Political News

Pitapuram: పక్కా ప్లాన్ తో నాపై హత్యాయత్నం చేశారు.. దాడిపై వర్మ కామెంట్స్?

Pitapuram: పిఠాపురం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జిగా కీలక బాధ్యతలు తీసుకున్నటువంటి వర్మ జనసేన పార్టీ విజయానికి ఎంతగానో దోహదం చేశారు. నిజానికి ఈ నియోజకవర్గంలో ఎంతో పలుకుబడి ఉన్నటువంటి ఈయనకే ఈసారి టికెట్ వస్తుందని అంతా భావించినప్పటికీ అనుకోకుండా కూటమిలో భాగంగా పవన్ కళ్యాణ్ టికెట్ పొందారు.

ఈ క్రమంలోనే పిఠాపురం నియోజకవర్గంలో టిడిపి కార్యకర్తలు పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా పార్టీ అధికారంలోకి వస్తే తనకు కీలక పదవి ఇస్తామని చంద్రబాబు నాయుడు బుజ్జగించడంతో తప్పనిసరి పరిస్థితులలో వర్మ జనసేన పార్టీకి మద్దతు తెలుపుతూ పవన్ కళ్యాణ్ విజయానికి కారణమయ్యారు.

ఇలా పవన్ కళ్యాణ్ గెలుపుకు కారణం అయినటువంటి వర్మపై జనసేన నాయకులు, హత్య ప్రయత్నం చేయడం పెద్ద సంచలనంగా మారింది. గొల్లప్రోలు మండలం వన్నెపూడి గ్రామంలో వర్మపై దాడికి పాల్పడ్డారు జనసైనికులు. ఈ గ్రామంలో సర్పంచ్ ను కలవడానికి వర్మ వెళ్లడంతో తమ గ్రామంలోకి వర్మ రావడానికి వీలు లేదంటూ జనసేన నాయకులు దాడి చేశారు.

ప్లాన్ ప్రకారమే దాడి…
ఈ దాడిలో భాగంగా ఆయన కారు ధ్వంసం కావడమే కాకుండా స్వల్ప గాయాలు కూడా అయ్యాయి. అయితే ఈ దాడి పై వర్మ స్పందించారు.ప్లాన్ ప్రకారం చేసిన హత్యాయత్నమే అని అన్నారు. తనను చంపే ఉద్దేశంతోనే జనసేన కార్యకర్తలు దాడి చేశారని అన్నారు. 20ఏళ్ళ తన రాజకీయ జీవితంలో పిఠాపురంలో ఇలాంటి దాడి జరగటం మొదటిసారని అన్నారు వర్మ. ఎమ్మెల్యే సీటును త్యాగం చేసి పవన్ కళ్యాణ్ గెలుపు కోసం కృషి చేసినందుకు సరైన ఫలితమే ఇచ్చారంటూ టీడీపీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago