Connect with us

Featured

Prabhu Deva: ప్రభుదేవా సినిమాని ఆపేయాలని నిర్మాతకు వార్నింగ్ ఇచ్చిన గవర్నర్.. చివరికి ఏమైందంటే?

Prabhu Deva:సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా తెరకెక్కించాలి అంటే ఆ సినిమాకి ఎన్నో అవరోధాలు ఏర్పడుతూ ఉండటం సర్వసాధారణం. కొన్ని

Published

on

Prabhu Deva:సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా తెరకెక్కించాలి అంటే ఆ సినిమాకి ఎన్నో అవరోధాలు ఏర్పడుతూ ఉండటం సర్వసాధారణం. కొన్ని సినిమాలకు రాజకీయ ఒత్తిళ్లు ఎదురుగా మరికొన్ని సినిమాలకు కొన్ని సామాజిక వర్గాల నుంచి కూడా ఎన్నో వ్యతిరేకతలు ఏర్పడుతుంటాయి. ఈ విధంగా ఆదిలోనే ఎన్నో సినిమాలు ఆగిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అర్జున్ ప్రేమ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన జెంటిల్ మెన్ చిత్రం ఎంతో మంచి విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో చిత్రబృందంతో సినిమా చేయాలని నిర్మాత కుంజుమన్ భావించారు.

Prabhu Deva: ప్రభుదేవా సినిమాని ఆపేయాలని నిర్మాతకు వార్నింగ్ ఇచ్చిన గవర్నర్.. చివరికి ఏమైందంటే?
Prabhu Deva: ప్రభుదేవా సినిమాని ఆపేయాలని నిర్మాతకు వార్నింగ్ ఇచ్చిన గవర్నర్.. చివరికి ఏమైందంటే?

శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన జెంటిల్ మెన్ సినిమాలో చికుబుకు రైలే అనే పాట ప్రభుదేవా మైకేల్ జాక్సన్ తరహాలో డాన్స్ చేసి మెప్పించారు. ఇకపోతే శంకర్ తన తరువాత ప్రాజెక్టు కుంజుమన్ నిర్మాతగా వ్యవహరిస్తూ ప్రేమికుడు అనే సినిమా కథను తయారు చేశారు. ఈ సినిమాలో కొత్త వాళ్ళని హీరోగా పెట్టుకోవాలని నిర్మాత భావించారు. అయితే ఇందులో ప్రభుదేవా పేరును నిర్మాత సూచించగా ప్రభుదేవాతో సినిమా చేయడం ఏమాత్రం శంకర్ కు ఇష్టం లేదు. ఇకపోతే నిర్మాత బలవంతంతో ప్రభుదేవా హీరోగా ప్రేమికుడు సినిమా షూటింగ్ ప్రారంభమైంది.

Prabhu Deva: ప్రభుదేవా సినిమాని ఆపేయాలని నిర్మాతకు వార్నింగ్ ఇచ్చిన గవర్నర్.. చివరికి ఏమైందంటే?
Prabhu Deva: ప్రభుదేవా సినిమాని ఆపేయాలని నిర్మాతకు వార్నింగ్ ఇచ్చిన గవర్నర్.. చివరికి ఏమైందంటే?

ఇకపోతే ఈ సినిమా ప్రారంభానికి ముందు ఎన్నో అవరోధాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా కథ విషయానికి వస్తే హీరోయిన్ తండ్రి గవర్నర్ ఆయన పెద్ద ఎత్తున కుట్రలు కుతంత్రాలు చేస్తూ ఉంటారు. ఇదే సినిమాకి బలమైన కథాంశమని ప్రతి ఒక్కరు చర్చించుకోవడంతో ఈ విషయం గవర్నర్ కార్యాలయం వరకు చేరింది.

అప్పట్లో తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత బాధ్యతలు తీసుకోగా గవర్నర్ గా చెన్నారెడ్డి పనిచేస్తున్నారు.అయితే ఒక గవర్నర్ పట్ల చెడుగా ఈ సినిమాని చిత్రీకరిస్తున్నారని తెలియడంతో గవర్నర్ కార్యాలయం నుంచి నిర్మాతకు బెదిరింపు ఫోన్ కాల్స్ వెళ్లాయి. అయితే నిర్మాత ఏమాత్రం బెదిరి పోకుండా ముఖ్యమంత్రి జయలలితను కలిసి కథ వివరించారు. ఇక ఈ సినిమాని నిరభ్యంతరంగా చేసుకోమని జయలలిత అభయం ఇవ్వడంతో ఈ సినిమా తెరకెక్కింది.

