Thripuraneni Chittibabu : ఇండస్ట్రీ లో ప్రస్తుతం ఉన్న సీనియర్ హీరోల్లో ఇండస్ట్రీ పెద్ద అంటే చిరంజీవి అనే అంటారు. అయితే చిరంజీవి తో పాటు మోహన్ బాబు వంటి సీనియర్లు ఉన్నారు. ఇక ఇండస్ట్రీ గురించి కొంచెం తెలిసిన వారికి చిరంజీవి కి మోహన్ బాబు కి మధ్య పడదు అనే విషయం తెలిసిందే. అయితే ఎందుకు అన్నది ఎవరికీ తెలియదు. ఇద్దరూ దాసరి నారాయణ రావు గారి శిష్యులే. ఇద్దరూ జీరో నుండి మొదలైయి కష్టపడి పైకి వచ్చినవాళ్ళే. మొదట్లో ఇద్దరూ కలిసి సినిమాలు చేసారు. అయితే స్టార్ డమ్ అన్నీ వచ్చాక ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చిందని అందరూ అంటారు. అయితే ఈ మధ్యనే మోహన్ బాబు గారు తిరుపతి దగ్గర కట్టించిన సాయి బాబా గుడికి కూడా చిరంజీవి గారు, అయన భార్య వెళ్లి వచ్చారు.
మా ఎలక్షన్ లో కూడా ఇదే తీరు…
మొన్నా మధ్య మా ఎలక్షన్ సమయంలో కుడా మోహన్ బాబు కొడుకు మంచు విష్ణు మా ప్రెసిడెంట్ కి అభ్యర్థి గా నిలబడితే మెగా కుటుంబం ప్రకాష్ రాజ్ కు మద్దతు ఇచ్చింది. ఇక్కడ మాటల యుద్ధం జరిగింది ఇరు వర్గాలకు. ఇక వీటిపై నిర్మాత చిట్టిబాబు గారు మాట్లాడుతూ వారి మధ్య విబేధాలు ఏమి లేవు. కానీ మా ఎన్నికల సమయంలో ప్రకాష్ రాజ్ కి మద్దతుగా నిలబడినపుడు మోహన్ బాబు గారు చెప్పారు మీ కుటుంబం నుండి ఎవరైనా నిలబడండి మా అబ్బాయి ని విత్ డ్రా చేయిస్తాను అని.
కానీ ప్రకాష్ రాజ్ కి సపోర్ట్ ఇవ్వము అని చెప్పారు. క్రమశిక్షణ లేని వ్యక్తి ఎన్నికల్లో నిలబడకూడదు. ప్రకాష్ రాజ్ మీద ఫిల్మ్ ఛాంబర్ లో 23 కంప్లైంట్స్ ఉన్నాయి అంటూ వాదించారు. అయితే ఇక్కడ ఎన్నికలు విష్ణు కి ప్రకాష్ రాజ్ కి అయితే దాన్ని చిరంజీవి కి మోహన్ బాబు కి అన్నట్లు మార్చింది నాగబాబు నే. ఇద్దరి మధ్య అనవసరంగా మాట్లాడి ఇరుకున పెట్టాడు. ప్రకాష్ రాజ్ ఓడిపోతే చిరంజీవి ఓడిపోయినట్లు భావించేలా పరిస్థితి తీసుకువచ్చింది నాగబాబు నే అంటూ అభిప్రాయపడ్డాడు. మోహన్ బాబు, చిరంజీవి ఇద్దరి మధ్య బంధం ఇప్పటిది కాదు, వారి సినిమా జీవితం మొదలయినప్పటి నుండి ఉంది. ఇపుడు కొత్తగా వచ్చిన పరిస్థితులకు ఇద్దరూ విడిపోయారనడం మూర్కత్వం అవుతుంది అంటూ చిట్టిబాబు మాట్లాడారు.
నేటి వేగవంతమైన జీవనశైలిలో నడుము నొప్పి ఒక సాధారణ సమస్యగా మారుతోంది. ముఖ్యంగా రోజంతా కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేసే…
నేటి పట్టణ జీవనశైలిలో డెంగీ ప్రమాదం కొత్త రూపం దాల్చుతోంది. ఒకప్పుడు మురుగు నీరు, చెత్త ప్రదేశాలు ప్రధాన కారణాలుగా…
సీనియర్ నటుడు రాజశేఖర్ తన సినీ ప్రయాణం, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో…
ఇంటి వంటల్లో రుచితో పాటు ఆరోగ్యం కూడా కలగాలంటే సీజనల్ కూరగాయలతో తయారయ్యే వంటకాలకు ప్రాధాన్యం ఇవ్వాలని పోషకాహార నిపుణులు…
ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో జగద్గురు ఆదిశంకరుల జయంతి ఉత్సవాలు మంగళవారం వైభవంగా నిర్వహించబడ్డాయి. వైశాఖ…
ప్రస్తుత జీవనశైలిలో ఆరోగ్య సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో సహజ పదార్థాలపై మళ్లీ దృష్టి పెడుతున్నారు చాలా మంది. మన వంటింట్లో…