భారతదేశంలో శాఖాహారంతో పోలిస్తే మాంసాహారం తీసుకునే వాళ్లు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. మాంసాహారం తీసుకోవడం మంచిదే కానీ అతిగా మాంసాహారం తీసుకుంటే మాత్రం అనేక ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉంటుంది. మాంసం ద్వారా శరీరానికి అవసరమైన ప్రోటీన్ లభిస్తుంది కాబట్టి చాలామంది మాంసాహారం తీసుకోవడానికి ఆసక్తి చూపుతుంటారు. అయితే మాంసాహారం ఎక్కువగా తీసుకుంటే ఊబకాయంతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉంటుంది.
మాంసాహారం ఎక్కువగా తీసుకుంటే మలబద్ధకం సమస్య వేధించే అవకాశం ఉంటుంది. మాంసంలో ఫైబర్ ఉండదు కాబట్టి ఈ సమస్య వేధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అతిగా మాంసం తీసుకునే వాళ్లు తలనొప్పితో బాధ పడే అవకాశం ఉంటుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. మాంసాహారం కణాల పునరుత్పత్తి రేటును తగ్గించడంతో పాటు కంటి సమస్యలకు కారణమవుతుంది.
మాంసాహారంలో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయనే సంగతి తెలిసిందే. ప్రోటీన్ల మొత్తం పెరిగితే ఎముకల పనితీరుపై ప్రభావం పడుతుందని.. మాంసాహారం ఎక్కువగా తీసుకునే వాళ్లు కాల్షియం సమస్యతో బాధ పడే అవకాశం ఉందని వైద్యనిపుణులు చెబుతున్నారు. అతిగా మాంసాహారం తీసుకుంటే త్వరగా అలసిపోయే అవకాశాలు ఉంటాయి.
ప్రొటీన్ జీర్ణం కావడానికి శక్తి మరియు పోషకాలు అవసరమవుతాయి. మాంసాహారం ఎక్కువగా తీసుకుంటే జీర్ణ సంబంధిత సమస్యలు సైతం వేధించే అవకాశం ఉంటుంది. మాంసాహారం ఎక్కువగా తీసుకుంటే బరువు పెరిగే అవకాశాలు సైతం ఎక్కువగా ఉంటాయి. మాంసాహారం తినేవారికి క్యాన్సర్ ముప్పు ఎక్కువగా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో జగద్గురు ఆదిశంకరుల జయంతి ఉత్సవాలు మంగళవారం వైభవంగా నిర్వహించబడ్డాయి. వైశాఖ…
ప్రస్తుత జీవనశైలిలో ఆరోగ్య సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో సహజ పదార్థాలపై మళ్లీ దృష్టి పెడుతున్నారు చాలా మంది. మన వంటింట్లో…
ఇతిహాసాలలో ధర్మం, మానవత్వం గురించి చెప్పే గొప్ప ఉదాహరణల్లో ఒకటి రామాయణ యుద్ధం చివర్లో జరిగిన సంఘటనగా పండితులు పేర్కొంటారు.…
ఆంధ్రప్రదేశ్లోని పుణ్యక్షేత్రాల్లో ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్న కుండలేశ్వర స్వామి క్షేత్రం భక్తుల విశ్వాసానికి కేంద్రంగా నిలుస్తోంది. పవిత్ర గోదావరి…
సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లిళ్లు, విడాకులు కొత్త విషయం కాదు. అయితే కొంతమంది సెలబ్రిటీల వ్యక్తిగత జీవితం మాత్రం ఎప్పటికప్పుడు…
ఆయుర్వేద ఔషధాల్లో ప్రముఖ స్థానం ఉన్న అశ్వగంధపై కేంద్ర సంస్థలు కీలక నిర్ణయం తీసుకోవడం ఆరోగ్య రంగంలో చర్చనీయాంశంగా మారింది.…