Prabhu Deva: ప్రభుదేవా సినిమాని ఆపేయాలని నిర్మాతకు వార్నింగ్ ఇచ్చిన గవర్నర్.. చివరికి ఏమైందంటే?
Prabhu Deva:సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా తెరకెక్కించాలి అంటే ఆ సినిమాకి ఎన్నో అవరోధాలు ఏర్పడుతూ ఉండటం సర్వసాధారణం. కొన్ని సినిమాలకు రాజకీయ ఒత్తిళ్లు ఎదురుగా మరికొన్ని సినిమాలకు కొన్ని సామాజిక వర్గాల నుంచి కూడా ఎన్నో వ్యతిరేకతలు ఏర్పడుతుంటాయి. ఈ విధంగా ఆదిలోనే ఎన్నో సినిమాలు ఆగిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అర్జున్ ప్రేమ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన జెంటిల్ మెన్ చిత్రం ఎంతో మంచి విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో చిత్రబృందంతో సినిమా చేయాలని నిర్మాత కుంజుమన్ భావించారు.
శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన జెంటిల్ మెన్ సినిమాలో చికుబుకు రైలే అనే పాట ప్రభుదేవా మైకేల్ జాక్సన్ తరహాలో డాన్స్ చేసి మెప్పించారు. ఇకపోతే శంకర్ తన తరువాత ప్రాజెక్టు కుంజుమన్ నిర్మాతగా వ్యవహరిస్తూ ప్రేమికుడు అనే సినిమా కథను తయారు చేశారు. ఈ సినిమాలో కొత్త వాళ్ళని హీరోగా పెట్టుకోవాలని నిర్మాత భావించారు. అయితే ఇందులో ప్రభుదేవా పేరును నిర్మాత సూచించగా ప్రభుదేవాతో సినిమా చేయడం ఏమాత్రం శంకర్ కు ఇష్టం లేదు. ఇకపోతే నిర్మాత బలవంతంతో ప్రభుదేవా హీరోగా ప్రేమికుడు సినిమా షూటింగ్ ప్రారంభమైంది.
ఇకపోతే ఈ సినిమా ప్రారంభానికి ముందు ఎన్నో అవరోధాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా కథ విషయానికి వస్తే హీరోయిన్ తండ్రి గవర్నర్ ఆయన పెద్ద ఎత్తున కుట్రలు కుతంత్రాలు చేస్తూ ఉంటారు. ఇదే సినిమాకి బలమైన కథాంశమని ప్రతి ఒక్కరు చర్చించుకోవడంతో ఈ విషయం గవర్నర్ కార్యాలయం వరకు చేరింది.
అప్పట్లో తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత బాధ్యతలు తీసుకోగా గవర్నర్ గా చెన్నారెడ్డి పనిచేస్తున్నారు.అయితే ఒక గవర్నర్ పట్ల చెడుగా ఈ సినిమాని చిత్రీకరిస్తున్నారని తెలియడంతో గవర్నర్ కార్యాలయం నుంచి నిర్మాతకు బెదిరింపు ఫోన్ కాల్స్ వెళ్లాయి. అయితే నిర్మాత ఏమాత్రం బెదిరి పోకుండా ముఖ్యమంత్రి జయలలితను కలిసి కథ వివరించారు. ఇక ఈ సినిమాని నిరభ్యంతరంగా చేసుకోమని జయలలిత అభయం ఇవ్వడంతో ఈ సినిమా తెరకెక్కింది.
ఇక ప్రభుదేవా హీరోగా ఏ మాత్రం ఇష్టం లేని శంకర్ బలవంతంగా ఈ సినిమాని తెరకెక్కించారు.ఇక ఈ సినిమాకి ఎ.ఆర్.రెహమాన్ సంగీతం కూడా ఎంతో ప్లస్ అయ్యింది. ఇక ఇందులో ప్రభుదేవా సరసన నగ్మా మరింత హైలైట్ అయ్యారు. ఈ సినిమాలోని ముక్కాల, ఊర్వశి ఊర్వశి అనే పాట ఇప్పటికీ యువతను ఆకట్టుకుంటుంది. ఇలా ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా 1994 సెప్టెంబర్ 15 వ తేదీ విడుదలయింది. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన రికార్డులను సృష్టిస్తూ ఎంతో విజయాన్ని అందుకుంది.ఈ విధంగా సినిమా షూటింగ్ కి ముందు గవర్నర్ నుంచి ఎన్నో అభ్యంతరాలు వచ్చినప్పటికీ సీఎం జయలలిత సహాయంతో ఈ సినిమాని తెరకెక్కించే బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నారు.
తమిళనాడులో డీలిమిటేషన్ బిల్లుపై రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనపై తన నిరసనను…
ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఓ ఇంటర్ విద్యార్థి చేసిన ఫోన్ కాల్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఫలితాలు వెలువడక ముందే ఫెయిల్…
యాదాద్రి భువనగిరి జిల్లాలోని హనుమాపురం గ్రామంలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. కుటుంబ కలహాల మధ్య ఓ తండ్రి…
భారతదేశంలో ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన క్షేత్రాల్లో కాశీ ప్రత్యేక స్థానం పొందింది. అదే కాశీలో అరుదుగా దర్శనమిచ్చే దేవగురువు బృహస్పతి…
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న ప్రముఖ గాయని మంగ్లీకు సంబంధించిన మోసం ఆరోపణలు రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. మైక్రో…
పార్లమెంట్లో మహిళా సాధికారతకు సంబంధించిన కీలక చర్చలు ప్రారంభం కానున్న వేళ, ప్రధాని నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో…