టీం ఇండియా క్రికెటర్.. డాషింగ్ ఒపెనర్ శిఖర్ ధావన్, ఆయేషా ముఖర్జీ విడాకులు తీసుకున్నారట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఇంతకు ఎందుకు ఇలా తెరపైకి వచ్చిందంటూ.. ఆయేషా ముఖర్జీ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఒక పోస్టు చేశారు. ఆ పోస్టులో ఎంతో ఎమోషనల్ తో చేసినట్లు కనిపిస్తోంది. దీంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు.
అయితే అప్పటికే వివాహం అయిన ఆయేషా ముఖర్జిని 2012 సంవత్సరంలో శిఖర్ ధావన్ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వివాహం అయిన పిల్లలతో ఉన్న ముఖర్జిని పెళ్లి చేసుకున్న ధావన్ .. పెళ్లి సమయంలో కూడా ఆమె కూతుళ్లను బాగా చూసుకుంటానని మాట ఇచ్చి.. ఇంట్లో పెద్ద ఒప్పుకోకపోయిన ఆమెపై ఇష్టంతో ఈ పెళ్లి చేసుకున్నారు. తర్వాత 2014 సంవత్సరంలో అతడికి ఒక కొడుకు పుట్టాడు. ఇంత బాగా అన్యోన్యంగా సాగుతున్న వీరి జీవితంలో ఒక్క సారిగా విడాకులు టాపిక్ రావడంతో అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
రెండోసారి విడాకులు తీసుకునేంతవరకు విడాకులంటే అదేదో చెడ్డ పదంలా భావించేదాన్ని. ఫన్నీ… విడాకులు, వివాహం వంటి పదాలకు ఎంత శక్తివంతమైన అర్థాలు,అనుబంధాలు ఉంటాయో. మొదటిసారి విడాకులు తీసుకున్నప్పుడు చాలా భయపడ్డాను. జీవితంలో నేనేదో విఫలమైనట్లు… చేయకూడని తప్పు చేసినట్లు బాధపడ్డాను. నా స్వార్థం కోసం తల్లిదండ్రులు, పిల్లలను ఇబ్బంది పెడుతున్నానని అనుకున్నాను.
అలాంటిది ఇప్పుడు రెండోసారి విడాకులు తీసుకోబోతున్నాను. ఇది ఊహించుకుంటే భయానకంగా ఉంది. ఇప్పుడు మళ్లీ నన్ను నేను నిరూపించుకోవాలని అయేషా ముఖర్జీ ఇన్స్టాలో పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం డాషింగ్ ఓపెనర్ ‘గబ్బర్’(శిఖర్ ధావన్) ఐపీఎల్ సెకండ్ హాఫ్లో ఆడేందుకు యూఏఈ వెళ్లాడు. ప్రస్తుతం ఢిల్లీ కేపిటల్స్ టీమ్తో యూఏఈలో ఉన్నాడు. ప్రస్తుతం తన భార్య ఆయేషా ముఖర్జి పోస్టు చేసిన దీనికి శిఖర్ ధావన్ స్పందించలేదు. కానీ ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…