Featured

దారుణం: ప్రమాదంలో పది మంది చిన్నారులు బలి!

మహారాష్ట్ర జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ అగ్ని ప్రమాదంలో అభం శుభం తెలియని నవజాత శిశువులు పదిమంది అగ్నికి ఆహుతయ్యారు. ఈ హృదయ విదారక ఘటన మహారాష్ట్ర భండార జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. ఆస్పత్రిలోనిఐసీయూ ఈ విభాగంలో దాదాపు నెల నుంచి మూడు నెలల వయసున్న 17 మంది చిన్నారులు చికిత్స పొందుతున్నారు. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో ఐసీయూ ఈ విభాగంలో ఉన్నఫలంగా మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.అగ్ని ప్రమాదం సంభవించిన సమయంలో ఐసీయూ విభాగంలో పనిచేసే వైద్య సిబ్బంది ఏడుగురు చిన్నారులను రక్షించగలగారు. మిగిలిన పదిమంది అగ్నికి ఆహుతయ్యారు. అయితే ఈ ప్రమాదం ఏ కారణం వల్ల చోటు చేసుకుందో తెలియాల్సి ఉంది.ఈ ప్రమాద ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం భవిష్యత్తులో ఎంతో విలువైన చిన్నారులను కోల్పోయామని,గాయపడిన చిన్నారులు త్వరగా కోలుకోవాలని నరేంద్రమోడీ ఆకాంక్షించారు.

మహారాష్ట్రలో జరిగిన ఈ ప్రమాద ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందిస్తూ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే ఈ ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ తోపేతో మాట్లాడి విషయంపై ఆరా తీశారు వెంటనే ప్రమాద ఘటనకు కారణాలు తెలియజేయాలని ఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు.

అంతేకాకుండా ఈ ప్రమాదంలో మరణించిన చిన్నారుల కుటుంబానికి ఒక్కొక్కరికి ఐదు లక్షల చొప్పున నష్టపరిహారాన్ని చెల్లిస్తున్నట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ తెలియజేశారు. ఈ ఘటనపై మృతుల బంధువులు స్పందిస్తూ కేవలం ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఏమీ తెలియని తమ చిన్నారులు ప్రాణాలు కోల్పోయారని ఆసుపత్రి ఎదుట నిరసన వ్యక్తం చేశారు.అయితే ఈ ప్రమాదానికి గల కారణాలను తొందరలోనే వెల్లడిస్తామని అధికారులు తెలియజేశారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago