Tickets sold out a year before release! The film created huge hype worldwide!
హైదరాబాద్: సినిమా ప్రపంచంలో ఎంత పెద్ద సినిమాకైనా అడ్వాన్స్ బుకింగ్లు మహా అయితే రెండు వారాల ముందు, లేదా ఒక నెల ముందు మొదలవుతాయి. అంతకంటే ముందు ఆన్లైన్ టికెట్లు అమ్మడం అరుదైన విషయం. కానీ, ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ ఈ లెక్కలకు అతీతంగా నిలుస్తున్నారు. ఆయన కొత్త చిత్రం ‘ఒడిస్సీ’ వచ్చే ఏడాది జూలై 17న విడుదల కానుంది. అంటే, ఇంకా సుమారు సంవత్సరం సమయం ఉంది. అయినప్పటికీ, ఈ సినిమాకు అప్పుడే అడ్వాన్స్ బుకింగ్లు మొదలయ్యాయి. ఆశ్చర్యకరంగా, యుఎస్, యుకెలోని ప్రముఖ ఐమ్యాక్స్ 70 ఎంఎం స్క్రీన్లలో టికెట్లన్నీ దాదాపు సోల్డ్ అవుట్ అయిపోయాయి. ఇలాంటి క్రేజ్ సినీ చరిత్రలో చాలా అరుదుగా కనిపిస్తుంది.
న్యూయార్క్, శాన్ ఫ్రాన్సిస్కో, లాస్ ఏంజిల్స్, డల్లాస్, ఫిలడెల్ఫియా, టొరంటో, గ్రాండ్ రాపిడ్స్, లండన్, ప్రేగ్ తదితర ప్రాంతాలకు సంబంధించిన సేల్స్ అప్పుడే పీక్స్కు చేరుకుంటున్నాయి. అసలు ‘ఒడిస్సీ’ ఎలా ఉంటుందో పూర్తి అవగాహన లేకుండానే ప్రేక్షకులు ఇంతగా ఎగబడుతున్నారంటే దానికి కారణం నోలన్ మాస్టర్ స్టోరీ టెల్లింగ్. ‘ఓపెన్హైమర్’ సినిమాను ఎగబడి చూసినా, పదేళ్ల క్రితం వచ్చిన ‘ఇంటర్స్టెల్లార్’ను మళ్ళీ రీ-రిలీజ్ చేస్తే కోట్లు వసూలు చేసినా అది నోలన్కే సాధ్యమైంది. కొందరికి నోలన్ టేకింగ్ అర్థం కాకపోయినా సరే, కథ చెప్పే విధానానికి ఫిదా అయిపోయి మళ్ళీ మళ్ళీ ఎంజాయ్ చేస్తారు.
ఇంత హైప్ ఉందంటే, ‘ఒడిస్సీ’ విడుదలవుతున్న జూలై 17న మరే ఇతర పెద్ద సినిమా కాంపిటీషన్లో ఉండకపోవడం ఉత్తమం. గ్రీకు పురాణాల్లోని ఇతికా రాజు ఒడిస్సిస్ చేసిన ట్రోజన్ యుద్ధంతో పాటు ఆయన జీవిత ప్రయాణాన్ని నోలన్ కథాంశంగా ఎంచుకున్నారు. 250 మిలియన్ డాలర్ల వ్యయంతో పూర్తి ఐమ్యాక్స్ కెమెరాలతో షూట్ చేస్తున్న ‘ఒడిస్సీ’లో ఇప్పటిదాకా ప్రపంచ స్క్రీన్ మీద ఎప్పుడూ చూడని విజువల్స్ ఉంటాయని సమాచారం. షూటింగ్ పూర్తి చేసుకున్న ‘ఒడిస్సీ’ పోస్ట్ ప్రొడక్షన్ కోసమే నోలన్ నెలల తరబడి వర్క్ చేస్తున్నారు. ప్రపంచంలో 365 రోజుల ముందే టికెట్లు అమ్ముడుపోయేలా చేసిన ఘనత క్రిస్టోఫర్ నోలన్కే దక్కుతుందేమో. ఆయన దర్శకత్వ ప్రతిభకు, ప్రేక్షకులపై ఆయనకున్న నమ్మకానికి ఇది నిదర్శనం.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…