Tarakaratna: నందమూరి తారక రామారావు మనవడిగా గుర్తింపు పొందిన నందమూరి తారకరత్న గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒకటో నెంబర్ కుర్రాడు సినిమా ద్వారా హీరోగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నందమూరి తారకరత్న ఆ తర్వాత పలు సినిమాలలో హీరోగా, విలన్ గా నటించాడు. అయితే సినిమా రంగంలో సరైన గుర్తింపు రాకపోవటంతో ఇండస్ట్రీ కి దూరం అయ్యాడు.
ఆ తర్వాత వ్యాపార రంగంలో రాణిస్తున్న తారక్ ఇటీవల రాజకీయల్లో ఎంటర్ అవుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవల నారా లోకేష్ ప్రారంభించిన యువగలం పాదయాత్రలో నందమూరి తారకరత్న పాల్గొన్నారు. ఈ యాత్ర ప్రారంభించిన మొదటి రోజే తారకరత్న గుండెపోటుతో అనారోగ్యం పాలయ్యాడు. దీంతో వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి ప్రతిమ చికిత్స అందించారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ప్రస్తుతం తారకరత్న ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, డాక్టర్ల చికిత్సకు ఆయన శరీరం స్పందిస్తోందని నందమూరి కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఈ క్రమంలో నందమూరి బాలకృష్ణ తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.
తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలియడంతో బాలకృష్ణ వెంటనే బెంగుళూరుకు చేరుకొని డాక్టర్లతో సంప్రదింపులు జరిపి తారకరత్న వైద్యం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాడు. అప్పటి నుండి బాలకృష్ణ బెంగళూరులోనే ఉంటున్నాడు.
ఇక తాజాగా తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి బాలకృష్ణ స్పందిస్తూ… ప్రస్తుతం తారకరత్న ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, 45 నిమిషాల పాటు ఆగిపోయిన తారకరత్న గుండె మళ్ళీ కొట్టుకోవడం ఒక మెరాకిల్ అంటూ వెల్లడించాడు. ప్రస్తుతం స్టంట్ వేయడానకీ డాక్టర్లు కొన్ని మందులు వేస్తున్నారు. బీపీ, షుగర్ లెవల్స్ నార్మల్ అయ్యాక స్టంట్ వేయనున్నట్టు చెప్పారు. తారకరత్న హెల్త్ విషయమై వైద్యులు అన్ని రకాలుగా కేర్ తీసుకుంటున్నారని వెల్లడించాడు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…