మహారాష్ట్ర జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ అగ్ని ప్రమాదంలో అభం శుభం తెలియని నవజాత శిశువులు పదిమంది అగ్నికి ఆహుతయ్యారు. ఈ హృదయ విదారక ఘటన మహారాష్ట్ర భండార జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. ఆస్పత్రిలోనిఐసీయూ ఈ విభాగంలో దాదాపు నెల నుంచి మూడు నెలల వయసున్న 17 మంది చిన్నారులు చికిత్స పొందుతున్నారు. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో ఐసీయూ ఈ విభాగంలో ఉన్నఫలంగా మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
మహారాష్ట్రలో జరిగిన ఈ ప్రమాద ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందిస్తూ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఈ ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ తోపేతో మాట్లాడి విషయంపై ఆరా తీశారు వెంటనే ప్రమాద ఘటనకు కారణాలు తెలియజేయాలని ఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు.
అంతేకాకుండా ఈ ప్రమాదంలో మరణించిన చిన్నారుల కుటుంబానికి ఒక్కొక్కరికి ఐదు లక్షల చొప్పున నష్టపరిహారాన్ని చెల్లిస్తున్నట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ తెలియజేశారు. ఈ ఘటనపై మృతుల బంధువులు స్పందిస్తూ కేవలం ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఏమీ తెలియని తమ చిన్నారులు ప్రాణాలు కోల్పోయారని ఆసుపత్రి ఎదుట నిరసన వ్యక్తం చేశారు.అయితే ఈ ప్రమాదానికి గల కారణాలను తొందరలోనే వెల్లడిస్తామని అధికారులు తెలియజేశారు.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…