మెగా హీరో సాయిధరమ్ తేజ్ కు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ విషయం తెలిసిందే. అతడు ప్రస్తుతం అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ.. కోలుకుంటుంన్నాడు. దీనిపై సినీ ప్రముఖులు వివిధ రకాలుగా స్పందించారు. అందులో మొదట సీనియర్ సినీ నటుడు నరేష్.. ‘సాయి మా ఇంటి దగ్గర నుంచే బైక్ పై వెళ్లాడు. ఈ స్పోర్ట్స్ బైక్ లను వాడొద్దు.. అవి ప్రమాదకరం అని తాము తన కొడుకుకి.. మిగతా వారికి కౌన్సెలింగ్ ఇవ్వాలని అనుకున్నామని’ అన్నాడు.
కానీ ఈ లోపు ప్రమాదం జరిగిందని అన్నాడు. అంతేకాకుండా ఇలా.. రోడ్డు ప్రమదాల్లో బాబూ మోహన్ కుమారుడు, కోట శ్రీనివాసరావు కుమారుడు చనిపోయి.. వాళ్ల కటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చారు అంటూ ఆవేదన చెందాడు. దయచేసి ఎవరు బైక్ నడిపినా జాగ్రత్తగా ఉండాలంటూ.. ఓ వీడియోను పోస్టు చేశాడు నరేష్.
దీనిపై శ్రీకాంత్ తీవ్రంగా స్పందించాడు. చనిపోయిన వారి పేర్లను తీసుకురావడం కరెక్ట్ గా లేదు. మరోసారి ఈ వీడియోలు పెట్టకుండా ఉండటం మంచిది అంటూ సలహా ఇచ్చాడు. నరేష్ వీడియోపై బండ్ల గణేష్ కూడా స్పందించాడు. ఆ వీడియోలో అలా మాట్లాడటం మంచిది కాదని సలహా ఇచ్చాడు.
అయితే శ్రీకాంత్ ఇచ్చిన బైట్ కు నరేష్ తీవ్ర స్థాయిలో మండపడ్డాడు. ‘నువ్వే ఆలోచించి మాట్లాడు.. నా బైట్స్ మీద నువ్వు ఇచ్చిన బైట్ చూశాను. ఏంటమ్మా నువ్వు ఎందుకు అలా ఇచ్చావ్.. నువ్వు ఇచ్చిన బైట్ నాకు నచ్చలేదు. నా కళ్ల ముందు హీరోగా వచ్చావు.. జాగ్రత్త’ అంటూ.. మరో వీడియోను నరేష్ పోస్టు చేశాడు. ఇలా ఈ వీరిద్దరి మధ్య సోషల్ వార్ జరిగింది.
2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…
“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…
తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…
సినీ పరిశ్రమలో కనిపించే మెరుపులు, గ్లామర్ వెనుక ఎన్నో సంవత్సరాల కష్టం దాగి ఉంటుందని ప్రముఖ నటి Mrunal Thakur…