Big Boss OTT Telugu: బుల్లితెర పై ప్రసారం అవుతూ ఎంతో మంచి ప్లేస్ దక్కించుకున్న బిగ్ బాస్ కార్యక్రమం నిన్నటి నుంచి( ఫిబ్రవరి 26) డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో 24 గంటల ప్రసారమవుతూ ప్రేక్షకులను ఎంతగానో సందడి చేస్తోంది. ఈ కార్యక్రమానికి 17 మంది కంటెస్టెంట్ లు ఎంతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. ఇక వీరిలో రాయలసీమకు చెందిన చొక్కా రపు స్రవంతి బిగ్ బాస్ ఎంట్రీ ఇచ్చారు.
రాయలసీమలోని కదిరి ప్రాంతానికి చెందిన స్రవంతి తన టాలెంట్ తో సోషల్ మీడియా నుంచి టీవీ దాకా అవకాశాలను అందుకొని ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అదే గుర్తింపుతో నేడు బిగ్బాస్ స్టేజీపై ఐదో కంటెస్టెంట్గా ఎంట్రీ ఇచ్చిన స్రవంతి తన నవ్వుతూనే ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.
ఈ విధంగా బిగ్ బాస్ ఎంట్రీ ఇచ్చిన ఈమె తన జీవితంలో రెండు సార్లు పెళ్ళి చేసుకున్నానని ఈ సందర్భంగా వెల్లడించారు. మొదటిసారి ప్రేమించి పెళ్లి చేసుకున్నానని తరువాత పెద్దల సమక్షంలో మరోసారి పెళ్లి చేసుకున్నానని ఈ సందర్భంగా ఈమె వెల్లడించారు.అయితే ఈ విషయం ఇప్పటివరకు ప్రేక్షకులకు తెలియదని ఈ సందర్భంగా స్రవంతి వెల్లడించారు.
తన టాలెంట్ తో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె బిగ్ బాస్ ఓటీటీ ఎంట్రీ ఇచ్చి ఓటీటీలో నవరసాలతో ఎంటర్టైన్ చేస్తానని మనసావాచా కర్మణా మాటిస్తున్నానంటూ శపథం చేసింది స్రవంతి. మరి మాట ఇచ్చిన విధంగా మాటపై నిలబడుతుందా? లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…