Featured

నవ్వుల రారాజు రాజాబాబు కొడుకులు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో.. ఏలా ఉన్నారో తెలుసా ?

రాజబాబు, రేలంగి… ఈ ఇద్దరి కమెడియన్ల పేర్లను తెలుగు సినిమా ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపో లేరని చెప్పుకోవచ్చు. అప్పట్లో రాజబాబు హీరోలతో సమానంగా రెమ్యూనరేషన్ తీసుకున్నారంటే అతని హాస్యనటనకు ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. 1937 అక్టోబర్ 20 తేదీన తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రిలో మా మహేశ్వర రావు రమణమ్మ దంపతులకు జన్మించిన రాజబాబు అసలు పేరు పుణ్యమూర్తుల అప్పలరాజు.

ఇతనికి తమ్ముల్లుగా జన్మించిన చిట్టిబాబు, అనంత్ బాబు కూడా తెలుగు పరిశ్రమలో హాస్యనటులుగా కొనసాగారు. ఆనాటి కాలంలోనే రాజబాబు ఇంటర్మీడియట్ విద్యాభ్యాసం పూర్తి చేసి టీచర్ ట్రైనింగ్ కోర్స్ పూర్తి చేసి తెలుగు ఉపాధ్యాయుడిగా కొన్ని రోజుల పాటు పనిచేశారు. అయితే ఆ సమయంలోనే నాటకాలలో నటించడం ప్రారంభించారు రాజబాబు. కుక్కపిల్ల దొరికింది నాలుగిళ్ళ చావిడి అల్లూరి సీతారామరాజు వంటి నాటకాలలో వేషాలు వేసిన రాజబాబుకి చాలా గొప్ప పేరు లభించింది. దాంతో సినిమాలో కూడా ప్రయత్నం చేసి సినీ నటుడిగా రాణించాలనుకున్నారు రాజబాబు.

ఆ సమయంలోనే గరికపాటి రాజారావు అతని నటనా నైపుణ్యం చూసి మద్రాసు రావాల్సిందిగా ఆహ్వానించారు. దీంతో బాగా సంబరపడిపోయిన రాజబాబు మద్రాసు వెళ్లారు కానీ సినీ అవకాశాలు అతను వెళ్ళిన వెంటనే లభించ లేదు. దీంతో చాలా కాలము ట్యూషన్లు చెబుతూ కొద్దిపాటి డబ్బు సంపాదించి జీవనం సాగించేవారు. ఆ క్రమంలోనే సినిమా దర్శకుడు అడ్డాల నారాయణరావు రాజబాబుకు సమాజం అనే సినిమాలో ఒక చిన్న పాత్ర ఇచ్చారు. ఈ సినిమా 1960 వ సంవత్సరంలో విడుదలై రాజబాబు బాగానే గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ సినిమా తర్వాత దాదాపు 20 సంవత్సరాల పాటు టాలీవుడ్ పరిశ్రమలో హీరోగా హాస్యనటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించారు.

కేవలం రెండు దశాబ్దాల్లో 589 సినిమాల్లో నటించారంటే అతను ఎంత బిజీగా ఉండేవారు అర్థం చేసుకోవచ్చు. తాతా మనోడు, పిచ్చోడు పెళ్లి, తిరుపతి, ఎవరికి వారే యమునా తీరే, మనిషి రోడ్డున పడ్డాడు వంటి సినిమాల్లో హీరోగా నటించాడు రాజబాబు. సినిమాల్లో అతనికి భార్యలు గా లీలారాణి, ప్రసన్న రాణి, గీతాంజలి రమాప్రభ నటించేవారు. అయితే ఎక్కువగా రమాప్రభ అతను కలిసి నటించిన సినిమాలు సూపర్ డూపర్ హిట్ గా నిలిచాయి. దీంతో వీళ్లిద్దరి కామెడీ జంటకు డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. అయితే అప్పట్లో రాజబాబు ఒక్క సినిమాల్లో నటించాలంటే లక్ష రూపాయల రెమ్యునరేషన్ తీసుకునే వారట. ఈ విధంగా ఎన్నో సినిమాల్లో నటిస్తూ కోటీశ్వరుడు అయ్యారట. అయితే రాజ బాబు 1965 వ సంవత్సరంలో రచయిత శ్రీశ్రీ మేనమామ కూతురైన లక్ష్మీ అమ్మలు ను పెళ్లి చేసుకున్నారు. వీళ్ళిద్దరికీ నాగేంద్ర బాబు, మహేష్ బాబు అనే ఇద్దరు కుమారులు కూడా జన్మించారు. రాజబాబు చివరి దశలో ఎక్కువగా ఆల్కహాల్ తీసుకునే వారు. ఈ మద్యపాన వ్యసనం కారణంగానే అతను క్యాన్సర్ బారిన పడి కేవలం 45 సంవత్సరాలకే మృత్యువాతపడ్డారు.

