టిక్ టాక్ దుర్గారావు ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.తనలో ఉన్న టాలెంట్ ఆధారంగా సోషల్ మీడియా వేదికగా చేసుకొని తన నైపుణ్యాన్ని బయటపెడుతూ ఉన్నఫలంగా ఎంతో క్రేజ్ సంపాదించుకున్న దుర్గారావు అతని భార్య టిక్టాక్ వీడియోల ద్వారా ఎంతో క్రేజ్ సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే టిక్ టాక్ ముగిసే సరికి మిలియన్ల సంఖ్యలో ఫాలోవర్స్ ను పెంచుకున్నారు.
టిక్ టాక్ ద్వారా వీరు చేసే డాన్స్ లకు సంబంధించిన స్టెప్పులు విపరీతంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.ఈ క్రమంలోనే నాది నకిలీసు గొలుసు అనే పాటకు వీరు వేసిన స్టెప్పులు బాగా పాపులర్ అయ్యాయని చెప్పవచ్చు. ఎంతగా అంటే వీరి స్టెప్పులను ఏకంగా సినిమాలలో కూడా వాడుకునే అంతా ఫేమస్ అయ్యాయని చెప్పవచ్చు.
ఒకప్పుడు కేవలం సోషల్ మీడియాకు మాత్రమే పరిమితమైన ఈ దంపతులు చిన్నగా బుల్లితెరపై జబర్దస్త్, క్యాష్ వంటి కార్యక్రమాలకు కూడా వచ్చి మంచి ఆదరణ దక్కించుకున్నారు. ఇక క్రాక్ సినిమాలో కూడా ఈ దంపతులు నటించే అవకాశాన్ని దక్కించుకొని ప్రస్తుతం ఎంతో బిజీగా ఉన్నారని చెప్పవచ్చు.ఈ విధంగా ఒకప్పుడు బట్టలు కుడుతూ బ్రతికిన ఈ దంపతులు ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా నెలకు యాభై వేలకు పైగానే సంపాదిస్తున్నారని చెప్పవచ్చు.
ఈ విధంగా ఉన్నఫలంగా పాపులారిటీని సంపాదించుకున్న దుర్గారావు దంపతులు పలు కార్యక్రమాల్లో నటిస్తూ పలు బ్రాండ్ ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు. అదేవిధంగా ఈ జంటను యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వ్యూ ఇస్తే కూడా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలకు ఈ దంపతులు సుమారు 15 నుంచి 20 వేల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ప్రసిద్ధ సినీ నటి తమన్నాభాటియా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి భక్తిశ్రద్ధలు చాటుకున్నారు. తిరుమల దేవాలయంలోఉదయం వేళలోనే ఆమె స్వామివారిని…
టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ అనన్య నాగళ్ల ఇటీవల సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇన్స్టాగ్రామ్లో ఆమె…
తెలంగాణకు చెందిన ఓ భక్తుడు తన భక్తిశ్రద్ధలను ప్రత్యేకంగా చాటుకున్నారు. హైదరాబాద్కు చెందిన ఈ భక్తుడు, ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీశైలం…
ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ వైష్ణవక్షేత్రాలలో ఒకటైన సింహాచలం దేవాలయంలో జరగబోయే చందనోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రతి ఏడాది విశేషంగా నిర్వహించే…
తమిళ సినీ నటుడు, తమిళక వెట్రి కళగం (TVK) పార్టీ అధినేత విజయ్ తాజాగా రాజకీయ కార్యక్రమాల్లో భాగంగా ఆధ్యాత్మిక…
ఉత్తరాఖండ్లో ప్రతి ఏడాది భక్తుల ఆధ్యాత్మిక ఆశలను నెరవేర్చే చార్ధామ్ యాత్ర ఈసారి కూడా ఘనంగా ప్రారంభమైంది. అక్షయ తృతీయ…