Money Lose: మీరు పోగొట్టుకున్న డబ్బులు మీ దగ్గరకు వచ్చేస్తాయి..ఎలా అంటే..?
Money Lose: నేరాల తీరు మారుతోంది. ఒకప్పుడు డబ్బులు కావాలంటే ఇళ్లకు కన్నాలు వేసేవారు. కానీ ఇటువంటి నేరాలు చాలా వరకు తగ్గాయి. అయితే ఇప్పుడు నేరాల తీరులో చాలా మార్పులు వచ్చాయి. వైట్ కాలర్ దొంగతనాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా టెక్నాలజీని యూస్ చేసుకుని.. నేరాలకు పాల్పడుతున్నారు కేటుగాళ్లు.
మోసపోవడానికి కేవలం సెల్ ఫోన్, కంప్యూటర్ కారణం అవుతోంది. మనం అప్లై చేయని లాటరీ మనకు తగిలినట్లు.. మనకు అసలే సంబంధం లేని దేశం నుంచి గిఫ్టు వస్తున్నట్లు, లారీల్లో కోట్ల రూపాయలు వచ్చాయని.. ప్రాసెసింగ్ ఫీజు చెల్లిస్తే చాలు కోట్లు మీరు సొంత చేసుకోవచ్చని మేసేజ్ లు, ఈమెయిల్ లు పెడుతుంటారు.
దీంతో కోట్ల మోజులో ప్రజలు మోసపోతున్నారు. మనం అప్లై చేయని లాటరీలు ఎలా తగులుతాయని ఒక్క క్షణం ఆలోచిస్తే మోసపోయే అవకాశం ఉండదు. ఇదిలా ఉంటే మరోవైపు ఓఎల్ఎక్స్ ఫ్రాడ్స్, ఓటీటీ ద్వారా బ్యాంకులోని డబ్బును తస్కరిస్తున్నారు నేరగాళ్లు.
పోలీసులు ఎంతగా ఇటువంటి నేరాల గురించి అవగాహన కల్పిస్తున్నా.. ఎక్కడో చోట ఎవరో ఒకరు మోసానికి గురువుతున్నారు. కేటుగాళ్లు అడిగిన డబ్బును భారీ మెత్తాన్ని ఇచ్చి… తర్వాత మోసపోయామని లబోదిబోమంటున్నారు. అంత అయిపోయిన తర్వాత పోలీసులను ఆశ్రయిస్తున్నారు. తాజాగా ఇటువంటి నేరాలను కట్టడి చేసేందుకు రాచకొండ కమిషనరేట్ పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా ఆన్ లైన్ పోసాలకు గురైన బాధితులు ఎవరైనా ఉన్నా.. ఆలస్యం చేయకుండా 155260 లేదా 100 నెంబర్ కు ఫోన్ చేసి దీంతో పోగొట్టుకున్న డబ్బు తిరిగి సంపాదించుకునే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. అనుమానాస్పదంగా కనిపించే, ఫోన్లకు వచ్చే లింకులను ఎట్టిపరిస్థితుల్లో క్లిక్ చేయవద్దని, అన్ నోన్ నెంబర్లకు రెస్పాండ్ కావద్దని పోలీసులు సూచిస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…