AP politics: చిచ్చు రేపిన రెండో జాబితా.. రాజీనామాల బాటలో టీడీపీ జనసేన?

AP politics: ఏపీ ఎన్నికల తేదీ ప్రకటనలు రాకముందే ఎన్నికల వేడి రాజు కుంది. సొంత పార్టీలోనే పెద్ద ఎత్తున రాజకీయాలు జరుగుతూ పార్టీకే ముప్పు తెచ్చేలా పార్టీ నాయకులు కార్యకర్తలు వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ జనసేన కూటమిగా ఎన్నికల బరిలోకి రాబోతున్నటువంటి నేపథ్యంలో కొన్ని సీట్లను జనసేన పార్టీకి చంద్రబాబు నాయుడు కేటాయించిన సంగతి తెలిసిందే.

ఇకపోతే తాజాగా చంద్రబాబు నాయుడు రెండో జాబితాను విడుదల చేశారు ఇదివరకే 99 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసినటువంటి చంద్రబాబు నాయుడు రెండో జాబితాను కూడా విడుదల చేశారు. అయితే ఈ రెండో జాబితా పార్టీ నేతలలోనూ కార్యకర్తలలోనూ పెద్ద ఎత్తున చిచ్చు రేపింది.

రెండో జాబితాలో ఆయన తమ పేరు ఉంటుందని ఆశించినటువంటి పలువురు సీనియర్లకు ఈసారి తీవ్ర నిరాశ ఎదురయింది. ఈ క్రమంలోనే ఎంతోమంది సీట్లు రాలేదన్న ఆవేదనతో పార్టీకి రాజీనామా చేస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి విశాఖ జిల్లాలలో టిడిపికి జనసేన పార్టీకి తీవ్రస్థాయిలో వ్యతిరేక సెగ తగులుతుంది.

టీడీపీకి రాజీనామా..
పలు నియోజకవర్గాలలో ఆశించిన వారికి టికెట్లు రాకపోవడంతో మనస్థాపానికి గురైనటువంటి కొంతమంది నేతలు పార్టీకి రాజీనామాలు చేస్తున్నారు. ముఖ్యంగా పిఠాపురంలో చంద్రబాబు నాయుడుకి జనసేనానికి తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఏర్పడింది ఇక మాజీ మంత్రి గంట శ్రీనివాసరావు పేరు రెండో జాబితాలో లేకపోవడంతో ఈయన కూడా అలక మానలేదని తెలుస్తుంది. అయితే ఇలా అలిగిన వారందరినీ పార్టీకి రాజీనామా చేస్తున్నటువంటి వారందరికి చంద్రబాబు స్వయంగా ఫోన్లు చేసి బుజ్జగిస్తున్నట్లు తెలుస్తోంది.