సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన వార్త తెలియడంతో మెగా అభిమానులను తీవ్ర ఆందోళనకు గురయ్యారు. శుక్రవారం సాయంత్రం ఆయన బైక్ పై వెళ్తూ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. రోడ్డు ప్రమాదానికి గురైన సాయితేజ్ ను కుటుంబ సభ్యులు మెరుగైన చికిత్స కోసం అపోలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సాయి తేజ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఇదిలా ఉండగా సాయి తేజ్ ప్రమాదంపై నటుడు నరేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
నటుడు నరేష్ కొడుకు నవీన్ సాయి తేజ్ చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులను, ప్రతిరోజు వీరు ఏదో ఒక సందర్భంలో కలుస్తూనే ఉంటారని తెలిపారు. ఈ క్రమంలోనే తన కొడుకు నవీన్,సాయి ధరమ్ తేజ్ బైక్ రేసింగ్ అంటే ఎంతో ఇష్టమని వీళ్లు ఎన్నోసార్లు రేసింగ్ లో పాల్గొన వద్దని వీరిని వారించానని, నిన్న కూడా సాయి ధరమ్ తేజ్ తన కొడుకు మరొక వ్యక్తి ముగ్గురు కలిసి ఏదో ఓపెనింగ్ కు వెళుతున్న సమయంలో బైక్ పై ప్రయాణించడం మంచిది కాదని హెచ్చరించేలోగా అక్కడి నుంచి వెళ్ళిపోయారని తెలిపారు.
తన కొడుకు నవీన్, సాయి తేజ్ దగ్గర 1000 సిసి స్పోర్ట్స్ బైక్స్ ఉన్నాయని.. అలాంటి వాటిని రోడ్డుమీదికి తీసుకువచ్చేటప్పుడు ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలని అసలు మన దగ్గర అంత సీసీ స్పోర్ట్స్ బైక్స్ ను బ్యాన్ చేయాలని నటుడు నరేష్ ప్రభుత్వానికి సూచించారు. ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీలు ఈ విధంగా రోడ్డు ప్రమాదంలో మరణించారనీ,ఇకపై ఈ విధమైనటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే పూర్తిగా స్పోర్ట్స్ బైక్స్ బ్యాన్ చేయాలని నరేష్ కోరారు.
సాయి ధరమ్ తేజ్, తన కుమారుడు నవీన్ లకు ఏదో క్లబ్ ఉందని అక్కడ వీరందరూ బైక్ రేసింగ్ లు చేస్తారంటూ వారి గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. సాయి తేజ్ తన కొడుకు లాంటి వాడేనని ఈ ప్రమాదం నుంచి సాయి తొందరగా కోలుకొని ఎప్పటిలాగే సినిమా షూటింగ్లో పాల్గొంటారని నరేష్ సాయి ధరమ్ తేజ్ ప్రమాదం గురించి తెలిపారు.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…