ఆడపిల్ల బయటకు వచ్చిందంటే చాలు.. కామంతో కల్లు మూసుకుపోయిన కామాంధులు వావివరసలు మరచిపోయి రెచ్చిపోతున్నారు. ఎక్కడ చూసినా హత్యలు, ఆత్యాచార వార్తలే వినిపిస్తున్నాయి. ఎన్ని చట్టాలు తెచ్చినా వీళ్లలో మాత్రం మార్పు రావడం లేదు. ఈ రోజుల్లో బంధువులను నమ్మి వారితో పంపించాలన్న భయపడాల్సి పరిస్థితి వచ్చింది. ఎవరి మదిలో ఎలాంటి విషపు ఆలోచన దాగి ఉందో..! ఎవరి నుంచి ప్రమాదం పొంచి ఉందో ముందే గ్రహించడం చాలా కష్టంగా మారుతోంది.
రేషన్ కోసం అని బంధువుతో తన కూతరును పంపించారు తల్లిదండ్రులు. వరుసకు పెద్దనాన్నతో రేషన్ షాపుకు వెళ్ళింది ఆ బాలిక. కానీ ఆ కామాంధుడి కన్ను కూతరు వయస్సున్న ఆ బాలికపై పడింది. పొదల్లోకి వెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గౌనిగానిపల్లెలో ఇంటర్ చదువుతున్న విద్యార్థిని తల్లి తండ్రులతో కలసి జీవనం సాగిస్తోంది. రేషన్ కోసమని ఆ బాలిక పెద్దనాన్న అయిన గంగులప్పతో పంపించారు తల్లిదండ్రులు. రేషన్ బియ్యం, సరుకులు తీసుకోని తిరుగు ప్రయాణం అయ్యారు.
అతడికి అప్పటికే పెళ్లైన ఇద్దరు కుమార్తెలు, కొడుకు కూడా ఉన్నారు. కుమారుడికి రెండేళ్ల క్రితం వివాహం కూడా చేశాడు. అయితే ఆ కామాంధుడి కన్ను కూతురు వరుసైన ఆ బాలికపై పడింది. ఇంటికి వెళ్లే క్రమంలో దారి మధ్యలో బైక్ ఆపి.. పక్కనే ఉన్న పొదల్లోకి తీసుకెళ్లాడు. ఇదేంటి పెద్దనాన్న ఇక్కడకు తీసుకొచ్చావ్.. అని ప్రశ్నించగా.. తన కోరిక తీర్చాలని బలవంతంగా అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ బాలిక పెద్దగా అరిచింది. చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో.. ఆమె అరుపులకు ఉపయోగం లేకుండా పోయింది. ఎలాగోలా అక్కడ నుంచి ఆమె అతడి చెర నుంచి తప్పించుకొని పరుగున తన ఇంటికి చేరుకుంది.
ఈ విషయం తల్లిదండ్రులకు చెప్పకుండా.. అఘాయిత్యాన్ని తలుచుకొని సబ్బు నీళ్లను తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమెను తల్లితండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. ఎందుకు ఈ పని చేశావని ఆ బాలికను నిలదీయగా.. జరిగిన ఘోరాన్ని వివరించింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధిత కుటుంబసభ్యులు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…