Rajababu Brothers

దీంతో తండ్రి లేని తన కుమారులను పెద్ద చదువులు చదివించారు లక్ష్మీ అమ్మలు. అలాగే రాజబాబుకి తమ్ముళ్లు అయిన చిట్టిబాబు, అనంత్ బాబు లను కూడా సొంత కుమారుల గా భావించి వారికి అన్ని చేసి పెట్టేవారు లక్ష్మి అమ్మలు. నాగేంద్రబాబు, మహేష్ బాబు బాగా చదువుకొని అమెరికా దేశంలో ఉద్యోగాలు సంపాదించి అక్కడే స్థిరపడిపోయారు. స్మార్ట్ ఫోన్, కార్లు, బస్సులలో అమర్చే జిపిఎస్ సిస్టమ్ రూపొందించడంలో రాజబాబు కుమారులైన నాగేంద్రబాబు, మహేష్ బాబు కీలకమైన పాత్ర వహించారట. అలాగే అమెరికాలో తమకంటూ రూ. 10 కోట్ల విలువైన ఒక విలాసవంతమైన భవనాన్ని కొనుగోలు చేశారట. వాళ్లకి మన భారతదేశంలో కూడా దాదాపు 25 కోట్ల రూపాయలు ఉన్నాయని రాజబాబు తమ్ముడు అయిన చిట్టిబాబు ఒక ఇంటర్వ్యూలో తెలిపారు..

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

కిడ్నీ వ్యాధి ముందస్తు సంకేతాలు ఇవే… రాత్రి తరచూ మూత్రం వస్తుందా? జాగ్రత్త… ఇది కిడ్నీ సమస్య కావచ్చు

మన శరీరంలో కిడ్నీలు అత్యంత ముఖ్యమైన అవయవాలు. ఇవి రక్తంలో ఉన్న వ్యర్థాలను తొలగించడమే కాకుండా, శరీరంలో ద్రవాల సమతుల్యతను…

21 minutes ago

30 తర్వాత కండరాలు క్షీణిస్తున్నాయా? నడవడంలో ఇబ్బంది? ఇది సార్కోపీనియా సంకేతమా?

వయస్సు పెరుగుతున్న కొద్దీ శరీరంలో కొన్ని మార్పులు సహజమే. అయితే ఇటీవల చాలా మందిలో కనిపిస్తున్న ఒక సమస్య నిపుణులను…

51 minutes ago

ఒకసారి వాడిన నూనె మళ్లీ వాడుతున్నారా? ఇది తప్పక తెలుసుకోండి!

మన రోజువారీ వంటకాలలో నూనెకు ప్రత్యేక స్థానం ఉంది. ఉదయం అల్పాహారం నుంచి రాత్రి భోజనం వరకు దాదాపు ప్రతి…

1 hour ago

అలసట, బలహీనతకు కారణం ఇదే.. చిన్నారుల ఆరోగ్యానికి కీలకం.. ఎనీమియా నివారణకు సరైన డైట్!

మన దేశంలో చిన్నపిల్లల్లో తరచుగా కనిపిస్తున్న ఆరోగ్య సమస్యల్లో రక్తహీనత ఒకటి. ముఖ్యంగా ఐదేళ్లలోపు పిల్లల్లో, అలాగే రెండు సంవత్సరాల…

2 hours ago

ఈ రోజు రాశి ఫలాలు.. వృశ్చిక రాశికి శుభసూచనలు, మిగతావారికి హెచ్చరికలు!

2026 ఏప్రిల్ 15 బుధవారం రోజుకు సంబంధించిన రాశి ఫలితాలు ఈ రోజు గ్రహస్థితుల ప్రభావంతో కొన్ని రాశుల వారికి…

2 hours ago

శని బాధలకు ఉపశమనం.. గుజరాత్‌లోని ఈ హనుమ ఆలయం ఎందుకు ప్రత్యేకం?

గుజరాత్‌లోని సారంగపుర్ ప్రాంతంలో వెలసిన కష్టభంజన్ దేవ్ హనుమాన్ ఆలయం దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఆంజనేయస్వామి క్షేత్రాల్లో ఒకటి. భక్తులు…

3 hours ago