మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ కు మళ్లీ బెదిరింపు ఈ మెయిళ్లు వచ్చాయి. ఇప్పుటి వరకు మూడు సార్లు బెదిరింపు ఈమెయిల్ వచ్చినట్లు పోలీసులకు గంభీర్ ఫిర్యాదు చేశారు. పాకిస్తాన్ నుండి ఈ మెయిల్ వచ్చినట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ విషయమై గౌతం గంభీర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
గతంలో గంభీర్ కు వచ్చిన మెయిల్ లో నిన్ను చంపాలనుకున్నాం. నిన్న బతికిపోయావ్. బతుకుమీద ఆశ ఉంటే రాజకీయాలను, కశ్మీర్ అంశాన్ని వదిలెయ్ అని మెయిల్లో బెదిరించారు. ఈ బెదిరింపుల నేపథ్యంలో పోలీసులు గౌతం గంబీర్ ఇంటి వద్ద భద్రతను పెంచారు. గంభీర్ ఇంటి చుట్టూ సీసీ కెమెరాలతో పటిష్ట నిఘాను ఏర్పాటు చేశారు.
గంభీర్ ఇంటి వైపు వెళ్లే ప్రతి వాహనాన్ని పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఇక దీనిపై పోలీసులు సీరియస్ గా దర్యాప్తు చేపడుతున్నారు. ఈ మెయిల్ గురించి గూగుల్ ను పూర్తి వివరాలు ఇవ్వాలని సమాచారం కోరారు ఢిల్లీ పోలీసులు. గూగుల్ ఇచ్చిన సమాచారం ప్రకారంగా పాకిస్తాన్ నుండి వచ్చినట్టుగా ఉందని పోలీసులు ప్రాధమికంగా గుర్తించారు.
అంతే కాకుండా ఈ దర్యాప్తులో భాగంగా సైబర్ సెక్యూరిటీ సెల్ సహాయాన్ని పోలీసులు తీసుకుంటున్నారు. ఢిల్లీ పోలీస్లోని ఉగ్రవాద సంస్థ గూఢచారులు మాజీ క్రికెటర్ పై నిఘా ఉంచారని బెదిరింపులో పేర్కొన్నారు. గతంలో బెదిరింపు ఈమెయిళ్లు పాకిస్థాన్ కరాచీ సింధ్ యూనివర్సీటీ నుంచి షాహీద్ హమీద్ అనే యువకుడు పంపించారని నిర్థారించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…