Advertisement

బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించిన ప్రేమికుడు….

ఇక ప్రభుదేవా హీరోగా ఏ మాత్రం ఇష్టం లేని శంకర్ బలవంతంగా ఈ సినిమాని తెరకెక్కించారు.ఇక ఈ సినిమాకి ఎ.ఆర్.రెహమాన్ సంగీతం కూడా ఎంతో ప్లస్ అయ్యింది. ఇక ఇందులో ప్రభుదేవా సరసన నగ్మా మరింత హైలైట్ అయ్యారు. ఈ సినిమాలోని ముక్కాల, ఊర్వశి ఊర్వశి అనే పాట ఇప్పటికీ యువతను ఆకట్టుకుంటుంది. ఇలా ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా 1994 సెప్టెంబర్ 15 వ తేదీ విడుదలయింది. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన రికార్డులను సృష్టిస్తూ ఎంతో విజయాన్ని అందుకుంది.ఈ విధంగా సినిమా షూటింగ్ కి ముందు గవర్నర్ నుంచి ఎన్నో అభ్యంతరాలు వచ్చినప్పటికీ సీఎం జయలలిత సహాయంతో ఈ సినిమాని తెరకెక్కించే బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నారు.

Advertisement
Continue Reading
Advertisement

Featured

ITR FIling : గడువు పెంచలేదు.. ఫేక్ న్యూస్ నమ్మొద్దు.. “జూలై 31వ తేదీలోపు మీ ITR ఫైల్ చేయండి”.. కీలక ప్రకటన చేసిన ఐటీ శాఖ

Published

on

ITR ఫైలింగ్ : పన్ను చెల్లింపుదారులకు ముఖ్యమైన గమనిక. మీరు FY 2023-2024 కోసం మీ ఆదాయపు పన్ను రిటర్న్‌ను ఇంకా ఫైల్ చేయలేదా? ఆదాయపు పన్ను శాఖ మరో కీలక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నెల 31లోగా ఐటీ రిటర్నులు సమర్పించాలని కోరింది ఐటీ శాఖ. మరో నెల రోజులు గడువు పెంపుపై వస్తున్న వార్తల్లో నిజం లేదని తేలింది. పన్ను చెల్లింపుదారులు ఇలాంటి ఫేక్ న్యూస్ నమ్మవద్దని సోషల్ మీడియా ఎక్స్ లో సూచించింది.

గడువు 4 రోజులు మాత్రమే. జూలై 31వ తేదీలోపు ITR ఫైల్ చేయాలి. ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ వీలైనంత త్వరగా రిటర్నులు సమర్పించాలని ఐటీ శాఖ సూచించింది. పన్ను పోర్టల్ లో ఎటువంటి సాంకేతిక సమస్య లేదు. మీరు గడువు సమయంలోపు ITR ఫైల్ చేయకపోతే, మీరు సెక్షన్ 234A కింద వడ్డీని మరియు ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 234F కింద జరిమానా చెల్లించవలసి ఉంటుంది.

మరోవైపు ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలు చేసి వాపసు కోరుతున్న వారిని కూడా ఐటీ శాఖ హెచ్చరించింది. సైబర్ నేరగాళ్లు ఫోన్లలో మెసేజ్ లు పంపుతూ మోసాలకు పాల్పడుతున్నట్లు తెలిసిందని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. ఇలాంటి ఫేక్ మెసేజ్‌లను చూసి మోసపోకండి మరియు రీఫండ్ కోసం మీ బ్యాంక్ ఖాతా వివరాలు మరియు వన్-టైమ్ పాస్‌వర్డ్‌లను అడుగుతూ మీకు కాల్ వస్తే అప్రమత్తంగా ఉండండి. అటువంటి లింక్‌లపై క్లిక్ చేయవద్దు. ఇప్పటి వరకు 5 కోట్ల మంది పన్ను రిటర్నులు దాఖలు చేసినట్లు గుర్తించింది. వీరిలో ఇప్పటికే 1.8 మిలియన్ల రిటర్న్‌లు ప్రాసెస్ చేయబడి, రీఫండ్ ఖాతాలకు జమ అయినట్లు కూడా తెలిపింది.

Advertisement

Continue Reading

Featured

Niharika: యుద్ధం గెలిచిన రాముడు అయోధ్యకు వచ్చినట్టు ఉంది… బాబాయ్ పై నిహారిక కామెంట్స్!

