CM KCR: తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై సీఎం కేసీఆర్ క్లారిటీ..! ఏమన్నారంటే..!
Telangana: తెలంగాణ సర్కార్ ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. జోనల్ బదలాయింపుల దృష్ట్యా సాధారణ బదిలీలు చేపట్టవద్దని నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల కేటాయింపులు, బదలాయింపులు అనేవి కొత్త జోనల్ విధానానికి అనుగుణంగా చేపట్టింది.
దీనిలో భాగంగానే పరస్పర బదిలీలు పరిశీలనలోకి తీసుకుంది. ఇది కనుక అనుమతిస్తే మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. అన్ని శాఖల కార్యదర్శులు, కమిషనర్లు, డైరెక్టర్లు , కలెక్టర్లతో ఇటీవల నిర్వహించిన వర్చువల్ సమీక్షలో దీనికి సంబంధించి సంకేతాలు ఇచ్చిటట్లు సమాచారం.
2018 సంవత్సరంలో చివరిసారిగా తెలంగాణలో ఉద్యోగుల బదిలీలు జరిగాయి. ప్రతీ సంవత్సరం ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని.. సాధారణ బదిలీలు చేపట్టాలని కోరుతున్నాయి. కానీ ప్రభుత్వం ఏ సంవత్సరం కూడా పట్టించుకోలేదు. ఈ సంవత్సరం జరగుతాయని అశించినా ఫలితం లేదు.
కొత్త జోనల్ విధానానికి అనుగుణంగా బదలాయింపులు జరగడంతో.. నెల రోజుల వ్యవధిలోనే 70 వేల మందికి బదిలీలు జరిగాయి. దీనిలో కూడా భార్య భర్తలకు సంబంధించి బదిలీల సమస్యలు ఉంది. వీటిపై ప్రభుత్వానికి ఎన్నో వినతులు వచ్చాయి. ఈ అంశాలను కూడా పరిష్కరించాల్సి ఉంది. అంతే కాదు బదిలీలు అయిన వారిలో కూడా సీనియార్టీని ఖరారు చేయాలి.. ఈ సమస్యలు అనేది జిల్లా స్థాయిలో లేకున్నా.. జోనల్, మల్టీ జోనల్ స్థాయిలోని పోస్టుల్లోకి బదిలీ అయిన వారికి.. భార్యాభర్తలకు సంబంధించి ఇంకా క్లారిటీ రావాల్సి వుంది. వారిని ఒకవేళ ఒకే చోటు నియమిస్తే మాత్రం.. అప్పటికే అక్కడ ఉన్నవారిని సీనియారిటీ ఇచ్చే అవకాశం ఉంది. దీనిపై ప్రభుత్వం ఇంత వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…