ఒక సినిమా ప్రేక్షకుల ముందుకు రావాలంటే.. దాని వెనుకాల ఎంతో శ్రమదాగి ఉంటుంది. సినిమా షూటింగ్ సమయంలో పడే కష్టాలు.. ఇబ్బందులు వాళ్లకే తెలుస్తాయి. కథ దగ్గర నుంచి దానిని తెరమీద చూపించే విధానం వరకు అన్నీ కష్టంతో కూడకున్నదే. ఇంత శ్రమ పడి.. చివరకు సినిమా విడుదలైన సందర్భంగా కొన్ని వెబ్ సైట్లు కావాలనే బ్యాడ్ రివ్యూస్ ఇచ్చి.. సినిమాపై నెగెటివ్ ఫీలింగ్ తెప్పిస్తారు.
ఇలాంటిదే ఈ మధ్య విడుదలైన నాట్యం సినిమాకు జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. సినిమా ప్రమోషన్ చేయాలంటే వారికంటూ ఓ పీఆర్ఓ ఉంటారు. ఆ సినిమాకు సంబంధించి ప్రమోషన్ దగ్గర నుంచి.. సినిమా రిలీజ్ అయిన తర్వాత వచ్చే రివ్యూస్ వరకు అన్నీ అతడే చూసుకుంటాడు. ఇలా నాట్యం మూవీకి కూడా ఓ పీఆర్ఓను నియమించుకున్నారు.
దీనికి వంశీ-శేఖర్లు పీఆర్ఓగా పనిచేశారు. ప్రమోషన్ చేస్తామని ఇద్దరు కలిసి.. భారీగానే డబ్బులు వెనుకవేశారు. ఆ సినిమాకు సంబంధించిన వార్తలు ఎక్కడా రాకపోవడంతో.. ఇదేంటని సినిమా సభ్యులు వాళ్లని ప్రశ్నించారు. గొడవకు కూడా దిగారు. తాము చెప్పినట్లు అన్ని వెబ్ సైట్లు నడుచుకుంటాయని చెప్పడంతో.. వాళ్లు అడిగిన కాడికి ఇచ్చేశారు మేకర్స్. అయినా ఈ గొడవను మనస్సులో పెట్టుకున్నారు. వాళ్లను నమ్మించి.. సినిమా రిలీజ్ రోజున బ్యాడ్ రివ్యూస్ రాయించారు.
ఒక్క వెబ్ సైట్లో అంటే సరే అనుకోవచ్చు.. ప్రతీ సైట్లో ఇలానే వచ్చింది. దీనికి కారణం వీళ్లిద్దరే అని తెలుసుకున్న చిత్ర సభ్యులు తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి, మూవీ ఆర్టిస్ట్ యూనియన్, డైరెక్టర్స్ యూనియన్కు కంప్లైంట్ చేశాడు. ఎన్నో ఇబ్బందులను దాటుకొని.. నాలుగు సంవత్సరాలుగా ఎన్నో ఆశలతో విడుదల చేసిన ఈ సినిమాపై దుష్ప్రచారం చేయడంతో యువ దర్శకుడు రేవంత్ కోరుకొండ న్యాయపోరాటానికి దిగాడు. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…