Prabhas: ప్రభాస్ ఈ పేరు తెలియని భారతీయుడు ఉండరు. బాహుబలి వంటి సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఈయన పలు సినిమా షూటింగులతో ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా పాన్ ఇండియా హీరోగా ప్రభాస్ అందరికీ సుపరిచితమే.
ఇలా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందిన హీరోని ఒక్కసారైనా కలవాలని, అతనితో మాట్లాడాలని ఎంతో మంది భావిస్తారు. ఈ క్రమంలోనే ఇలా స్టార్ హీరోల పేర్లు చెప్పుకొని ఎంతోమంది పెద్దఎత్తున మోసాలకు పాల్పడుతున్నారు.ఇలా ప్రభాస్ పేరు చెప్పుకొని టాలీవుడ్ హీరోయిన్ ట్రాప్ చేయడానికి ప్రయత్నించారట. టాలీవుడ్ హీరోయిన్లలో ఒకరైన రేఖా భోజ్ ఒక వీడియోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ తనకు జరిగిన సంఘటనల గురించి కామెంట్ రూపంలో తెలియజేశారు.
2016వ సంవత్సరంలో ప్రభాస్ అసిస్టెంట్ అనే ఒక వ్యక్తి తనకు ఫోన్ చేశారని ఈమె తెలియజేశారు. ఆ వ్యక్తి ఫోన్లో మాట్లాడుతూ మీరు ప్రభాస్ అభిమాని తనకు మెసేజ్ చేయడం వల్ల అతను మిమ్మల్ని కలవడం కోసం నోవాటెల్ హోటల్ లో ఎదురు చూస్తున్నారనీ చెప్పినట్లు ఈ సందర్భంగా ఈమె తెలియజేశారు.
ఈ విధంగా తనకు ఫోన్ చేసి తాను ప్రభాస్ అసిస్టెంట్ ప్రభాస్ నా కోసం ఎదురు చూస్తున్నాడని చెప్పడంతో ఒక్కసారిగా నేను పగలబడి నవ్వి ఆ వ్యక్తిని ఇష్టానుసారంగా తిట్టి ఫోన్ పెట్టేసానని తెలిపారు. అయితే ఇలాంటి ఫోన్ రావడానికి రెండు రోజుల ముందే కమెడియన్ ప్రభాస్ శీను ప్రభాస్ అమెరికా వెళ్ళాడని మరో ఆరు నెలల వరకు ఇండియా తిరిగి రారని చెప్పారు. ఈ విధంగా అమెరికా వెళ్ళిన ప్రభాస్ నన్ను ఏ విధంగా కలుస్తారని అతనిని తిట్టానట్లు ఈమె తెలిపారు.ఈ విధంగా రోజు సెలబ్రిటీల పేర్లు చెప్పుకొని ఎంతమంది ఎన్ని మోసాలకు పాల్పడుతున్నారో అంటూ రేఖా భోజ్ తన విషయంలో జరిగిన సంఘటన గురించి తెలియజేశారు.
దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో ప్రాణాలను పణంగా పెట్టి పోరాడే సైనికులు ప్రతి భారతీయుడికి స్ఫూర్తి. దేశం కోసం తమ…
తెలుగు బుల్లితెరపై అత్యధిక ఆదరణ పొందిన రియాలిటీ షోల్లో బిగ్బాస్ తెలుగు ఒకటి. ఇప్పటికే విజయవంతంగా తొమ్మిది సీజన్లు పూర్తి…
ప్రస్తుతం ఆరోగ్యంపై అవగాహన గతంతో పోలిస్తే ఎంతో పెరిగింది. ముఖ్యంగా కరోనా తర్వాత చాలా మంది ఫిట్నెస్కు ప్రాధాన్యం ఇస్తున్నారు.…
తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిన చిత్రాల్లో 'బాహుబలి'కి ప్రత్యేక స్థానం ఉంది. దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన ఈ…
టాలీవుడ్లో ప్రస్తుతం ఎక్కువగా చర్చకు వస్తున్న అంశాల్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తదుపరి సినిమా ఒకటి. దర్శకుడు…
తిరుమల శ్రీవారి దర్శనం కోసం ప్రతి రోజు లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు. వృద్ధులు, దివ్యాంగులు, చిన్నారులతో వచ్చే కుటుంబాలకు…