Taraka Ratna: టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువ గళం అనే పేరుతో పాదయాత్ర చేపట్టిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈ పాదయాత్రలో పాల్గొన్నటువంటి నందమూరి తారకరత్న ఉన్నఫలంగా స్పృహ తప్పి పడిపోయారు.ఇలా స్పృహ తప్పి పడిపోవడంతో ఈయన శరీరం మొత్తం నీలిరంగులోకి మారడంతో ఒకసారిగా పార్టీ శ్రేణులు అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఈయనని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
మొదట సమీప ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స నిర్వహించిన అనంతరం తారకరత్నను పీఎస్ఈ ఆస్పత్రికి తరలించారు. అనంతరం పీఎస్ఈ వైద్యులు ఆయనకు యాంజియోగ్రామ్ చేసి గుండె రక్తం సరఫరా చేసే నాళాల్లో బ్లాక్ లు ఉన్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే తారకరత్న శరీరం నీలిరంగులోకి మారిపోవడానికి గల కారణాల గురించి పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. ఈ క్రమంలోనే ఈ విషయంపై ప్రముఖ కార్డియాలజిస్ట్ ముఖర్జీ స్పందిస్తూ అసలు విషయం వెల్లడించారు.
తారకరత్న శరీరం నీలిరంగులోకి మారడానికి గల కారణం ఆయన శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గిపోవడం అని తెలిపారు. సాధారణంగా మన శరీరంలో ఏ అవయవానికి అయితే రక్తం సరఫరా కాదో ఆ అవయవం మొత్తం నీలిరంగులోకి మారిపోతుంది ఉదాహరణకు కాళ్లు చేతి వేళ్ళకొన వరకు రక్తం సరఫరా కాకపోతే వేళ్ళ కొనభాగం నీలిరంగులోకి మారుతుంది.
ఈ క్రమంలోనే తారకరత్న శరీరంలో కూడా రక్త సరఫరా రేటు తగ్గిపోవడంతో ఆయన శరీరం మొత్తం నీలిరంగీలోకి మారిపోయిందని డాక్టర్ ముఖర్జీ వెల్లడించారు. ఇలా శరీరం నీలిరంగులోకి మారిపోవడంతో వెంటనే చికిత్స అందించామని సుమారు 45 నిమిషాల పాటు శ్రమించిన తర్వాతే పల్స్ మొదలైందని వైద్యులు తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…