Published

on

Niharika: నిహారిక కొణిదెల పరిచయం అవసరం లేని పేరు. ప్రస్తుతం ఈమె ఇండస్ట్రీలో నిర్మాతగా నటిగా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు. తన భర్త నుంచి విడాకులు తీసుకొని విడిపోయిన నిహారిక తిరిగి కెరియర్ పై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే నిర్మాతగా కూడా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు.

ఇక నిహారిక నిర్మాణంలో తెరకెక్కిన కమిటీ కుర్రోళ్ళు సినిమా ఆగస్టు 9వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ఈమె ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఆహాలో ప్రసారమవుతున్న సర్కార్ సక్సెస్ సెలబ్రేషన్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల అయింది.

ఇక ఈ ప్రోమోలో భాగంగా నిహారిక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ నేను వచ్చేది ఎప్పుడు నెక్స్ట్ సీజనా అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సుడిగాలి సుదీర్ రెస్పాండ్ అవుతూ మీకేంటండి మీరు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారి తాలూకా అంటూ మాట్లాడారు. అనంతరం పవన్ కళ్యాణ్ విజయం సాధించిన తర్వాత చిరంజీవి ఇంటికి వచ్చి ఆశీర్వాదం తీసుకున్న వీడియో ఎంతలా వైరల్ అయిందో మనకు తెలిసిందే .ఇక ఈ వీడియోని ప్లే చేశారు.

Advertisement

యుద్ధం గెలిచిన రాముడు…
ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించింది అంటూ నిహారికను ప్రశ్నించారు. ఇక నిహారిక ఈ వీడియో గురించి మాట్లాడుతూ యుద్ధం గెలిచిన తర్వాత శ్రీరాముడు అయోధ్యకు వచ్చినప్పుడు కూడా ఇలాగే ఉండేదేమో అనిపించింది అంటూ తన బాబాయ్ విజయం గురించి నిహారిక మాట్లాడుతూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Anasuya: ఇకపై రంగమ్మత్త లాంటి పాత్రలు అసలు చేయను.. గ్లామర్ పాత్రలకు సై అంటున్న అనసూయ?

Published

on

Anasuya: అనసూయ భరద్వాజ్ పరిచయం అవసరం లేని పేరు. ఈమె జబర్దస్త్ యాంకర్ గా బుల్లితెరపై ఎంతో మంచి సక్సెస్ అందుకొని అనంతరం వెండి తెరపై సినిమా అవకాశాలను అందుకున్నారు. ఇలా వెండితెరపై వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న అనసూయ తిరిగి బుల్లితెర కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఈమె స్టార్ మా లో ప్రసారమవుతున్న కిరాక్ బాయ్స్ కిలాడి లేడీస్ అనే కార్యక్రమంలో సందడి చేస్తున్నారు. ఇలా ఒక వైపు బుల్లితెర కార్యక్రమాలు మరోవైపు వెండితెర కార్యక్రమాలలో సందడి చేస్తున్న అనసూయ త్వరలోనే సింబా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదల కాగా ఈమె మీడియా సమావేశంలో పాల్గొన్నారు ఇటీవల కాలంలో మీరు చాలా సినిమాలను రిజెక్ట్ చేస్తున్నారని తెలుస్తోంది కారణం ఏంటని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు అనసూయ సమాధానం చెబుతూ తాను సినిమాలు రిజెక్ట్ చేస్తున్న మాట నిజమేనని తెలిపారు. నేను ఒక సినిమాలో నటించిన పాత్ర హిట్ అవడంతో తదుపరి సినిమాలలో కూడా అలాంటి పాత్రలలో నటించే అవకాశం వస్తుందని తెలిపారు.

Advertisement

రంగమ్మత్త..
ఇలా ఒక పాత్రలో నటించిన తర్వాత తిరిగి అలాంటి పాత్రలలో నటించిన ప్రేక్షకులు పెద్దగా తీసుకోలేరు ఉదాహరణకు రంగమ్మత్త పాత్ర చాలా హైలెట్ అయింది. తదుపరి అలాంటి పాత్రలు వస్తే నేను చెయ్యను నేను అన్ని చాలా డిఫరెంట్ గా ఉండేలా చేయాలని భావిస్తున్నాను. ఇక ఎక్కువగా తాను గ్లామర్ పాత్రలకే ప్రాధాన్యత ఇవ్వాలని అనుకుంటున్నాను అంటూ ఈ సందర్భంగా అనసూయ గ్లామర్ రోల్ చేయడానికి సై అంటూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!