Featured

Titan Submarine tragedy : టైటానిక్ లో ముత్తాత… టైటన్ లో ముని మనవడు… ఇద్దరూ ఒకేచోట జల సమాధి…!

Titan Submarine tragedy : ఉత్తర అంట్లాంటిక్ సముద్రంలో మునిగిపోయిన టైటానిక్ షిప్ గురించి మనకు తెలుసు. 1912 ప్రాంతంలో జరిగిన టైటానిక్ ప్రమాదంలో సుమారు 1500 మంది మరణించారు. అయితే ఆ షిప్ శిథిలాలను కనుగొన్నా సముద్ర అడుగున ఉన్న వాటిని చేరుకోవడం కష్టం. అయితే ఓషన్ గేట్ సంస్థ తయారు చేసిన టైటన్ సబ్ మెరైన్ తాజాగా ఆ సాహసం చేసింది. ఐదగురు వ్యక్తులు ఆ సబ్ మెరైన్ ద్వారా సముద్రం లోపలికి వెళ్లి టైటానిక్ శిథిలాలను చూడాలని భావించారు. అయితే వారి సహస యాత్ర విషాదంగా మారింది. సముద్రం లోకి వెళ్లిన వారి జాడ నాలుగు రోజులు దాటినా ఇప్పటికీ తెలియరాలేదు. వారికి సబ్ మెరైన్ లో ఉన్న ఆక్సిజన్ నిల్వలు కూడా ఇప్పటికే ఖాళీ అయ్యుంటాయనే అంచనాతో వారు మరణించి ఉండేందుకు ఎక్కువ అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే గాలింపు చర్యలను మాత్రం ఇప్పటికీ కొనసాగిస్తున్నారు.

అపుడు ముత్తాత ఇప్పుడు మునిమనవడు…

ఓషన్ గేట్ కంపెనీ కి చెందిన టైటన్ సబ్ మెరైన్ లో టైటానిక్ షిప్ శిథిలాలను చూడటానికి బయలుదేరిన ఐదుగురు ఈ పాటికే మరణించి ఉంటారని అందరూ భావిస్తుండగా అందులో ప్రయాణించిన బ్రిటన్ కుబేరుడైన హామీష్ హార్దింగ్, ఫౌండర్ అండ్ సీఈఓ అఫ్ ది ఆపరేటింగ్ కంపెనీ స్టాక్టన్ రష్, ఫ్రెంచ్ నావికుడైన పాల్ హేనరీ నర్జెలౌట్ మరియు పాకిస్థాన్ సంతతికి చెందిన లండన్ వ్యాపారవేత్త షాజడా దావుద్ మరియు అతని కొడుకు సులేమాన్ ఉన్నారు. అయితే ఓషన్ గేట్ కంపెనీ సీఈఓ అయిన స్టాక్టన్ రష్ గురించి ఒక ఆసక్తికర విషయం బయటికి వచ్చింది. స్టాక్టన్ రష్ భార్య వెండి రష్ పూర్వికులు ఇటువంటి ప్రమాదంలోనే మరణించారు.

1912 లో జరిగిన టైటానిక్ షిప్ దుర్గటనలో 1500 వదలకు పైగా చనిపోయారు. అందులో ఇసిడోర్ స్ట్రాస్, ఇడా అనే దంపతులు ఉన్నారు. వారి మునిమనవరాలే వెండి రష్. న్యూయార్క్ లోని అత్యంత ధనవంతుల్లో ఒకరైన ఇసిడోర్ స్ట్రాస్ తన భార్యతో మొదటి సముద్రయానం కోసం టైటానిక్ వెళ్లగా అక్కడ మరణించారు. ఇప్పుడు వారి ముని మనవడు వెండి రష్ భర్త, స్టాక్టన్ రష్ ఆ టైటానిక్ శిథిలాలను చూడటానికి వెళ్లి అక్కడే జల సమాధి అయ్యారు.

Bhargavi

Recent Posts

44 డిగ్రీలకు చేరే ఉష్ణోగ్రతలు.. మూడు రోజులు హెచ్చరిక

తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…

40 minutes ago

ప్రభాస్ ‘ఫౌజీ’ ఛాన్స్ వదిలేసిన టాలీవుడ్ హీరో ఎవరు?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…

47 minutes ago

180 బాధితులు.. దేశాన్ని షాక్‌కు గురిచేసిన ఘటన

మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…

57 minutes ago

వరుణ్ తేజ్ గాయం.. నిహారిక ఎమోషనల్ ప్రెస్ నోట్

టాలీవుడ్‌లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…

2 hours ago

అటెండర్ మాస్టర్ ప్లాన్.. SBIకి రూ.2.65 కోట్ల షాక్!

తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…

4 hours ago

ఎన్నికల వేళ ఆస్తుల వివాదం.. ఉదయనిధిపై విచారణ

తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌లోని ఆస్తుల…

4 hours ago