికే చిత్ర బృందం స్పందించారు.
ఇదివరకే చిత్ర బృందం ప్రెస్మీట్ ప్రొడ్యూసర్, డైరెక్టర్, హీరో సినిమాని 3డీలో చూడాలని చెబుతున్నారు. 3డీ అయినా ఫోర్ డి అయిన యానిమేషన్ కి లైవ్ కి చాలా తేడా ఉంటుంది. రాముడిని దేవుడిలా భావించే ఈ దేశంలో రాముడి గెటప్ మార్చేయడం చాలా విచిత్రంగా ఉంది. రావణాసురుడు కూడా బ్రాహ్మణుడు ఆయనకు కూడా మన భారతదేశంలో దేవాలయాలు ఉన్నాయి.20 రోజులలో మొత్తం మారుతుందని చిత్ర బృందం చెబుతున్నారు నిజంగానే ఆ మార్పులు చేసి సినిమాని మంచిగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఈయన తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ చిత్ర బృందానికి ఆల్ ద బెస్ట్ తెలియజేశారు
తమిళనాడులో డీలిమిటేషన్ బిల్లుపై రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనపై తన నిరసనను…
ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఓ ఇంటర్ విద్యార్థి చేసిన ఫోన్ కాల్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఫలితాలు వెలువడక ముందే ఫెయిల్…
యాదాద్రి భువనగిరి జిల్లాలోని హనుమాపురం గ్రామంలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. కుటుంబ కలహాల మధ్య ఓ తండ్రి…
భారతదేశంలో ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన క్షేత్రాల్లో కాశీ ప్రత్యేక స్థానం పొందింది. అదే కాశీలో అరుదుగా దర్శనమిచ్చే దేవగురువు బృహస్పతి…
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న ప్రముఖ గాయని మంగ్లీకు సంబంధించిన మోసం ఆరోపణలు రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. మైక్రో…
పార్లమెంట్లో మహిళా సాధికారతకు సంబంధించిన కీలక చర్చలు ప్రారంభం కానున్న వేళ, ప్రధాని నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో…