Actress Jyothi: ఎన్నో సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న జ్యోతి అందరికీ సుపరిచితమే. గతంలో ఈమె డ్రగ్స్ వ్యవహారంలో సంచలనంగా మారింది. డ్రగ్ కేసులో భాగంగా జ్యోతి సోషల్ మీడియా వార్తల్లో హాట్ టాపిక్ గా మారారు.అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న జ్యోతి తన కెరియర్ లో జరిగిన కొన్ని సన్నివేశాల గురించి వెల్లడించారు.
ఈ సందర్భంగా ఆమెను ప్రశ్నిస్తూ ఒక సినిమాలో మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుని అనంతరం మిమ్మల్ని తీసేసిన సంఘటనలు ఏమైనా జరిగాయా అని ప్రశ్నించారు. ఇక ఈ ప్రశ్నకు సమాధానం చెబుతూ తన సినీ కెరియర్ లో అలాంటి సన్నివేశాలు ఏమీ జరగలేదని,ఒకవేళ తను చేయడానికి ఆన్ కంఫర్టబుల్ గా ఉన్నా వెంటనే ఆ సీన్ మార్చమని చెప్పేస్తానని జ్యోతి వెల్లడించారు.
ఇకపోతే డైరెక్టర్ ఈవీవీ గురించి మాట్లాడుతూ ఆయన ఒక పెద్ద డైరెక్టర్ ఎవడి గోల వాడిది సినిమా ద్వారా తనకు మంచి పాత్ర ఇచ్చారని ఆమె గుర్తు చేసుకున్నారు. అయితే ఈవివి సత్యనారాయణ గారు ఏ ఆర్టిస్టుకి వారి పాత్ర గురించి ముందుగా వెల్లడించరు. ఈ క్రమంలోనే ఎవడి గోల వాడిది సినిమా షూటింగ్ కోసం 25 రోజుల పాటు బ్యాంకాక్ వెళ్ళాము. అక్కడ షూటింగ్ జరుగుతున్న సమయంలో తెలంగాణ శకుంతలకు కమెడియన్ కృష్ణభగవాన్ తో బెడ్ రూమ్ సన్నివేశాలు చేయాలని చెప్పారు.
అలా చెప్పడంతో తెలంగాణ శకుంతల ఆ సీన్ లో నటించడానికి బోరున ఏడ్చారు. అయితే ఆ సన్నివేశం మొత్తం కామెడీగా చూపించారని ఈ సందర్భంగా జ్యోతి వెల్లడించారు.ఇక తన డ్రగ్స్ వ్యవహారం గురించి మాట్లాడుతూ తనని పూర్తిగా ట్రాప్ చేసి ఈ కేసులో ఇరికించారని, తన తప్పు ఏమాత్రం లేదని ఈమె తెలియజేశారు. అయితే ఆరోజు నన్ను ఎవరు ట్రాప్ చేశారనే విషయం నాకు తెలుసు అని ఇలా అనవసరంగా తననీ వేధించి నందుకు వాళ్ళ కుటుంబ సభ్యులు కుక్క చావు చచ్చారని, వాళ్ల మదర్ వాళ్ళ వైఫ్ అందరూ యాక్సిడెంట్లో చనిపోయారని ఈ సందర్భంగా జ్యోతి డ్రగ్స్ వ్యవహారం గురించి తెలియజేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…