తెలంగాణాల ఇక అనాథలు ఉండరన్నారు స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్. హోమ్స్ లలో ఉండే పిల్లలకు అన్ని ప్రభుత్వమే చూసుకుంటుందని తెలిపారు. సీఎం కేసీఆర్ నియమించిన కేబినెట్ సబ్ కమిటీ అనాథ పిల్లల సంక్షేమానికి గొప్ప విధానం తీసుకుని రాబోతోందన్నారు సత్యవతి రాథోడ్.

కాగా తల్లిదండ్రులకు దూరమై హోమ్స్ లో ఉండే పిల్లలకు కుటుంబం ఏర్పడే వరకు ప్రభుత్వమే అండగా ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. హైదరాబాద్ లోని సైదాబాద్, నింబోలి అడ్డా ప్రాంతాలలో బాల, బాలికల సదన్ భవనాలను మంత్రులు సత్యవతి రాథోడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ ప్రారంభించారు.































